కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి.

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి

యువజన కాంగ్రెస్ గుండాల మండల ఉపాధ్యక్షులు బొబ్బిలి పవన్ కళ్యాణ్

గుండాల,నేటిధాత్రి:

 

మండల గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి విజయాన్ని యువజన కాంగ్రెస్ గుండాల మండలం ఉపాధ్యక్షులు బొబ్బిలి పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండాల మండలం ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలుపరిచిన అభ్యర్ధులను గెలిపిస్తేనే గుండాల మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ తోనే పల్లె ప్రగతి సాధ్యం అవుతుంది గ్రామంలో మౌలిక సదుపాయాలతో పాటు మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజలు సన్న బియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. గుండాల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version