ప్రజలకోసం పని చేసిన మాకు మున్సిపాలిటీ ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: యూత్ కాంగ్రెస్ జహీరాబాద్ మండల ఉపాధ్యక్షుడు ఎం.డి. సామియుద్దీన్ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు నం.33 శాంతినగర్, జహీరాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుటకు పార్టీ టికెట్ మంజూరు చేయాలని కోరుతూ టౌన్ పార్టీ అధ్యక్షుడికి దరఖాస్తు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొంతకాలంగా యూత్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానని మున్సిపాలిటీ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.
