సమాజ మార్పు కోసం విద్య కీలకం..

సమాజ మార్పు కోసం విద్య కీలకం

◆-: జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సమాజంలో మార్పు రావాలంటే విద్య ఎంతో కీలకమని జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తన జన్మదినం సందర్భంగా గురువారం జహీరాబాద్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ హైస్కూల్లో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదవాలని సూచించారు. సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో విద్య ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు.
తన జన్మదినాన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఆనందంగా ఉందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జ్యోతి, రమాదేవి, రేణుక, పూజా తదితరులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

పదవ తరగతి విద్యార్థిని,విద్యార్థులకు…

పదవ తరగతి విద్యార్థిని,విద్యార్థులకు
( గిఫ్ట్ ఏ స్మైల్ ) ఆధ్వర్యంలో,పెన్స్,ఎగ్జామ్స్ పాడ్స్ పంపిణి

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పెద్దూరులోని
కస్తూరిబ గురుకుల పాఠశాలలో మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు( గిఫ్ట్ ఏ స్మైల్) ఆధ్వర్యంలో పదో తరగతి రాయబోయి విద్యార్థినీ, విద్యార్థులకు ఎగ్జామ్స్ పాడ్స్ మరియు పెన్స్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా 9వ వార్డ్ కౌన్సిలర్ దొంతులేని కళ్యాణి అశోకరావు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థిని విద్యార్థులు విజయవంతంగా పదో తరగతి పరీక్షలు రాసి, అత్యధిక మార్కులు సాధించి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు గౌరవప్రదంగా ఈ విజయాన్ని అందించాలని తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ లింగంపల్లి భాగ్యలక్ష్మి సత్యనారాయణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేకాలి,ఎనిమిదో వాడు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విడుదల దేవయ్య,మాజీ సర్పంచ్ ఆదేపల్లి దేవ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థిని ,విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేసిన అనుపురం పరశురామ్ గౌడ్..

విద్యార్థిని ,విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేసిన అనుపురం పరశురామ్ గౌడ్

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులు అందరికీ దాదాపు ఎనభై ఆరు మందికి పైగా విద్యార్థులందరికీ వచ్చే నెలలో జరగబోయే పదవ తరగతి పరీక్షల దృష్ట్యా యువజన కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరశురామ్ గౌడ్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో శ్రీకొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం డైరెక్టర్, పదవ వార్డు సభ్యులు మామిడి దిలీప్ కుమార్, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా రామడుగు మండల కోఆర్డినేటర్ బాసరవేని అజయ్, రామడుగు పద్నాలుగవ వార్డు సభ్యులు సిరికొండ సాయితేజ, రామడుగు యువకులు ఎడవెల్లి శ్రీనివాస్, వెంకటేష్, రాంప్రసాద్, భరత్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్, ఉపాద్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అనుపురం పరశురాం గౌడ్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మెట్టు. రాబోవు పదవ తరగతి పరీక్షలు విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకొని పరీక్షలు మంచిగా వ్రాసి మంచి ర్యాంక్ లు సాధించి మీతల్లితండ్రులకు, పాఠశాలకి మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని, విద్యార్థులు మంచి భవిష్యత్తును సాధించాలని కోరారు. మోడల్ స్కూల్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించి ఏటువంటి ఇబ్బందులు ఉన్న అన్నివిధాల నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version