ఝరాసంగం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా పట్లోళ్ల రవి కుమార్…

ఝరాసంగం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా పట్లోళ్ల రవి కుమార్

●-: సర్పంచుల సమస్యల పరిష్కరం కోసం కృషి చేస్తా

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తనపై నమ్మకం ఉంచి ఝారసంగం మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మండలంలోని సర్పంచులకు దేవరం పల్లి గ్రామ సర్పంచ్ పట్లోళ్ల రవి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం నాడు ఝారసంగం మండలం సర్పంచుల.ఫోరం అధ్యక్షుడి ఎంపిక కోసం సర్పంచులు సమావేశమై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ ఆధ్వర్యంలో మండల నూతన సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా దేవరపల్లి సర్పంచ్ పట్లోల రవి కుమార్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదే విదంగా ఉపాధ్యక్షురాలు గినియార్పల్లీ సర్పంచ్ కుమ్మరి రాజేశ్వరి ని ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం సర్పంచులతో కలిసి ముందుకు వెళ్తామని, తమ మధ్య ఎలాంటి పట్టింపులు లేవని, సర్పంచుల సమస్యల పరిష్కరం కోసం మంత్రి దామోదర్ రాజనర్సింహ, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్, ఇంచార్జ్ డా చంద్రశేఖర్ ల సహకారంతో అభివృద్ధి పనులు చేసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో లో వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు యువ నాయకులు పాల్గొన్నారు.

నడికూడ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా పెద్ద బోయిన రవీందర్ యాదవ్…

నడికూడ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా పెద్ద బోయిన రవీందర్ యాదవ్

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు నడికూడలో నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో నార్లాపూర్ గ్రామ సర్పంచ్ పెద్ద బోయిన రవీందర్ యాదవ్ ను నడికూడ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఫోరం ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణాపురం సర్పంచ్ పెండ్లి లక్ష్మి, కార్యదర్శిగా కంఠాత్మకూర్ సర్పంచ్ కొంగంటి తిరుపతి, ఉపాధ్యక్షుడిగా రాయపర్తి సర్పంచ్ రాజా జగత్ ప్రకాష్, కోశాధికారి గా ధర్మారం సర్పంచ్ భాషిక ఎల్లస్వామి లను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో నడికూడ మండలంలోని సర్పంచులు కుడ్ల మలహల్ రావు,చర్లపల్లి గ్రామ సర్పంచ్ బండి రేణుక,చౌటుపర్తి గ్రామ సర్పంచ్ ఓదెల రూప,ధర్మారం గ్రామ సర్పంచ్ బాషిక ఎల్లస్వామి,కౌకొండ గ్రామ సర్పంచ్ ఓదెల శ్రీలత, ముస్త్సాల పెల్లి గ్రామ సర్పంచ్ మేకమల్ల వెంకటేష్, నర్సక్కపల్లి గ్రామ సర్పంచ్ కోడెపాక ముత్యాలు,పులిగిల్ల గ్రామ సర్పంచ్ ఇనుగాల పద్మ,సర్వాపూర్ గ్రామ సర్పంచ్ భోగి శ్రీలత,వరికోల్ గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి,కంఠాత్మకూర్ గ్రామ సర్పంచ్ కొంగంటి తిరుపతి,రాయపర్తి గ్రామ సర్పంచ్ రాజా జగత్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నడికూడ మండల యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అప్పం కుమార్ స్వామితో పాటు వివిధ గ్రామాల,మండల స్థాయి నాయకులు హాజరయ్యారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లను అభినందిస్తూ,మండల అభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version