నూతన మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లును సన్మానించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు…

నూతన మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లును సన్మానించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు

◆-: డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ ఫిబ్రవరి23:పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారి నివాసంలో సోమవారం నూతనంగా ఎన్నికైన జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లుకు శాలువాతో సన్మానించి వారికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.వారు మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యునూస్,వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి,కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి,జాఫర్,అరుణ్ కుమార్, జమిలుద్దిన్,జావిద్,జహంగీర్,అక్రం,నిజాం,అక్కాన్,ఖదీర్ మరియు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శుక్లవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,నర్సింహా యాదవ్,బర్కత్,ముస్తఫా మరియు తదితరులు పాల్గొన్నారు.

దేశ రాజధానిలో వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

దేశ రాజధానిలో వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ మున్సిపల్ సంస్థ stray dogs‌ను ఎనిమిది వారాల్లో పట్టుకుని, వాటిని శాశ్వతంగా షెల్టర్లకు తరలించాలని, ముందుగా వాటిని స్టెరిలైజ్ చేయాలని ఆదేశించింది.

రాజధానిని సురక్షితంగా ఉంచేందుకు ఈ చర్యలను కఠినంగా అమలు చేయాలని కోర్టు స్పష్టంచేసింది. ఈ ప్రక్రియలో ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ అడ్డంకిగా మారితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version