విద్యార్థిని ,విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేసిన అనుపురం పరశురామ్ గౌడ్..

విద్యార్థిని ,విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేసిన అనుపురం పరశురామ్ గౌడ్

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులు అందరికీ దాదాపు ఎనభై ఆరు మందికి పైగా విద్యార్థులందరికీ వచ్చే నెలలో జరగబోయే పదవ తరగతి పరీక్షల దృష్ట్యా యువజన కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరశురామ్ గౌడ్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో శ్రీకొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం డైరెక్టర్, పదవ వార్డు సభ్యులు మామిడి దిలీప్ కుమార్, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా రామడుగు మండల కోఆర్డినేటర్ బాసరవేని అజయ్, రామడుగు పద్నాలుగవ వార్డు సభ్యులు సిరికొండ సాయితేజ, రామడుగు యువకులు ఎడవెల్లి శ్రీనివాస్, వెంకటేష్, రాంప్రసాద్, భరత్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్, ఉపాద్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అనుపురం పరశురాం గౌడ్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మెట్టు. రాబోవు పదవ తరగతి పరీక్షలు విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకొని పరీక్షలు మంచిగా వ్రాసి మంచి ర్యాంక్ లు సాధించి మీతల్లితండ్రులకు, పాఠశాలకి మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని, విద్యార్థులు మంచి భవిష్యత్తును సాధించాలని కోరారు. మోడల్ స్కూల్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించి ఏటువంటి ఇబ్బందులు ఉన్న అన్నివిధాల నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version