బిఎల్ఎ ఓటర్ లిస్ట్ జాబితాను ఎన్నికల అధికారులకు సమర్పించిన కాంగ్రెస్ నాయకులు..

బిఎల్ఎ ఓటర్ లిస్ట్ జాబితాను ఎన్నికల అధికారులకు సమర్పించిన కాంగ్రెస్ నాయకులు

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి దాత్రి:

 

జహీరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు డా||ఏ.చంద్రశేఖర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం జహీరాబాద్ నియోజకవర్గంలోని సంబంధిత పోలింగ్ స్టేషన్లు మరియు ప్రాంతాలకు సంబంధించిన బూత్ లెవల్ ఏజెంట్ల ( బిఎల్ఎ ) జాబితాను వారి పరిశీలనార్థం మరియు అవసరమైన రికార్డు నిమిత్తం ( ఆర్డిఓ ) రెవిన్యూ డీవిజన్ ఎన్నికల అధికారికి వారి కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో బడుగుబాలహీన వర్గాల ప్రజల ఓట్లు తొలగించాలని కేంద్ర సర్కార్ బీజేపీ ప్రభుత్వం తెర లేపింది.( ఎస్ఐఆర్ ) ఓటర్ జాబిత ప్రక్రియను కట్టుదిట్టంగా మరియు పారదర్శకంగా నిర్వహించి,అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటర్ జాబితాలో నమోదు కావాలని, నకిలీ మరియు అనర్హత ఓట్లను తొలగించే విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ జాబితా కీలకమని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు, మొగుడంపల్లి మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సామెల్,మాజీ వైస్ చైర్మన్ ఖాజా,టీపీసీసీ కో- ఆర్డినటర్ గౌస్, కౌన్స్లర్ మహేష్, సర్పంచ్ రాజు,ఏ.యం.సి డైరెక్టర్ శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు హుగ్గేల్లి రాములు,నాయిమ్ మొయిజ్,గౌస్,ఆయుబ్,అడ్వొకేటే వాజహత్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్,కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version