నిబంధనల ప్రకారమే నిర్మాణం కూల్చివేత: తహసీల్దార్…

నిబంధనల ప్రకారమే నిర్మాణం కూల్చివేత: తహసీల్దార్

జహీరాబాద్ నేతి ధాత్రి:

 

కోహీర్,మండలం లోని సజ్జాపూర్ గ్రామానికి చెందిన బేగరి రాములు ఇంటి నిర్మాణం గోడలను గ్రామపంచాయతీ తీర్మానం చేసి కూల్చివేయడంపై వివాదం నెలకొంది. సజ్జాపూర్ గ్రామంలోని 21వ సర్వే నంబర్ లో పల్లె ప్రకృతి వనా నికి సమీపంలో ఇంటి నిర్మాణం చేయడంపై డిసెంబర్ 16న ఇంటి నిర్మాణం పనులు చేయరాదని పంచా యతీ కార్యదర్శి వికాస్ రాములుకు నోటీసులు జారీ చేశారు. రాములు ఆ నోటీసులను లెక్కచేయకుండా బేస్మెంట్ వరకు గోడలను నిర్మించాడు. దీంతో ఈ నెల 22న గ్రామ పంచాయతీ కార్యదర్శి, నూతనంగా ఎన్ను కోబడిన సర్పంచు, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో ఎక్స్కవే టర్ సాయంతో ఆ గోడలను కూల్చివేశారు. ఈ క్రమంలో రాములు మాట్లాడుతూ కావాలనే సర్పంచు తనయుడు తన ఇంటి నిర్మాణం గోడలను కూల్చివేశా రని ఆరోపించాడు. మంగళవారం సాయంత్రం కోహీర్ తహసీల్దార్ సుప్రియ, జహీరాబాద్ సీఐ శివలింగం సజ్జాపూర్ గ్రామాన్ని సందర్శించి గోడలను కూల్చివే

కూల్చివేత స్థలాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్, సీఐ

సిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తహ సిల్దార్ సుప్రియ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలోనే ఇంటి నిర్మాణం పనులు చేశారని, అంతేకాకుండా పల్లె ప్రకృతి వనానికి అడ్డుగా నిర్మాణం చేయడం నిబంధన లకు విరుద్ధంగా ఉండడంతోనే నిబంధనల ప్రకారమే పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ పాలకవర్గం వారు గోడలను తీసివేశారని ఆమె పేర్కొన్నారు. తనకు న్యాయం చేకూర్చాలని రాములు పలువురు గ్రామస్తు లతో కలిసి మంగళవారం మాజీ మంత్రి హరీశ్ వును కలిశారు. కాగా ఈ విషయమై పూర్తి విచారణ చేపట్టి బాధితుడికి న్యాయం చేయాలని హరీశ్రావు ఎస్పీని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version