బి.ఆర్.ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం
ఆశావహుల జాబితాను అధిష్టానానికి పంపిన నేతలు
కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల
నేటిధాత్రి ఐనవోలు :-
అయినవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామంలో బుధవారం వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మరియు అయినవోలు మండల పార్టీ సూచన మేరకు ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల సమావేశం బుధవారం గ్రామ పార్టీ అధ్యక్షులు మామిండ్ల సంపత్ అధ్యక్షతన గ్రామ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ పార్టీ ఎన్నికల ఇన్చార్జి మున్సిపాలిటీ పరిధి నుండి మేకల రాణి డివిజన్ పార్టీ అధ్యక్షులు కాంటెస్ట్ కార్పోరేటర్& అయినవోలు మండలం నుండి గ్రామ పార్టీ ఎన్నికల ఇన్చార్జిగా ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ కట్కూరి రాజు హాజరై రాబోయే జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచి వార్డు సభ్యుల ఎన్నికల గెలుపు కొరకు పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేసి కార్యకర్తలను ప్రోత్సహించినారు. అనంతరం కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేసినారు. మరియు ఎంపీటీసీ జనరల్ మహిళ ఆశావాహ పోటీ చేసే అభ్యర్థుల నుండి పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మామిళ్ళ సంపత్, మాజీ ఎంపీటీసీ కడూరి రాజు, నందనం సొసైటీ డైరెక్టర్ రాజారాపు కుమార్, సతీషు, రమేషు, భాస్కరు, ప్రతాపరెడ్డి, సమ్మయ్య, రాజు, రాజిరెడ్డి, రాజేషు, అశోకు, కుమారు, రాజు, రమేషు, రాజబాబు, కుమారు, ప్రతాపు, రాజశేఖర్, మరియు గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.