ఎంపీటీసీ స్థానాల వారిగా సీపీఐ సమావేశాలు.

ఎంపీటీసీ స్థానాల వారిగా సీపీఐ సమావేశాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ సత్తా చాటాలి

మండలంలో ఎర్ర జెండా ఎగురవేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలి- పంజాల శ్రీనివాస్

కరీంనగర్, నేటిధాత్రి:

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలిచి తమ సత్తా చాటాలని, చిగురుమామిడి మండలంలో సీపీఐ పూర్వవైభవం కోసం మండలంలో ఎర్ర జెండా ఎగురవేయడానికి సీపీఐ నాయకులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున మండలంలోని ఇందుర్తి గ్రామంలో గల అమరజీవి కూన ముత్తయ్య స్మారక భవన్ సీపీఐ కార్యాలయంలో ఇందుర్తి రెవిన్యూ పరిధిలోని రెండు ఎంపీటీసీ స్థానాల గ్రామాలైన ఇందుర్తి, ఓగులాపూర్, గాగిరెడ్డిపల్లె, గునుకులపల్లె గ్రామాల సీపీఐ ముఖ్య నాయకుల సమావేశం సీపీఐ ఇందుర్తి గ్రామశాఖ కార్యదర్శి ఎం.డి.ఉస్మాన్ పాషా అధ్యక్షతన జరిగింది. చిగురుమామిడి మండల కేంద్రంలోని అమరజీవి ముస్కు రాజిరెడ్డి స్మారక భవన్ లో చిగురుమామిడి ఎంపీటీసీ స్థానం సమావేశం అల్లేపు జంపయ్య అధ్యక్షతన జరిగింది. సుందరగిరి ఎంపీటీసీ స్థానం సమావేశం మావురపు రాజు అధ్యక్షతన జరిగింది. లంబాడిపల్లి, సీతారాంపూర్ గ్రామాల ఎంపీటీసీ స్థానం సమావేశం కయ్యం తిరుపతి అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీకి పెట్టింది పేరుగా ఉన్న చిగురుమామిడి మండలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఎంతోమంది త్యాగదనులు ప్రాణాలు సైతం కోల్పోయారని, ఈప్రాంతంలో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని వారంతా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం వారి, గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారని వారి ఆశయాలను లక్ష్యాలను ముందుకు తీసుకు పోవడం కోసం మండలంలో ఎర్రజెండాను ఎగురవేసి తిరిగి గత వైభవం తీసుకురావాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై నాయకులపై ఉందని, నిరంతరం ప్రజల మధ్య ఉండి సమస్యలు పరిష్కరించడం కోసం పార్టీ నాయకత్వం ముందుండాలని, పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే పార్టీ ప్రజాపతినిధులు గ్రామ, మండల స్థాయిలో గెలవాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ప్రభుత్వం, ఈప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేసినట్లుగా లేవని, ఆయా పార్టీ నాయకులకే, కార్యకర్తలకే పథకాలు అందాయని, అర్హులైన వారికి అందలేదని, కమ్యూనిస్టు పార్టీ ప్రజాప్రతినిధులు ఉంటేనే పేదలకు, అర్హులకు సంక్షేమ పథకాలు అందుతాయని, న్యాయం జరుగుతుందని శ్రీనివాస్ అన్నారు. ఈసమావేశాల్లో జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు గూడెం లక్ష్మీ, జిల్లా కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్ రెడ్డి, అందె చిన్నస్వామి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి బూడిద సదాశివ, రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శి కోమటిరెడ్డి జయపాల్ రెడ్డి, గోలి బాపురెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ముద్రకోల రాజయ్య, గ్రామశాఖ కార్యదర్శులు ఎం.డి.ఉస్మాన్ పాషా, ఇల్లందుల రాజయ్య, అల్లేపు జంపయ్య, ఎలగందుల రాజు, కయ్యం తిరుపతి, బోట్ల పోచయ్య, నాయకులు కూన లెనిన్, రాకం అంజవ్వ, గంధె కొమురయ్య, తాల్లపెల్లి చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

కులబలం ఉంటేనే రాజకీయ పార్టీల్లో సీట్లు.

కులబలం ఉంటేనే రాజకీయ పార్టీల్లో సీట్లు..

ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఎన్నారై సెల్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్,

నర్సంపేట నేటిధాత్రి:

కులబలం ఉంటేనే రాజకీయ పార్టీల్లో సీట్లు సాదించుకోవచ్చని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఎన్నారై సెల్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్ రాష్ట్ర ముదిరాజ్ కులస్తులు పిలుపునిచ్చారు.తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామాల్లో గల వందన గార్డెన్ లో ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు ,నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథులుగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు,శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లేబోయిన అశోక్ పాల్గొన్నారు.శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 13 వేల గ్రామ పంచాయితీ ఉంటే ముదిరాజ్ కులస్తులు ముదిరాజ్ సొసైటీలతో పటిష్టంగా ఉన్నారన్నారు.
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న ముదిరాజ్ కులస్తులు కీలకమని పేర్కొన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో కులబలం ఉంటేనే రాజకీయ పార్టీల్లో సీట్లు లభిస్తాయి.సీట్లు సాధించి ప్రజా ప్రతినిధులుగా ఎదగచ్చని తెలిపారు.
సామాజికంగా,ఆర్థికంగా ఎదగాలన్న సమిష్టిగా ఉండాలి.గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముదిరాజ్ లకు బీసీ డి నుండి బీసీ ఏ కు మార్చాలని ప్రత్యేక జీఓను ప్రస్తుత శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ తెప్పించారు.నేడు ఆయన వెంటే ఉంటూ హక్కులను సాధించుకోవాలని ముదిరాజ్ కులస్తులు పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అధిక స్థానాలు గెలిపించాలి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అధిక స్థానాలు గెలిపించాలి.

పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల కేంద్రంలో మండల కార్యవర్గ సమావేశం బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు విచ్చేసి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారాధ్యంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ దేశం కోసం ధర్మం కోసం దేశ అభివృద్ధి కోసం ఎల్లవేళల శ్రమిస్తూ నరేంద్ర మోడీ ని ఆయన తీసుకువచ్చిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అధిక స్థానాల్లో గెలుపొందే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ రావుల రాకేష్ బీజేపీ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు తీగల జగ్గయ్య మండల ఉపాధ్యక్షులు సుధా గాని శ్రీనివాస్ నల్ల శ్రీనివాస్ రెడ్డి చింతల రాజేందర్ మండల కార్యదర్శి చెన్నవేని సంపత్ బిజెపి సీనియర్ నాయకులు మాచర్ల రఘు, కంచ కుమారస్వామి బూత్ అధ్యక్షులు వల్లల ప్రవీణ్ తీగల వంశీ బుర్రితిరుపతి జైపాల్ చందు వివేక్ తోట్ల మహేష్ గొప్పగాని రాజు మాదారపు రాజు శ్యామల వెంకటేశ్వర్లు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version