స్వశక్తి నారి అభియాన్ వైద్య శిబిరము…

స్వశక్తి నారి అభియాన్ వైద్య శిబిరము

మందమర్రి నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లాలో ఆరోగ్య మహిళ ఆరోగ్యవంతమైన కుటుంబము స్వశక్తి నారి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము మందమర్రిలో ప్రత్యేక వైద్య శిబిరమును డాక్టర్ సుధాకర్ నాయక్ ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆకస్మికంగా సందర్శించి తగు సూచనలు ఆదేశాలు జారీ చేసినారు ఈ వైద్య శిబిరంలో 172 మంది నమోదు చేసుకున్నారు ఈ శిబిరంలో డాక్టర్ అతుల్ ఫిజీషియన్ డాక్టర్ శిల్ప కంటి వైద్య నిపుణులు డాక్టర్ మానస స్త్రీ వైద్య నిపుణులు ఎమ్మెల్యే సీలు వైద్య సిబ్బంది ఆశ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సమావేశంలో బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి ద్వారా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగినది

ఈ ప్రత్యేక వైద్య శిబిరములను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ అనిత ఆధ్వర్యంలో చేస్తున్నట్టు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి సామాజిక ఆరోగ్య కేంద్రం నుండి వైద్య నిపుణుల ద్వారా వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చేపట్టడం రోగుల వివరములను ఆన్లైన్లో నమోదు చేయడం అదేవిధంగా తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా పరీక్షలు చేయించడం మందులను చికిత్సలు అందించడము రిఫరల్ కేసులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగినది ముఖ్యంగా ఈ ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా మాతా శిశు సంరక్షణ టీకాల కార్యక్రమము అసంక్రమణ వ్యాధులు బిపి డయాబెటిస్ క్యాన్సర్ల నిర్ధారణ అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన చర్యలు కీటక జనిత వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గుని అలాంటివి పరబలకుండా చర్యలు చేపట్టడం అవగాహన కలిగించడం జరిగినది ముఖ్యంగా పిల్లలకు టీ తాగిపించడం సరైన సమయంలో సరైన వయసులో ఇవ్వడం టీవీ ద్వారా రోగులను గుర్తించి వారికి పోషకాహార కిట్టులు అందజేయడం జరుగుతుందని అవగాహన కల్పించడం జరిగిందని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ మానస సిబ్బంది శ్రీ సత్తయ్య సి హెచ్ ఓ బుట్ట వెంకటేశ్వర్ జిల్లా మాస్ మియాధికారి పాల్గొన్నారు

గల్ఫ్ కార్మికునికి గల్ఫ్ కార్మికుల భరోసా….

గల్ఫ్ కార్మికునికి గల్ఫ్ కార్మికుల భరోసా
వి. వి. రావుపేట్ సంఘం తరపున 57.001 ఆర్థిక సాయం
మల్లాపూర్ సెప్టెంబర్ 11 నేటి ధాత్రి

 

 

 

జగిత్యాల జిల్లా మల్లపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన కండేల గంగాధర్ అనే గల్ఫ్ కార్మికుని పట్ల కాలం కనికరం చూపలేదు. తన కుటుంబం కోసం చిన్నతనం అందరిని కాల్పోయి మళ్ళీ కుటుంబం కోసం కష్టపడి మంచి కుటుంబాన్ని సంతోషంగా సాగుతున్న సమయం లో విషాదం నెలకొల్పింది.
కండెల గంగాధర్ తన భార్య అంజలి అనారోగ్యం బాగా లేనందున ఎంతో ఖర్చు చేసుకొని హాస్పిటల్లో లక్షలు ఖర్చు చేసుకున్న కూడా తన భార్యను కాన్సర్ నుండి రక్షించలేకపోయాడు.
తోటి గల్ఫ్ కార్మికునిక గా చిన్నతనం నుండి చూసిన ఎంతోమంది గల్ఫ్ కార్మికులు చలించి పోయారు. వి. వి. రావుపేట్ గల్ఫ్ కార్మిక సంఘం సభ్యులు ఏదో ఉడుతా సహాయంగా ఆర్థిక సాయం చేయడం జరిగింది. అక్షరాల యాభై ఏడు వేల రూపాయలు తోటి గల్ఫ్ కార్మికులకు ఇబ్బంది ఉందని చెప్పగానే వి. వి. రావుపేట్ గల్ఫ్ కార్మిక సంఘ సభ్యులు తన కుటుంబానికి ఆర్థికంగా మనందరం కూడా సహాయం చేద్దామని ముందుకు రావడం.జరిగింది
ఒకరికి ఒకరం భరోసానివ్వడం చాలా గొప్ప విషయం అని వి. వి. రావుపేట్ గల్ఫ్ సంఘo నాయకులు తెలిపారు.
అలాగే ఈ సంస్థ ఏర్పడిన నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి భరోసా, గల్ఫ్ కార్మికలకు అవగాహనా కల్పిస్తున్న అందున పలు నాయకులు సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమం లో వి వి రావుపేట గల్ఫ్ కార్మిక సంఘం సభ్యులు పెనుకుల అశోక్. ఆరేళ్లి మహేష్,విష్ణు రాజా. మచ్చర్ల అదిరెడ్డి నారాయణ గౌడ్.రఘపతి. నలిమేల ప్రసాద్. పోతు రఘు. గుగ్లావత్ శ్రీకాంత్ మెండే ప్రవీణ్. రొడ్డ రాజశేఖర్. శ్రీమాన్ గౌడ్. రొడ్డ నవీన్. ఒల్లలా మల్లేషం. సంఘ మహేష్.గోపినేని రమేష్. వేల్పుల గంగాధర్. జక్కని నరేష్. కాట్కామ్ గణేష్. అరెల్లి శ్రీనివాస్. మిట్టపల్లి శ్రీనివాస్. సురేందర్ రొడ్డ. నాణెం రంజిత్. పళ్ళికొండ నరేష్. ఒల్లలా శ్రీనివాస్. పంజర్ల సత్యనారాయణ. ఎండీ రహీమ్. కండెల వెంకటి. బాధనపెల్లి గంగారెడ్డి. ఇరిశెట్టి సాయిలు. కోమానాపెళ్ళి కాసాన్న. రొడ్డ రాజేందర్. కండెల భూమయ్య. వేల్పుల మహేష్. సకినాపెళ్ళి శేఖర్. కొడిమ్యాల లింగం చారి. సుతారి గణేష్. గుగ్లావత్ రాజేష్. యాళ్ల తిరుపతి రెడ్డి. అమరకొండ లక్ష్మి రాజాం. గుగ్లావత్ శ్యామల్. గుగ్లావత్ తిరుపతి. కండెల సాయిలు. లౌడ్య విష్ణు. అరే రాజేశం. నిమ్మల విజయ్. ఎండీ ఆమాన్. వెల్మలా ప్రవీణ్. ఎండీ అబిబి.అరెల్లి రాజేశం. సకినపెల్లి రమేష్. జోగుల రాకేష్. గుగ్లావత్ చిన్నా.ఈ కార్యక్రమంలో. పెనుకుల నరేష్. వేముల నరేష్. నలిమేల రాజు. సతీష్. శ్రీను . శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఫ్రీ క్యాన్సర్ టెస్ట్.!

తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఫ్రీ క్యాన్సర్ టెస్ట్

జైపూర్,నేటి ధాత్రి:

తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఫ్రీ క్యాన్సర్ టెస్ట్
తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉచితంగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని గ్రామాల్లో 18 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.ఈ పరీక్షల్లో ఎవరిలోనైనా క్యాన్సర్‌ లక్షణాలు బయటపడితే జిల్లాస్థాయి క్యాన్సర్‌ చికిత్స కేంద్రానికి తరలిస్తామని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version