జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్…

జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్

జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఆయిల్ మారుతి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో అన్ని గ్రామాల నుండి కంటి పొరలు & శుక్లాల సమస్యతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకోవాలనే వారికోసం జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతీ భూపాలపల్లి లో బస్సు ఏర్పాటు చేసి వారందరినీ కరీంనగర్ లోని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించనున్నారు తేదీ ఏప్రిల్ 13/2026 సోమవారం రోజున ఉదయం 9 గంటలకు భూపాలపల్లి, కిరణ్ హాస్పిటల్ ముందు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల భవనం వద్దకు బస్సు వస్తుంది కావున వచ్చేవారు ఉదయం 9 గంటల వరకు అక్కడికి రాగలరు
ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ పేరును నమోదు చేసుకోగలరు 9440903023 ఇతర ఏ జిల్లాల నుండైనా ఆపరేషన్ కోసం రావచ్చు వేరే జిల్లాల నుండి వచ్చేవారు ఫోన్ చేసి డైరెక్ట్ గా కరీంనగర్ హాస్పిటల్ దగ్గరికి రాగలరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9440903023
వెంట తీసుకరావాల్సినవి
ఆధార్ కార్డ్ కలర్ జిరాక్స్ లు (3)
కలర్ ఫోటోలు (3)
ఒక జాత బట్టలు, ఒక చెద్దర్, పేషెంట్ తో వచ్చేవారు ఒక చద్దర్ తెచ్చుకోవాలి,అలాగే ఒక వాటర్ బాటిల్ తీసుకొని రాగలరు
ఆపరేషన్ చేయించుకునే వారు రెండు రోజుల నుండి మద్యం మానివేయాలి

గ్రీన్ స్టార్ హాస్పిటల్ లో ఆప్తమాలజీ యూనిట్ ప్రారంభం….

గ్రీన్ స్టార్ హాస్పిటల్ లో ఆప్తమాలజీ యూనిట్ ప్రారంభం

నర్సంపేట,నేటిధాత్రి:

 

*నర్సంపేట పట్టణంలోని గ్రీన్ స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆప్తమాలజీ కంటి వైద్య యూనిట్ ను ప్రారంభించినట్లు గ్రీన్ స్టార్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి తెలిపారు.నేటి నుండి స్టార్ హాస్పిటల్ లో కంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని కంటి ఆపరేషన్లు కంటిలో పోరా, లెన్స్ లాంటి ఆపరేషన్లు కూడా చేయబడును అని డయాబెటిక్ పేషెంట్లకు కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ విద్య, కంటి వైద్య నిపుణులు నామాల అనిల్, గ్రీన్ స్టార్ హాస్పిటల్ డైరెక్టర్లు బీరం నాగిరెడ్డి, నాయుడు శ్రీనివాస్,అనంతగిరి రవి,గోనె యువరాజు,పీఆర్ఓ రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉచిత కంటి వైద్య శిబిరం

ఉచిత కంటి వైద్య శిబిరం

 

డాక్టర్ జి.సంజీవరావు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..

 

కరకగూడెం:మండలంలోని కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,మారుతి నర్సింగ్ కాలేజ్,లయన్స్ క్లబ్ భద్రాచలం సహకారంతో సికింద్రాబాద్ వారిచే పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరంలో ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు.ఈ వైద్య శిబిరంలో డాక్టర్ జి.సంజీవరావు పాల్గొని 250 మందిని కంటి పరీక్షలు చేయగా అందులో 60 మందికి శాస్త్ర చికిత్సలకు ఎంపిక చేశారు.అనంతరం రోగులకు ఉచితంగా మందులు అందజేశారు.ఈ సందర్భంగా డా,, సంజీవరావు మాట్లాడుతూ… ఏజెన్సీలోని మారుమూల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం గొప్ప నిర్ణయమని,ప్రజల నుండి మంచి విశేష స్పందన ఉందన్నారు.ఏజెన్సీ ప్రాంతంలోని పేదవారికి ఈ సంస్థ వారు మరెన్నో సేవలందించాలని వారు కోరారు.ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులను,సంయుక్త సంస్థ వారిని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు డా,,ఎస్ఎల్ కాంతారావు,రాజిరెడ్డి,ఆదినారాయణ,సూర్యనారయణ,గ్రామస్తులు:గొగ్గల నారాయణ,ఈసం సమ్మయ్య,ఈసం సత్యం,కొమరం లక్ష్మీనర్సు,జోగ దూలయ్య,రామక్రిష్ణ,మారుతి కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version