అయినవోలులో కాంగ్రెస్ ప్రచారానికి ఊపు

అయినవోలు మండలంలో కాంగ్రెస్ జాతీయ నేతల ప్రచారం
నేతృత్వం వహించిన
ఏఐసీసీ నేషనల్ జాయింట్ కోఆర్డినేటర్ ఉల్లెంగల యాదగిరి
మండల వ్యాప్తంగా ప్రచారానికి కొత్త ఊపు

నేటిధాత్రి అయినవోలు:

అయినవోలు మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థుల ప్రచార కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నేషనల్ జాయింట్ కోఆర్డినేటర్ మరియు మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి ఉల్లెంగల యాదగిరి స్వయంగా హాజరై ప్రచారానికి విశేషమైన దృష్టిని ఆకర్షించారు. గ్రామాల్లో అడుగుపెట్టిన ప్రతి చోట ఆయనకు ప్రజల నుంచి అపారమైన స్పందన లభించింది.ప్రచార బృందంతో కలిసి ఇంటింటా తిరిగిన ఉల్లెంగల యాదగిరి, అభ్యర్థుల గెలుపు కోసం ప్రజలను ఓటు వేయాలని కోరారు. గ్రామాభివృద్ధి, పారదర్శక పరిపాలన, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌నే ఎంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మండలంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం నెలకొన్నట్లు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించబోతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఆదివాసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కుర్ర రాజు నాయక్, మాజీ కార్పొరేటర్ హన్మకొండ రాజేందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రొఫెసర్ బూర ముత్తిలింగం, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీరామ థియేటర్ ఎదురుగా లీకేజీ నీళ్ల పైపులను తనిఖీ చేస్తున్న మున్సిపల్ కమిషనర్.

శ్రీరామ థియేటర్ ఎదురుగా లీకేజీ నీళ్ల పైపులను తనిఖీ చేస్తున్న మున్సిపల్ కమిషనర్

నేటి ధాత్రి దినపత్రిక లో వచ్చిన కథనంపై స్పందన

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో శ్రీరామ టాకీస్ ఎదురుగా మిషన్ భగీరథకు సంబంధించి ఇండ్ల యజమానుల నల్లాలు లీకేజ్ కావడంతో రోడ్డుపై నీరు పారడంతో మంగళవారం నాడు నేటిధాత్రి దినపత్రికలో వార్త కథనంపై మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు స్పందించారు ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ మిషన్ భగీరథ కి సంబంధించి నీళ్ల పైపులను తనిఖీ చేశారు . మాజీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మయ్య ఇంటి ఎదురుగా శ్రీ రామ టాకీస్ వరకు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి దగ్గరుండి కార్మికులచే రోడ్డుపై ఉన్న మట్టిని తీసి వేయించారు ఈ మేరకు 15వ వార్డ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ కల్వ భూపేష్ కుమార్ శెట్టి బండార్ రాజు ఆర్ఎంపీ డాక్టర్ దానెల్ పాపిశెట్టి శ్రీనివాసులు వార్డు ప్రజల తరుపున మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డికి మున్సిపల్ సిబ్బందికి నేటి దాత్రి దినపత్రి క ప్రతినిధికి కృతజ్ఞతలు తెలిపారు

ఉచిత కంటి వైద్య శిబిరం

ఉచిత కంటి వైద్య శిబిరం

 

డాక్టర్ జి.సంజీవరావు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..

 

కరకగూడెం:మండలంలోని కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,మారుతి నర్సింగ్ కాలేజ్,లయన్స్ క్లబ్ భద్రాచలం సహకారంతో సికింద్రాబాద్ వారిచే పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరంలో ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు.ఈ వైద్య శిబిరంలో డాక్టర్ జి.సంజీవరావు పాల్గొని 250 మందిని కంటి పరీక్షలు చేయగా అందులో 60 మందికి శాస్త్ర చికిత్సలకు ఎంపిక చేశారు.అనంతరం రోగులకు ఉచితంగా మందులు అందజేశారు.ఈ సందర్భంగా డా,, సంజీవరావు మాట్లాడుతూ… ఏజెన్సీలోని మారుమూల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం గొప్ప నిర్ణయమని,ప్రజల నుండి మంచి విశేష స్పందన ఉందన్నారు.ఏజెన్సీ ప్రాంతంలోని పేదవారికి ఈ సంస్థ వారు మరెన్నో సేవలందించాలని వారు కోరారు.ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులను,సంయుక్త సంస్థ వారిని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు డా,,ఎస్ఎల్ కాంతారావు,రాజిరెడ్డి,ఆదినారాయణ,సూర్యనారయణ,గ్రామస్తులు:గొగ్గల నారాయణ,ఈసం సమ్మయ్య,ఈసం సత్యం,కొమరం లక్ష్మీనర్సు,జోగ దూలయ్య,రామక్రిష్ణ,మారుతి కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

నేటి ధాత్రి ఎఫెక్ట్…స్పందించిన మున్సిపల్ అధికారులు

నేటి ధాత్రి ఎఫెక్ట్…స్పందించిన మున్సిపల్ అధికారులు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

పారిశుద్ధ్యం పడకేసిందా…?
నేటి ధాత్రి కథనానికి కేసముద్రం మున్సిపాలిటీ అధికారులు పారిశుధ్యం పై స్పందించి తక్షణమే పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టడం జరిగింది

సైడ్ డ్రైనేజీ కాలువ పిచ్చి మొక్కల తొలగింపు చెత్తకుప్పల తొలగింపు మున్సిపల్ కార్మికుల చే పారిశుద్ధ్యం పనులు చేయడం జరిగింది. కథనానికి స్పందించిన అధికారుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version