భూ వివాదం.. తుపాకీతో కాల్చి పారేస్తామని బెదిరింపు…

 భూ వివాదం.. తుపాకీతో కాల్చి పారేస్తామని బెదిరింపు

 

భూ వివాదంలో తుపాకీ కలకలం సృష్టించిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. హావేలి ఘనాపూర్ మండల కేంద్రం శివారులో రైతు సిద్దమ్మకు గ్రామంలో కొందరితో భూ తగాదాలు ఉన్నాయి.

మెదక్, నవంబర్ 6: భూ వివాదంలో తుపాకీ కలకలం సృష్టించిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. హావేలి ఘనాపూర్ మండల కేంద్రం శివారులో రైతు సిద్దమ్మకు గ్రామంలో కొందరితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూ వివాదంపై మెదక్ జిల్లా కోర్టు నుంచి సిద్దమ్మ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రత్యర్ధులు.. గ్రామ శివారులోని పొలం వద్ద సిద్దమ్మ సహా ఆమె కుటుంబీకులను తుపాకీతో బెదిరించారు. భూమి వద్దకు వస్తే తుపాకీతో కాల్చి పారేస్తానంటూ బెదురింపులకు దిగారు. దీంతో భయాందోళనకు గురైన బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. తమను బెదిరించారని, కాల్చేస్తామంటూ బయపెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version