మందమర్రి రజక వృత్తిదారుల సంఘం.!

మందమర్రి రజక వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం

మందమర్రి నేటి ధాత్రి

 

 

మందమర్రి పట్టణంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సమావేశం….. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైల్ల ఆశన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తు పథకాన్ని రజక అభివృద్ధి దారులకు కూడా అమలు చేయాలని మందమర్రి పట్టణంలో ఇతర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ధోబిఘాట్లను పూర్తి చేయాలని అంతేకాకుండా రాజీవ్ యువ వికాస్ యోజన పథకం కింద రజకులకు ప్రత్యేకంగా యూనిట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

General Meeting

 

అంతేకాకుండా దేశవ్యాప్తంగా అమలవుతున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రజకుల కోసం కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిరాల రాములు జిల్లా అధ్యక్షులు తంగేళ్లపల్లి వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షులు ముస్కే చందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టణ అధ్యక్షుడు గంగరాజుల రామచందర్ ఉపాధ్యక్షులు కొత్తకొండ నరసయ్య బండి పోశయ్య రాసర రాములు పెనుగొండ సమ్మయ్య తోటపల్లి కళావతి తడిగొప్పుల భాగ్య తదితరులు పాల్గొన్నారు

క్రిమినల్స్ పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు .

క్రిమినల్స్ చేంజ్ పట్టుకొని కటకటాల్లోకి పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు .
మిక్రిమినల్స్ చేంజ్ పట్టుకొని కటకటాల్లోకి పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

 

క్రిమినల్స్ చేంజ్ పట్టుకొని కటకటాల్లోకి పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు. జైల్లో ఖైదీలకు కాపలాగా ఉండే పోలీస్ కాస్తా ఖైదీల బట్టలు వెళుకోవడానికి సిద్ధం అయ్యాడు. సిగరెట్లు డిస్టిబ్యూటీ చెస్తున్న వ్యక్తులను భయబ్రాంతులకు గురి చేసి డబ్బులు వసూలు చేస్తు సిగరెట్ ప్యాకెట్లను తీసుకెళ్తున్న ఇద్దరు పోలీసులతో సహా మరో ఇద్దరిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 3.5 లక్షలు విలువ చేసే పలు కంపెనీలకు చెందిన సిగరెట్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చెలుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలు మియాపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ కుమార్ వెల్లడించారు. వారసిగూడా కు చెందిన గాయని శ్రీకాంత్ (36) కంది జైల్లో జైల్ వార్డెన్ గా పని చేటున్నాడు. కడప జిల్లాకు చెందిన చిదిరి అమర్నాథ్ (41) ఎపి లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ పలు కెసుల్లో జైల్ కి వెళ్లి వచ్చాడు. ఇద్దరు సస్పెన్షన్ లో ఉండగాఆరో ఇద్దరు మల్కాజిగిరి దాయనంద్ నగర్ కి చెందిన ఎండి ఇమ్రాన్ (32), మలక్ పెట్, మూసరం బాగ్ కి చెందిన వాసం శ్రీకాంత్ (32) లతో పరిచయం ఏర్పడింది. ఇమ్రాన్ డెలివరీ బాయ్ గా శ్రీకాంత్ పెయింటర్ గా పనిస్తున్నారు. నలుగురు ముఠా గా ఏర్పడి ఇటిసి నుండి సిగరెట్లు షాప్ లలో సప్లై చేసే వారే టార్గెట్ గా పెట్టుకొని రెక్కీ నిర్వహించేవారు. వారు బైక్ పై వెళ్తున్న సమయంలో ఆపి మేము క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులం మీరు తిఅంకెళ్తున్న సిగరేట్లలో గంజాయి కలిపి అమ్ముతున్నారు అని భయబ్రాంతులకు గురి చేసేవారు. సిగరేట్లతో పాటు గంజాయి, డ్రగ్స్ సప్లై చేటున్నందుకు కేసులు పెడతామని బెదిరిస్తారు. వాటిని పరిశీలించి లోకల్ పోలీసులకు అప్పగించాలి అంటూ బెదిరించి డబ్బ, సిగరెట్ ప్యాకెట్లు తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు. కాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాతృ శ్రీ నగర్ లో ఏప్రిల్ 28 వ తేదీన సిగరెట్ సప్లైర్ బెదిరించి సిగరెట్ ప్యాకెట్లు తీసుకెళ్లారు. అనుమానం వచ్చిన సప్లర్ శ్రీహరి వెంటనే మియాపూర్ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయాయడంతో నిందితులను అదుపులోకి తిఆకున్నారు. వారి నుండి 3.5 లక్షల విలువ చేసే పలు రకాల కంపెనీలకు చెందిన సిగరెట్ ప్యాకెట్లను పోలీసుల స్వాధీనం చెలుకున్నారు. ఈ విధంగా వారిపై అల్వాల్, మియాపూర్, సైఫాబాద్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో నాలుగు కేసులు ఉన్నాయి. ఈ మేరకు నిందితులను రిమాండ్ కు తరలించి కేసును చేధించిన పోలీసులని ఏసీపీ, శ్రీనివాస్ కుమార్ అభినందించారు ఈ కార్యక్రమంలో, క్రాంతి కుమార్, రవీందర్, రమేష్ నాయుడు,విజయ్ కుమార్, శ్రీకాంత్, చంద్రశేఖర్, ప్రేమ్ కుమార్, పుల్య నాయక్, సుభాష్

వేతనాన్ని విరాళంగా అందజేసిన ఎమ్మెల్యే .!

దేశ రక్షణ నిధికి ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునందుకొని తాను సైతం దేశ రక్షణ నిధికి ఒక నెల వేతనాన్ని అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం

సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులను తరిమి కొడుతున్న భారత ఆర్మీ వీరులకు నా సెల్యూట్

గంగాధర నేటిధాత్రి :

 

 

నేను భారతీయుడను- నేను భారత సైన్యానికి మద్దతుగా నిలబడతానని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు ఇండియన్ ఆర్మీకి మద్దతుగా నిలబడవలసిన సమయం వచ్చిందన్నారు. సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులను తరిమి కొడుతున్న భారత ఆర్మీ వీరులకు నా సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. దేశ ప్రజలు గర్వించే విజయాలను అందిస్తున్న భారత సైన్యానికి పూర్తి సంఘీభావం తెలుపుతూ, తమ కర్తవ్యం గా దేశ రక్షణ నిధికి ప్రజా ప్రతినిధులు ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుమేరకు విరాళం అందజేసినట్లు తెలిపారు.పహాల్గంలో అమాయక ప్రజల ఉసురు తీసి విర్రవీగుతున్న ఉగ్రముకలు, వారిని భారతదేశం పైకి ఉసిగలిపిన పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీకి భారతదేశ పౌరులు మద్దతుగా నిలబడే సమయం వచ్చిందన్నారు. నేను భారతీయుడిని, దేశ సరిహద్దుల్లో విరోచితంగా పోరాడుతున్న భారత వీర జవాన్లకు సంఘీభావం తెలియజేస్తున్నట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమకు తోచిన విధంగా దేశ రక్షణ నిధికి విరాళం అందజేయాలని సూచించారు.

బిజెపిలో చేరిన చీర్యాల గ్రామం మాజీ సర్పంచ్ .!

బిజెపిలో చేరిన చీర్యాల గ్రామం మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్

కీసర నేటి దాత్రి :

 

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

కీసర మండల చీర్యాల గ్రామ మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సమక్షంలో బండారు నరసింహ యాదవ్, గూడ నరేష్ గౌడ్, సాయికుమార్ గౌడ్, తదితరులు బిజెపిలో చేరారు వారిని ఈటల రాజేందర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ యొక్క కార్యక్రమము బిజెపి కీసర మండల అధ్యక్షులు కోళ్ల బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, పట్లోళ్ల విక్రం రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

సోమశీల నదిలో కోటి గౌరమ్మల నిమజ్జనం .

సోమశీల నదిలో కోటి గౌరమ్మల నిమజ్జనం

వనపర్తి నేటిధాత్రి :

 

 

వనపర్తి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘంఅధ్యర్యములో పసుపుతో తయారు చేసిన కోటి గౌరమ్మల నిమజ్జనం సోమశిల సంగమేశ్వర నదిలో నిమజ్జనము చేశారు నిమజ్జన కార్యక్రమంలో వనపర్తి ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజు మహిళా అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి అనంత పద్మావతి గుబ్బ మాధవి కొండూరు మంజుల ప్రవీణ్ కొంపల. శ్రీలక్ష్మి ఆకుతోట సుప్రియ యావజన సంఘము అధ్యక్షులు బచ్చు వెంకటేష్ పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు బచ్చురాము లగిశెట్టి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారని బచ్చురామ్ ఒక ప్రకటన లో విలేకరులకు తెలిపారు

బీసీల విద్యా స్థాయిని పెంచాలి.

బీసీల విద్యా స్థాయిని పెంచాలి

నేటిధాత్రి :

బలహీనవర్గాల విద్యా స్థాయిని పెంచడానికి తీసుకోవలసిన చర్యలపై తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి ఒక నివేదికను అందజేశామని బీసీ నాయకులు డాక్టర్ తిరునహరి శేషు, డాక్టర్ తండు నాగయ్య తెలియజేసినారు. శుక్రవారం హైదరాబాద్ ఎడ్యుకేషన్ కమిషన్ కార్యాలయంలో జరిగిన ఎడ్యుకేషనల్ స్టేటస్ ఆఫ్ బీసీస్ ఇన్ తెలంగాణ అనే అంశంపై జరిగిన వర్క్ షాప్ లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి పాల్గొన్న డాక్టర్ శేషు డాక్టర్ నాగయ్య తెలంగాణ రాష్ట్రంలో బీసీల విద్యాస్థాయి, విద్యా విషయాలలో బిసిలు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యా స్థాయిని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య, ప్రొఫెషనల్, సాంకేతిక విద్యలలో బీసీల విద్యా స్థాయిని పెంచడానికి చెప్పటాల్సిన చర్యలపై కమిషన్ కి నివేదిక అందజేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి పథకాన్ని ఆంక్షలు లేకుండా అమలు చేయాలని, పూలే విదేశీ విద్యా జ్యోతి లాంటి పథకం ద్వారా లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్యను పెంచాలని ప్రాథమిక విద్యలో డ్రాప్ ఔట్ ని తగ్గించాలని కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినారు. ఈ సందర్భంగా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలను క్రోడీకరించి బలహీన వర్గాల విద్యా స్థాయిని పెంచటానికి కమిషన్ పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందని తెలియజేసినారు.

పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం .

పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

పాల్గొన్న శాసన మండలి వైస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గండ్ర

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో ముదిరాజ్ ల ఆరా ధ్య దైవం పెద్దమ్మతల్లి ఆశీస్సు లతో ప్రజలందరూ సుఖసంతో షాలతో జీవించాలని కోరిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ బండా ప్రకాష్, భూపాలపల్లి మాజీ . ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయoలో అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని జరుపుకు న్నారు

ceremony.

.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘరాష్ట్ర నాయకులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు,ముదిరాజ్ సోదర సోదరీమణులు,బిఆర్ ఎస్పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బోధించు – సమీకరించు- పోరాడు .!

బోధించు – సమీకరించు- పోరాడు అనే నినాదంతో* ముందుకు వెళ్ళాలి.

ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అంబేద్కర్ ఆశయాలు సిద్దాంతాలు భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని 2023-24&25 -లలో వేసిన కమిటీ లు మినహా మిగిలిన గ్రామ కమిటీలను వేయాలని అందుకబోదించు -సమీకరించు – పోరాడు* అనే నినాదంతో గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రజలకు మహానీయుల గురించి తెలియజెప్పాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* అన్నారశని వారం రోజున చిట్యాల మండల కేంద్రంలో మల్లయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కమిటీ లను 2023–24-& 25 సంవత్సరా, లలో వేసిన కమిటీలు మిసహ మిగిలిన కమిటీ లు ఏర్పాటు చేయాలని అన్నారు. అంబేద్కర్ గారి తో పాటు మహనీయుల ఆశయాలను సిద్ధాంతాలను భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని గ్రామాల్లో ప్రజలకు చెప్పాలన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో దళితుల పట్ల కుల వివక్షత ఇంకా గ్రామాల్లో కొనసాగుతుందన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను భారత రాజ్యాంగం గురించి తెలియజెప్పి వారిని చైతన్య వంతులను చేయాలన్నారు. బోధించు సమీకరించు పోరాడు అనే నినాదంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మే నెల 31* వరకు అన్ని గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘాలను పూర్తి చెయ్యాలని మండల కమిటీలు భాద్యతలు తీసుకుని గ్రామ కమిటీలు పూర్తి చెయ్యాలన్నారు.

నిజాంపేట మండల అధ్యక్షునికిగా చంద్రశేఖర్ .

నిజాంపేట మండల అధ్యక్షునికిగా చంద్రశేఖర్

నిజాంపేట: నేటి ధాత్రి 

 

 

భారతీయ జనత పార్టీ మండల మండల అధ్యక్షునిగా చిన్మనమైన చంద్రశేఖర్ ను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మరోసారి మండల అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ కి, జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

ధాన్యం కొను గోలు సెంటర్ లో గన్ని సంచుల ‘గోల్ మాల్ .

ధాన్యం కొను గోలు సెంటర్ లో గన్ని సంచుల ‘గోల్ మాల్

గన్నీ సంచుల కొరతతో అమ్ముకుంటున్న నిర్వాహకు డు
చిన్నాల ధనుంజయ్

అధికారుల నిర్లక్ష్యం

తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి :

 

 

ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులకు ధాన్యాన్ని అమ్ముకునేందుకు అష్ట కష్టాలు తప్పడం లేదు. మద్దతు ధర కల్పించే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిన వాటిని ఆసరా చేసుకుని నిర్వాహకులు కొందరిని నియమించుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డివిజన్ పరధిలోని మండలంలోని హరిపిరాల, గ్రామం వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు కన్నెత్తి చూడడం లేదు.

గన్ని బ్యాగులను అమ్ముకున్న సెంటర్ నిర్వాహకుడు

Farmers

కొనుగోలు కేంద్రంలో గన్ని బ్యాగుల కొరతతో మండలంలోని అరిపిరాల గ్రామ పిఎసిఎస్ సెంటర్ లో చీకటాయపాలెం గ్రామానికి చెందిన రైతుకు గన్ని బ్యాగులను అమ్ముకోవడంతో పిఎసిఎస్ సెంటర్ నిర్వాకుడు ధనుంజయ్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల అనుమతి లేకుండా రైతులు అనుమతి లేకుండా బస్తాలను వేరే గ్రామానికి చెందిన రైతులకు అమ్ముకోవడం ఏంటి అని నిలదీశారు, హరిపిరాల గ్రామానికి వచ్చిన బస్తాలను చీకటాయపాలెం గ్రామానికి ఎలా అమ్ముతారు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల చేతివాటంతోటి బస్తాలను అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల ఆందోళనతో గ్రామాలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి గన్ని బ్యాగుల కొరత లేకుండా చూసి సెంటర్ నిర్వాహకుని పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

మెట్ ల్లి పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న . .

మెట్ పల్లి మే 10 నేటిధాత్రి :

 

 

మెట్ ల్లి పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో మల్లాపూర్, చిట్టపూర్, సాతారం డబ్బా, మేడిపల్లి గ్రామ చౌరస్తాలలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరుశురాం గౌడ్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ జరిగింది . అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరశురాం గౌడ్ మాట్లాడుతూ 12వ తారీకు సోమవారం రోజున మల్లాపూర్ మెట్పల్లి గ్రామం మండలాలలో సర్దార్ సర్వాయి పాపన్న ఐదు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ధర్మపురి అరవింద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగారావు విగ్రహావిష్కరణ చేస్తారని గీతా కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని నియోజకవర్గ గౌడ సంఘ నాయకులు మరియు నియోజకవర్గ గౌడ సంఘ ప్రజలు అత్యధిక మంది పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వాని అందని వారు ఇదే ఆహ్వానంగా అనుకొని మన కార్యక్రమం మనం ముందు ఉండాలని ఉద్దేశంతో అందరూ రావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంపునూరి మల్లేశం గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, గొల్లపల్లి రామా గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రంగు రామా గౌడ్ ,జిల్లా అధ్యక్షులు చెట్ల చంద్రశేఖర్ గౌడ్, కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షులు ఏపూరి శ్రీనివాస్ గౌడ్, ఆరెల్ల నరస గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రత్నాకర్ రావు 5వ వర్ధంతి.

మెట్ పల్లి మే 10 నేటి ధాత్రి:

మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 5వ వర్ధంతి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు చేతుల మీదుగా వ్యవసాయ మార్కెట్ అమాలి చాట జాడు కార్మికులకు మజ్జిగ పాకెట్లు కూల్ డ్రింక్ పాకెట్స్ పంపిణీ చేశారు అనంతరం జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ మా నాన్నమంత్రిగా ఉండగా కోరుట్ల నియోజకవర్గంలో అత్యధిక పనులు చేశారని పశు వైద్యశాల ఏర్పాట్లు చేశారని ఆయన కోరుట్ల నియోజకవర్గంలో అన్ని సదుపాయాలు కల్పించాలని ఆయన చేసిన అభివృద్ధి పనులే ఇప్పటికి నడుస్తున్నాయని అన్నారు .
ఈ కార్యక్రమంలో కొమిరెడ్డి విజయ్ జువ్వాడి చంద్రశేఖర రావు పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మెట్పల్లి మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి పట్టణ యూత్ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్ మాజీ జెడ్పిటిసి ఆకుల లింగారెడ్డి ఎర్రోళ్ల హనుమాన్లు యమ రాజయ్య జిల్లా సేవాదళ్ అధ్యక్షులు నాయిని సురేష్ తుమ్మలపల్లి రాంప్రసాద్ పూదారి నర్సాగౌడ్ మర్రి సహదేవ్ పిప్పిర రాజేష్ మోకిం షకీల్ లింగారెడ్డి బుర్ర మహేందర్ అన్నమయ్య నరేష్ జాకీర్ రమేష్ బత్తుల భరత్ పూదారి రాము పుల్ల రాజా గౌడ్ మహేందర్ యూట్యూబ్ రాజు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

శ్రీశ్రీశ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి .

శ్రీశ్రీశ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ రజితోత్సవ వేడుకలు.

మందమర్రి నీటి ధాత్రి :

 

 

మందమర్రి పట్టణ అంగడి బజార్ లోని శ్రీశ్రీశ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ రజితోత్సవ వేడుకలు. మందమర్రి పట్టణంలోని అంగడి బజార్ లో గల శ్రీ శ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ 25వ వార్షికోత్సవ ఉత్సవాలను శుక్రవారం నుండి శనివారం వరకు అత్యంత వైభవంగ నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు దిలీప్ శుక్ల శర్మ తెలిపారు.

Silver Jubilee.

 

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క 25 వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 9వ తేదీ నుంచి పదవ తేదీ వరకు నిర్వహించడం జరిగిందని ప్రతిరోజు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తూ అనంతరం మహా అన్నప్రసాద్ వితరణ నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈనాటి.

Silver Jubilee.

ఆలయ రజిత ఉత్సవ వేడుకలకు హాజరైన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన జరిగిందని అలాగే స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని తెలిపారు

లైన్స్ క్లబ్ అధ్యక్షునికి ఘన సన్మానం.

లైన్స్ క్లబ్ అధ్యక్షునికి ఘన సన్మానం.

కల్వకుర్తి నేటి ధాత్రి:

 

లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు లయన్ ఎం. జె.ఎఫ్ కల్మచర్ల రమేష్ ను ఘనంగా సన్మానించారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా.. లైన్స్ క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి కేకును కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. జన్మదినాన్ని పురస్కరించుకొని కల్మచర్ల రమేష్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎలక్ట్రిక్ డ్రం ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, కోశాధికారి గోవింద శ్రీనివాస్, ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్ బచ్చు రామకృష్ణ, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ గుబ్బ కిషన్ కుమార్, ఉప్పు ఆంజనేయులు, బాదం రాఘవేందర్, చెదిరే శ్రీనివాస్, నీలా కోటి, మాచిపెద్దిరవి తదితరులున్నారు.

భూ కబ్జాదారుని పై చర్యలు తీసుకోవాలి.

భూ కబ్జాదారుని పై చర్యలు తీసుకోవాలి.

స్థానిక వాసులను భయ భ్రాంతులకు గురిచేస్తున్న బొమ్మినేని తిరుపతిరెడ్డి

హౌసింగ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసిన స్థానికులు.

కాశిబుగ్గ నేటిధాత్రి :

 

 

 

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ పరిధి కీర్తి నగర్ లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ కు సంబంధించిన భూములను భూ కబ్జాదారుడు బొమ్మనేని తిరుపతిరెడ్డి ప్రభుత్వ భూములను కబ్జా చేయడం జరుగుతుంది. కబ్జాదారునిపై చర్యలు తీసుకోవాలని హోసింగ్ బోర్డు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కు స్థానిక వాసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం కీర్తి నగర్ మరియు గరీబ్ నగర్ వాసులు మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ కాలనీ కు సంబంధించిన భూములను స్థానికంగా ఉంటున్న బొమ్మినేని తిరుపతి రెడ్డి నేను కీర్తి నగర్ కాలనీ అధ్యక్షుడిని అని స్తానిక వాసులను భయబ్రాంతులకు గురి చేస్తూ, తప్పుడు పత్రాలను సృష్టిస్తూ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎంఐజి,ఎల్ఐజి లోని కొన్ని ఇండ్లకు సంబంధించిన యజమానులు స్థానికంగా లేకపోవడంతో వారి సంతకాలను ఫోర్జరీ చేస్తూ కొంతమంది వ్యక్తులతో కలిసి తప్పుడు పత్రాలు సృష్టించి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని భూములను మరియు ఇండ్లను ఆక్రమించుకోని లక్షల రూపాయలను సొమ్ము చేసుకోవడం జరుగుతుందన్నారు.ఇదేంటని అని ప్రశ్నిస్తే ఖాళీ స్థలాల దగ్గర రౌడీల సహాయంతో,రాజకీయ అండ దండలతో ప్రశ్నించిన స్థానికులను, మహిళలను అని చూడకుండా, అసభ్య పదజాలంతో దూషిస్తూ, తిరుపతిరెడ్డి అతని అనుచరులు కలిసి స్థానికులను బెదిరించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Corporation.

తిరుపతి రెడ్డి అనే వ్యక్తి అతని ఇంటి వద్ద ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీ కి సంబంధించిన రోడ్డును సైతం కబ్జా చేసి రోడ్డు మూసివేసి ప్రహరీ గోడను నిర్మించుకొని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అతను సొంత స్థలంగా వాడుకోవడం జరుగుతుందన్నారు.అది సుమారు 100 గజాలకు పైనే ఉంటుంది.అంతే కాకుండా పక్క భూమిని కబ్జా చేయాలనే ఆలోచనతో ఉన్న తిరుపతిరెడ్డి ఖాళీ స్థలానికి ప్రహరీ గోడ నిర్మిస్తున్న క్రమంలో స్థానికులు వద్దని ఎంత చెప్పిన వినకుండా ప్రశ్నించే వారిని అతని అనుచరులతో బెదిరించడం జరుగుతుందన్నారు. స్థానికులు అంతా కుల, మతాలకు అతీతంగా కబ్జాకి గురవుతున్న ప్రభుత్వ స్థలం కాలనీ వాసులకు అందరికి ఉపయోగపడే విధంగా చూడాలని సంబంధిత అధికారులను కోరడం జరిగింది . గతంలో కూడా హౌసింగ్ బోర్డ్ కాలనీ కీర్తి నగర్ నందు తప్పుడు పత్రాలతో, కొంతమంది రౌడీల అండ దండలతో, రాజకీయ బడా బాబులతో చేతులు కలిపిన తిరుపతిరెడ్డి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని భూములను కబ్జా చేస్తూ హౌసింగ్ బోర్డ్ కాలనీ ని సర్వనాశనం చేస్తున్నారని స్థానిక మహిళలు దుమ్మెతిపోస్తున్నారు.అంతా నేనే ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీకి అధ్యక్షుడనని నాకు ఎదురు చెప్పే వారు లేరని, నాకు ఎదురు చెప్పితే వారు కాలనీ లో ఉండరని,వాళ్ల సంగతి ఎట్లా చెప్పాలో మాకు బాగా తెలుసు అని స్థానికులను, మహిళలను, ఒంటరిగా ఉన్న సమయంలో వారి వద్దకు వచ్చి రౌడీల సహాయంతో వారిని భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బంది పెడుతున్నాడని స్థానికులు వాపోతున్నారు. స్థానికులకు,మహిళలకు ఏదైనా జరిగితే పూర్తిగా తిరుపతి రెడ్డి,అతని అనుచరులే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.వారితో స్థానికులకు ప్రాణభయం ఉందని అన్నారు. తిరుపతి రెడ్డి ఆగడాలు రోజురోజుకీ అత్యంత ప్రమాదకరంగామారుతుందని అన్నారు.హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్న తిరుపతి రెడ్డి, రౌడీ ముకల పై చర్యలు తీసుకోవాలని హౌసింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కు స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

11వ మహాసభను జయప్రదం చేయండి .

11వ మహాసభను జయప్రదం చేయండి

మందమర్రి నేటి ధాత్రి :

 

 

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మందమర్రి 11వ మహాసభను జయప్రదం చేయండి..
ఈనెల 18వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ మందమర్రి పట్టణ 11వ మహాసభను విజయవంతం చేయాలని ఈరోజు స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి.. కామెర దుర్గారాజ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భీమనాధుని సుదర్శన్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు శైలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ . దున్నేవాడికే భూమిని అను నినాదంతో పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ.. మందమర్రి ప్రాంతంలో నాడు దొరల భూస్వాములు వారి అనుచరులు గుండాలు ప్రజలను కట్టు బానిసలుగా చేసి చిత్రహింసల గురి చేసినటువంటి సమయంలో కామ్రేడ్ టి వి అబ్రహం
దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేదలకు భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ఈ కార్యక్రమంలో బండారి రాజేశం బియ్యాల పద్మ ఆంటోని దినేష్. ఆర్ జనార్ధన్. ఉప్పులేటి తిరుపతి.. సుంకర శ్రీనివాస్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప గారు మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ
జహీరాబాద్ మండల, వివిధ గ్రామాలకు చెందిన 17 మంది లబ్ధిదారులకు గాను ₹4,87,000 విలువ గల చెక్కులను పాక్స్ చైర్మన్ మచ్చెందర్ ,పార్టీ జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి, యూత్ అధ్యక్షులు గోవర్దన్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్,ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ ,మైనార్టీ అధ్యక్షులు వహీద్ , గ్రామాల మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు ,గ్రామ పార్టీ అధ్యక్షులు,ముఖ్య నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది….
లబ్ధిదారుల వివరాలు సత్వార్ గ్రామానికి చెందిన లలిత ₹.25,500/- కృష్ణ ₹.48,000/- లక్ష్మి ₹.17,500/- అనెగుంట గ్రామానికి చెందిన ₹.32,500/- హుగ్గెల్లి గ్రామానికి చెందిన బేబీ లత ₹.22,500/- గౌషియా బి ₹.45,000/- అల్గొల్ గ్రామానికి చెందిన బక్కన్న ₹.21,000/- రయిపల్లి డి గ్రామానికి చెందిన సరిత ₹.15,000/- బాగమ్మ ₹.60,000/- మలచెల్మ తండా కి చెందిన గుని బాయి ₹.22,500/- బుచ్చినెల్లి గ్రామానికి చెందిన శాబుద్దీన్ ₹.37,000/- హోతి బి గ్రామానికి చెందిన మొహియుద్దీన్ ₹.30,000/- మధులై తండా కి చెందిన రాథోడ్ మోహన్ సింగ్ ₹.16,500/- షేకపూర్ గ్రామానికి చెందిన జైపాల్ ₹.36,000/-గోవింద్ పూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ₹.34,000/- కసింపూర్ గ్రామానికి చెందిన గంగమ్మ ₹24,000/-
ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి , మండల పార్టీ అధ్యక్షులు నారాయణ గారికి ,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం.

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం.

కల్వకుర్తి  నేటి ధాత్రి :

 

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శివరాం జన్మదినం సందర్బంగా.. శనివారం రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. రక్త దానం చేయండి ప్రాణదాతలు కండి అని చెప్పారు. రక్తదానము మహాదానం మీరు దానం చేసిన రక్తము ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మనిషిని ప్రాణము పోసి ఆ కుటుంబంలో ఆనందము నింపుతుంది. పరోపకార హృదయంతో మీరు చేసిన ఈ కార్యము ఎందరికో ఆదర్శ ప్రదమైనది. సమాజము పట్ల సేవా భావము కలిగిన మీ మంచి మనసుకు హృదయపూర్వకముగా అభినందనలు తెలియజేస్తున్నాము. మీరు చేసిన మానవ సేవ మానవళికి ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ శివరాం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు యశోద భాయ్, మాజీ కౌన్సిలర్ శానవాజ్ ఖాన్, మాజీ సర్పంచ్ రాములు, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యురాలు రేష్మ, దున్న భాస్కర్, యువ నాయకులు పడకంటి వెంకటేష్, దున్న సురేష్, శ్రీశైలం, శివ, ఆసుపత్రి సిబ్బంది శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట.

ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట.

నాగర్ కర్నూల్  నేటి దాత్రి:

నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో మండలానికి సంభందించిన రైతులకు శనివారం రోజున ప్రభుత్వ సబ్సిడీ కింద మంజూరు అయిన స్ప్రింక్లర్లను ఎమ్మేల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్ద పీట వేస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ కింద 24 వేల కోట్ల రూపాయలు వెచ్చించిందని, సన్న వడ్లకు బోనస్ ఇచ్చిందని, ఎలాంటి షరతులు లేకుండా రైతుల నుండి ధాన్యం కోనుగులు చేసిందని, వ్యవసాయ యాంత్రీకరణను రైతాంగానికి మరింత దగ్గర చేయడానికి ప్రయత్నిస్తుందని,. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రజా ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని ఎమ్మేల్యే అన్నారు.ఇట్టి కార్యక్రమంలో సంబధిత అధికారులు, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణ రావు, మండల ప్రెసిడెంట్ కోటయ్య,మాజీ కౌన్సిలర్స్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వినోద్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, పాల్గొన్నారు.

30 ఏళ్ల క్రితం అమ్మిన భూమిపై వారసుల దౌర్జన్యం.

30 ఏళ్ల క్రితం అమ్మిన భూమిపై వారసుల దౌర్జన్యం

మందమర్రి నేటి ధాత్రి :

 

 

 

మందమర్రి మండల తుర్కపల్లి గ్రామంలో 30 సంవత్సరాల క్రితం ప్లాటు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్న కుటుంబం పై భూమి అమ్మిన వ్యక్తి వారసులు దౌర్జన్యం చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి భూమి విలువకు అదనంగా డబ్బులు చెల్లించాలంటూ బెదిరిస్తున్నారని బాధిత కుటుంబ యజమాని మేడి శ్రీమతి భర్త స్వామి కొడుకు శ్రావణ్ లు మీడియా ముందు వాపోయారు. మందమర్రి లో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో బాధిత కుటుంబం మేడి శ్రీమతి కొడుకు శ్రావణ్లు మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం అగ్గు బాలయ్య సారంగపల్లి నివాసి తన వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి ప్లాట్లు చేయగా ప్లాటు కొనుక్కొని అందులో ఇల్లు నిర్మించుకొని ఉంటున్నామని గ్రామపంచాయతీ వారు ఇంటికి నెంబర్ కూడా కేటాయించారని ఇల్లు శిధిలమైపోవడంతో నూతనంగా ఇంటిని నిర్మించుకుందామనే ఆలోచనతో ఉండగా అగ్గు బాలయ్య కొడుకు అగ్గు మల్లయ్య భార్య ఆగు లక్ష్మి కూతురు సంధ్య కుటుంబ సభ్యులందరూ కలిసి కుటుంబ సభ్యులపై దాడి చేసి ఇది మా పట్టా భూమిని మీ పేరు పై పట్టాలేదని ప్రస్తుతం ఉన్న భూమి విలువకు తగ్గట్టుగా మరింత అదనంగా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దౌర్జన్యానికి దిగారని తెలిపారు. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చి వ్యవసాయతర భూమిగా రికార్డుల్లోకి మార్చకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుందని  .అధికారులు గమనించి మా కుటుంబం పై భూమి అమ్మిన అగ్గు బాలయ్య కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేయడమైనది.

error: Content is protected !!
Exit mobile version