పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పాలసీకి గొప్ప స్పందన.

పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పాలసీకి గొప్ప స్పందన

ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ బిజినెస్ కరస్పండెంట్ కమల్

పరకాల నేటిధాత్రి

 

 

 

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తీసుకువచ్చిన తక్కువ ధరకే అధిక ప్రయోజనాల గల యాక్సిడెంట్ భీమా పాలసీకి ప్రజల నుండి కార్మికుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని ఇండియన్ పోస్ట్పేమెంట్ బ్యాంక్ బిజినెస్ కరస్పండెంట్ కమల్ అన్నారు.శుక్రవారంరోజున బిర్లా సిమెంటు ఉద్యోగులు,కార్మిక సంఘ సభ్యులు కలిసి 649/849 రూపాయల ప్రీమియాలకు 10,15 లక్షల భీమా కవరేజ్ తో ఉన్న పాలసీని తీసుకున్నారని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది చాలా మంచి అవకాశమని ఇతర కార్మిక సంఘాలతో పాటు అందరూ పాలసీ తీసుకోవాలని,మనం పని చేస్తున్నంతవరకూ భద్రత అవసరమవుతుందని,పాలసీ వివరాలకు 8885111943 నెంబర్ కు లేదా సమీప ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ చుంచు కమలాకర్ ని సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

కొడుకు ఎంట్రీపై విష్ణు ఎమోషనల్ పోస్ట్.

కొడుకు ఎంట్రీపై విష్ణు ఎమోషనల్ పోస్ట్

 

 

 

 

మోహన్ బాబు, విష్ణు, అతని పిల్లలు కలిసి నటించిన సినిమా ‘కన్నప్ప’.

 

ఆ రకంగా మంచు కుటుంబానికి చెందిన మూడు తరాల నటీనటులను డైరెక్ట్ చేసే ఛాన్స్ ముఖేష్ కుమార్ సింగ్ కు లభించింది.

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) జూన్ 27న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో రాబోతోంది.

 

అందులో మోహన్ బాబు (Mohan babu) తో పాటు మోహన్ లాల్ (Mohan Lal), శరత్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్ కీలక పాత్రలను పోషించారు.

 

ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించిన

 

ఈ సినిమాలో మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానాతో పాటు కొడుకు అవ్రామ్ సైతం చిన్నప్పటి తిన్నడుగా తెర మీద మెరిశాడు.

‘కన్నప్ప’ సినిమాలో విష్ణు తిన్నడు పాత్రను పోషించాడు. గూడెంలోని మూఢాచారాల కారణంగా దేవుడంటే ఇష్టం లేని తిన్నడు…

 

చివరకు శివయ్యకు ఎలా దాసోహమయ్యాడు…

తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి ఎలా సిద్థమయ్యాడు అనేదే ‘కన్నప్ప’ చిత్రం.

ఇందులో చిన్నప్పటి తిన్నడుగా అవ్రామ్ నటించాడు.

అతని మీద కూడా కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు ముఖేశ్‌ కుమార్ సింగ్ చిత్రీకరించాడు.

మోహన్ బాబు, విష్ణు, అతని కుమార్తెలు, కుమారుడు ఇందులో యాక్ట్ చేయడంతో మొత్తం మూడు తరాలను కవర్ చేసినట్టు అయ్యింది.

ఇదో రేర్ ఫీట్.

ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంటూనే విష్ణు…

తాజాగా అవ్రామ్ షూటింగ్ సమయంలో చేసిన చిలిపి పనులను, అతని పై చిత్రీకరించిన సన్నివేశాలకు సంబంధించిన సీన్స్ ను ఓ మేకింగ్ వీడియోగా చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

‘కన్నప్ప’తో నా తనయుడు అవ్రామ్ తెరంగేట్రం చేస్తున్నారు.

అవ్రామ్ సెట్‌లోకి అడుగు పెట్టడం, కెమెరా ఎదుట నిల్చోవడం, డైలాగ్స్ చెప్పడం…

ఇలా ప్రతీదీ నా జీవితంలో భావోద్వేగపూరితమైన క్షణాలు.

ఓ తండ్రిగా, ఒకప్పుడు నేను కలలుగన్న అదే ప్రపంచంలోకి నా తనయుడు అడుగు పెట్టడం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది.

ఈ క్షణంలో నేను అనుభవిస్తున్న ఆనందానికి ఏదీ సాటి రాదు.

ఇది అవ్రామ్ తెరంగేట్రం మాత్రమే కాదు..

నా జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం.

నాపై చూపించిన ప్రేమాభిమానాలే నా కుమారుడిపైనా చూపిస్తారని భావిస్తున్నాను.

 

అవ్రామ్ ప్రయాణం ‘కన్నప్ప’తో మొదలైంది’ అని విష్ణు ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు.

డ్రాయింగ్ టీచర్ పోస్టు పెట్టాలి.

డ్రాయింగ్ టీచర్ పోస్టు పెట్టాలి…

మందమర్రి నేటి ధాత్రి:

 

మందమర్రి సింగరేణి పాఠశాల కళ్యాణి ఖని లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఆర్ట్ డ్రాయింగ్ టీచర్ పోస్టు పెట్టాలని కార్మికులు విద్యార్థులు కోరుతున్నారు. డ్రాయింగ్ మాస్టర్ లేక విద్యార్థులు వారి నైపుణ్యాన్ని కోల్పోతున్నారని సింగరేణి ప్రాంతంలో 9 సింగరేణి పాఠశాలలు ఉండగా ఒక్క పాఠశాలలోనే డ్రాయింగ్ టీచర్ కొనసాగుతున్నాడు. ఆ ఉపాధ్యాయుడు కూడా త్వరలో కొద్ది నెలలో రిటైర్డ్ కాబోతున్నాడని సింగరేణి పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ ఉపాధ్యాయులను నియమించాలని కార్మికులు విద్యార్థులు కోరుతున్నారు. సింగరేణి కోల్ బెల్టు ప్రాంతమైన కొత్తగూడెం మణుగూరు ఇల్లందు భూపాలపల్లి గోదావరిఖని సెక్టార్ 2 సీసీసి మందమర్రి గోలేటి లో డ్రాయింగ్ టీచర్ లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారు న్యూస్ టుడే కు ఆవేదన చెప్పారు. ఎన్ ఈ పి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం విద్యార్థులకుబోధనతోపాటుసృజనాత్మకత విద్యను అందించుటకు చాలా దోహదపడుతుందిని డ్రాయింగ్ టీచర్లను నియమించాల్సిందిగా సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీకి విద్యార్థుల తల్లిదండ్రులు విన్నపం చేస్తున్నారు. సింగరేణి పాఠశాలలో ఎన్నోమార్పులు తీసుకొచ్చిన సెక్రెటరీ విద్యార్థులు నైపుణ్యాన్ని మెరుగుపరచడం కోసం డ్రాయింగ్ పోస్టును నియమించాలని సింగరేణి కార్మికులు విద్యార్థులు కోరుతున్నారన్నారు.

శ్రీహరి ముదిరాజ్ కు మంత్రి పదవివ్వాలి.

శ్రీహరి ముదిరాజ్ కు మంత్రి పదవివ్వాలి

మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్

పరకాల నేటిధాత్రి

 

ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ముదిరాజ్ ల ఆశాజ్యోతి మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ముదిరాజ్ కి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవివ్వాలని మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్ తెలిపారు.వారు మాట్లాడుతూ కులగణన సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ముదిరాజ్ వారే ఉన్నారని తెలిందని మంచి గుణ,ప్రజా బాంధవుడు,ప్రజల ఆపద్బాంధవుడు వాకటి శ్రీహరి ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవివ్వాలని ముదిరాజులను బిసిఏ కి చేర్చాలని మా ఓటుతో గెలిచి మమ్మల్ని మర్చిపోతూ,అన్యాయం చేస్తున్నారని మేమెంతో మాకంతా కావాలని కోరుతున్నామని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ముదిరాజ్ కావున వారికి మంత్రి పదవివ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

వనపర్తిఎమ్మెల్యే మెఘారెడ్డికి చీఫ్ విప్ ఇవ్వాలి.

వనపర్తిఎమ్మెల్యే మెఘారెడ్డికి చీఫ్ విప్ ఇవ్వాలి

ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శికాంగ్రెస్ నేత మండ్ల దేవన్ననాయుడు

వనపర్తి నేటిధాత్రి:

 

వనపర్తి ఎమ్మెల్యే మె గారెడ్డి కి
రాష్ట్రప్రభుత్వ చీఫ్ విప్ కాంగ్రెస్ పార్టీ టి పి సీసీ ప్రధాన కార్యదర్శి ఇవ్వాలని ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి,కాంగ్రెస్ నేత మండ్ల దేవన్ననాయుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సి ఎం రేవంత్ రెడ్డిని ఒక ప్రకటనలో కోరారు .తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చేపట్టిందని ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ నేత మండ్ల దేవన్న నాయుడు తెలిపారు
నియోజకవర్గంలో బడా నాయకులమని చెప్పుకునే నాయకులను మట్టి కరిపించిన చిన్న మారుమూల గ్రామం
సర్పంచ్ .ఎంపీటీసీ. ఎంపీపీ ఎమ్మెల్యే గా గెలిచిన తూడి మేఘా రెడ్డి కి ప్రభుత్వ చీఫ్ విప్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి కేటాయిస్తే వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మార్గం సుగమం అవుతుందని మండ్లదేవన్న నాయుడు తెలిపారు

పదవి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి.

డిసిసి అధ్యక్ష పదవి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి కేటాయించాలి- అనుపురం పరశురాం గౌడ్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా డిసిసి అధ్యక్ష పదవిని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి కేటాయించాలని యువజన కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరశురాం గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మేడిపల్లి సత్యం పీహెచ్డీ చేసిన ఒక విద్యావేత్త, యువ నాయకులు, పేదల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసే నాయకులు, పార్టీ కోసం అహర్నిశలు పాటుపడే గొప్ప వ్యక్తి. మంచి నాయకత్వ లక్షణాలు కలిగివున్న సత్యంకు డిసిసి అధ్యక్ష పదవిని అందించడం ద్వారా ముందు ముందు పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా యువత కూడా రాజకీయంగా ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు.

విద్వేషకర పోస్టులు పెడితే చర్యలు తప్పవు..

విద్వేషకర పోస్టులు పెడితే చర్యలు తప్పవు..

సోషల్ మీడియాను చెడుకు ఉపయోగించొద్దు..

వాట్సాప్, ఇన్ స్టాలో వచ్చే పుకార్లను నమ్మొద్దు..

నిబంధనలకు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు…

యువత భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలి..

రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజా గౌడ్..

రామాయంపేట ఏప్రిల్ 15 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో ఫోటోలు మార్పించేస్తూ ప్రజల మనోభా వాలు దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, పోస్టులు పెట్టవద్దని, అలా పెట్టిన వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్య లు తీసుకోవడం జరుగుతుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజా గౌడ్ హెచ్చరించారు.
ఇందుకోసం ప్రత్యేక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు తప్పుడు వార్తలు పెట్టే వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగు తుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, ప్రజలు ఎవ్వరు నమ్మవద్దని సూచించారు. సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకోని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేసిన, షేర్ చేసినా వారి సమాచా రాన్ని రామాయంపేట సర్కిల్ కార్యాలయం కంట్రోల్

రూమ్ వాట్సప్ నెంబర్కు 8712667100 తెలియజేయాలని అట్టి సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ టెక్నాలజీ యుగంలో వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ద్వారా సమాచారము క్షణాల్లో కొన్నిలక్షల మందికి చేరుతుందని పంపించే సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ను మంచి మంచి కార్యక్రమాలకు ప్రజలను యువతను చైతన్యపరిచే విధమైన పోస్టులు చేస్తూ మంచితనానికి ఉపయోగిం చుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత వారి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలని, సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు పెట్టి ఇబ్బంది పడవద్దని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎమ్మెల్యే దొంతికి మంత్రిపదవి ఇవ్వాలి.

ఎమ్మెల్యే దొంతికి మంత్రిపదవి ఇవ్వాలి

ఎన్ఎస్ యుఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఎన్ఎస్ యుఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా చిలుపూరి భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నర్సంపేట నియోజకవర్గ పరిధిలో పార్టీని బలోపేతం చేసి మొదటి నుండి ఎన్ని అవకాశాలు వచ్చినా వదులుకొని కాంగ్రెస్ పార్టీ వీడకుండా ఉన్నారని చెప్పారు.కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నర్సంపేటను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మాధవ రెడ్డికి క్యాబినెట్ లో మంత్రి స్థానం కల్పించాలని పార్టీ అధిష్టానన్నీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

ఎమ్మెల్యే దొంతికి మంత్రి పదవి కేటాయించాలి.

ఎమ్మెల్యే దొంతికి మంత్రి పదవి కేటాయించాలి

రాజకీయ నిబద్ధత,నిజాయితీకి నిదర్శనం దొంతి

మంత్రి పదవికి ఎమ్మెల్యే దొంతి అర్హుడు

పార్టీకి చేసిన త్యాగాన్ని హైకమాండ్ గుర్తించాలి

టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాలని చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు రాజకీయ నిబద్ధతకు నిజాయితీకి నిదర్శనమైన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డికి మంత్రిపదవి కేటాయించాలని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రభుత్వాన్ని కోరారు.

శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానంద్ మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నోవ్యాయ ప్రయాసాలు ఒడిదుడుకులను అనుభవిస్తూ నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నాయకుడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అని అన్నారు.

నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామ సర్పంచిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి సొసైటీ చైర్మన్ గా డిసిసిబి చైర్మన్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేసి పిసిసి సభ్యులుగా ఏఐసీసీ సభ్యులుగా పదవులు చేపట్టి నిబంధత క్రమశిక్షణ కమిట్మెంట్ కు మారుపేరుగా నిలిచి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం జీవితాన్ని దారపోసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ వారు చేపట్టిన పాదయాత్రలో చురుకైన పాత్ర పోషించారని పేర్కొన్నారు.

2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల పొత్తులో భాగంగా నర్సంపేట టికెట్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంభంపాటి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయిస్తే కలత చెందకుండా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను ఏకతాటిపై నడిపించి లక్ష్మారెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాడని అన్నారు.

2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓటమి చెందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ వచ్చారని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దొంతి మాధవరెడ్డికి టికెట్ కేటాయించకుండా మోసంచేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నియోజకవర్గ ప్రజల బలమైన కోరికతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రవ్యాప్తంగా దొంతి మాధవరెడ్డి ప్రభంజనం సృష్టించారని వివరించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ పదవుల కోసం జంపుజిలానిలుగా మారి టిఆర్ఎస్ పార్టీలో కిరాయిప్పులకు పాల్పడుతుంటే అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని టిఆర్ఎస్ పార్టీకి ఆహ్వానించినప్పటికీ అలాగే మంత్రి పదవి ఇస్తామని కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆఫర్లు చేసిన ఆశపడకుండా కాంగ్రెస్ పార్టీని వీడకుండా మాతృపార్టీపై ప్రేమతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో చేరి తన రాజకీయ నిబద్ధతను చాటుకోవడం జరిగిందని గుర్తుకు చేశారు.

2014 నుండి 2018 వరకు ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తూ అప్పటి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన నిఖర్సగా ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన గొప్ప నాయకుడు దొంతి మాధవరెడ్డి అని అభివర్ణించారు.

2018 ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముందుండి నిర్వహిస్తూ నడపారన్న విషయాన్ని గుర్తు చేశారు.

2018 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పార్టీ కోసం నిలబడే వ్యక్తిగా గుర్తింపు పొందిన నాయకుడని దాదాపు నర్సంపేట నియోజకవర్గం ఏర్పడి 45 ఏళ్ల చరిత్రలో చేతి గుర్తుపై గెలిచిన దాఖలాలు లేకపోగా మొదటిసారి నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై గెలిచి చరిత్ర తిరిగరాశాడన్నారు.

కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ అధిష్టానం పార్టీలు ఫిరాయింపులు చేసిన వారికి కొత్తగా వివిధ పార్టీల నుండి పదవుల కోసం పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులను ఇవ్వడం వరంగల్ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని గుర్తించి మంత్రిపదవి ఇవ్వకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను నిరాశకు గురి చేయడం సరికాదని వాపోయారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలో భర్తీ చేయనున్న మంత్రి పదవుల్లో రాజకీయ నిబద్ధతకు నిదర్శనంగా ఉన్న ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారికి మంత్రి పదవిని కట్టబెట్టి నర్సంపేట ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు భూసాని సుదర్శన్, బీరం భరత్ రెడ్డి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి జన్ను మురళీ, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, పున్నం రాజు, భూక్య గణేష్, కొత్తగట్టు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే దొంతికి మంత్రి పదవి కేటాయించాలి.

ఎమ్మెల్యే దొంతికి మంత్రి పదవి కేటాయించాలి

రాజకీయ నిబద్ధత,నిజాయితీకి నిదర్శనం దొంతి

మంత్రి పదవికి ఎమ్మెల్యే దొంతి అర్హుడు

పార్టీకి చేసిన త్యాగాన్ని హైకమాండ్ గుర్తించాలి

టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాలని చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు రాజకీయ నిబద్ధతకు నిజాయితీకి నిదర్శనమైన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డికి మంత్రిపదవి కేటాయించాలని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రభుత్వాన్ని కోరారు.

శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానంద్ మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో
వ్యాయ ప్రయాసాలు ఒడిదుడుకులను అనుభవిస్తూ నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నాయకుడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అని అన్నారు.

నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామ సర్పంచిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి సొసైటీ చైర్మన్ గా డిసిసిబి చైర్మన్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేసి పిసిసి సభ్యులుగా ఏఐసీసీ సభ్యులుగా పదవులు చేపట్టి నిబంధత క్రమశిక్షణ కమిట్మెంట్ కు మారుపేరుగా నిలిచి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం జీవితాన్ని దారపోసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ వారు చేపట్టిన పాదయాత్రలో చురుకైన పాత్ర పోషించారని పేర్కొన్నారు.

2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల పొత్తులో భాగంగా నర్సంపేట టికెట్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంభంపాటి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయిస్తే కలత చెందకుండా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను ఏకతాటిపై నడిపించి లక్ష్మారెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాడని అన్నారు.

2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓటమి చెందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ వచ్చారని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దొంతి మాధవరెడ్డికి టికెట్ కేటాయించకుండా మోసంచేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నియోజకవర్గ ప్రజల బలమైన కోరికతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రవ్యాప్తంగా దొంతి మాధవరెడ్డి ప్రభంజనం సృష్టించారని వివరించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ పదవుల కోసం జంపుజిలానిలుగా మారి టిఆర్ఎస్ పార్టీలో కిరాయిప్పులకు పాల్పడుతుంటే అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని టిఆర్ఎస్ పార్టీకి ఆహ్వానించినప్పటికీ అలాగే మంత్రి పదవి ఇస్తామని కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆఫర్లు చేసిన ఆశపడకుండా కాంగ్రెస్ పార్టీని వీడకుండా మాతృపార్టీపై ప్రేమతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో చేరి తన రాజకీయ నిబద్ధతను చాటుకోవడం జరిగిందని గుర్తుకు చేశారు.

2014 నుండి 2018 వరకు ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తూ అప్పటి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన నిఖర్సగా ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన గొప్ప నాయకుడు దొంతి మాధవరెడ్డి అని అభివర్ణించారు.

2018 ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముందుండి నిర్వహిస్తూ నడపారన్న విషయాన్ని గుర్తు చేశారు.

2018 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పార్టీ కోసం నిలబడే వ్యక్తిగా గుర్తింపు పొందిన నాయకుడని దాదాపు నర్సంపేట నియోజకవర్గం ఏర్పడి 45 ఏళ్ల చరిత్రలో చేతి గుర్తుపై గెలిచిన దాఖలాలు లేకపోగా మొదటిసారి నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై గెలిచి చరిత్ర తిరిగరాశాడన్నారు.

కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ అధిష్టానం పార్టీలు ఫిరాయింపులు చేసిన వారికి కొత్తగా వివిధ పార్టీల నుండి పదవుల కోసం పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులను ఇవ్వడం వరంగల్ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని గుర్తించి మంత్రిపదవి ఇవ్వకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను నిరాశకు గురి చేయడం సరికాదని వాపోయారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలో భర్తీ చేయనున్న మంత్రి పదవుల్లో రాజకీయ నిబద్ధతకు నిదర్శనంగా ఉన్న ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారికి మంత్రి పదవిని కట్టబెట్టి నర్సంపేట ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ విజ్ఞప్తి చేశారు.

 

మేయర్ పదవి పై… అందరి చూపు…. డాక్టర్ సంధ్య యాదవ్ వైపు…!

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ తీర్థం

టిడిపి కూటమి పార్టీల బలోపేతమే లక్ష్యం

ఆదిశగా ఆమె అడుగులు…పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వైనం

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ బాబు,అనిత కూటమి అన్న డాక్టర్ సంధ్య యాదవ్ కు అడ్డ దండలు ,

త్వరలో అన్నా డాక్టర్ సంధ్య యాదవ్ ను వరించనున్న మేయర్ పదవి

టిడిపి, కూటమి యాదవ సామాజిక వర్గం ఆమె వైపు మొగ్గు

తిరుపతి జిల్లా..తిరుపతి(నేటి ధాత్రి)….
ఫిబ్రవరి 06:

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి ఉత్కండ నేపథ్యంలో ముగిసింది. రెండు రోజుల క్రితం డిప్యూటీ మేయర్ నియామకంలో వైసిపి టిడిపి కార్పొరేటర్ల మధ్య రణ పోరు కొనసాగిందని చెప్పవచ్చు.తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో గత వైసిపి పాలనలో టిడిపి మాజీ నగర అధ్యక్షుడు ఆర్ సి మునికృష్ణ ఒకే ఒక్క కార్పొరేటర్ గా గెలిచిన నేపథ్యం. ఒక కార్పొరేటర్ పదవి కోర్టు పరిధిలో పోను మిగతా 48 స్థానాలను వైసిపి కైవసం చేసుకుంది. అయితే 2024 ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి తిరుపతి మేయర్ పదవి పై టిడిపి కూటమి కన్ను పడింది. అప్పటికే మేయర్ పదవి కోసం వైసీపీ పార్టీని వీడి టిడిపి పార్టీలోకి చేరిన అన్నా రామచంద్రయ్య ఒక్కసారిగా డిప్యూటీ మేయర్ ఎన్నికపై తన సత్తా ఏమిటో చూపెట్టాడు. వైసీపీకి 48 మంది కార్పొరేటర్ల బలము ఉన్న వారిని ఒక్కొక్కరిని వైసీపీ పార్టీ నుండి టిడిపి పార్టీ వైపు వచ్చే విధంగా తన మార్కును అన్న రామచంద్రయ్య చూపెట్టాడని చెప్పక తప్పదు. ఒకానొక దశలో 48 మంది వైసిపి కార్పొరేటర్లు ఒక కార్పొరేటర్ మృతి చెందడంతో మిగతా 47 మంది వైసీపీ కార్పొరేటర్ లను తన వైపు తిప్పుకునేందుకు తన అనుచర గణంతో కలిసి పెద్ద ఎత్తున పావులు కదిపాడు. అయితే మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి వారి అనుచర గణం పట్టు వదలని విక్రమార్కుడుల విజృంభించారు. ఒకానొక దశలో టిడిపి,కూటమికి వైసిపి గట్టి పోటీనిచ్చింది. అయితే అధికార పార్టీ కూటమి అండదండలతో అన్నా రామచంద్రయ్య 50% కార్పోరేటర్లను టిడిపి వైపు తిప్పి చివరగా డిప్యూటీ మేయర్ పదవిని టిడిపి కార్పొరేటర్ అయిన ఆర్ సి మునికృష్ణకు కట్టబెట్టాడు. దీంతో డిప్యూటీ మేయర్ పదవి భర్తీ అయింది. అయితే ఇక మేయర్ పదవి పై అన్న రామచంద్రయ్య ప్రత్యక్షంగా పరోక్షంగా టిడిపి కూటమినేతలతో మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక్కడ ఆయనకు ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఏమిటంటే తన కుమార్తెలైన డాక్టర్ సంధ్య యాదవ్, అనిత యాదవులలో ఇద్దరిలో ఎవరికైనా మేయర్ పదవి ఇప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.అయితే గత వైసిపి ప్రభుత్వం లోని పార్టీ నుండి తాను విడిపోయి తటస్థంగా ఉంటూ టిటిపి కూటమి గెలుపుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ టిడిపి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నాడు. తమ పెద్ద కుమార్తె అయిన అన్నా డాక్టర్ సంధ్యా యాదవ్ మాత్రం సాక్షాత్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు,మంత్రి లోకేష్ బాబు సమక్షంలో టిడిపి పార్టీ తీర్థం పుచ్చుకుంది. అయితే రెండవ కుమార్తె అనిత యాదవ్ మాత్రం ఇప్పటివరకు టిడిపి పార్టీలో చేరలేదు, టిడిపి పార్టీలో సభ్యత్వం కూడా తీసుకోలేదు.కానీ డాక్టర్ అన్నా సంధ్య యాదవ్ మాత్రం టిడిపి పార్టీలో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి యుద్ధ సైనికుల పనిచేస్తోంది. అంతేకాకుండా ఇటు టిడిపి అటు కూటమి పెద్దల ఆదేశాలు తు.చ తప్పకుండా అందరి మన్నలను పెద్దల ఆశీస్సులు, పొందుతూ టిడిపి పార్టీని కూటమి ని బలోపేతం చేయడంతో పాటు తండ్రి అన్నా రామచంద్ర యాదవ్ అడుగుజాడల్లో నడుస్తూ డాక్టర్ అన్న సంధ్యా యాదవ్ పది అడుగులు ముందుకు వేస్తూ దూసుకెళ్తుంది. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో మెజార్టీ కార్పొరేటర్లు డాక్టర్ అన్న సంధ్య యాదవ్ కే మేయర్ పదవి ఇస్తే ఆ పదవికి డాక్టర్ సంధ్య యాదవ్ న్యాయం చేస్తుందని,అంతేకాకుండా ప్రస్తుత తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష యాదవ్ కు తగ్గ వ్యక్తి డాక్టర్ అన్న సంధ్యారాణి అని ఆమెకే మేయర్ పదవి కట్టబెట్టాలని ఇప్పటికే పరోక్షంగా అన్న రామచంద్రయ్య యాదవ్ తన అనుచర గణంతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని మెజారిటీ కార్పొరేటర్ తో పాటు మొత్తం యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, యువత మహిళలు, యాదవ కుటుంబాలు కూడా డాక్టర్ అన్న సంధ్య యాదవ్ కు మేయర్ పదవి ఇస్తే బాగుంటుందని గుసగుసలాడుతున్నారు. అంతేకాకుండా డాక్టర్ సంధ్య యాదవ్ అయితే ఇటు టిడిపి పార్టీకి అటు కూటమి నేతలను ఏకత్రాటి పై నడిపే శక్తి యుక్తి ఉన్న ఏకైక వ్యక్తి డాక్టర్ అన్న సంధ్య యాదవ అని అందరి నోట గట్టిగా వినిపిస్తున్న నేపథ్యం. అయితే పార్టీలో ఇప్పటివరకు చేరకుండా పార్టీ కార్యక్రమాలకు అక్కడక్కడ పాల్గొంటున్న అన్న అనిత యాదవ్ కు మేయర్ పదవి వరిస్తుందా..? లేకుంటే టిడిపి కూటమిపార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న అన్న డాక్టర్ సంధ్య యాదవ్ కు మేయర్ పదవి వరించనుందా.. ? కొద్ది రోజుల్లో తేలనుంది. అయితే మొత్తం మీద ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్ బాబు అనిత, పెద్దల ఆశీస్సులు టిడిపి కూటమి పార్టీలతో పాటు తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని మొత్తం యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు యువత మహిళలు డాక్టర్ అన్నా సంధ్య యాదవ్ కే మేయర్ పదవి ఇస్తే బాగుంటుందని ఆమె వైపు మొగ్గుచూపడం, ప్రస్తుతమే డాక్టర్ శిరీష కు దీటుగా డాక్టర్ అన్న సంధ్యా యాదవ్ పాలనలో తిరుపతి మరింత అభివృద్ధి చెందుతుందని తిరుపతి నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు యువత మహిళలు టిడిపి కూటమి ప్రధానంగా యాదవ సామాజిక వర్గ ప్రజలు గుసగుసలాడడం కొసమెరుపు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version