థ‌గ్‌లైఫ్ మ‌ణిర‌త్నం క్ష‌మాప‌ణ‌ చెప్ప‌లేదు.

థ‌గ్‌లైఫ్ మ‌ణిర‌త్నం క్ష‌మాప‌ణ‌ చెప్ప‌లేదు…

 

థ‌గ్‌లైఫ్ సినిమా ఫెయిల్యూర్‌కు మణిరత్నం ప్రేక్షకులకు క్షమాపణ లు చెప్పినట్టు జరుగుతున్న ప్రచారంపై మ ద్రాస్‌ టాకీస్ స్పందించింది. 

సినిమా టైమింగ్స్
ఇటీవ‌ల ఎన్నో అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల మ‌ధ్య‌కు వ‌చ్చి డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డ‌మే కాక తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న చిత్రం థగ్‌లైఫ్ (Thug Life). అయితే ఈ సినిమా ఫెయిల్యూర్‌కు ఆ చిత్ర దర్శకుడు మణిరత్నం (Manirathnam) ప్రేక్షకులకు క్షమాపణ లు చెప్పినట్టు జరుగుతున్న ప్రచారంపై మ ద్రాస్‌ టాకీస్ (Madras Talkies) స్పందించింది. చిత్ర దర్శకుడు మణిరత్నం ప్రేక్షకులకు సారీ చెప్పినట్టుగా అసత్య ప్రచారం చేయొద్దని కోరింది. 
సినిమా టైమింగ్స్

‘ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనయ్యారని, దీంతో అభిమానులకు మణిరత్నం (Manirathnam) సారీ చెప్పినట్టుగా సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను షేర్‌ చేస్తున్నారు. నిజానికి మణిరత్నం ఎవరికీ క్షమాపణ చెప్పలేదు. ఆ సినిమా అభిమానులను సంతృప్తి పరచలేదని, అందుకే ఆయన సారీ చెప్పినట్టుగా సాగుతున్న ప్రచారం అబద్దమని మద్రాస్‌ టాకీస్‌ స్పష్టం చేసింది. 

సినిమా టైమింగ్స్

కాగా, రాజ్‌ కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాయి. కమల్‌ హాసన్ (Kamal Haasan), శింబు (Silambarasan), నాజర్‌, త్రిష (Trisha), అభిరామి వంటి అగ్రతారాగణం నటించగా, ఏఆర్‌.రెహ్మాన్ (AR Rahman) సంగీతం. జూన్‌ 5వ తేదీన విడుదలైంది.

థగ్‌లైఫ్‌ మూవీ బ్యాన్‌ కోర్టులో విచారణ.

 థగ్‌లైఫ్‌ మూవీ బ్యాన్‌ కోర్టులో విచారణ…

కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమా విడుదలకు సంబంధించి నమోదైన పిటిషన్‌లు సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టులో శుక్రవారం ఒకే రోజు విచారణకు వచ్చాయి.

థగ్‌లైఫ్‌ హీరో కమల్‌ హాసన్‌ బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో.

కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమా విడుదలకు సంబంధించి నమోదైన పిటిషన్‌లు సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టులో శుక్రవారం ఒకే రోజు విచారణకు వచ్చాయి.
థగ్‌లైఫ్‌ హీరో కమల్‌ హాసన్‌ బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
కమల్‌ క్షమాపణ చెప్పకపోతే థగ్‌లైఫ్‌ సినిమాను రాష్ట్రంలో విడుదల చేయనివ్వబోమని కన్నడ సంఘాలు హెచ్చరించాయి.
కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలి కూడా ఈ మేరకు తీర్మానం చేసింది.
దీన్ని ప్రశ్నిస్తూ, సినిమా నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ మన్మోహన్‌ ధర్మాసనం విచారించింది.
సినిమా విడుదలకు అభ్యంతరాలు తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version