క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించాలి…

క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించాలి…

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి…

మాత శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి…

విద్యార్థులకు అవసరమైన పరీక్షలు నిర్ణిత సమయంలో నిర్వహించాలి…

విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలి…

కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం, గిరిజన ఆశ్రమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్- లెనిన్ వత్సల్ టోప్పో…

నేటి ధాత్రి -గార్ల :-

గార్ల మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం, మరియు గిరిజన ఆశ్రమ వసతి గృహాన్ని బుధవారం మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రభలే అవకాశాలు ఉన్నందున వైద్య సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ అన్ని రకాల మందులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను షెడ్యూల్ వారీగా పూర్తిచేసే విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని అన్నారు.

అనంతరం వసతి గృహంలో వంటశాలను, స్టోర్ గదిని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం వేడివేడిగా పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని అన్నారు. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి రికార్డులను, మరుగుదొడ్లను, ఆపరేషన్ థియేటర్, మందుల గది, పోస్ట్మార్టం గదిని పరిశీలించి వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఏజిహెచ్ఎస్ పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను పరిశీలించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు.ఈసందర్బంగా కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కందునూరి శ్రీనివాస్, అలవాల సత్యవతి లు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో కు అందజేశారు.

పుస్తక పటనం చాలా మంచిది.

పుస్తక పటనం చాలా మంచిది.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు నవతెలంగాణ పత్రిక వారు ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన షాపును సిఐ నాగార్జున, ఎస్. ఐ మాధవ రెడ్డి తో కలిసి సందర్శించారు. సీఐ నాగార్జున మాట్లాడుతూ..పుస్తకాలు చదవడం వల్ల వ్యక్తిత్వ వికాసం, మెరుగైన భాషా నైపుణ్యాలు, జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత మెరుగుపడతాయని అలాగే, ఒత్తిడి తగ్గి, జ్ఞానం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి పరశురాములు, పడకంటి వెంకటేష్, దున్న సురేష్, శివ తదితరులు ఉన్నారు.

రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన..

రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులు

రామడుగు, నేటిధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-31.wav?_=1

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఎన్ఎమ్ఎన్ఎఫ్ పథకంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చొప్పదండి డివిజన్ ఏడిఏ ప్రియదర్శిని హాజరై రైతులకు సేంద్రియ సాగు గురించి సలహాలు సూచనలు తెలియజేశారు. ఆయిల్ ఫాం పంట సాగులో మెలకువలతో పాటు పంట సాగుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి హార్టికల్చర్ ఆఫీసర్ రోహిత్ రైతులకు వివరించారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

సి ఆర్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ.

సి ఆర్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపాలిటీ పరిధిలోని సి ఆర్ నగర్ లో భూపాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. వార్డు ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అనంతరం
సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమంలో డాక్టర్ శారద, వి బృందా. శ్రీదేవి ఏఎన్.ఎంలు రమ, కరుణ,ఆశ వర్కర్లు స్వరూప,అరుణ తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన ఎస్సై సంతోష్.

డ్రగ్స్ మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన ఎస్సై సంతోష్

శ్రీరాంపూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి డ్రగ్స్,గంజాయి,మద్యం ఇతర మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై సంతోష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలని పాఠశాలల విద్యార్థులకు డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించారు.రాబోయే రోజుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని తెలిపారు.విద్యార్థులు,యువత,కార్మికులు,పౌరులు చెడు వ్యసనాల బారిన పడి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని అన్నారు.మత్తు పదార్థాల నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.విద్య సంస్థలలో అవగాహన సదస్సు నిర్వహించి మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనార్ధలను వివరిస్తున్నట్లు పేర్కొన్నారు.అలాగే కేసులో ఇరుకుతే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేస్తూ తరచూ తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు.విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాలు వినియోగించరాదు గంజాయి మత్తు పదార్థాలకు బానిస అయిన వారిని అందులో నుంచి బయటకు వచ్చేందుకు పునరావాస కేంద్రాలకు పంపిస్తూ ఎక్కడైనా గంజాయి మత్తు పదార్థాలు విక్రయిస్తే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.

మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ

మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించిన తొర్రూరు డి.ఎస్.పి కృష్ణ కిషోర్

యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా సన్మార్గంలో నడవాలని తొర్రూరు డీ ఎస్పీ క్రిష్ణ కిషోర్ యువతకు విజ్ఞప్తి చేశారు.

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

 

 

 

అంతర్జాతీయ మాధికద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో మాధక ద్రవ్యాల  నిర్మూలన పై అవగాహన ర్యాలీ ని తొర్రూరు డీఎస్పీ కిష్ణ కిషోర్ ప్రారంభించారు …ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ….యువత మత్తులో చిత్తవుతున్నారని…మాదకద్రవ్యాలనువిక్రయించినా, రవాణా చేసినా, వినియోగించినా 1908 గాని పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని మాదకద్రవ్యాల అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా  అవగాహన పెంపొందించేందుకు పోలీసులు పలు అవగాహన కర్యక్రమాలు చేపడుతున్నామన్నారు.ఈ ర్యాలీలో తొర్రూర్ తాసిల్దారు గారు సబ్ డివిజన్లోని, సీ.ఐ లు. ఎస్సైలు పోలీస్ సిబ్బంది, పలు శాఖల అధికారులు, వివిధ పాఠశాలల  విద్యార్థులు పాల్గొన్నారు.

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

-ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సూచన మేరకు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొరవి పరమేష్ ల ఆదేశాల మేరకు వరంగల్ ఎంజిఎంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో యువజన కాంగ్రెస్ నాయకులతో రక్తదానాన్ని చేయించిన నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ తన కర్తవ్యంగా రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రూపిక శ్రవణ్ కుమార్, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొదిల నరేష్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, నెక్కొండ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సింగం ప్రశాంత్, చెన్నారావుపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బండి హరీష్, నర్సంపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బోంత రంజిత్, యువజన కాంగ్రెస్ నాయకులు ఇజ్జగిరి దిలీప్, చెన్నబోయిన సాయి శ్రావణ్ కుమార్, కోలుగురి కర్ణాకర్, జెట్టి ప్రశాంత్, జెట్టి రాజేంద్రప్రసాద్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించిన.

అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ప్రాథమిక పాఠశాల న్యాల్కల్ మండల రేజింతల్ గ్రామంలో ప్రధానోపాధ్యాయులు సఫియా సుల్తానా అధ్యక్షతన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నూతనంగా 1 వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సఫియా సుల్తానా ఉపాధ్యాయులు జ్యోతి, మానస, ఏ ఏ పి సి చైర్మన్ రామేశ్వరీ, మాజీ ఎంపీటీసీ నల్లవల్లి మల్లిక, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

బక్రీద్ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో “పీస్ మీటింగ్”ఏర్పాటు

బక్రీద్ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో “పీస్ మీటింగ్”ఏర్పాటు

★ఎస్సై నరేష్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రం పోలీస్ స్టేషన్లో ఎస్సై నరేష్, ఆధ్వర్యంలో జరిగిన “పీస్ మీటింగ్”నకు ఝరాసంగం లోని హిందూ,ముస్లిం మతాలకు చెందిన మత పెద్దలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్సై నరేష్, మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని మతాల పెద్దలు పోలీసువారికి సహకరించాలని కోరారు. సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధంగా, విషపూరిత పుకార్లను నమ్మవద్దని కోరారు. నిజ నిజాలు తెలియకుండా మీకు వచ్చిన అసత్యపు సోషల్ మీడియా సందేశాలను దాని గురించి నిజామా అబద్దమా అని ఆలోచించకుండా ఇతరులకు షేర్ చేయకుడదన్నారు.దాని వలన ఎలాంటి ప్రమాదమైన జరగవచ్చు కావున ప్రశాంత మైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు పోలీసులకి సహకరించాలని అన్నారు. ప్రజా భద్రత, లా & ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి యుత జీవనం గడిపేలా చూడడం పోలీసుల ప్రధాన లక్ష్యం అన్నారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలు,ప్రజా శాంతి కి భంగం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఝరాసంగం ప్రజలు అన్నదమ్ముల వలే కలిసి ఉండి ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా అందరికి,అన్ని ప్రాంతాల వారికీ ఆదర్శంగా నిలివాలని కోరారు.

విరాజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

విరాజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారం మండలం పోతారం గ్రామం లో శ్రీ విరాజ్ హస్పిటల్ పేద్దపల్లి అద్వర్యం లో ఉచ్చిత వైద్య శిబిరం నిర్వయించారు
ఈ వైద్య శిబిరం లో డాక్టర్ రాజ్ కుమార్ దంత వైద్యులు ( మేనేజింగ్ డైరేక్టర్ ) డాక్టర్ చంద్రకుమార్ జనరల్ పిజిషన్
సదానందం మేనేజ్ మేంట్
రాజు మేనేజ్ మేంట్ మరియు మార్కేటింగ్ పాల్గోని గ్రామస్తులకు వైద్య పరిక్షలు నిర్వయించి ఉచితంగా మందులు పంపిణి చేసారు వైద్యులను మాజీ సర్పంచ్ నేత్తేట్ల మహేందర్ మరియు గ్రామస్తులు షాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బందీ గ్రామస్తులు యూత్ సబ్యులు పాల్గోన్నారు

సంఘటిత సహకార శక్తి పెంపు కోసం సకృషి ఉద్యమం.

సంఘటిత సహకార శక్తి పెంపు కోసం సకృషి ఉద్యమం.

విజయవంతమైన 19వ వార్షిక మహాసభ..

10 వ సారి అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీనివాస్ గౌడ్..

నర్సంపేట నేటిధాత్రి:

గ్రామీణ ప్రజల్లో సమిష్టిగా పొదుపు చేయు అలవాట్లు ప్రవేశపెట్టి సంఘటితంగా సహకార శక్తిని పెంపొందించడం కోసం స్వకృషి ఉద్యమం పనిచేస్తుందని దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ అన్నారు. నర్సంపేట మండలంలోని చంద్రయ్య పల్లి గ్రామంలో గల చంద్ర పురుషుల పొదుపు సంఘం 19 వార్షిక మహాసభ సంఘ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. 2024 జనవరి నుండి 2025 మార్చి నెల వరకు సంఘంలో జరిగిన లావాదేవీలు,ఆస్తుల వివరాల పట్ల నివేదిక రూపంలో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ప్రవేశపెట్టారు. పొదుపు సంఘంలో నిర్వహిస్తున్న వివిధ ఖాతాల పట్ల మహాసభలో చర్చించి సంఘం అభివృద్ధి కోసం పలు సలహాలు సూచనలతో చర్చించుకున్నారు.

cooperation

2025 మార్చి నెల వరకు 410 మంది సభ్యులతో రూ. 60 లక్షల 76 వేల 567 నిధులు ఉన్నట్లు గణకుడు ఏడెల్లి మహేందర్ రెడ్డి తెలియజేశారు.ముఖ్య అతిథులుగా హాజరైన సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ సంఘం సమర్థవంతమైన సేవలు అందించడం ద్వారా సభ్యుల ఆర్థిక సాంఘిక స్థితిని మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.ఆర్థిక అవసరాలను తీర్చడం కోసం స్వకృషి ఉద్యమ పొదుపు సంఘాలు ఎంతగానో దోహదపడుతున్నాయని సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల కుమారస్వామి పేర్కొన్నారు. ఉత్తమ సంఘ సభ్యునిగా ఎన్నికైన వరంగంటి ప్రవీణ్ రెడ్డి, ఉత్తమ పాలకవర్గ సభ్యులు భాషబోయిన రాజు, ఉప్పుల రాజు, బానోతు రమేష్,కందుల శ్రీనివాస్ గౌడ్ లకు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.

నూతన అధ్యక్ష,ఉపాధ్యక్షుల ఎన్నిక..

2025 – 26 సంవత్సరానికి గాను నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక కోసం ఎన్నికల నిర్వహించగా సంఘం అధ్యక్షులుగా కందుల శ్రీనివాస్ గౌడ్ , ఉపాధ్యక్షులుగా వడ్డేపల్లి మృత్యుంజయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ ప్రకటించారు.

cooperation

అధ్యక్షుడిగా 10వ సారి ఎన్నికైన శ్రీనివాస్ గౌడ్..

చంద్రయ్యపల్లి గ్రామంలో సహకార వికాస సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చంద్ర పురుషుల పొదుపు సంఘం అధ్యక్షులుగా వరుసగా పదవసారి ఎన్నికయ్యారు. తన ఎన్నిక పట్ల మరింత బాధ్యత పెరిగిందని అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బానోతు రమేష్, భాషబోయిన రాజు, పాక రాజయ్య, సలపాల ప్రభాకర్, భాషబోయిన చరణ్ రాజ్,మామిడి ఐలయ్య,ఉప్పుల రాజు,బానోతు సాంబయ్య,అజ్మీర జితేందర్, సయ్యద్ బషీర్ తోపాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ఉచిత కంటి వైద్య శిబిరం

ఉచిత కంటి వైద్య శిబిరం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామ పంచా యితీ కార్యాలయంలో ఉద యం కంటి పరీక్ష క్యాంపు తీన్మార్ మల్లన్న టీం ఆధ్వ రంలో లయన్ విజన్స్ క్లబ్ సహకారంతో నాలుగో విడతలో భాగంగా నిర్వహించ డం జరిగింది దాదాపుగా గ్రామ వృద్ధులు 80 మందికి ఉచి తంగా కంటి బీపీ షుగర్ థైరాయిడ్ పరీక్షలు చేయించు కోవడం జరిగింది అందులో ఒక 35 మందిని కంటి ఆపరేషన్ ఎన్నుకోవడం జరిగింది వారికి ఉచితంగా బస్సు భోజనము పడక కల్పిస్తూ హైదరాబాదు లోని పుష్పగిరి ఆసుపత్రికి తీసుకుపోయి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని మండలం లోని 24 గ్రామాలలో ఉచితం గా కంటి పరీక్ష క్యాంపు నిర్వ హించాలనే సంకల్పంతో కన్నా కొడుకులు కూతుర్లు తల్లితం డ్రులను పట్టించుకోలేని స్థితిలో తీన్మార్ మల్లన్న టీం ముందుం డి వారికి ఇంటి పెద్ద బిడ్డ లాగా వారికి సహాయం చేస్తున్నారని ఒక గొప్ప అనుభూతి కలుగుతుందని తీన్మార్ మల్లన్న టీం మండలాధ్యక్షులు తీన్మార్ జయ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు పెద్ద ఎత్తున వృద్ధులు గ్రామ పెద్దలు తీన్మార్ జయ్ పెద్దిరెడ్డి వేముల రమేష్ శానం కుమార్ స్వామి సుమన్ తదితరులు పాల్గొన్నారు.

షీ టీం అవగాహన సదస్సు ఏర్పాటుచేసిన.!

సిరిసిల్ల జిల్లాలో షీ టీం అవగాహన సదస్సు ఏర్పాటుచేసిన జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే

మహిళలకు రక్షణగా షీ టీం

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల జిల్లాలో మహిళల, విద్యార్థుల రక్షణయే లక్ష్యంగా ఏర్పాటు చేసిన షీ టీం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మహిళ చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పొక్సో, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, వేధింపులకు గురైతే ఎవరిని సంప్రదించాలి అనే మొదలగు అంశాలపై అవగాహన కల్పిస్తూ మహిళల,విద్యార్థినీల భద్రతకు భరోసా కల్పించడం జరుగుతుంది.గడిచిన నెల రోజుల వ్యవధిలో జిల్లాలో విద్యార్థినిలను, మహిళలను వేధిస్తున్న ఆకతాయిలపై 02 కేసులు, 07 పెట్టి కేసులు నమోదు చేసి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే మాట్లాడుతూ..విద్యార్థినులు,
మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని,ధైర్యంగా ముందుకు వచ్చి షీ.టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రధానంగా మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురౌవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా, ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు.ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యాసంస్థలల్లోఎవరైనా వేధించిన,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ తెలిపారు.

బంగ్లపల్లి లో ఉచిత పశువైద్య శిభిరం ఏర్పాటు.

బంగ్లపల్లి లో ఉచిత పశువైద్య శిభిరం ఏర్పాటు………….
చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్
గుమ్మడి శ్రీదేవి…………వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ ……….

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

మండలంలోని బంగ్లపల్లి గ్రామంలో, వ్యవసాయమార్కెట్ కమిటీ చిట్యాల ఆధ్వర్యంలో. పశుసంవర్ధక శాఖ సౌజన్యంతో. ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి పాల్గొని మాట్లాడుతూ.

Chityala Market

మొగుళ్లపల్లి మండలంలోని రైతుసోదరులు తమ పాడి పశువులు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాట్లు చేశామని రైతు సోదరులు తమ పశువులను పశు వైద్య అధికారికి చూపించి డాక్టర్ సలహాలు పాటించి పశువులకు వ్యాధులు సోకకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.ఆమెవెంట ఏ ఎం సి. వైస్ చైర్మన్ ఎండి రఫీ, డైరెక్టర్లు లింగయ్య, సతీష్ రెడ్డి, మార్కెట్ కమిటీ సెక్రటరీ కనుక .శేఖర్, మండల పశువైద్యాధికారి డాక్టర్.G. రాకేష్ శర్మ, ఎం .వెంకటేష్(జె వి వో), గోపాలమిత్ర శ్రీనివాస్, రాజన్న, అశోక్ , మార్కెట్ కమిటీ సిబ్బంది బొచ్చు రాజు, పడదల దేవేందర్ రావు, అల్లం సమ్మయ్య రైతు సోదరులు పాల్గొనడం జరిగింది.

మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు పశువులకు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని పశువులకు ఇచ్చే వ్యాక్సినేషన్ సకాలంలో ఇప్పించి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా చింత వైద్య శిబిరంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ నర్సింగ్ గౌడ్ డైరెక్టర్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు

సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం బస్టాండ్ సమీపం లోని రాజీవ్ రహదారి పై శుక్రవారం సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఏ హెచ్ కె ఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ సిస్టమును స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వారు మాట్లాడుతూ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులకు ఉపయోగకరంగా ఉంటుందని, అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగే సంఘటనలు తగ్గుతాయని అన్నారు.ఇందారం ఓసిపి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి పవర్ ప్లాంట్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కొరకు హెచ్ కె ఆర్ సంస్థ చొరవ చూపాలని ఎమ్మెల్యే వివేక్ వారిని కోరారు.

నోటిని అదుపులో పెట్టుకో..

నోటిని అదుపులో పెట్టుకో
– మాట్ల మధు పై కాంగ్రెస్ నాయకుల ధ్వజం
– కేకే సిరిసిల్ల వాసి
– గతంలో కెసిఆర్ కేకే ను మోసం చేశారు

సిరిసిల్ల:(నేటి ధాత్రి)

బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు గడ్డం కిరణ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్ల మధు నువ్వు నిన్న మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకొని, భేషరతుగా కెకె మహేందర్ రెడ్డి అన్నకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. అర్హతకు, ( పరిధికి ) మించి మాట్లాడొద్దని అన్నారు.
పెద్దవారిని విమర్శిస్తే పెద్దొనివైతవని భ్రమలో మాట్లాడుతున్నావని అన్నారు.
కెకె మహేందర్ రెడ్డి పుణ్యమే సిరిసిల్ల నియోజకవర్గం, కెకె మహేందర్ ప్రతి ఇంటి,ఇంటికి గులాబి జెండాని, తెలంగాణ నినాదాన్ని పరిచయం చేసిందని అన్నారు.
నీకు తెల్వకపోతే కేటీఆర్, కేసీఆర్ లను అడుగని అన్నారు.
10 సంవత్సరాల కాలంలో మల్కపేట రిజర్వాయర్ లో నీళ్ళు నింపలేని చాతగాని మనుషులు ఎవరో ఈ ప్రాంత ప్రజలకు తెలుసని అన్నారు.
కెకె మహేందర్ రెడ్డి ని విమర్శిస్తే కెకె మహేందర్ రెడ్డి అభిమానులు

శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం 18 వ కళ్యాణ మహోత్సవం

శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం 18 వ కళ్యాణ మహోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కొల్లూర్ గ్రామంలో
శ్రీ రేణుక ఎల్లమ్మ 18 వ కళ్యాణ మహోత్సవం నిర్వాహకురాలు శ్రీమతి భ్రమరాంబ రాములు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది . తేదీ 6 7 గురు శుక్రవారం రోజున అమ్మవారి కళ్యాణం బోనాల ఊరేగింపు పోతురాజుల విన్యాసాలు గొల్ల బిర్లా ఆటపాట ఒగ్గు కథ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారి కుమారుడు డా: కోట ధన్ రాజ్ గౌడ్ సామాజికవేత్త ఆలయ కమిటీ చైర్మన్ తెలియజేశారు ధన్ రాజ్ గౌడ్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోని కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని రాజకీయ ప్రముఖులు ఉన్నతాధికారులు పాల్గొంటారని వారు తెలియజేశారు.

సైన్స్ డే రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ వారి ఆధ్వర్యంలో.!

సైన్స్ డే రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ వారి ఆధ్వర్యంలో పోస్టర్ ప్రజెంటేషన్ నిర్వహణ

హన్మకొండ, నేటిధాత్రి :

తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళశాల వరంగల్ వెస్ట్ నందు సైన్స్ డే సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ వారు పోస్టర్ ప్రసెంటేషన్ ను నిర్వహించారు. విద్యార్థినిల విజ్ఞాన సముపర్జనకు మరియు మనో వికాసానికి గాను ఫిల్డ్ ట్రిప్ లో భాగంగా రీజనల్ సైన్స్ సెంటర్, వరంగల్ ను సందర్శించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డా.గోళి.శ్రీలత తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఎస్.మాలతి, మైక్రో బయాలజీ ఎచ్ వో డి కె. గీతా రాణి మరియు కె. శ్రీవిధ్య పాల్గొన్నారు.

సైన్స్ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలి..

 రేపు సైన్స్ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలి

జహీరాబాద్. నేటి ధాత్రి:

జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించాలని డిఈవో వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో 21 రకాల కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. సెన్స్ కార్యక్రమ వేడుకలను ఫోటోలు వీడియోల రూపంలో డీఈవో కార్యాలయానికి పంపాలని సూచించారు. పూర్తి వివరాలకు సెన్స్ ఆఫీసర్ సిద్ధారెడ్డి 6302290235న సంప్రదించాలని చెప్పారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version