అడవిని దున్నుతున్న ఒకరిపై కేసు నమోదు.

అడవిని దున్నుతున్న ఒకరిపై కేసు నమోదు

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి రేంజి పరిధిలోని బొమ్మెన 143 కంపార్ట్మెంట్ అడవిలో చామనపల్లికి చెందిన ధూపం కుమార్ ట్రాక్టర్ తో అడవిని దున్నతుండగా తమ సిబ్బంది పట్టుకున్నట్లు అటవీ రేంజ్ అధికారి హఫీజ్ ఖాన్ శనివారం తెలిపారు. ట్రాక్టర్ ను సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అటవీ భూమిని దున్నితే చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

అసత్య ప్రచారం చేసిన ఒకరిపై కేసు నమోదు.

అసత్య ప్రచారం చేసిన ఒకరిపై కేసు నమోదు

నెన్నెల,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

నెన్నెల మండలంలో అసత్య ప్రచారం చేసిన ఒకరిపై కేసు నమోదు
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన బెల్లంపల్లి మండలం చాకెపల్లికి చెందిన దుర్గం రవిపై గురువారం కేసు నమోదు చేసినట్లు నెన్నెల ఎస్సై ప్రసాద్ శుక్రవారం తెలిపారు.ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడని నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన అత్తిని బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

నాణ్యత లోపం ఎవరిదీ ఈ పాపం.

నాణ్యత లోపం ఎవరిదీ ఈ పాపం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

కప్పాడు గ్రామం, ఝరాసంగం మండలం. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని కప్పడ్ గ్రామం మరియు రాయికోడ్, మండలం కప్పడ్ మరియు రాయి కోడ్, ఈ రెండు గ్రామాల మధ్యలో, దాదాపు మూడు నెలల క్రితం, సాంకేతిక పరిజ్ఞానంతో, రకరకాల మిశ్రమాలను ఉపయోగించి, తారు రోడ్డును వేశారు. కాని పని పూర్తి చేసిన మూడు నెలల లోపే, రోడ్డుకు పగుళ్లు ఏర్పడి, గుంతలుగా మారుతున్నాయి. ప్రభుత్వ అధికారులు స్పందించి, రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని ప్రజలు కోరుచున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version