థగ్లైఫ్ మణిరత్నం క్షమాపణ చెప్పలేదు…
థగ్లైఫ్ సినిమా ఫెయిల్యూర్కు మణిరత్నం ప్రేక్షకులకు క్షమాపణ లు చెప్పినట్టు జరుగుతున్న ప్రచారంపై మ ద్రాస్ టాకీస్ స్పందించింది.
‘ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనయ్యారని, దీంతో అభిమానులకు మణిరత్నం (Manirathnam) సారీ చెప్పినట్టుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలకు సంబంధించిన స్క్రీన్షాట్లను షేర్ చేస్తున్నారు. నిజానికి మణిరత్నం ఎవరికీ క్షమాపణ చెప్పలేదు. ఆ సినిమా అభిమానులను సంతృప్తి పరచలేదని, అందుకే ఆయన సారీ చెప్పినట్టుగా సాగుతున్న ప్రచారం అబద్దమని మద్రాస్ టాకీస్ స్పష్టం చేసింది.
కాగా, రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కించాయి. కమల్ హాసన్ (Kamal Haasan), శింబు (Silambarasan), నాజర్, త్రిష (Trisha), అభిరామి వంటి అగ్రతారాగణం నటించగా, ఏఆర్.రెహ్మాన్ (AR Rahman) సంగీతం. జూన్ 5వ తేదీన విడుదలైంది.