డ్రగ్స్ మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన ఎస్సై సంతోష్.

డ్రగ్స్ మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన ఎస్సై సంతోష్

శ్రీరాంపూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి డ్రగ్స్,గంజాయి,మద్యం ఇతర మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై సంతోష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలని పాఠశాలల విద్యార్థులకు డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించారు.రాబోయే రోజుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని తెలిపారు.విద్యార్థులు,యువత,కార్మికులు,పౌరులు చెడు వ్యసనాల బారిన పడి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని అన్నారు.మత్తు పదార్థాల నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.విద్య సంస్థలలో అవగాహన సదస్సు నిర్వహించి మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనార్ధలను వివరిస్తున్నట్లు పేర్కొన్నారు.అలాగే కేసులో ఇరుకుతే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేస్తూ తరచూ తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు.విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాలు వినియోగించరాదు గంజాయి మత్తు పదార్థాలకు బానిస అయిన వారిని అందులో నుంచి బయటకు వచ్చేందుకు పునరావాస కేంద్రాలకు పంపిస్తూ ఎక్కడైనా గంజాయి మత్తు పదార్థాలు విక్రయిస్తే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version