మంచు విష్ణు క‌న్న‌ప్ప ఎలా ఉందంటే ట్విట్ట‌ర్ రివ్యూ.

 మంచు విష్ణు క‌న్న‌ప్ప ఎలా ఉందంటే ట్విట్ట‌ర్ రివ్యూ…

క‌న్న‌ప్ప చిత్రం అన్ని అవాంత‌రాల‌ను దాటుకుని ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విదేశాల‌లో ఇప్ప‌టికే సినిమా షోలు ప‌డిపోయాయు.

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇండియ‌న్ సూప‌ర్ స్టార్స్ అక్ష‌య్ కుమార్‌, ప్ర‌భాస్‌, మోహాన్ లాల్ వంటి మ‌హా మ‌హులు న‌టించిన‌ క‌న్న‌ప్ప (Kannappa) చిత్రం అన్ని అవాంత‌రాల‌ను దాటుకుని ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విదేశాల‌లో ఇప్ప‌టికే సినిమా షోలు ప‌డిపోయాయు. మ‌న ద‌గ్గ‌ర కూడా కొన్ని ప్రాంతాల‌లో ప్రీమియ‌ర్లు వేయ‌డంతో చాలా మంది సినిమా చూసి క్ష‌ణం గ్యాప్ ఇవ్వ‌కుండా వెనువెంట‌నే త‌మ త‌మ సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తూ సినిమా ఎలా ఉంది, న‌టీన‌టులు ఎలా చేశార‌నే అంశాల‌ను తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రి వీక్ష‌కులు ఎలాంటి రిపోర్టులు ఇచ్చారో, ఇస్తున్నారో Kanappa Review ఇక్క‌డ చూద్దాం.

 

ఫ‌స్టాప్ కాస్త ల్యాగ్‌, బోర్ ఫీల్ వ‌చ్చినా ద్వితియార్ధ‌మే అద్భుతంగా ఉంద‌ని, ముఖ్యంగా ప్ర‌భాస్ వ‌చ్చిన త‌ర్వాత‌, ఆపై చివ‌రి 30 నిమిషాలు సినిమాకు ఆయువు ప‌ట్ట‌ని అంటున్నారు. అధేవిధంగా సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్‌, పాట‌లు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయ‌ని, పాటల్లోని సాహిత్యం కూడా అర్థ‌వంతంగా ఉండి అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా ఉన్నాయ‌ని పేర్కొంటున్నారు. ఈ త‌రానికి క‌న్న‌ప్ప గురించి తెలియ‌జేసే ప్ర‌య‌త్నం బావుంద‌ని, ప్ర‌ధానంగా మంచు విష్ణు న‌ట‌న, తిన్న‌డు నుంచి క‌న్న‌ప్పగా మారిన క్ష‌ణం మెస్మ‌రైజింగ్‌గా ఉంద‌ని, పూర్తిగా భ‌క్తిభావం పెరిగేలా చేస్తూ క్లైమాక్స్ స్ట‌న్నింగ్‌గా రూపొందించార‌ని అనేక మంది సోష‌ల్ మీడియాల్లో త‌మ‌, త‌మ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు.

ఎయిరిండియాలోనే మంచు లక్ష్మీ ప్రయాణం ఆమె ఏమన్నారంటే.

ఎయిరిండియాలోనే మంచు లక్ష్మీ ప్రయాణం ఆమె ఏమన్నారంటే…

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలిన రోజే మంచు లక్ష్మీ ఎయిరిండియా విమానంలో లండన్‌కు వెళ్లారు.

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా (Air india Plain) విమానం కుప్పకూలిన రోజే మంచు లక్ష్మీ (manchu lakshmi Prasanna) ఎయిరిండియా విమానంలో లండన్‌కు వెళ్లారు. దీంతో ఆమె ఎలా ఉన్నారో ఆరా తీశారు అభిమానులు. మెసేజ్‌లు చేశారు.  అయితే తాను క్షేమంగా ఉన్నానంటూ మంచు లక్ష్మి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.  ‘‘ఫ్లైట్‌ దిగిన తర్వాత ప్రమాదం గురించి తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యాను. నేను ఎలా ఉన్నానో కనుక్కోవడం కోసం ఎన్నో ఫోన్లు, మెేసజ్‌లు వస్తూనే ఉన్నాయి. నేను, మా అమ్మాయి అదేరోజు ముంబయి నుంచి లండన్‌కు ఎయిరిండియా విమానంలో ప్రయాణం చేశాము. దేవుడి దయ వల్ల మేము సేఫ్‌గా చేరుకున్నాం. అక్కడికి వెళ్లిన వెంటనే ఈ ప్రమాదం గురించి తెలిసి ఉలిక్కిపడ్డాను.
ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం. విద్యార్థులు కూడా మృతి చెందారని తెలిసి నా హృదయం ముక్కలైంది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మన ప్రాణాలు క్షణంలో ముగిసిపోతాయనడానికి ఈ ప్రమాదం ఒక ఉదాహరణ. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని మంచు వీడియోలో పేర్కొన్నారు. ఈ నెల 12న జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా ఆస్పత్రి, నివాస సముదాయం లోని ప్రజలు కొంత మంది మరణించినట్లు చెప్పారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version