పట్టణాన్ని మార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ చాబుత్ర .!

మందమర్రి పట్టణాన్ని నేరా రహితంగా మార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ చాబుత్ర

మందమర్రి నేటి ధాత్రి :

 

 

మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి. అర్థరాత్రి ఆవారా గా తిరుగుతున్న 30 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్
18 బైకులు,1 కారు, 5 సెల్ఫోన్లు స్వాధీనం
2 డ్రంకెన్ డ్రైవ్ కేస్ లు నమోదు 4 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు.

శనివారం అర్థరాత్రి మందమర్రి పట్టణం లో రావడం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా (డిఐజి) ఐపిఎస్, మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్ గార్ల ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ గారి పర్యవేక్షణలో మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ ముగ్గురు ఎస్ఐలు 25 మంది సిబ్బంది తో పెట్రోలింగ్ పార్టీలుగా మందమర్రి పట్టణాన్ని అష్టదిగ్బంధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రోడ్లపై అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతూ అనుమానాస్పదంగా ఉన్న 30 మందిని అదుపులోకి తీసుకొని మందమర్రి సిఐ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే వారి వద్ద నుండి 18 బైకులు, 1 కారు, 5 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.అలాగే తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులపై డీడీ కేస్ లు నమోదు చేయడం జరిగింది.

Operation

 

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ….
అర్ధరాత్రి అరుగుల (చబుత్ర) మీద బాతకానీలు కొడుతూ, రోడ్లమీద ఇష్టానుసారం బైకులపై తిరుగుతూ కాలనీ వాళ్లకు ఇబ్బందులకు గురిచేసిన, తాగి వాహనాలపై తిరుగుతూ . రోడ్డు ప్రమాదాలకు గురి చేస్తున్న, గొడవలు సృష్టిస్తున్న మరియు అనుమానస్పదంగా రోడ్లపై తిరుగుతున్న వారిని ఉపేక్షించేది లేదని ఇక మీద నుండి ఈ డ్రైవ్ క్రమ తప్పకుండా నిర్వహిస్తామని హెచ్చరించారు.

అలాగే ఇప్పుడు జరుగుతున్న నేరాలకు ముఖ్యంగా మైనర్లు మరియు 30 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లే అధికంగా ఉంటున్నారని, వీళ్లకు కౌన్సిలింగ్ చేసి మార్పు తీసుకొచ్చినట్లైతే చాలా నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలియజేశారు.

మందమర్రి పట్టణాన్ని నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని దీనికి పట్టణవాసులు సహకరించాలని కోరడం జరిగింది.

ఆపరేషన్ చాబుత్ర కార్యక్రమం లో మందమర్రి, రామకృష్ణాపూర్, కాశిపేట ఎస్సైలు సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.

అక్రమ వసూళ్లకు ప్రోత్సాహమే లక్ష్యంగా టిజిఎండిసి.

అక్రమ వసూళ్లకు ప్రోత్సాహమే లక్ష్యంగా టిజిఎండిసి.

38 రోజుల్లో 24 అక్రమ వసూళ్ల సాక్షాలతో కథనాలు.

చర్యలకు బదులు సెటిల్మెంట్లు చేసుకుంటున్న అధికారులు.

అదనపు ఇసుక అక్రమ వసూళ్లు జోరులో కాంట్రాక్టర్లు.

పక్క జిల్లా ఇసుక క్వారీల హద్దులు దాటి ఇసుక తరలిస్తున్న, టీజీఎండిసి నిశ్శబ్దం.

టీజీఎండిసి అక్రమ వసూళ్లలో సూత్రధారిగా వ్యవహరిస్తే కొత్త ఇసుక పాలసీ ఏలా అమలవుతుంది.

అక్రమ వసూళ్లకు ప్రభుత్వం కూడా పరోక్షంగా మద్దతు పలుకుతుందా.!?

టీజీఎండిసి ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎండి ఎక్కడ.!?

మహాదేవపూర్- నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నీ మహాదేవపూర్ మండల గోదావరి పరివాహక ప్రాంతానికి అనుకొని నిర్వహించబడుతున్న ఇసుక రీచ్ ల్లో అక్రమ వసూళ్లకు టీజీఎండిసి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల రూపాయల సొమ్మును కాంట్రాక్టర్లకు దూచిపెట్టడం జరుగుతుంది. అక్రమ వసూళ్లే కాదు అక్రమ ఇసుక తవ్వకాలను కూడా టీజీఎండిసి సహకరించడం జరుగుతుంది. కాంట్రాక్టర్ల ఇష్ట రాజ్యాన్ని టీజీఎండిసి అధికారులు కాంట్రాక్టర్ల చేతిలో కీలుబొమ్మలుగా మారి కాంట్రాక్టర్లు చెప్పింది వేగంగా వ్యవహరించడం జరుగుతుంది. అక్రమ ఇసుక రవాణా వసూళ్ల సాక్షాలు, వందల సంఖ్యలో తెరపైకి తీసుకువచ్చిన టీజీఎండిసి, చర్యల కు బదులు కాంట్రాక్టర్లతో హోటల్లో సెటిల్మెంట్ చేసుకోవడం, ఆనవాయితీగా మరణంతో పెద్ద మొత్తంలో ఇసుక రవాణా చేసే క్వారీలు దోపిడీలో మరింత ముందుకు దూసుకు వెళ్లడం జరుగుతుంది. టీజీఎండిసి ఉన్నత అధికారి ఇసుక రీచులను సందర్శించి అక్రమాలు అక్రమ ఇసుక రవాణాకు కఠిన చర్యలు ఉంటాయని చెప్పినప్పటికీ, ఇసుక రీచ్ లో అక్రమాలు బయటపడుతున్న, ఆ ఉన్నత అధికారి ఎందుకు స్పందించడం లేదు అనేది సందిగ్ధంగా మారింది.

చర్యలకు బదులు సెటిల్మెంట్లు చేసుకుంటున్న అధికారులు.

మండలంలో నిర్వహించబడుతున్న ఇసుక రీచులకు సంబంధించి అక్రమ వసూళ్ల వ్యవహారం, అదుపు ఇసుక రవాణా చేస్తున్న లారీల వివరాలు, కాంటాల వద్ద అదునపు ఇసుక వసూళ్లు, సాక్షాలతో “నేటి ధాత్రి” గత నెల నాలుగవ తేదీ నుండి నేటి వరకు, 34 కథనాలు అక్రమ వసూళ్లు అదనపు ఇసుక రవాణా చేస్తున్న సాక్షాలతో ప్రచురించడం జరిగింది. కానీ అధికారులు చర్యలకు బదులు, హోటళ్లలో కాంట్రాక్టర్లను పిలుచుకొని సెటిల్మెంట్ చేసుకుని వెళ్లడం జరగడంతో, రెచ్చిపోయిన కాంట్రాక్టర్లు వసూళ్ల పరంపర అక్రమంగా అదునపు ఇసుక రవాణా కు హద్దు అదుపు లేకుండా మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగించడం ఆశ్చర్యం. అంతేకాకుండా పక్క జిల్లా కు కేటాయించిన ఏర్రాయిపేట ఇసుక క్వారీ, గోదావరిలో అక్రమంగా రోడ్డు నిర్మించి, కుంట్లం గ్రామ సరిహద్దు వద్ద తవ్వకాలు జరిపి ఇసుకను తరలిస్తుంటే, కాంట్రాక్టర్లతో టీజీఎండిసి అధికారుల చీకటి ఒప్పందం నేటి వరకు ఏర్రాయిపేట ఇసుక కాంట్రాక్టర్, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రోడ్డును నిర్మించి భారీ తవ్వకాలతో ఇసుకను రవాణా చేయడం జరుగుతుంది అంటే, టీజీఎండిసి అధికారులు ఎంతవరకు అవినీతి మత్తులో ఉన్నారు అర్థమవుతుంది.

Encourage

 

అదనపు ఇసుక అక్రమ వసూళ్లు జోరులో కాంట్రాక్టర్లు.

తాజాగా పలుకుల తొమ్మిది, ఉసుక్పల్లి మహదేవపూర్ ఒకటి, పలుగుల ఎనిమిది, పెద్ద మొత్తంలో ఇసుక రవాణా చేసే ఈ మూడు ఇసుక క్వారీల అక్రమ వసూళ్ల అరాచకాలు హద్దు లేకుండా పోయింది. టీజీఎండిసి సిబ్బంది, కాంట్రాక్టర్ సూపర్వైజర్లు కలిసి, పలుగుల ఎనిమిది ఇసుక రీచ్ లో 1400, పలుగుల తొమ్మిది 1100, అలాగే పుసుక్కుపల్లి మహదేవ్పూర్ ఒకటవ నంబర్ ఇసుక రీచ్ లో 1100 రూపాయల చొప్పున ఇక్కడ టీజీఎండిసి సిబ్బంది, అక్రమ వసూళ్ల వ్యవహారంతో పాటు, లోడింగ్ వద్ద 200 అదనపు రూపాల వసూలు, కాంట్రా వద్ద పాసింగ్ పై అదనపు ఇసుక మరో 500 రూపాయల చొప్పున వసూళ్లు చేస్తున్న సాక్షాలతో ప్రచురించిన, టీజీఎండిసి మాత్రం సెటిల్మెంట్ చేసుకొని అక్రమాల వైపు కన్నెత్తి చూడడం లేదు. తాజాగా పలుకుల తొమ్మిది, మహదేవపూర్ పుసుపుపల్లి ఒకటి, ప్రస్తుతం వందల సంఖ్యలో లారీల్లో ఇసుక రవాణా చేస్తూ పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లతో లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటుంది. కానీ వీటిపై చర్యలకు టి జి ఎం డి సి, ఏ అధికారి కూడా సాహసం చేయడం లేదు.

 

టీజీజిడిసి అక్రమ వసూళ్లలో సూత్రధారిగా వ్యవహరిస్తే కొత్త ఇసుక పాలసీ ఏలా అమలవుతుంది.

ఇసుక రీచ్ లో అక్రమాలపై పరోక్షంగా ప్రత్యక్షంగా టీజీఎండిసి అధికారులు లంచాలకు మత్తులో ఇసుక రీచుల్లో అక్రమాలు కనబడకుండా పోయింది. కాంట్రాక్టర్లు మాత్రం పెద్ద మొత్తంలో లంచాలు అందించడం జరిగిందని తమకు అడిగే వారు లేరు అనుకొని అక్రమ వసూళ్ల అరాచకాలను మరింత జోరుగా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇప్పటికె మండలంలో అనేక రీచ్లు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ల వెసులుబాటు కొరకు టీజిఎండిసి కాంట్రాక్టర్లు చెప్పే విధంగా తల ఊపడంతో మండలంలో ఇసుక రీచులు ప్రారంభం కావడం లేదు. అంతేకాకుండా ఇప్పటికీ నెలల తరబడి ఇసుక స్టార్ చేసుకొని ఉన్న రీచులు కూడా లోడింగ్ ప్రక్రియ ప్రారంభించపోకపోవడానికి టీజీఎండిసి చీకటి ఒప్పందమే ప్రధాన కారణం. అవినీతికి కేరాఫ్ టీజిఎండిసీ, గా శాఖ మారడంతో, నూతన ఇసుక పాలసీ అక్రమ ఇసుక రవాణా అక్రమ వసూళ్ల వ్యవహారంపై, కొరడా విధించడం జరుగుతుందని ప్రజల్లో నమ్మకం లేకుండా పోయింది. అధికారుల ప్రవర్తన మార్చుకోవాలని ప్రభుత్వం డేట్ లైన్ కూడా డొంట్ కేర్ అనే విధంగా వ్యవహారిసున్న టీజీఎండిసి వ్యవహారం, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సాక్షాలతో ఇసుక రచుల్లో అక్రమాలను తెరపైకి వస్తున్న పక్షం రోజులైనప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం, ప్రభుత్వం కూడా ఇసుక రీచ్ లో అక్రమాలకు పరోక్షంగా సహకరిస్తుందన్నా వాదనలు బలమవుతున్నాయి.

టీజీఎండిసి ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎండి ఎక్కడ.!?

ఇసుక రీచ్ లు ప్రారంభం కాకముందే,టిజీ ఎం డి సి ఉన్నత అధికారి మేనేజింగ్ డైరెక్టర్ మండలంలోని పలు ఇసుక రీచ్ లను సందర్శించి అక్రమాలు అదనపు ఇసుక ఇలాంటి వ్యవహారాన్ని ఉపేక్షించమని బల్ల గుద్ది చెప్పిన ఎండి, పక్షం రోజులుగా టిజిఎండిసి సిబ్బంది వసూళ్ల పర్వాన్ని, సాక్షాలతో తెరపైకి తీసుకువచ్చిన, అదనపు వసూళ్ల వ్యవహారం ఇసుక కాంట్రాక్టర్ల సూపర్వైజర్లు దౌర్జన్యంగా అదనపు వసూళ్ల వ్యవహారాన్ని కూడా సాక్షాలతో తెరపైకి తీసుకురావడం కూడా జరిగింది. అంతేకాకుండా పక్క జిల్లాల ఇసుక రీచులు కూడా హద్దులు దాటి అక్రమ తవ్వకాలు, లాంటి వాటిని కూడా సాక్షాలతో ప్రచురించినప్పటికీ టీజీఎండిసి మేనేజింగ్ డైరెక్టర్ ఎందుకు నిశ్శబ్దాన్ని వహిస్తున్నారు, మరోవైపు అధికారులు కాంట్రాక్టర్లకు హోటల్లో పిలుచుకొని సెటిల్మెంట్లు చేసుకున్నారు అని స్పష్టంగా ప్రచురించడం జరిగినప్పటికీ కూడా ఎండి చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణమేమిటి, ఇసుక రీచుల్లో కాంట్రాక్టర్లు టీజీఎండిసి సిబ్బంది అధికారుల ప్రోత్సాహంతో దోపిడి రాజ్యాన్ని సృష్టించి అక్రమ వసూళ్లు అదనపు ఇసుక రవాణా చేస్తుంటే మేనేజింగ్ డైరెక్టర్ టి జి ఎం డి సి ఎక్కడ అని, ప్రజలు ప్రశ్నించక తప్పడం లేదు. ఇప్పటికైనా చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ టి జి ఎం డి సి తక్షణమే, చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

కలెక్టర్ ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలి .!

కలెక్టర్ ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు ఆదేశాలు.

వనపర్తి నేటిధాత్రి :

 

 

సోమవారం కలెక్టర్ కార్యలయముల నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనప కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు కలెక్టర్ ఆదర్శ్ సురభి స్వీకరించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి లో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుదారులకు తగిన సమాచారం ఇచ్చే బాధ్యత జిల్లా అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి హైదరాబాద్ ప్రజావాణి, మంత్రి ద్వారా వనపర్తి జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ప్రజావాణిలో మొత్తం 66 ఫిర్యాదులు వచ్చాయి. పి డి ఆర్ డి ఏ ఉమాదేవి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బంధన్ హాస్పిటల్లో దారుణం.

బంధన్ హాస్పిటల్లో దారుణం.

కడుపు నొప్పని వస్తే, కాటికి పంపిన బంధన్ హాస్పిటల్ వైద్యం.

బంధన్ హాస్పిటల్ నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం బలి.

హనుమకొండ బంధన్ హాస్పిటల్ లో వైద్యం వికటించి వరంగల్ కి చెందిన మహేందర్ అనే వ్యక్తి మృతి.

అనుభవం లేని డాక్టర్లు వైద్యం చేయడం వల్లే మహేందర్ రావు మృతి చెందినట్లు ఆరోపిస్తూ బంధువుల ఆందోళన.

హాస్పిటల్ లోనికి ఎవరిని అనుమతించని పోలీసులు. మృతుడి బంధువులు, పలువురిని హాస్పిటల్ లోనే ఉంచి తాళాలేసిన యాజమాన్యం.

మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు, న్యాయం చేయాలని బంధువుల డిమాండ్.

గతంలో కూడా బంధన్ హాస్పిటల్ లో వైద్యం వికటించిన వైనం..

గతంలో వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఉంటే ఈ మృతి జరిగేది కాదంటూ పలువురి ఆవేదన

చోద్యం చూస్తున్న “వైద్యాధికారులు”.! ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించేనా..?

*బంధన్ హాస్పిటల్ పై చర్యలకు వెనకాడుతున్న హనుమకొండ వైద్యశాఖ అధికారులు?.

ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? అపెండిక్స్ ఆపరేషన్ లు సైతం చేయరాని ఇలాంటి హాస్పటల్ ను సీజ్ చేయాలని బాధితుల డిమాండ్.

“బంధన్ ఆసుపత్రి” వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎవరు?

నలుగురు డాక్టర్లు కలిసి కోట్లు పెట్టి హాస్పిటల్ లు కట్టడం.., పేద ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడమేనా వీళ్ళ టార్గెట్?

నాణ్యమైన వైద్యం అందివ్వడం చేతకాదా.. డబ్బుల సంపాదనే వీళ్ళ ప్రధాన ఎజెండా?

వరంగల్ నేటిధాత్రి:

అమ్మ జన్మనిస్తే.. ఏదైనా ప్రాణాపాయ స్థితి ఏర్పడితే దాని నుంచి కాపాడి.. పునర్జన్మనిచ్చే దేవుళ్లుగా వైద్యులను ఆరాధిస్తుంటారు. అలా గొప్పగా కీర్తించబడే పవిత్రమైన వైద్య వృత్తికి కొందరు డాక్టర్లు అపఖ్యాతి తీసుకొస్తున్నారు. ఈ కోవకు చెందినవారే హనుమకొండలోని బంధన్ ఆసుపత్రి వైద్యులు అని బాధితులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు, వరంగల్ నగరం రంగశాయిపేట కు చెందిన మహేందర్ రావు అనే వ్యక్తి కడుపునొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు హన్మకొండలోని బంధన్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. కడుపు నొప్పితో బాధపడుతున్న వ్యక్తిని అందుబాటులో ఉన్న అనుభవం లేని డి ఫార్మా,, బిఏఎంఎస్ చేసిన డాక్టర్లు పరిశీలించి ట్రీట్మెంట్ చేయడం వల్ల వ్యక్తి మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మహేందర్ రావుకు గతంలోనే గుండెకు సంబంధించి వైద్యం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని గుండె కు సంబంధించిన డాక్టర్ను పిలవండి అని కుటుంబ సభ్యులు తెలిపిన కానీ, బంధన్ హాస్పిటల్ వాళ్ళు ఈ రోజు ఆదివారం గుండెకు సంబంధించి డాక్టర్ రారు, మేము చూసుకుంటాం అని, కనీసం జనరల్ అనస్థీషియా డాక్టర్ లేకుండానే ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు. గ్యాస్ట్రిక్ సమస్య, కడుపునొప్పి, ఉబ్బసంతో బాధపడుతున్న వ్యక్తి హాస్పిటల్ కు నడుచుకుంటూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయి, డిశ్చార్జ్ కూడా రాసిన డాక్టర్లు, మరి ఏమైందో, ఏమో కానీ అచ్చిరాని వైద్యం చేసి మంచిగున్న వ్యక్తిని నిర్లక్ష్యంగా ప్రాణాలు బలిగొన్నారు అని మృతుడి కుమార్తె మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. పేషెంట్ కు అల్ట్రా సౌండ్ స్కానింగ్ కొరకు నడుచుకుంటూ బయటికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు బంధువులు.

hospital

పేషంట్ కొరకు కార్డియాలజిస్ట్ డాక్టర్ ను పిలవండి, లేదంటే మేము వేరే హాస్పటల్ కు వెళ్తాము అని, అంబులెన్స్ కూడా తెచ్చుకొని, హాస్పిటల్ దగ్గర దాదాపుగా మూడు గంటలు వేచి ఉన్నా కానీ, సదరు బంధన్ డాక్టర్లు నిర్లక్ష్యంతో అనుభవం లేని డాక్టర్లు ట్రీట్మెంట్ చేయడం ద్వారా వ్యక్తి మృతి చెందిన సంఘటన. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసి, తమ తండ్రి మృతికి కారణం అయ్యారు బంధన్ హాస్పిటల్ డాక్టర్లు అని, ఈ హాస్పిటల్ లో ఎలాంటి క్వాలిఫైడ్ డాక్టర్లు అందుబాటులో లేరని, అనుభవం లేని డాక్టర్లు మాత్రమే వైద్యం చేస్తున్నారనీ నడుచుకుంటూ వచ్చిన మా నాన్నని నిర్లక్ష్యంగా వైద్యం చేసి మరణానికి కారకులయ్యారు అని మృతుడి కుమార్తెలు కన్నీరు పెట్టుకున్నారు. మహేందర్ రావు మృతి విషయం తెలుసుకున్న వెంటనే బంధువులు హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకొని ఆందోళన చేశారు. వెంటనే స్థానిక పోలీసులు రంగంలోకి దిగి బంధువులతో, హాస్పిటల్ యజమాన్యంతో మాట్లాడారు. బంధన్ హాస్పిటల్ బడా బాబులది కావడం దీని వెనుక రాజకీయ నాయకుల అండ ఉండడంతో, సమస్యను మేము పరిష్కరించుకుంటాం అని చెప్పి, విషయం బయటకు రాకుండా మేనేజ్ చేసిన తీరు ఆశ్చర్యం. ఏది ఏమైనా కానీ బంధం హాస్పిటల్ లో సరియైన డాక్టర్లు లేకుండానే వైద్యం చేస్తున్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా అనుభవం లేని డాక్టర్లు అపెండిక్స్ ఆపరేషన్ చేసి ఫెయిల్యూర్ అయిన ఘటన మరువకముందే, కడుపు నొప్పితో బాధపడుతున్న మరో వ్యక్తి ఈ హాస్పిటల్ లో జాయిన్ అయి, మృతి చెందిన వార్త నగరంలో కలకలం రేపింది. గతంలోనే అపెండిక్స్ ఫెయిల్యూర్ కు సంబంధించి హాస్పిటల్ నిర్లక్ష్యం వలన తనకు అన్యాయం జరిగిందని ఒక జర్నలిస్ట్ హనుమకొండ వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా, సదరు వైద్య శాఖ అధికారులు కానీ, హనుమకొండ డిఎంహెచ్ఓ సైతం స్పందించకుండా, హాస్పిటల్ పై ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఇప్పటివరకు. అప్పుడే వాళ్లు స్పందించి హాస్పిటల్ లో వైద్యులు ఎవరున్నారు? ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు? క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన వైద్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం గమనార్హం.

గతంలో ఒక జర్నలిస్టుకు చేసిన అపెండిక్స్ ఆపరేషన్ సైతం ఫెయిల్యూర్

Hospital

బంధన్ హాస్పిటల్ వైద్యుల నిర్వాకం వల్ల తాను ప్రాణాపాయ స్థితికి వెళ్లి నెలల పాటు మంచానికి పరిమితం అయ్యానని బాధితుడు జర్నలిస్టు కృష్ణ పేర్కొన్నారు. గత ఏడాది 21 జూలైన అపెండిక్స్ సమస్యతో బంధన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన జర్నలిస్ట్ కృష్ణకు.. అదే రోజు సాయంత్రం 6 గంటలకు సుమారు నాలుగు గంటల పైనే వైద్యులు ఆపరేషన్ చేశారు.  ఒకరోజు తర్వాత హాస్పిటల్ లో వైద్యం సరిగా లేకపోవడం గ్రహించిన కుటుంబ సభ్యులు.. వైద్యులను అడగగా.. ఎవరూ స్పందించకపోవడంతో.. ఆపరేషన్ వికటించిందని భావించి..జూలై 23 రాత్రి వరంగల్ మెడికవర్ హాస్పటల్ కి వెళ్లారు. అక్కడ వైద్యులు రోగిని చెక్ చేసి పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో వెంటనే హైదరాబాద్ బేగంపేట మెడికోవర్ హాస్పటల్ కి వెళ్లి అడ్మిట్ అయ్యారు. మెడికవర్ ఆస్పత్రికి చేరుకున్న రోగిని చూసిన వైద్యులు ఇన్ఫెక్షన్ ఎక్కువ స్థాయికి చేరుకుందని అబ్జర్వేషన్ లో ఉంచి మరో ఆపరేషన్ చేశారు. దానికి పూర్తిగా అయిన ఖర్చు రూ.14 లక్షలు.. దానికి తోడు ఆరు నెలల పాటు పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకోవాలని వైద్యులు తెలిపారు. ఐతే అంత పెద్దగా కావడానికి కారణం బంధన్ హాస్పటల్ లో జర్నలిస్టు కృష్ణకు 4 గంటల పాటు చేసిన వైద్యంలో

Hospital

జరిగిన తప్పిదమే కారణం అని బాధితుడు కృష్ణ ఆరోపించారు. అయితే బాధితుడు సర్జరీ చేసే సమయంలో రికార్డు అయిన వీడియో ఇవ్వమని పలుమార్లు అడిగిన కూడా బంధన్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యపు సమాధానం ఇస్తూ దాట వేయడంతో బాధితుడు తనపై చాలా ప్రయోగాలు చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై గతంలో ఉన్నతాధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. సమాజంలో జరిగే మంచి చెడును విశ్లేషించే పాత్రికేయుడి నైన తనకు సదరు ఆసుపత్రిలో అన్యాయం జరగగా.., ఇక సామాన్యుడి సంగతి ఏమిటని జర్నలిస్ట్ కృష్ణ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, బంధన్ ఆసుపత్రి వెనక ఉన్న రాజకీయ అండదండలను చూసి బెదరకుండా ఆసుపత్రిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయండి .

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయండి

మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

నిజాంపేట, నేటి ధాత్రి:

 

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలో ని నస్కల్, నంద గోకుల్, రాంపూర్ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని తెలిపారు లారీలు, హమాలీలు, టార్పినల్ కొరత లేకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి శ్రీలత, వి ఏ లు మంగ, వాణి, రైతులు తదితరులు పాల్గొన్నారు

గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో కౌన్సిలింగ్.!

తెలంగాణా గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు

పత్రికా ప్రకటన

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి) :

 

 

ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇంటర్ లో
2005- 26 . విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణా గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల, ఇందిరమ్మ కాలనీ (గా). పం). సిరిసిల్ల లో ST బాలికల నుండి ధరఖాస్తులు ఇహ్వానిస్తున్నామని ప్రాంతయ సమ్వన్వయ అధికారి D. S. వెంకన్న ఒక ప్రకటనలో
తెలియజేసారు. ఆసక్తి గల అభ్యర్ధులు కళాశాల నందు మే 16న నిర్వహించే కౌన్సిలింగ్ అన్ని ఓరిజినల్ (TC, బోనాఫైడ్, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్, రెసిడెన్సి, డేట్అఫ్ బర్త్, మొదలగునవి మొగునని దృవీకరణ పత్రంలో పాటు, ఒక సెట్ జిరాక్స్ తీసుకొని వచ్చి అడ్మిషన్లు పొందవచ్చని, కళాశాల ప్రిన్సిపల్ తెలియజేశారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ : 9032170654, 8333925362

రజతోత్సవ సభను విజయవంతం చేసిన మాజీ ఎమ్మెల్యే.

రజతోత్సవ సభను విజయవంతం చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్దికి సన్మానం.

ఉద్యమ సారధిని సన్మానించిన మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి.

నల్లబెల్లి  నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషిచేసి రథసారధి కేసీఆర్ అడుగుజాడలో నడుస్తూ వెన్నుదన్నుగా నిలిచి తెలంగాణ ప్రజల గొంతును కేంద్ర ప్రభుత్వాలపై పోరాడిన వ్యక్తి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అని ఆయన అన్నారు. ఉద్యమ పార్టీగా పుట్టి రాజకీయ పార్టీగా అవతరించి దేశ రాజకీయాలను శాసించే శక్తిగా ఎదిగిన భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ వసంతాల రజతోత్సవ సభను తన భుజస్కందాలపై మోస్తూ సభను విజయవంతం చేయడంలో తన మార్కు చూపించిన పెద్దికి మండల పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కర్ల శ్రీనివాస్ గౌడ్, నాయకులు గందే శ్రీనివాసులు గుప్తా, మామిండ్ల మోహన్ రెడ్డి, ఊరటి అమరేందర్ రెడ్డి, భగీరథ, రాజు తదితరులు పాల్గొన్నారు.

నిర్ణీత గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలి.

నిర్ణీత గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలి

ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ):

 

 

ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రతి సోమవారం ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో  కలెక్టర్ నేరుగా మాట్లాడి, వారి సమస్యలను సానుకూలంగా స్పందించారు. ప్రజావాణి ద్వారా వచ్చే అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం లో డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు , మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇప్పపువ్వు లడ్డుతో ఆరోగ్య ప్రయోజనాలు.

ఇప్పపువ్వు లడ్డుతో ఆరోగ్య ప్రయోజనాలు

గంగారం నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ . గంగారం మండలాల్లో సహజ సిద్ధంగా దొరికే ఇప్పపువ్వుతో
కొంతమంది ఆదివాసీ గిరిజనులు సేకరించి అందులో ఇప్పపువ్వు. బెల్లం. నువ్వులు. పల్లీలు. యాలకుల పొడి కలిపి లడ్డులుగా తయారు చేస్తున్నారు గంగారం మండలంలోని మహదేవుని గూడెం గ్రామం లో మద్దెల పద్మ కుటుంబ సభ్యులు ఇప్పపువ్వు లడ్డు తయారు చేసి విక్రయిస్తున్నారు
ఇప్ప పువ్వు లడ్డు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పపువ్వు లడ్డు తినడం వల్ల రక్తహీనత ఉన్న వారికి దాదాపు 45 రోజులలో శరీరంలో రక్తం శాతం పెంచడంతో పాటు రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుందని
ఇది జాయింట్ల నొప్పులు, మోకాలి నొప్పులు, కండరాల నొప్పులను తగ్గిస్తుంది.

Health benefits

అంతేకాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, చర్మ ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తుంది మహిళల్లో రక్తహీనత తగ్గిస్తుంది. కొలెస్ట్రాలను తగ్గించి రోగనిరోధక శక్తినీ పెంచుతుంది
ఇప్పటికీ కొంతమంది గిరిజనులు ఇప్పగింజలు ఏరి తీసుకువచ్చి నూనె తయారు చేసి వంటల్లో వాడుతున్నారు.. ప్రభుత్వం స్పందించి సంబంధిత యంత్రాలు ఇప్పించి ఆదివాసీ గిరిజన ప్రజలకు ఉపాధి కల్పించాలని పలువురు ప్రభుత్వం న్ని వేడుకుంటున్నారు….

సురేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ.!

కుర్మ సురేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కుర్మ సురేందర్, పార్టీ నాయకులు కుర్మ సుగుణాకర్ ల యొక్క నాన్న కుర్మ రామయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను సోమవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని అందించారు.కుటుంబానికి అండగా ఉంటామని,అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు.పరామర్శ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, పల్లె దినేష్, కనకం వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం .

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రామడుగు, నేటిధాత్రి:

 

 

ఇరవై తోమ్మిది సం.ల క్రితం పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఒకే వేదికపై కలిసి చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-96లో ఎస్ఎస్సి చదివిన విద్యార్థులు చదువుకున్న పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈకార్యక్రమానికి అప్పటి ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి, ఒకేషనల్ ఉపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, రాంబ్రహ్మంలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన విద్యార్థులు వారిని ఘనంగా శాలువాతో సన్మానించి వారి నుండి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఈసందర్భంగా పూర్వ విద్యార్థులు తమ జీవనశైలిని, పాఠశాలలో చదువుకున్న జ్ఞాపకాలను, అనుభవాలను ఒక్కొక్కటిగా గురువుల ముందుంచారు. ఈకార్యక్రమంలో బొమ్మరవేణి తిరుపతి, ఆడెపు మనోజ్ కుమార్, శ్రీనివాస్, సంతోష్, మునిందర్, శ్వేతా, సుజాత, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి .

సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకండి

సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

గ్రామాల్లో సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట . గ్రామంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్ అధ్యక్షతన మండల మహాసభ జరిగింది. ఈమండల మహాసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి వెంకటస్వామి హాజరై మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సిపిఐ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, పార్టీ అభ్యర్థులుగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని, అందులో భాగంగానే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కేంద్రంలో, రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న వారిని హామీలను అమలు పరుచాలని సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించాలన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్బవించి వంద సంవత్సరాలు అవుతుందని, మార్కిసిజం, లేనినిజం సిద్ధాంతాలతో సమ సమాజ స్థాపనే లక్ష్యంగా దోపిడీ లేని సమాజం కోసం అంతరాలు లేని వ్యవస్థ కోసం దేశంలోనే మొట్టమొదటి రాజకీయ పార్టీ సిపిఐ పార్టీ అని నాటి నుండి నేటి వరకు కార్మిక, కర్షకుల సమస్యలతో పాటు దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారం పోరాడుతున్న ఏకైక పార్టీ అని అన్నారు. దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి కేవలం కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు సంపన్న వర్గాలకు అనూకూల నిర్ణయాలు చేస్తూ దేశ సంపదను కోళ్లగొడుతూ కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆలస్యం అవుతుందని, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, పెన్షన్స్ పెంపు, రైతుల ఋణమాఫీ తదితర హామీలను వెంటనే నేరవేర్చాలని లేకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవని వెంకటస్వామి హెచ్చరించారు. ఈసమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి గోడిశాల తిరుపతి గౌడ్, ఉమ్మెంతుల రవీందర్ రెడ్డి, మండల నాయకులు ఎగుర్ల మల్లేశం, శంకరయ్య, లక్ష్మి, నర్సయ్య, ఐలయ్య, రాజేష్, అజీమ్, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ సమావేశం.!

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలోని మీనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం రోజున మధ్యాహ్నం రెండున్నర గంటలకు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతింది అని. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మరియు రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి మరియు ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు.అని కావున మండలంలోని మాజీ ప్రజాప్రతినిధులు జడ్పిటిసిలు , ఎంపీపీలు , సర్పంచులు , ఎంపీటీసీలు , వార్డ్ మెంబర్స్ జిల్లాస్థాయి మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీ సెల్ విభాగ నాయకులు కార్యకర్తలు మండలంలోని బూత్ ఎన్రోలర్స్ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి కోరినారు.

గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.

గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.

హైదారాబాద్ నేటిధాత్రి:

రాష్ట్ర గవర్నర్ తో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు.

గంజాయి తాగిన గుట్కాలు అమ్మిన కేసులు.

గంజాయి తాగిన గుట్కాలు అమ్మిన కేసులు

పోలీసుల గట్టి నిఘా

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి జిల్లాను నషాముక్తి జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి నార్కోటిక్, నషాముక్త్ భారత్ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు.
మత్తు పదార్థాల సేవించడం వల్ల జరిగే నష్టం పై యువతకు అవగాహన కల్పించాలని, విద్యా శాఖ అధికారులతో తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు గట్టి నిఘా ఉంచాల ని గంజాయి తాగే వారిని రవాణా, చేసే వారిని అరికట్టాలని సూచించారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య మాట్లాడుతూ తమ పిల్లలు మత్తుపానియాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలపై నిఘావేసి ఉంచాలని కోరారు. విద్యాలయాలు, ఆసుపత్రుల దగ్గర వ్యాపారులు గుట్కాలు , సిగరెట్ వంటి పదార్థాలు అమ్మకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Gutkhas

స్పెషల్ క్యాంపెయిన్ లు నిర్వహించి యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల ఆవరణలో మత్తు పదార్థాలు గంజాయి తాగడం వల్ల జరిగే నష్టలపై ఫ్లెక్సీ లు ఏర్పాట్లు చేసి అవగాహన కల్పించాల్సిందిగా జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు డి.సి.ఆర్.బి. డి.ఎస్పీ ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ జిల్లాలో 2017 నుంచి గంజాయి కేసులు నమోదు అవుతున్నాయని, ఇటీవల వీపనగండ్ల మండలంలో ఒక పశువుల కాపరి గడ్డి వాములో గంజాయి దాపెట్టి ఉంచిన ఉదంతం వచ్చిందని అన్నారు గంజాయి తాగే వారు, రవాణా చేసే వారి పై పోలీస్ శాఖ గట్టి నుఘావేసి ఉంచిందని వారు దొరికిన వెంటనే కేసులు బుక్ చేసి జైలుకు పంపిస్తున్నట్లు తెలిపారు జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, పి.డి. డీఆర్డిఒ ఉమాదేవి, ఆబ్కారీ శాఖ, విద్యా శాఖ అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మత్స్యగిరిస్వామి దేవాల యానికి బహు కరణ .!

మత్స్యగిరిస్వామి దేవాల యానికి జనరేటర్ బహు కరణ

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో ని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయా నికి శాయంపేట గ్రామానికి చెందిన క్రీస్తు శేషులు మామిడి సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుమారులు మామిడి ప్రమోద్ త్రిశూల్ ,సాయి కృష్ణులు కలిసి సుమారు 35 వేల రూపాయల విలువ కలిగిన జనరేటర్ ను . సోమవారం దేవాలయ చైర్మన్ సామల బిక్షపతికి అందజేసి నారు ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్య లు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో దాసరి వేణు, కల్పన పాల్గొన్నారు.

లబ్ధిదారుల ఎంపికలో కమిటీల నిర్ణయం భేష్.

లబ్ధిదారుల ఎంపికలో కమిటీల నిర్ణయం భేష్.

అన్ని పేద అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపు.

కమిటీ ఎంపిక పై కక్షసాధింపు,కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం.

గతంలో డబుల్ బెడ్రమ్ ఇండ్లు కేటాయింపులో 50 వేలు తీసుకున్నారు,

డబల్ బెడ్ రూమ్, కలగా మిగిలిన వారికి ఇందిరమ్మ ఇల్లు అందించి చేయూత.

నెత్తిపై గూడు లేకున్నా గాంధీభవన్ పై కాంగ్రెస్ జెండా ఎగరడమే, లక్ష్యంగా సాగిన కాంగ్రెస్ వాది అర్హుడు కదా.

దుష్ప్రచారాల తో ల్యాండ్ ఆర్డర్ ను విఘాతం కలిగించే ప్రయత్నం.

మహాదేవపూర్ నేటి ధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద బడుగు బలహీన వర్గాల కు సొంతింటి కల నెరవేర్చుటకు శ్రీకారం చుట్టి, స్థానిక వ్యక్తులచే కమిటీలుగా ఏర్పాటుచేసి వారి పర్యవేక్షణ తో, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నేడు కమిటీలు అందించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలు వారి నిర్ణయం శభాష్ అనిపించేలా అందించడం జరిగింది అని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 24 గ్రామాల్లో ఇంద్రమ్మ ఇల్లు మంజూరు కావడం, ప్రభుత్వ అధికారులు ఇండ్ల మంజూరి కై నిష్పక్షంగా సర్వే నిర్వహించడం, అధికారులు సర్వే నిర్వహించిన అనంతరం వంద శాతం అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నియామక కమిటీ, అధికారుల జాబితా నుండి అర్హులకు ఎంపిక చేయడం తో లబ్ధిదారుల, ఆనందానికి అంతులేకుండా పోయింది. మండలంలో 321 ఇండ్లను మంజూరు చేయగా, ప్రభుత్వ ఆదేశాల అనుసారం గూడు లేని నిరుపేద కుటుంబానికి ఇంద్రమ్మ ఇల్లు అందించడమే లక్ష్యంగా ఇంటింటికి అధికారుల సర్వే, కుటుంబాల వివరాలు నేరుగా అధికారులు పరిశీలించి నమోదు చేయడం జరిగింది.తిరిగి ఇందిరమ్మ గృహాల మంజూరు కమిటీలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ నిర్ణయం మండలంలోని అన్ని వర్గాలకు చెందిన అర్హులైన నిరుపేద కుటుంబానికి ఇంద్రమ్మ ఇల్లు అనర్హులకు చెందకుండా పటిష్టమైన విచారణ,విధి విధానాలతో, ముందుకు సాగడమే కమిటీ లక్ష్యంగా, అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటి కల త్వరలో ఆ పేద కుటుంబాలకు తీరనుంది.

కమిటీ ఎంపిక పై కక్షసాధింపు,కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం.

ఇందిరమ్మ సొంతింటి కల నిర్మాణంపై స్థానిక కమిటీల ఎంపిక 100% నిరుపేద గూడు లేని అర్హులకు కేటాయించడం జరిగిందని లబ్ధిదారులు చెప్తున్నప్పటికీ, నిరుపేద కుటుంబాల గూడును కొల్లగొట్టే ప్రయత్నంలో, కమిటీల పై కక్ష సాధింపు చర్యగా, దుష్ప్రచారాలు చేయడానికి లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో కమిటీల ఎంపిక అధికారుల జాబితాలోని అర్హులకు ఎంపిక చేయడం జరిగిందని, లబ్ధిదారులు చెప్తున్న క్రమంలో, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై, బురద జల్లి పబ్బం గడుపుకోవాలని కొందరు, లబ్ధిదారుల ఎంపికను తప్పుడు ప్రచారం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మండలంలో 321 ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు లబ్ధిదారుల ఎంపికై అధికారుల సర్వే ఆధారంగా,,ఇంద్రమ్మ ఇండ్ల కమేటి, నిష్పక్ష పర్యవేక్షణతో లబ్ధిదారుల పేర్లను అందించడం జరిగింది, గతంలో డబుల్ బెడ్ రూమ్ కేటాయింపులో పేరుతో 50వేల రూపాయలు తీసుకొని, అర్హులకు కాకుండా ధనవంతులకు కేటాయించడం జరిగిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల పర్యవేక్షణ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికకు స్థానికుల కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన పేద కుటుంబాలకు ఇండ్ల మంజూరుకు ప్రతిపాదించడం జరిగిందని,కానీ స్వలాభాల కోసం నిరుపేద గూడు లేని కుటుంబాలకు ఇల్లు లేకుండా చేసే ప్రయత్నం జరగడంతో, లబ్ధిదారులు తమ ఇండ్లు ఏక్కడ కోలిపోతామని ఆవేదనతో, ప్రభుత్వం మరియు రాష్ట్ర మంత్రివర్యులు మేము పేద అర్హులము మాపై కరుణించాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు.

డబల్ బెడ్ రూమ్, కలగా మిగిలిన వారికి ఇందిరమ్మ ఇల్లు అందించి చేయూత.

పది సంవత్సరాలపాటు డబుల్ బెడ్ రూమ్ కొరకు తమ కండ్లు కాయలు కాసి వేల దరఖాస్తులను ఇవ్వడం జరిగింది కానీ, అర్హులుగా ఉన్న పేదలకు గూడు లేకుండా డబుల్ బెడ్ రూమ్ పేరుతో వేల రూపాయలు వసూలు చేసి ధనవంతులకు కేటాయించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో స్థానికుల పర్యవేక్షణలో అధికారులు అందించిన జాబితాల ఆధారంగా 100% అర్హులుగా ఉన్న లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్ రూమ్ కలగాలనే మిగిలిన, ఆ గూడు లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటి భరోసా కలిగించడం, సంవత్సరాల తరబడి జెండా వాననక పెంకుటిల్లు గుడిసెల్లో తమ పిల్లలతో జీవితాన్ని కొనసాగిస్తున్న మాకు, ఇందిరమ్మ ఇల్లు కేటాయించి ప్రభుత్వం ఆదుకోవడం, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని లబ్ధిదారులు చెప్తున్నారు.

తన నెత్తిపై గూడు లేకున్నా గాంధీభవన్ పై కాంగ్రెస్ జెండా లక్ష్యంగా సాగిన కాంగ్రెస్ వాది అర్హుడు కదా.

ఆ అర్హులు గూడు లేని నిరుపేదవారు, కూలి నాలి చేసుకోవడంతో పాటు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు కూడా, మండలంలో లబ్ధిదారుల జాబితాలో నిరుపేద లబ్ధిదారులు అయినప్పటికీ, సుమారు 50 సంవత్సరాలుగా వ్యవసాయ కూలీతోపాటు కాంగ్రెస్ జెండా నెత్తిన మోయడం, తమకు ప్రభుత్వ పథకం అనర్హుడుగా చేస్తుందా, తమ ఇంటిపై పెంకలు లేకున్నా పరవాలేదు, వర్షాకాలం ప్లాస్టిక్ కవర్ లేకున్నా పరవాలేదు, కానీ తమ లక్ష్యం గాంధీభవన్ పై జెండా ఎగరడంతోపాటు తమ ఇంటి పైన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు జెండా సంవత్సరాల కాలం పాటు తగిలి ఉండాల్సిందే, అనే ఏకైక లక్ష్యంతో ఉన్న ఆ నిరుపేద కాంగ్రెస్ కార్యకర్త వంద శాతం అర్హుడే కదా, పేద వ్యవసాయ కూలీ మా కుటుంబాన్ని పోషిస్తుంది, కాంగ్రెస్ పార్టీ జెండా నా హృదయంలో ప్రాణం పోస్తుంది, అని పేద లబ్ధిదారులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడం, తో వారి పేర్లు తలుచుకుంటూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరి విషయంలో, విషపచారాలు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. ప్రజలు ఎవరైనా, ఏ పార్టీ అభిమాని అయిన ప్రభుత్వ పథకాలకు, పార్టీలను ప్రేమించే కార్యకర్తలకు పథకం వర్తించదని, రాజ్యాంగం లో ఏమైనా రాసి ఉందా, కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా, వ్యవహారించడం జరుగుతుందని, లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్లు కేటాయిస్తే, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనే ఒక ఉద్దేశంతోనే, లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని పొంతన లేని మాటలతో దుష్ప్రచారాలు చేయడాన్ని లబ్ధిదారులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

దుష్ప్రచారాల తో ల్యాండ్ ఆర్డర్ ను విఘాతం కలిగించే ప్రయత్నం.

మండలంలో ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు కమిటీల పర్యవేక్షణ అనంతరం లబ్ధిదారుల పేర్లు ఎంపిక చేసి లిస్టును అందించడం జరిగింది. లబ్ధిదారుల ఎంపిక విషయంపై, ప్రభుత్వ ఆదేశాల అనుసారం అర్హులుగా అధికారులు గుర్తించి తిరిగి ఇందిరమ్మ ఇండ్ల కమిటీల పర్యవేక్షణలో నిష్పక్షంగా ఎంపిక ప్రక్రియ జరిగినప్పటికీ, అమాయకులను రెచ్చగొట్టి, వారి పేర్లు నమోదు చేయలేదని, కమిటీలపై బురద జల్లుతూ, అమాయక ప్రజలను రెచ్చగొట్టి, మండలంలోని కమిటీ సభ్యులపై అసభ్యకర పదజాలాలతో, అవమానించేలా ప్రయత్నించడం, సమాచార సాంకేతిక మాధ్యమాల్లో మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, స్వలాభం కోసం అమాయకులను ప్రభుత్వ పథకం నుండి మిక్ కావాలని దూరం చేశారని రెచ్చగొడుతూ, దౌర్జన్యానికి దిగేలా ప్రోత్సహించడం, ల్యాండ్ అడర్ ను విఘాతం కలిగించే, విధంగా ప్రవర్తించడం జరుగుతుందని, లబ్ధిదారులు చెప్పుకొస్తున్నారు, జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ ఉన్నత అధికారులు, ఇలాంటి వారిపై దృష్టి సాధించి, శాంతి భద్రతకు భంగం కలగకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మండల ప్రజలు అలాగే లబ్ధిదారులు కోరుతున్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత .

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

కొత్తగూడ,నేటిధాత్రి:

 

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి
చంద్రు తండా గ్రామానికి చెందిన బోడరాజు కుమారుడు శివగణేష్ ఇటీవల అనారోగ్యం తో ఆసుపత్రి పాలైనాడు. బోడ రాజు కుటుంబ పరిస్థితిని చూసిన ఓటాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు
ధనసరి అనసూయ సీతక్క తెలియజేయడం జరిగినది వెంటనే స్పందించిన మంత్రి సీతక్క గారు బోడరాజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంజూరు చేపించారు అట్టి చెక్కును సోమవారం రోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య గారి ఆధ్వర్యంలో బోడరాజుకు అందివ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు చల్ల నారాయణరెడ్డి డిసిసి జనరల్ సెక్రెటరీ బానోత్ రూప్ సింగ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులుబీట్ల శ్రీను, ముస్కు వెంకన్న, వల్లెపు రంజిత్, ఇరుప కొమ్మయ్య. ఉపేంద్ర చారి. యాదగిరి కిరణ్. మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జెడ్పిహెచ్ఎస్ లో విద్యార్థుల కోసం వేసవి శిక్షణా .!

జెడ్పిహెచ్ఎస్ లో విద్యార్థుల కోసం వేసవి శిక్షణా శిబిరం ప్రారంభం.

మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

జడ్.పి.హెచ్.ఎస్ చిట్యాల పాఠశాల ఆవరణలో 6-9 తరగతుల విద్యార్థులను ఉద్దేశించి వేసవి శిక్షణా శిబిరాన్ని ఎంఈఓ కొడపాక రఘుపతి , సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ఇందులో గ్రామంలో గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాల పిల్లలు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో విద్యార్థుల శారీరక, మానసిక,వికాసం కొరకు ఆటలు, పాటలు, బొమ్మలు గీయడం, యోగ, కథల పుస్తకాలు చదవడం మొదలగు వినోద కార్యక్రమాలు నేర్చుకోవడానికి ఈ శిక్షణా శిబిరం ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు,పోషక విలువలు కలిగిన స్నాక్స్ మరియు మంచినీటి సదుపాయం అందుబాటులో ఉంచామని వీటిని విద్యార్థిని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతిరోజు విద్యార్థులందరూ ఉదయం8గం నుండి 11వరకు హాజరయ్యేలా చూడాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి, బొమ్మ రాజమౌళి , బుర్రసదయ్య గోపగాని భాస్కర్,సిఆర్పి రాజు, కనకం భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ కూలి మృతి.

ఉపాధి హామీ కూలి మృతి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రాయిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలి మహిళ గుండెపోటుతో మృతి చెందిందని తోటి ఉపాధి కూలీలు తెలిపారు. సోమవారం ఉదయం ఆమె ఉపాధి హామీ కూలి వెళ్లడంతో పని స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!
Exit mobile version