మాజీ కౌన్సిలర్ పరిష్కరించిన రహదారి సమస్య…

స్వoత ఖర్చుతో మట్టి వేయిoచిన మాజీ కౌన్సిలర్
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణంలోని 15 వ వార్డులో మారెమ్మ కుంట దగ్గర రోడ్డు పై ప్రజలు వాహనాలు వెళ్ల డానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంగా స్వo త ఖర్చుతో 15 వ వార్డ్ మాజీకౌన్సిలర్ మట్టి వేయి oచారు ఈ సమస్య పై వార్డు ప్రజలు బండారు కృష్ణ దృష్టి కి తీసుకువెళ్లారు . 15 వ వార్డు ప్రజలు పి శ్రీనివాసులు ముంత మన్యం మున్నూర్ సురేందర్ బండారు భరత్ కుమార్ సంతోష్ తదితరులు రోడ్డు పై మట్టి వేయి oచి నందుకు బండారు కృష్ణ నకు మున్సిపల్ కమిషనర్ కు ఒక ప్రకటన లో కృతజ్ఞతలు తెలిపారు

అప్పులున్నా హామీలు నెర‌వేరుస్తున్నాం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు.

అప్పులున్నా హామీలు నెర‌వేరుస్తున్నాంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

తిరుప‌తి(నేటి ధాత్రి) జూలై 01:

ఎన్నిక‌ల హామీలను ఏడాదిలోనే 85శాతం నెర‌వేర్చిన ఘ‌నత ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వానికే ద‌క్కింద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. ఎన్టీఆర్ భ‌రోషా పెన్ష‌న్ల‌ను మూడువ డిజ‌వ‌న్ లోని ప్ర‌గ‌తీన‌గ‌ర్ లో ఎమ్మెల్యే ల‌బ్దిదారుల ఇళ్ళ‌కు వెళ్ళి పంపిణీ చేశారు. ఎన్డీఏ కూట‌మి నాయ‌కుల‌తోపాటు సిపిఐ నాయ‌కులు పెంచ‌ల‌య్య పెన్ష‌న్ల పంపిణీలో పాల్గొన్నారు. ప్ర‌ధాన డ్రైనేజీ కాలువ ఎత్తు త‌క్కువుగా ఉండ‌టంతో మురుగు నీరు పొర్లి ఇళ్ళ‌లోకి వ‌స్తున్న‌ట్లు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువ‌చ్చారు. కాల‌నీ విస్తరిస్తున్నా విద్యుత్ అధికారులు పోల్స్ ఏర్పాటు చేయ‌క‌పోతుండ‌టంతో త‌మ‌కు వీధి లైట్లు లేక ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు వారు ఎమ్మెల్యేకి తెలిపారు. కాగా సిపిఐ నాయ‌కులు పెంచ‌ల‌య్య ప్ర‌గ‌తీన‌గ‌ర్ లోని స‌మ‌స్య‌ల‌ను ఎమ్మెల్యేకి వివ‌రించారు. స్థానికులు త‌న దృష్టికి తీసుకువ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రిస్తామ‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. కాగా ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ఇచ్చిన మాట ప్ర‌కారం మూడు వేల రూపాయ‌ల పెన్ష‌న్ ను నాలుగు వేలు చేసి ఏడాది నిండింద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు. తిరుప‌తిలో 18వేల 664 మంది పెన్ష‌న‌ర్లు ఉండ‌గా వారికి 8 కోట్ల 23 ల‌క్ష‌ల రూపాయ‌లు అందిస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. సూప‌ర్ సిక్స్ హామీల్లో కీల‌క‌మైన పిఎం కిసాన్ – అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కం త్వ‌ర‌లో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. అలాగే ఆగ‌స్టు 15వ తేదీ మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం ప్ర‌భుత్వం క‌ల్పించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాల‌న‌లో పెన్ష‌న్ రెండు వేల నుంచి మూడు వేల‌కు పెంచేందుకు ఐదేళ్ళు ప‌ట్టింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. బ‌ట‌న్ నొక్కి సొంత ప్ర‌చారం మాజీ సిఎం జ‌గ‌న్ చేసుకున్నారే త‌ప్ప ల‌బ్దిదారుల‌కు డ‌బ్బులు మాత్రం ప‌డ‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు. 10ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని వైసిపి ప్ర‌భుత్వం దివాళా తీయించినా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోది స‌హ‌కారంతో సంక్షేమం, అభివృద్ధి స‌మ‌పాళ్ళ‌లో ముందుకు తీసుకువెళ్ళుతున్న ఘ‌న‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్, యువ‌నాయుకుళు లోకేష్ ల‌దేన‌ని ఆయ‌న కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నాయ‌కులు కోడూరు బాల‌సుబ్ర‌మ‌ణ్యం, సిపిఐ నాయ‌కులు పెంచ‌ల‌య్య‌, జ‌న‌సేన నాయ‌కులు రాజా రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

రోడ్లు విస్త‌రించి ఇబ్బందులు లేకుండా చూస్తా ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు.

రోడ్లు విస్త‌రించి ఇబ్బందులు లేకుండా చూస్తా ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

తిరుప‌తి(నేటి ధాత్రి) జూన్ 27:

న‌గ‌రంలోని 44, 43 డివిజ‌న్ ప‌రిధిలోని రోడ్ల‌ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు శుక్ర‌వారం ఉద‌యం ప‌రిశీలించారు. ముఖ్యంగా 44వ డివిజ‌న్ ప‌రిధిలోని న‌ర్శ‌రీ వీధిని ఇంజినీరింగ్ అధికారులు, టౌన్ ఫ్లానింగ్ అధికారుల‌తో క‌లిసి వీధి మొత్తం ప‌రిశీలించారు. రోడ్డు ఆక్ర‌మ‌ణ‌ల‌తో అంబులెన్స్ వ‌చ్చే ప‌రిస్థితి వీధిలో లేక‌పోవ‌డంతో ఇటీవ‌ల ఇద్ద‌రు చ‌నిపోయిన‌ట్లు స్థానిక మ‌హిళ‌లు ఎమ్మెల్యే దృష్టి తీసుకు వ‌చ్చారు. అలాగే డ్రైనీజీ స‌మ‌స్య‌తో దుర్వాశ‌న‌కు తోడు దోమ‌ల బెడ‌ద ఎక్కువుగా ఉన్న‌ట్లు వారు ఎమ్మెల్యేకి చెప్పారు. వ‌ర్షం ప‌డితే డ్రైనేజీ నీరు నిల్వ ఉండిపోతుండ‌టంతో ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు ఆ ప్రాంతవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువ‌చ్చారు.మ‌రోవైపు రోడ్డును పూర్తిస్థాయిలో విస్త‌రిస్తే త‌మ ఇళ్ళు దెబ్బ‌తింటాయ‌ని న‌ర్శ‌రీ వీధి వాసులు ఎమ్మెల్యే కి తెలిపారు. న‌ర్శ‌రీ వీధిలో రోడ్డు,డ్రైనేజీ నిర్మాణం కోసం 76 ల‌క్ష‌లు మంజూరు చేసిన‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. రోడ్డు విస్త‌ర‌ణ ఎలా చేయాలి అనేది ఇంజినీరింగ్, టౌన్ ఫ్లానింగ్ అధికారుల‌తో చ‌ర్చిం నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌జ‌ల‌కు అసౌక‌ర్యం క‌ల‌గుండా రోడ్డు, డ్రైనేజి స‌మ‌స్యను ప‌రిష్క‌రిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. 43వ డివిజ‌న్ లో డ్రైనీజి స‌మ‌స్య‌ను త్వ‌ర‌లో ప‌రిష్క‌రిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ మేయ‌ర్ ఆర్సీ మునికృష్ణ‌, కార్పోరేట‌ర్లు వ‌రికుంట్ల నారాయ‌ణ‌, న‌ర‌సింహాచ్చారి, న‌రేంద్ర‌, సికే రేవ‌తి, శైల‌జ‌, దూది కుమారి, రాధ‌,రాజా రెడ్డి,మహేష్ యాదవ్, దూది శివ, కార్పొరేషన్ ఎస్ ఈ శ్యామ్ సుందర్, డీసీపీ మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

నిజాంపేట నూతన ఎమ్మార్వో గా శ్రీనివాసులు.

నిజాంపేట నూతన ఎమ్మార్వో గా శ్రీనివాసులు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

నిజాంపేట మండల కేంద్రానికి నూతన ఎమ్మార్వోగా శ్రీనివాసులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సిసిఎల్ కమిషనర్ ఆఫీసులో పనిచేసిన ఆయన బదిలీపై నిజాంపేట మండలనీకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version