రాష్ట్ర బి సి పొలిటికకల్ జె ఏ సి చైర్మన్ రాచాల కా రుపై రాళ్లతో దాడి
జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన రాచాల
వనపర్తి నెటిదాత్రి :
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని. అది నచ్చని వారు ఇలాంటి దాడులకు దిగుతున్నారని వారికి భయపడబోనని.ప్రజల సమస్యలపై పోరాటాన్ని ఆపేది లేదని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ స్పష్టం చేశారు
గురువారం రాత్రి 12 గంటల సమయంలో తన స్వగ్రామమైన వడ్డెవాటకు వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన కారుపై రాళ్లతో దాడి చేశారని, కారు డ్రైవర్ చాకచక్యంతో కారు ముందుకు వేగంగా పోనివ్వడంతో తృటిలో తనకు ప్రాణాపాయం తప్పిందన్నారు డాడీ సంఘటన పై శుక్రవారం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ను కలిసి ఫిర్యాదు చేశామని రాచాల యూగంద ర్ గౌడ్ తెలిపారు
దాడి చేసిన వారు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టొద్దని చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ ని కోరారు.
ఎన్ని దాడులు చేసినా అదిరేది లేదు, బెదిరేది లేద.నిప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా తాను సిద్ధమని రాచాల స్పష్టం చేశారు.
రాచాల వెంట బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు పాండురంగ యాదవ్, వివి గౌడ్, నరసింహ యాదవ్, స్వప్న, దేవర శివ, అంజన్న యాదవ్, మహేందర్ నాయుడు, అరవింద చారి, బత్తుల జితేందర్, ధర్మేంద్ర సాగర్, అస్కని రమేష్, నాగరాజు, చెలిమిల్ల రామన్ గౌడ్, బీసీ కుల సంఘాల జెఎసి నాయకులు రాములు యాదవ్, సత్యం యాదవ్, వెంకటన్న గౌడ్, నజీర్, తిరుపతన్న గౌడ్, కొత్త గంగాధర్ తదితరులు ఉన్నారు