అంగన్వాడిలో 3సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలను నమోదు చేయించాలి.

అంగన్వాడిలో 3సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలను నమోదు చేయించాలి.

ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద.

చిట్యాల నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక అంగన్వాడీ కేంద్రంలో జీ జయప్రద సూపర్వైజర్ నిర్వహించిన సెక్టార్ సమావేశమునకు 28 మంది అంగన్వాడీ టీచర్స్ హాజరైనారు మీటింగ్ యొక్క ఉద్దేశం ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు టీచరు ఆయాసమయ పాలన పాటించాలని మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల నమోదు హాజరు శాతం పెంచుకోవాలని ప్రతి నెల పిల్లల బరువులు ఎత్తులు తీసి శామ్ మామ్ పిల్లల్ని గుర్తించి ఆరోగ్య పరీక్షలు చేయించాలని 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు కిషోరా బాలికల బరువు ఎత్తు చూసి పల్లి పట్టీలు ఇవ్వాలని వివరించి ఆషాడ మాసము అయినందున టీచర్లతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించి టీచర్స్ అందరూ కలిసి భోజనము చేసి సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా అంగన్వాడి కేంద్రాలన్నీ పిల్లలతో కలకలలాడాలని అన్ని గ్రామాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది 28మంది టీచర్స్ హాజరైనారు

 ఇలా ముగించారేంటి స్క్విడ్ గేమ్ 3 ఫైన‌ల్ సీజ‌న్‌ రివ్యూ.

 ఇలా ముగించారేంటి స్క్విడ్ గేమ్ 3 ఫైన‌ల్ సీజ‌న్‌ రివ్యూ

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురు చూసిన‌ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ డిజిట‌ల్‌ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి హాడావుడి చేస్తోంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూసిన‌ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ (Squid Game Season 3) జూన్ 27 నుంచి డిజిట‌ల్‌ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి హాడావుడి చేస్తోంది. ఇప్ప‌టికే రెండు భాగాలుగా వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ సీరిస్ ప్ర‌తీ సారి ప్రేక్ష‌కుల‌కు అదిరిపోయే థ్రిల్‌ అందించింది లీ జంగ్ జే (Lee Jung-jae), పార్క్ హే సూ, హోయాన్ జంగ్‌ల‌తో పాటు యిమ్ సి-వాన్ (Im Si-wan), కాంగ్ హా-న్యూల్, పార్క్ గ్యు-యంగ్, లీ జిన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హ్వాంగ్ డాంగ్-హ్యూక్ (Hwang Dong-hyuk) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.. మ‌రి కొత్త‌గా వ‌చ్చిన ఫైన‌ల్‌ సీజ‌న్ ఎలా ఉందో చూద్దాం.
మొద‌టి సీజ‌న్‌లో.. స్క్విడ్ గేమ్ (Squid Game) గెలిచిన 456 నంబ‌ర్ ప్లేయ‌ర్ తిరిగి ఆ గేమ్‌ను ఎలాగైనా అడ్డుకోవాల‌ని, అందులోని ప్లేయ‌ర్స్ ను ర‌క్షించాల‌ని , అక్క‌డ జ‌రుగుతున్న దుర్మార్గాన్ని ప్ర‌పంచానికి తెలియజేయాల‌ని ముంద‌స్తుగా పోలీసుల‌కు ఇన్ఫ‌ర్మేష‌న్ ఇచ్చి గేమ్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. అక్క‌డ కొంత‌మందితో టీమ్‌గా ఏర్ప‌డి గేమ్ నిర్వాహ‌కుల‌పై ఎదురు దాడికి దిగుతాడు. కానీ వాళ్ల‌లో చాలామంది చ‌నిపోగా 456 నంబ‌ర్ ప్లేయ‌ర్ ప‌ట్టుబ‌డి మ‌ళ్లీ గేమ్ ఆడాల్సిన ప‌రిస్థితితో రెండో సీజ‌న్‌ ముగించారు. ఇప్పుడీ ఈ మూడో సీజ‌న్ మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో ఒక్కొక్క‌టి గంట నిడివితో స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

 

అయితే.. తిరిగి గేమ్‌లోకి వ‌చ్చిన హీరో నా పొర‌పాటు వ‌ళ్లే అంత‌మంది చ‌నిపోయార‌నే బాధ‌లో ఉంటూ అక్క‌డున్న‌ వాళ్ల‌కు దూరంగా ఉంటుంటాడు. మ‌రోవైపు అక్క‌డి గార్డ్స్ లో ఒక‌రు గాయ‌ప‌డిన ఓ ప్లేయ‌ర్‌ను చ‌నిపోకుండా ర‌క్షించి అక్క‌డి లీడ‌ర్‌పై దాడికి సిద్ధ‌మౌతుంది. మ‌రోవైపు మేనేజ్‌మెంట్ చివ‌ర‌గా మూడు గేమ్స్ స్టార్ట్ చేస్తుంది. కాగా అప్ప‌టికే గ‌ర్బ‌వ‌తిగా ఉన్న నం 222 బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తుంది. అదేవిధంగా అప్ప‌టివ‌ర‌కు క‌లిసి ఉన్న త‌ల్లీ కొడుకుల జంట విడిపోయి ఆడాల్సి రావ‌డం, కొడుకు చ‌నిపోవ‌డం జ‌రుగుతాయి. అంత‌కుముందు జ‌రిగిన ఘ‌ట‌న‌లో నీ త‌ప్పేం లేద‌ని ఇక‌పై నం 222, త‌న బిడ్డ‌ను రక్షించే బాధ్య‌త తీసుకోవాల‌ని వృద్ద త‌ల్లి నిరుత్సాహంగా ఉన్న‌ హీరోకు చెప్పి సూసైడ్ చేసుకుంటుంది.

ఇదిలాఉంటే బ‌య‌టి నుంచి ఈ గేమ్‌ను కండ‌క్ట్ చేసేందుకు డ‌బ్బులు చెల్లించే ప‌లువురు వీఐపీలు అక్క‌డ‌కు స్వ‌యంగా వ‌చ్చి అక్క‌డి గేమ్‌లో ప్ర‌త్య‌క్షంగా పాల్గొంటు, ఆపై ఆట‌ను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్ర‌మంలో అప్పుడే పుట్టిన బిడ్డ బాధ్య‌త‌ను హీరోకు ఇచ్చి త‌ల్లి సైతం ఆట‌లో చ‌నిపోతుంది. దీంతో త‌ల్లి స్థానంలో ఆ పాప‌ను నం222గా ప‌రిగ‌ణిస్తూ ఆ ఆట‌లో ప్లేయ‌ర్‌గా లెక్కేస్తారు. దీంతో అక్క‌డి ప్టేయ‌ర్స్ ఎలాగైనా ఆ పాప‌ను చంపితే ఆ భాగం మాకే వ‌స్తుంద‌నే ఆశ‌లో ఆ పాప‌ను టార్గెట్ చేయ‌డం హీరో ఒంట‌రిగా ఆ బేబీని ర‌క్షిస్తూ ఉంటాడు. రెండో గేమ్‌కు వ‌చ్చేస‌రికి బేబీతో క‌లిపి కేవ‌లం 9 మంది మాత్ర‌మే మిగులుతారు. అందులో సెల్పీష్ అయిన పాప తండ్రి కూడా ఉంటాడు. ఇక చివ‌రి ఫైన‌ల్ గేమ్‌కు వ‌చ్చేస‌రికి హీరో, పాప‌, ఆ పాప తండ్రి ముగ్గురు మాత్ర‌మే బ‌రిలో ఉంటారు.

 

ఈ నేప‌థ్యంలో ఆ ముగ్గురిలో ఎవ‌రు బ‌తికారు, ఫ్రైజ్‌మ‌నీ ఎవ‌రికీ వ‌చ్చింది, పోలీసులు ఆ గేమ్ జ‌రిగే ప్రాంతాన్ని క‌నుగొనగ‌లిగారా లేదా తిర‌గ‌బ‌డ్డ ఆ గార్డ్ ఏం చేసింది అనే ఆస‌క్తిక‌ర క‌థ‌క‌థ‌నాల‌తో ఈ సిరీస్ సాగుతుంది. అయితే మ‌ద‌టి రెండు సీజ‌న‌ల క‌న్నా ఈ ఫైన‌ల్ సీజ‌న్‌లో ఎమోష‌న్ స‌న్నివేశాల‌కు పెద్ద‌పీట వేశారు. క్లైమాక్స్ ఎపిసోడ్ చాలామందికి అనేక ర‌కాల జ‌వాబులు ఇస్తుంది. మ‌న‌షులు సొంత వారైనా ఏ క్ష‌ణానికి ఎలా ఉంటారనే పాయింట్‌ను మ‌రోసారి బ‌లంగా చూయించారు. అక్క‌డ‌క్క‌డ లాగ్ అనిపించినా ఇప్పుడీ ఫైన‌ల్‌ సీజ‌న్ శుక్ర‌వారం (జూన్ 27) నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో కొరియ‌న్ భాష‌తో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లో అంద‌దుబాటులో ఉంది. ఎక్క‌డా ఎలాంటి అశ్లీల స‌న్నివేశాలు లేవు, ఎక్క‌డో ఓ చోట రెండు మూడు భూతులు వ‌స్తాయి త‌ప్పితే ఫ్యామిలీతో క‌లిసి ఎంచ‌క్కా చూసేయ‌వ‌చ్చు. ముగింపులో ఇచ్చిన హింట్స్‌తో ఈ సిరీస్‌కు ముగింపు లేతు కంటిన్యూ అవుంద‌నేలా ఉండ‌డం గ‌మ‌నార్హం.

టి యు డబ్ల్యూ జే (ఐ జేయు) 3 మడలాల కన్వీనర్ గా పుల్లరవితేజ.

టి యు డబ్ల్యూ జే (ఐ జేయు) 3 మడలాల కన్వీనర్ గా పుల్లరవితేజ.

చిట్యాల నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టి యు డబ్ల్యూ జె ఐ జెయు చిట్యాల టేకుమట్ల మొగుళ్ళపల్లి మూడు మండలాల కన్వీనర్గా పుల్ల రవితేజను (ఆర్ బి న్యూస్ )నియమించినట్లు జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి సామంతల శ్యామ్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధి కోసం గత కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న రవితేజను నియమించమని జర్నలిస్టుల సమస్యల కోసం కృషి చేయాలని అన్నారు అనంతరం ఎన్నికైన రవితేజ ను అభినందించారు, ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు ఐజేయు జిల్లా నాయకులు కాట్రేవుల ఐలన్న ప్రెస్ క్లబ్ నాయకులు కట్కూరి శ్రీనివాస్ బుర్ర రమేష్ గుర్రపు రాజమౌళి సరిగోమ్ముల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ షాక్ తో 3 ఆవుల మృతి.

విద్యుత్ షాక్ తో 3 ఆవుల మృతి

భూపాలపల్లి నేటిధాత్రి:

 

భూపాలపల్లి రూరల్ మండలం శ్యాంనగర్ గ్రామం లో ఇంచర్ల. కోటయ్య చెందిన 2 ఎడ్లు, 1ఆవు కౌటం.కమలాకర్ చెందిన 1 ఆవు కరెంట్ షాక్ కు గురిఐ మృతి చెందినవి. వీటి విలువ మూడు లక్షల వరకు ఉందని వీరి కుటుంబాలను ఆదుకోవాలని గ్రామమాజీ సర్పంచ్ తిరుపతిరావు, గ్రామకాంగ్రెస్ నాయకులు ఓరుగంటి బాబురావు కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version