వసతి గృహాన్ని ఆశ్రమ పాఠశాలగా అప్ గ్రేడ్ చేయాలని వినతి.

వసతి గృహాన్ని ఆశ్రమ పాఠశాలగా అప్ గ్రేడ్ చేయాలని వినతి.

నర్సంపేట నేటిధాత్రి:

గిరిజన వసతి గృహాన్ని ఆశ్రమ పాఠశాలగా అప్ గ్రేడ్ చేయాలని ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ అధికారి సౌజన్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణం వడ్డెర కాలనీలో ఉన్న గిరిజన సంక్షేమ బారుల వసతి గృహంలో చదువుతున్న గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొన్నది పేర్కొన్నారు.గిరిజన విద్యార్థులకు అనుగుణంగా అధికారులు స్పందించి గిరిజన వసతి గృహాన్ని ఆశ్రమం పాఠశాలగా అప్ గ్రేడ్ చేసి మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాములు,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version