ఎన్నికలు ఏవైనా ముదిరాజ్ లే పైచేయి సాధించాలి.
స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే పోరాటం ఆగదు.
ముదిరాజులను బీసీ.డి నుండి ఏ మార్పించడమే లక్ష్యం
శాసన మండలి డిప్యూటీ స్పీకర్,ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్
దుగ్గొండి మండలంలో ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం
నర్సంపేట నేటిధాత్రి:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలైనా ముదిరాజ్ కులస్తులు ప్రజా ప్రతినిధులుగా పై చేయి సాధించాలని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ స్పీకర్,ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ రాష్ట్ర ముదిరాజ్ కులస్తులు పిలుపునిచ్చారు.తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామాల్లో గల వందన గార్డెన్ లో ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు,నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథులుగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు,శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లేబోయిన అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన మండలి డిప్యూటీ స్పీకర్ బండా ప్రకాష్ మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా ముదిరాజ్ కులస్తులను బీసీ.డీ నుండి బీసీ.ఏ లోకి మార్చడం కోసం అనేక ప్రయత్నాలు జరిగాయని ఆనాటి దిగంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రత్యేక జీవో ద్వారా అమల్లోకి తీసుకచ్చామని ఐనప్పటికీ హైకోర్టులో వేసిన పిటిషన్ ద్వారా సాధించుకోలేకపోయామని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే ముదిరాజ్ కులస్తుల రిజర్వేషన్ కోసం పోరాటం మరోసారి కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
గతంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సకల జనుల సర్వేతో పాటు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి కులగణన సర్వేలో కూడా
ముదిరాజ్ జాతి అత్యున్నత స్థాయిలో ఉన్నదని సర్వేలు చెప్పుతున్నాయని
బండ ప్రకాష్ వివరించారు.రాష్ట్రంలో ముదిరాజ్ కులస్తులు పటిష్టంగా ఉన్న ప్రజా ప్రతినిధులుగా ప్రాతినిధ్యం లేని పరిస్థితి నెలకొన్నదని రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఉన్న ముదిరాజ్ బిడ్డలు ఏకమైతే అన్ని పంచాయితీలు మనవే అని స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ ల సంఖ్యను పెంచుకోవడానికి ఏపార్టీ ఐనా ఐక్యతతో సీట్లు సాధించుకోవాలని తెలిపారు.రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వకున్న ముదిరాజ్ జెండాతో ప్రజా ప్రతినిధులుగా గెలువాలే అని శాసన మండలి డిప్యూటీ స్పీకర్ బండా ప్రకాష్ పిలుపునిచ్చారు.
సర్పంచులు,జెడ్పీటీసీలు,ఎంపీటీసీ కోసం గెలిపించుకోవడం కోసం ప్రధాన బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలతో పాటు అన్ని రాజకీయ పార్టీల నుండి సీట్లు సాధించుకోవాలన్నారు.మహిళా రిజర్వేషన్ ప్రకారం మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఎక్కువగా ఉన్నాయని ఈ నేపథ్యంలో ఆకాశాలను కల్పించుకోవాలని సూచించారు.పట్టణాలలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముదిరాజ్ బిడ్డలు పొటీచేయాలన్నారు.గతంలో 150 మత్స్య శాఖ సొసైటీలు ఉంటే తెలంగాణ వచ్చాక 6 వేల సొసైటీలను తీసుకువచ్చామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముదిరాజ్ కులస్తుల రిజర్వేషన్ అమలు కోసం ప్రధాన,ప్రతిపక్ష పార్టీలలో ఉన్న ముదిరాజ్ ప్రజా ప్రతినిధులతో హైదారాబాద్ లో సమావేశం పెట్టబోతున్నట్లు తేల్చిచెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్న ఒక్క పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ కులస్తులు ముందుకొస్తున్నారని ఇదే తరహాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ కులస్తుల ఐక్యతచాటాలని శాసనమండలి డిప్యూటీ స్పీకర్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ తెలియజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ మాట్లాడుతూ ఐక్యతతో ఉంటే అన్ని హక్కులకు సాధించుకోవచ్చని తెలిపారు. కులబలం ఉంటేనే రాజకీయ పార్టీల్లో సీట్లు సాదించుకోవచ్చని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఎన్నారై సెల్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్ రాష్ట్ర ముదిరాజ్ కులస్తులు పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో 13 వేల గ్రామ పంచాయితీ ఉంటే ముదిరాజ్ కులస్తులు ముదిరాజ్ సొసైటీలతో పటిష్టంగా ఉన్నారన్నారు.
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న ముదిరాజ్ కులస్తులు కీలకమని పేర్కొన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో కులబలం ఉంటేనే రాజకీయ పార్టీల్లో సీట్లు లభిస్తాయి.సీట్లు సాధించి ప్రజా ప్రతినిధులుగా ఎదగచ్చని తెలిపారు.
సామాజికంగా,ఆర్థికంగా ఎదగాలన్న సమిష్టిగా ఉండాలి.గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముదిరాజ్ లకు బీసీ డి నుండి బీసీ ఏ కు మార్చాలని ప్రత్యేక జీఓను ప్రస్తుత శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ తెప్పించారు.నేడు ఆయన వెంటే ఉంటూ హక్కులను సాధించుకోవాలని ముదిరాజ్ కులస్తులు వివరించారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు, వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గొనెల రవీందర్, వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గోనెల పద్మ, జిల్లా మత్స్య శాఖ ప్రమోటర్ సోమయ్య, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు బుస మల్లేశం జిల్లా గౌరవాధ్యక్షుడు జిలుకల కొమ్మాలు, నీరటి సదానందం, గుంటిక సోమయ్య పోలు అమర్ చందు,గుండా రాకేష్, ముద్రపోయిన సుధాకర్,భీమ్ రాజ్, దుగ్గొండి మండల అధ్యక్షుడు పల్లె రమేష్, నూనె నర్సయ్య హంస విజయరామరాజు ముద్రబోయిన వెంకన్న రావుల రాజు తోట సాంబయ్య పిట్టల భాస్కర్ అన్నబోయిన లింగయ్య పంబాల కోటి కెవ్వు శివకాశి బోనాల భరత్, జిల్లా పరిధిలోని మాజీ జెడ్పిటిసిలు ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.