తాడిచెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు.

తాడిచెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

ప్రమాదవశాత్తు తాడిచెట్టు పైనుండి పడి గీతా కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన ఓరుగంటి సాయిలు తాడిచెట్లు ఎక్కి కళ్ళు గీసి జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం తాడిచెట్టి ఎక్కి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారీ కిందపడ్డాడు. ఈ సంఘటనలో సాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వైద్య చికిత్సల కోసం 108లో పరకాల సివిల్ ఆస్పత్రికి అక్కడి నుండి హనుమకొండలోని ఎంజీఎం తరలించినట్లు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version