పౌర హక్కుల పరిరక్షణలో కామ్రేడ్ ఓంకార్ పాత్ర ఎనలేనిది.

పౌర హక్కుల పరిరక్షణలో కామ్రేడ్ ఓంకార్ పాత్ర ఎనలేనిది

మోడీ పాలనలో పౌర హక్కులకు ప్రమాదం

“పౌర హక్కుల పరిరక్షణ- ఓంకార్ గారి పాత్ర” అనే రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

వరంగల్ జిల్లా ప్రతినిధి నేటిధాత్రి:

పౌర హక్కులు రాజ్యాంగ పరిరక్షణ కోసం కామ్రేడ్ ఓంకార్ చేసిన ఉద్యమాలు త్యాగాలు ఎనలేనివని ఆయన స్ఫూర్తితో ప్రమాదంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని పౌర హక్కులను రక్షించుకునేందుకు ప్రతి పౌరుడు పూనుకోవాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సిపిఎం జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల, న్యూ డెమోక్రసీ గ్రేటర్ కార్యదర్శి రాచర్ల బాలరాజు, లిబరేషన్ జిల్లా కార్యదర్శి అక్కనపెల్లి యాదగిరి, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు నున్న అప్పారావు, రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు సోమ రామమూర్తి, కేడల ప్రసాద్, ఫుడ్ అడ్వైజరీ కమిటీ మాజీ సభ్యులు బానోతు సంగులాల్ లు పిలుపునిచ్చారు. ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ అసెంబ్లీ టైగర్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాల్లో భాగంగా పౌర హక్కుల పరిరక్షణ ఓంకార్ పాత్ర అనే అంశంపై వామపక్ష కమ్యూనిస్టు సామాజిక ప్రజా సంఘాల బాధ్యులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్ భవన్ లో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పౌర హక్కుల పరిరక్షణకై కామ్రేడ్ ఓంకార్ పాత్రను వివరిస్తూ అధ్యక్షత వహించిన పెద్దారపు రమేష్ నోట్ ప్రవేశపెట్టారు.
అనంతరం సమావేశానికి హాజరైన వక్తులు ప్రసంగిస్తూ కేంద్రంలో ఏర్పడిన బిజెపి ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఈడి సిబిఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమంగా జైలులో పెట్టుతున్నదని అర్బన్ నక్సలైట్లని టెర్రరిస్టులని రకరకాల పేర్లతో నిర్బంధం ప్రయోగిస్తూ మావోయిస్టుల పేరుతో బూటకపు ఎన్కౌంటర్లతో అడవిలో మూలవాసులైన ఆదివాసీలను కాల్చి చంపుతున్నారని అటవీ సంపద కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుటకు దోచిపెడుటకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో ఆర్టికల్స్ 14 నుంచి 24 లో పొందుపరచబడిన స్వేచ్ఛ సమానత్వ మత విద్య సాంస్కృతిక రాజ్యాంగ ప్రాథమిక హక్కులను కాలరాస్తూ పౌరులుగా స్వేచ్ఛగా జీవించలేని స్థితికి నెట్టివేస్తున్నారని 1975 ఎమర్జెన్సీ కంటే భిన్నంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజాస్వామిక పత్రిక స్వేచ్ఛను సైతం హరించి వేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనాడు కామ్రేడ్ ఓంకార్ పౌర హక్కులు శాంతిభద్ర సమస్యలపై అసెంబ్లీలో సుమారు రెండు గంటలకు పైగా మాట్లాడి ప్రజా పోరాటాల పరిరక్షణకై హక్కులకై గలమెత్తి చట్టసభలకు వన్నె తెచ్చి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా భార్గవ కమిషన్ వేయించి సాక్షులను ప్రవేశపెట్టి పాలకవర్గాల గుట్టు రట్టు చేసిన గొప్ప యోధుడు కామ్రేడ్ ఓంకార్ ను ఆయన పౌర హక్కుల రక్షణ కోసం చేసిన కృషి నేటికీ ఎంతో అనుసరణీయమని ఈ క్రమంలో ప్రమాదంలో ఉన్న పౌర హక్కులను కాపాడుకునేందుకు వామపక్ష కమ్యూనిస్టు సామాజిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆ దిశలో ప్రతి పౌరుడు ఉద్యమాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎంసిపిఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబా బాబురావు, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, అసంఘటిత కార్మిక సంఘాల నాయకులు నలిగంటి చంద్రమౌళి, ప్రజాసంఘాల నాయకులు ఓదెల రాజన్న, అనిత,ఎండి ఇస్మాయిల్, ఐతం నాగేష్, మైదం సంజీవ్, ఎండి సలీం, ఎగ్గని మల్లికార్జున్, మాలి ప్రభాకర్, అప్పన్నపూరి నరసయ్య, నలివెల రవి, పరిమళ గోవర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పక్షపాతి పార్టీ

– కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంతకంతో రైతులకు రుణమాఫీ
– గత ప్రభుత్వంలో ఎటువంటి లైసెన్సులు లేకుండా అనుమతులు
– సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి పార్టీ అని రైతులకు ఎటువంటి ఇబ్బందులు జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు.
పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అనే ఒక గొప్ప సదుద్దేశంతో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకే ఒక పెన్ను సంతకంతో రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పాడి రైతుల విషయంలో ఎన్నో హామీలు ఇచ్చినా కూడా ఒకటి కూడా నెరవేర్చలేదని, కొన్ని పాడి పరిశ్రమ సంస్థలకు వ్యవస్థలకు ఎటువంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఫైర్ సేఫ్టీ లేకుండా గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని ఒకవేళ ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దాని బాధ్యత ఎవరు అని అందుకోసమే దీనిని గమనించిన అధికారులు అధికార యంత్రాంగము ఇటువంటి సమస్యల పైన చర్యలు తీసుకుంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. చట్టాలను చుట్టాలుగా మార్చుకొని లబ్ధి పొందాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకోదని అన్నారు. సమాజానికి ఆమోదయోగ్యమైనటువంటి వ్యాపారం చేసే సంస్థలకు వ్యవస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అందుకోసమే గత ప్రభుత్వం ఎటువంటి లైసెన్సులు లేకుండా అనుమతులు ఇస్తే అధికారులు వాటిని సీజ్ చేసినా కూడా రైతులు ఇబ్బంది పడద్దని ఒక ఉద్దేశంతో వాటిని మళ్లీ తెరిపించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ సిరిసిల్ల పట్టణ మహిళా అధ్యక్షులు వెలుముల స్వరూప,జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, ఆడెపు చంద్రకళ, గోనె ఎల్లప్ప, కత్తెర దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా వ్యతిరేక బడ్జెట్ కదా…?

కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్: తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :

పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని, కార్పొరేట్ శక్తులకుఅనుకూలమైన బడ్జెట్ అని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. గురువారంచండూరు మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో( సిఐటియు, రైతు,కల్లుగీత కార్మిక సంఘం,చేతి వృత్తిదారుల సంఘం )కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్లోమోడీ ప్రభుత్వం ప్రజల మౌలిక అవసరాలకు కేటాయింపులు తగ్గించి,సంపన్నులకు రాయితీలు పెంచిందని, సామాన్య ప్రజలకు తీరని ద్రోహం చేసిందని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. దేశంలో200 మంది శతకోటీశ్వరులపై4 శాతం సంపద పన్ను ప్రవేశపెట్టాలని, కార్పొరేట్ పన్ను పెంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర హామీ కల్పించాలని ఆయన అన్నారు. భీమా రంగంలో100 శాతం ఎఫ్ డిఐ ఉపసంహరించాలని ఆయన అన్నారు.ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ,ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వారికి అప్పగించడం ఆపాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 50 శాతంకేటాయింపులు పెంచాలని, పట్టణాలకు వర్తింపజేయాలని,ఆరోగ్య రంగానికి,విద్యారంగానికి జిడిపిలో3 శాతం చొప్పున కేటాయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆహార సబ్సిడీ పెంచాలని,ఎస్సీ ఎస్టిరంగాలకుమహిళ, శిశు సంక్షేమానికి కేటాయింపులు పెంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.స్కీం వర్కర్ల గౌరవ వేతనంతో కేంద్రం వాటాను పెంచాలని, రాష్ట్రాలకు నిధులబదిలీ పెంచాలని ఆయన అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై సెస్సులు,సర్ చార్జీలు రద్దు చేయాలనివారు అన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రజల వ్యతిరేక బడ్జెట్ అని వెంటనే పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్లు ఆమోదించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులుమొగుధాల వెంకటేశం, చేతి వృత్తిదారుల సంఘం నాయకులు చిట్టి మల్ల లింగయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కత్తుల సైదులు, నల్లగంటి లింగస్వామి, గండూరు వెంకన్న, చినరాజు, కృష్ణయ్య, రమేష్, వెంకన్న, అన్నేపర్తి ఎల్లమ్మ, బక్కమ్మ, చంద్రమ్మ, అలివేలు, కలమ్మ, రేణుక, ముత్తమ్మ,రైతు సంఘం నాయకులుకొత్తపల్లి నరసింహ,వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ కీలకం

నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు..తుమ్మలపెల్లి సందీప్

నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ విభాగం కీలకమని నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి నేతృత్వంలో ఈనెల 16నుండి 18వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్ లోని మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఓ రిసార్ట్ లో జరిగిన సోనియమ్మ కుటీరం యువ క్రాంతి బునియాది శిక్షణ తరగతుల సమావేశానికి సందీప్ హాజరైనారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాకు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవకాశాన్ని కల్పించి, మూడు రోజుల పాటు హైదరాబాదులో జరిగిగే శిక్షణ తరగతుల్లో పాల్గొనే గొప్ప అవకాశాన్ని అందించిన జనహృదయనేత, నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ చాలా కీలకమని యూత్ కాంగ్రెస్ లో ఎవరైతే క్రియాశీలకంగా సమర్థవంతంగా చురుగ్గా పని చేస్తారో వారికి కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో ఉన్న చాలా మంది ప్రముఖులు యూత్ కాంగ్రెస్ లో పని చేసిన వారేనని శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథులుగా హాజరైన పలువురు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మాట్లాడిన మాటలని ఆయన గుర్తు చేశారు.అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రజా పాలన అందిస్తున్న పథకాలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే దిశగా యూత్ కాంగ్రెస్ నాయకులు అడుగులు వేయాలని సూచించారు.జాతీయ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ సురభి దివెది జీ, జాతీయ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సైద్ ఖాళీద్ అహ్మద్ జీ, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డిల చేతుల మీదుగా శిక్షణ తరగతుల సర్టిఫికెట్, యూత్ కాంగ్రెస్ బ్యాగ్, బహుమతులను తీసుకున్నట్లు తుమ్మలపెల్లి సందీప్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version