ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా పాండవుల రాంబాబు.

ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా పాండవుల రాంబాబు.

#సంఘ అభివృద్ధి కొరకై కృషి చేస్తా.

#నాపై నమ్మకంతో 5వ సారి అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు సంఘానికి కృతజ్ఞతలు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

 

 

మండల కేంద్రంలోని ముదిరాజ్ కుల అధ్యక్షుని ఎన్నిక సోమవారం కుల దైవమైన పెద్దమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షునిగా పోటీలో పాండవుల రాంబాబు, పప్పు మొగిలి బరిలో నిలవగా ఎన్నికల నిర్వాహకులు రావుల రవి, కేశవ వర్మ, జక్కుల రవి, పోతు రెడ్డి రవిఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా సంఘ సభ్యులు ఓటును హక్కును వినియోగించుకున్నారు ఈ ఎన్నికల్లో పాండవుల రాంబాబు అధిక మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా సంఘానికి అన్ని విధాలుగా సహకరిస్తూ పార్టీలకు అతీతంగా కుల సమస్యలపై పోరాడి అభివృద్ధి దిశగా నడిపిస్తూ. కుల బాంధవులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సాధక బాధలను తీర్చడం జరిగిందని. కుల సంఘానికి పనిచేసే వ్యక్తి కావాలని 5 సారిగా మరోసారి నాకు అవకాశం కల్పించిన కుల బాంధవులకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆయన తెలిపారు. అదేవిధంగా కుల సంఘానికి ఎలాంటి సమస్యలు వచ్చిన పెద్ద చిన్న అని తేడా లేకుండా సమస్యల పరిష్కరణ కొరకై అనునిత్యం పనిచేస్తానని ఆయన కుల సంఘానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ముదిరాజ్ లను ఓటు బ్యాంక్ గా చూస్తున్న ప్రభుత్వాలు.

ముదిరాజ్ లను ఓటు బ్యాంక్ గా చూస్తున్న ప్రభుత్వాలు..

ముదిరాజ్ ల రిజర్వేషన్ హామీని మరిచిన ప్రభుత్వం.

మెపా తెలంగాణ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్

నర్సంపేట నేటిధాత్రి:

ప్రభుత్వాలు ఎన్ని మారిన ముదిరాజ్ లను ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని మెపా తెలంగాణ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ ఆరోపించారు.
ముదిరాజ్ లకు ఇచ్చిన రిజర్వేషన్ హామీని ప్రభుత్వం మరిచిపోయిందా? అని ఆయన ప్రశ్నించారు.గురువారం నాడు దుగ్గొండి మండల కేంద్రంలో మండల మెపా స్వామి ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పులి దేవేందర్ ముదిరాజ్ ముఖ్య హాజరైనారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లో ముదిరాజుల రిజర్వేషన్ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మెపా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్ మండల ఉపాధ్యక్షులు సంకెళ్ళ స్వామి,దండు తిరుపతి, జెట్టబోయిన రాజేందర్, గ్రామ పెద్దలు ముత్యం భూమయ్య ముదిరాజ్, పోన్నం కుమార్ ముదిరాజ్, పొన్నం సదానందం, ముదిరాజ్ అడ్వకేట్ ముత్యం కిషోర్ ముదిరాజ్,డా.చింతకాయల శంకర్ ముదిరాజ్, పొన్నం వేణు ముదిరాజ్, పొన్నం అశోక్ ముదిరాజ్, గేళ్ళ రాజు ముదిరాజ్ సానబోయిన శివ ముదిరాజ్ పొన్నం నాగరాజు ముదిరాజ్, బుస మల్లయ్య ముదిరాజ్ లు పాల్గొన్నారు.

సన్మానించిన ముదిరాజ్ కులస్తులు.

ఎమ్మెల్యేను సన్మానించిన ముదిరాజ్ కులస్తులు

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా చోప్పదండి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రంలోని శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ముఫై ఒకలక్షల రూపాయలు కేటాయించిన సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యంను రామడుగు ముదిరాజ్ కులస్తులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా పునర్నిర్మాణానికి నోచుకోని శ్రీపెద్దమ్మ తల్లి ఆలయాన్ని నూతనంగా నిర్మించుకోవడానికి తన వంతు సహాయం చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు దీనికి సహకరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి ముదిరాజ్, ముదిరాజ్ సంఘం పెద్దమనుషులకు, సొసైటీ సభ్యులకు, ముదిరాజ్ యువతకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు జిట్టవేణి రాజు, సదరు పెద్దమనిషి జిట్టవేణి రమేష్, వైస్ చైర్మన్ నీలం రవి, డైరెక్టర్లు, పెద్దమనుషులు ఉత్తం రాయమల్లు, సామంతుల తిరుపతి, రాగం రాజయ్య, మామిడి సుదర్శన్, రాగం వెంకటి, జిట్టవేణి అంజిబాబు, పెసరి రాజమౌళి, సామంతుల తిరుపతి, రాగం లచ్చయ్య, ఈగ రాజేశం, రాగం సంపత్, చిలువేరి కనకయ్య, ఉప్పరి మహేష్, నీలం లక్ష్మణ్ బొమ్మరివేని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ఆత్మ గౌరవ పాదయాత్రలో ఆకుల సుభాష్ ముదిరాజ్.

ముదిరాజ్ ఆత్మ గౌరవ పాదయాత్రలో ఆకుల సుభాష్ ముదిరాజ్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం తెలంగాణ ఆరాధ్య దైవలు శ్రీ మేడారం సమ్మక్క సారాలమ్మ లను దర్శించుకొను ఈ నెల 18 శుక్రవారం రోజునా ముదిరాజ్ ల పట్ల జరుగుతున్న వివక్ష విద్య ఉద్యోగ ఉపాధి ఆర్థిక సామజిక రంగాలలో ప్రభుత్వం చూపుతున్న వైఖరికి బి సి – డి నుండి బి సి -ఏ కు మారుస్తానని హామీ నెరవేర్చక పోవడం పట్ల నిరసన తెలుపుతూ తెలంగాణ ముదిరాజ్ సమాజ్ సంఘం అధ్యక్షులు
దారం యువరాజ్ ముదిరాజ్
ముదిరాజ్ ఆత్మగౌరవ పాదయాత్ర ప్రారంభం చేశారు. ఈరోజు వారి పాదయాత్రకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ సంఘీభావం తెలుపుతూ. మండు వేసవిలో వారి పాదయాత్రను చూసి కళ్ళు చెమ్మగిల్లయాని వారు అన్నారు పాదచారుల ఆరోగ్యంపై క్షేమ సమాచారిని అడిగి తెలుసుకున్నామని ఆకుల సుభాష్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version