ఎన్నికల ప్రచారానికి అనుమతి తప్పనిసరి .

ఎన్నికల ప్రచారాలకు..
అనుమతి తప్పనిసరి

నిజాంపేట: నేటి ధాత్రి

 

గ్రామ పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలకు అనుమతులు తీసుకోవాలని ఎస్ఐ రాజేష్ సూచించారు. నిజాంపేటలో మాట్లాడుతూ.. రెండు విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు మైక్ ద్వారా ప్రచారం చేయాలనుకునేవారు మీసేవ లో చలాన్ కట్టి, స్థానిక తహసిల్దార్ అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా ప్రచారం చేస్తే ఎన్నికల నిబంధన మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ప్రభుత్వ నిబంధన మేరకు ఇంటి నిర్మాణం చేపట్టాలి…

ప్రభుత్వ నిబంధన మేరకు ఇంటి నిర్మాణం చేపట్టాలి
..మున్సిపల్ కమిషనర్ మనోహర్

రాయికల్, జూలై 31,నేటి ధాత్రి:

ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలని మున్సిపల్ కమిషనర్ మనోహర్ అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని 1 వార్డులలో నిరుపేద కుటుంబానికి చెందిన మంద లావణ్య ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి,ఆన్లైన్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వారు సూచించిన స్థలాన్ని చదును చేసి ఇంటి నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి లబ్ధిదారులు 400 స్క్వేర్ ఫీట్స్ కు తగ్గకుండా 600 స్క్వేర్ ఫీట్స్ కు పెరగకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలని పెరగకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ బి.వెంకటి,హౌసింగ్ ఎ.ఇ పి. తిరుమల,మున్సిపల్ సిబ్బంది రజాక్,గంగారెడ్డి, శేఖర్ వార్డు కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ వార్డ్ ఇంచార్జ్ మొహమ్మద్ షాకీర్ సామాల్ల లత చింతకుంట సాయికుమార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మ్యకల రమేష్ ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్ బొమ్మ కంటి నవీన్ కడకుంట్ల నరేష్ బాపురపు నరసయ్య మహమ్మద్ సాబీర్ పొన్నం శ్రీకాంత్ గౌడ్ బొద్దుల శివ కుమార్ కాటిపెల్లిరామ్ రెడ్డి గుమ్మడి సంతోష్ గోపాల్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టాలి..

హౌసింగ్ ఏఈ అభినయ్ గౌడ్.

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని హౌసింగ్ ఏఈ బొమ్మగాని అభినయ్ గౌడ్ అన్నారు. శుక్రవారం పెనుగొండ గ్రామంలోని రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు మంజూరి పత్రాలు వచ్చినటువంటి వారు మాత్రమే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని, ప్లానింగ్ ముగ్గు పోసిన అనంతరం గ్రామంలోని కార్యదర్శి ద్వారా ఫోటోను యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుందని ప్రభుత్వ నిబంధనల ప్రకారం 400పీట్ల నుండి 600 ఫీట్ల లోపు మాత్రమే ఇంటి నిర్మాణం చేపట్టాలని, ఇంటి నిర్మాణ లబ్ధిదారులకు ఉచిత ఇసుక కూపన్లు మంజూరు చేయబడతాయని ఎటువంటి రుసుములు లేకుండా పూర్తిగా ఉచితంగా 8 ట్రాక్టర్లు అందజేయడం జరుగుతుందన్నారు. 150 బస్తాల సిమెంటు, 8 క్వింటాల స్టీల్ (సలాక), 20 ఎంఎం కంకర నాలుగు ట్రాక్టర్లు, 40 ఎంఎం కంకర రెండు ట్రాక్టర్లు, బేసుమెంటు రాయి మూడు ట్రాక్టర్లు , సిమెంట్ ఇటుకలు 2,150 లతో నిర్మాణం చేయాలని తప్పనిసరిగా గృహ నిర్మాణంలో టాయిలెట్ నిర్మాణం చేపట్టాలని, మేస్త్రీలు గోడ కొలతల ప్రకారం చదరపు అడుగుకి 300 చొప్పున మాత్రమే తీసుకోవాలని,ప్రభుత్వ నిబంధనలు ప్రకారమే నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version