దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జియంతి వేడుకలు.

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జియంతి వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు

వనపర్తి నెటిదాత్రి :

 

 

 

 

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రాపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వేడుకలు ఘనంగా నిర్వహించామని టిపిసిసి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు కాంగ్రెస్ పార్టీనేతలు లక్కకుల సతీష్ బి కృష్ణ చందర్ నక్కరాములు చుక్కరాజు జి జె శ్రీనివాసులు పార్టీ నేతలు పాల్గొన్నారు

కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉద్యోగితో గౌడ వృత్తి సమానం.

కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉద్యోగితో గౌడ వృత్తి సమానం..

గౌడ కులస్తుల వల్ల ఆనాటి నైజాం ప్రభులే ధనవంతులయ్యారు

గీత వృత్తిని కొనసాగిస్తూ ఆర్థికంగా ఎదగాలి.

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి

గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కీట్ల పంపిణీ

నర్సంపేట నేటిధాత్రి:

ప్రస్తుతం ఉన్న మద్యం రేట్లును పరిగణలోకి తీసుకున్న పలువురు ప్రకృతి వరమైన తాటికల్లులు సేవిస్తున్నారని ఈ నేపథ్యంలో గీత వృత్తి చేసే కార్మికులు ఒక కంప్యూటర్ ఉద్యోగిగా భావిస్తూ వృత్తి కొనసాగించుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తెలిపారు.బీసీ సంక్షేమ శాఖ,ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట డివిజన్ పరిధిలోని ఆరు మండలాల కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. బ్రిటిష్ కాలంలో తెలంగాణ ప్రాంతంలో గౌడ కులస్తులు కల్లు ద్వారా వచ్చే ఆదాయంతో నిజాం నవాబులు ధనవంతులు అయ్యారని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన సర్వేలో వెళ్లడైందని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కువగా మద్యం తాగేది తెలంగాణలోనే అని అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అన్ని ప్రాంతాలలో ఆయుర్వేద మెడిసిన్గా భావిస్తూ ప్రతీ ఒక్కరూ తాటికల్లు తాగుతున్నారు.కళ్లు అనేది నామూసి కాదని ఎమ్మెల్యే అభిప్రాయ వ్యక్తం చేశారు. గౌడ కులస్తులు నమ్ముకున్న గీత వృత్తిని కొనసాగించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో కాటమయ్య రక్షణ కిట్లకు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 41 లక్షల 40 వేల ఖర్చు చేసిందని పేర్కొన్నారు. గీత కార్మికులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తాం. ఎక్సైజ్ శాఖ అధికారులు,కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు సహకారంతో ఉంటుందని ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చిన అందిస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి హామీ ఇచ్చారు.జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత మాట్లాడుతూ గీత కార్మికులకు తాడిచెట్టు ఎక్కేటప్పుడు రక్షణ కల్పించేందుకు గాను కాటమయ్య రక్షణ కిట్స్ పంపిణీ సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సహకారంతో చేపట్టినట్లు తెలిపారు. ప్రాణాలను రక్షించుకుంటూ
వృత్తిని కాపాడుకున్న కోవాలని గీత కార్మికులను సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి ఎస్ఐ శార్వాణి సిబ్బంది నాగరాజు పాల్గొన్నారు.

పదోన్నతి పై వెళ్తున్న అధికారికి ఘన సన్మానం.

పదోన్నతి పై వెళ్తున్న అధికారికి ఘన సన్మానం

జైపూర్ నేటి ధాత్రి:

జైపూర్ మండల కేంద్రంలో ఏఎస్ఓగా విధులు నిర్వహించి డివైఎస్ఓ గా పదోన్నతి పొంది భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్తున్న సతీష్ కుమార్ కి శనివారం రోజున తహసిల్దార్ వనజా రెడ్డి, కార్యాలయ సిబ్బందితో కలిసి పూలమాలతో,శాలువాతో సత్కరించి,వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించి సన్మానం చేశారు.తమతో పాటు విధి నిర్వహణలో చురుగ్గా,నైపుణ్యంతో కూడిన సేవలను అందించి పదోన్నతి పై వెళ్తున్న సతీష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మరింత శ్రమించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నామని తహసిల్దార్ వనజా రెడ్డి తెలిపారు.

గత ప్రభుత్వంలో ఏ ఒక్కరి కూడా ఇల్లు మంజూరు చేయలేదు…

గత ప్రభుత్వంలో ఏ ఒక్కరి కూడా ఇల్లు మంజూరు చేయలేదు…

పిఎసిఎస్ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వర్ రావు

కల్యాణ లక్ష్మి,.. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ… ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేత

కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుంది…

కేసముద్రం/ నేటిదాత్రి

 

 

 

 

కేసముద్రం మండలం పరిధిలో ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో రైతు వేదిక నందు మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్, ఆదేశాల మేరకు స్థానిక తహసిల్దార్ వివేక్ అధ్యక్షతన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది, మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి 50 మంది లబ్ధిదారులకు మరియు13 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు,కేసముద్రం మున్సిపాలిటీ చెందిన 100 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను అందజేసిన ధన్నసరి పిఎసిఎస్ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వర్ రావు
మహబూబాబాద్ జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,కేసముద్రం పిఎసిఎస్ వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి,

ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ..నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల నిధులతో ఇందిరమ్మ మంజూరు చేస్తున్నారని,
అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు.

గత ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఇండ్లు మంజూరు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందిస్తుందన్నారు. మూడు నెలల సన్న బియ్యం ఒకేసారి అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె ప్రసన్న రాణి, ఎమ్మార్వో జి వివేక్ , రెవెన్యూ అధికారులు ఎండీ మాజిద్,సౌజన్య,పిసిసి మెంబర్ దశ్రు నాయక్ ,,మాజీ ఎంపీపీ మల్సూర్ నాయక్,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ ఎండీ ఆయాబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి,మాజీ సర్పంచ్ మధుగిరి సాంబయ్య, మాజీ ఉప్పసర్పంచ్ బానోత్ వెంకన్న, అధికారులు,గ్రామ పార్టీ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

టిటిపిఓసి 25 లో పాల్గొన్న ప్రెప్‌ఇన్స్టా.

టిటిపిఓసి 25 లో పాల్గొన్న ప్రెప్‌ఇన్స్టా

విద్యా వ్యవస్థ, పరిశ్రమల మధ్య అనుసంధానానికి వ్యూహాత్మక దిశ

వరంగల్ నేటిధాత్రి:

భారతదేశంలోని ప్రముఖ ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ మరియు నైపుణ్యాభివృద్ధి వేదిక అయిన ప్రెప్‌ఇన్స్టా, జూన్ మొదటివారంలో షాద్ నగర్ లో జరిగిన కెరీర్ నెక్సస్ -2025లో హాజరైనది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్ కన్సోర్షియం (టిటిపిఓసి) ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు సాగిన ఈ సదస్సు విద్యా సంస్థలు మరియు కార్పొరేట్ నియామకదారుల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రధాన వేదికగా నిలిచింది. దేశవ్యాప్తంగా వందలాదిమంది టీపీఓలు, హెచ్ ఆర్ అధిపతులు, ఎడ్టెక్ నేతలు మరియు పాలసీ మేకర్లు పాల్గొని, క్యాంపస్ ప్లేస్‌మెంట్లు మరియు నైపుణ్యాభివృద్ధి భవిష్యత్తును పునర్నిర్వచించాలనే లక్ష్యంతో చర్చించారు. ఈ చర్చల కేంద్రబిందువుగా, విద్యా శిక్షణ మరియు పరిశ్రమ అవసరాల మధ్య పెరుగుతున్న అంతరాన్ని పరిగణించడమే జరిగింది. ప్రెప్‌ఇన్స్టా సీనియర్ డైరెక్టర్ మనీష్ అగర్వాల్ మాట్లాడుతూ, “భారతదేశంలో ప్లేస్‌మెంట్ లాండ్‌స్కేప్ వేగంగా మారుతోంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు తయారవుతున్నా, పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఉద్యోగానికి సిద్ధంగా ఉండే వారి శాతం చాలా తక్కువగా ఉంది. ఈ అంతరాన్ని తగ్గించాలంటే, టిపిఓ లు మరియు కంపెనీ హెచ్ఆర్ లు కలిసి పని చేయాలి. శిక్షణ, అంచనా, నియామకం అన్నీ ఒకే వేదికపై కలిసేలా ప్లాట్‌ఫారాలు నిర్మించాలి. ఇది విద్యార్థుల విజయాన్ని పటిష్టంగా మద్దతిచ్చే ప్లేస్‌మెంట్ పద్ధతుల తరం కావాలి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో చర్చించిన ముఖ్య సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. క్యాంపస్ శిక్షణలో ప్రమాణాల లోపం, పాత విధానాల ఆధారంగా ప్లేస్‌మెంట్ ట్రాకింగ్, టీపీఓ లు మరియు నియామకదారుల మధ్య తక్కువ కమ్యూనికేషన్, టియర్ 2 టియర్ 3 కాలేజీలలో తక్కువ ప్లేస్‌మెంట్ శాతం వంటివి ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి, ప్రెప్‌ఇన్స్టా సహకారాత్మక, డేటా ఆధారిత దృక్పథాన్ని ప్రతిపాదించింది. దీని ద్వారా కాలేజీలు పటిష్టమైన డేటా, స్కేలబుల్ టూల్స్, మరియు బలమైన రిక్రూటర్ నెట్‌వర్క్‌ను పొందగలుగుతాయి. “ప్రెప్‌ఇన్స్టాలో, లక్ష్యం ఏమిటంటే విద్యార్థి ఏ కాలేజ్‌లో చదువుతున్నా, అతనికి సరైన శిక్షణ, మార్గనిర్దేశం మరియు ఉద్యోగ అవకాశాలు అందాలి. టిటిపీఓసి వంటి ఈవెంట్‌లు విద్యా వ్యవస్థతో కలసి భవిష్యత్ కోసం సమగ్ర పరిష్కారాలను రూపకల్పన చేసే అవకాశాలు కల్పిస్తాయి” అని మానిష్ అగర్వాల్ తెలిపారు. ఈ దిశగా, ప్రెప్‌ఇన్స్టా భారత దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల టిపిఓలు మరియు మేనేజ్‌మెంట్‌లను 2025 ప్లేస్‌మెంట్ సీజన్ కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాలను అన్వేషించమని ఆహ్వానిస్తోంది. ప్రెప్‌ఇన్స్టా రూపొందించిన బి2ఐ సాస్ ప్లాట్‌ఫారమ్ ‘ఆప్టిమస్’ ఇప్పటికే 250కి పైగా విద్యాసంస్థలకు మద్దతు ఇస్తోంది. శిక్షణ, అంచనా మరియు ప్రిపరేషన్ ట్రాకింగ్‌ను సమర్థంగా నిర్వహిస్తోంది. 2017లో స్థాపితమైన ప్రెప్‌ఇన్స్టా, నైపుణ్యాల అభివృద్ధి మరియు ప్లేస్‌మెంట్ కోసం విశ్వసనీయ వేదికగా ఎదిగింది. ఇందులో 200కి పైగా ఇండస్ట్రీ-అలైన్‌డ్ కోర్సులు ఉన్న ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉంది. ఇందులో జనరేటివ్ ఏ ఐ, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి హై-డిమాండ్ రంగాలలో శిక్షణ అందించబడుతుంది. నైపుణ్యాధారిత, ఉపాధి-సిద్ధమైన భారత్ కోసం మద్దతుగా నిలుస్తోందని తెలిపారు.

వరంగల్ నూతన ఏఎస్పీ గా శుభం ప్రకాష్.

వరంగల్ నూతన ఏఎస్పీ గా శుభం ప్రకాష్

వరంగల్, నేటిధాత్రి

 

 

 

 

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్ డివిజన్ ఏఎస్పీ గా ఎన్. శుభం ప్రకాష్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 ఐ.పి.ఎస్ బ్యాచ్ కు చెందిన శుభం 2024 సంవత్సరం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఆరు నెలల పాటు ట్రైనీ ఐపిఎస్ గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం వరంగల్ ఏసీపీ గా పనిచేస్తున్న నందిరాం నాయక్ డిజిపి కార్యాలయంకు బదిలీ అయ్యారు.

రామ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన.

రామ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన
శాసన మండలి పక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామాన్ని చెందిన ఇటీవల ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఒద్దుల రాంరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన శాసనమండలి పక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి.
ఈ కార్యక్రమంలో బీ. ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బైరాగాని కుమారస్వామి,రత్నం రవి,గ్రామ కమిటీ అధ్యక్షులు ఎడెల్లి మల్లారెడ్డి,మాజీ పిఎసిఎస్ చైర్మన్ పూర్ణచంద్రారెడ్డి,కంచరకుంట్ల రవీందర్ రెడ్డి.ఎక్కటి శ్యామల దేవి,మొగిలి శ్రీనివాస్.

వ్యవసాయ ఒక ఉద్యోగం లాంటిది.

వ్యవసాయ ఒక ఉద్యోగం లాంటిది.

పంటల మార్పిడితో అధిక లాభాలు..

వరిపంట సాగు కంటే కంది పంటతో అధిక లాభాలు.

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంది విత్తనాల కిట్ల పంపిణి

నర్సంపేట నేటిధాత్రి:

వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ యాంత్రిక పద్దతిలో వ్యవసాయం చేస్తేనే లాభాలు లేకపోతే అప్పులపాలు కాక తప్పదని అన్నారు. వ్యవసాయం చేసే రైతులకు అది ఒక ఉద్యోగం లాంటిదని, సేంద్రియ వ్యవసాయంతో కష్టపడి పని చేస్తే లాభాలు పొందవచ్చునని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తెలిపారు.జాతీయ ఆహార భద్రత పోష కమిషన్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పప్పు దినుసుల చిరు సంచుల కందులు,మినుములు విత్తన పంపిణీ కార్యక్రమం నర్సంపేట వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సంపేట డివిజన్ పరిధిలోని ఆరు మండలాల లో గల రైతులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఎల్అర్జి 52 రకం కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంది పంట సాగు చేయడం ద్వారా అధిక లాభాలు రావడం,ఆకులు మొత్తం భూమిపై రాలడంతో ఎరువులగా మారుతుంది. దీంతో భూసారం పెరుగుతుంది.రాబోయే పంటలకు ఎరువులు తక్కువగా వాడుకోవచ్చని పేర్కొన్నారు.వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్న విధంగా కందులు 10 నుండి 12 క్వింటాలు రావడం ఖాయమని ,వరి సాగు కంటే కందుల పంట సాగు వలన అధిక లాభాలు పొందవచ్చన్నారు.పత్తి మిరప,వేరుశనగ మరే ఇతర పంటల కంటే పప్పు దినుసుల పంటలే మేలన్నారు.గతంలో పశువుల ఎరువులు వాడేది.

ఇప్పుడు అధికంగా కెమికల్స్, ఫర్టీలైజర్స్ వేస్తున్నారు. దీంతో భూసారం తగ్గుతున్నది.పెట్టుబడులు పెరుగుతున్నాయి.లాభాలు తక్కువగా వస్తున్నాయని దీంతో రైతు కుటుంబం అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి నెలకొంటున్నదని ఎమ్మెల్యే దొంతి రైతులకు సూచించారు.అధిక పెట్టుబడుల వలన నేడు రైతులు తమ శ్రమ శక్తిని కూడా సంపాదించలేక పోతున్నారని…రైతే రాజు.. నేను రాజు అనే పిలింగ్ తో ,వ్యవసాయంలోనే ఉపాధి.. ఉన్నది.వ్యవసాయంతోనే జీవనం సాగిస్తూ అభివృద్ధి చేసుకోవాలని ఈసందర్భంగా పేర్కొన్నారు.తక్కువ పెట్టుబడులు ఉన్న అపరాలు పంటలు,ఫామ్ అయిల్ పంటలు సాగు చేసుకోవాలన్నారు.బయట దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులకు ఆపాలని,వేరుశనగ,అపరాల పంటలకు బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కేంద్రానికి నివేదికలు అందించేందుకు చర్యలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే దొంతి రైతులకు తెలిపారు.గ్రామాల్లో ఇండ్ల కూరగాయలు, కోళ్ళు,గుర్రెలు పెంపకం చేసుకోవాలి.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరూ సాగు చేసుకోవటం లేదు.
గ్రామాల్లో ఉన్న ప్రజలకు హైదారాబాద్ లో ఉన్న ప్రజలకు తేడా లేకుండా పోయిందని ఈ సందర్భంగా నియోజక వర్గం ప్రజలకు సూచించారు.
వ్యవసాయ శాఖ జిల్లా అధికారి అనురాధ మాట్లాడుతూ
ప్రతీ రోజు పప్పుదినుసులు తినాల్సిందే. కావున ప్రస్తుతం పప్పుల్లో కలర్ వేస్తున్నారు.వాటి వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పప్పు దినుసుల పంటలు
వరి సాగు కంటే కందుల పంట వలన అధిక లాభాలు ఉన్నాయని సూచించారు.ఈ సాగు వలన భూసారం పెరుగుతుంది.అవసరం మేరకే ఎరువులు,కెమికల్స్ వేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్టీవో ఉమారాణి, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జాతీయ ఆహార భద్రత న్యూట్రిషన్ మిషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా కన్సల్టెంట్ సారంగం,వైస్ చైర్మన్ , ఆయా మండలాల వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు.

సిపిఐ జిల్లా కార్యదర్శి కి ఘన సన్మానం.

సిపిఐ జిల్లా కార్యదర్శి కి ఘన సన్మానం

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

 

 

 

సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శిగా రామడుగు లక్ష్మణ్ రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయిన నేపద్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సీపీఐ శ్రేణులు ఘనంగా సన్మానించారు.పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ ను సైతం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు. జిల్లా మహాసభలో చేసిన తీర్మానాలను,పార్టీ ప్రజా సంఘాల నిర్మాణానికి స్థానిక సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇప్పకాయల లింగయ్య, మిట్టపల్లి పౌల్, వెంకటస్వామి, వనం సత్యనారాయణ, సాంబయ్య, గోపి, మణెమ్మ,శంకర్,రాములు, సత్తన్న, మొగిలి తదితరులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్ స్కూల్స్ రాష్ట్రస్థాయి క్రీడలకు ఇద్దరు బాలికల ఎంపిక.

స్పోర్ట్స్ స్కూల్స్ రాష్ట్రస్థాయి క్రీడలకు ఇద్దరు బాలికల ఎంపిక

మహాదేవపూర్ జూన్ 28( నేటి ధాత్రి )

 

స్పోర్ట్స్ స్కూల్స్ ప్రవేశం కోసం మహాదేవపూర్ మండలం కుదురుపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనేందుకు ఎంపికైనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంపత్ తెలిపారు కుదురుపల్లి కి చెందిన విద్యార్థినిలు జిముడ రహస్య గోగుల అనుష్క ఎంపికయ్యారు జులై ఒకటిన నుండి హైదరాబాద్ హంకి పేటలొ స్పోర్ట్స్ స్కూల్ పోటీలో పాల్గొంటారని ఆయన తెలిపారు మారుమూల గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ పోటీలో పాల్గొనేందుకు ఎంపిక కావడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు సతీష్, సంధ్య గ్రామస్తులు తదితరులు అభినందించారు

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

శాశ్వతంగా ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేయాలి

 

మారపల్లి మల్లేష్ సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి:

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ వికేసి పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ బహుజన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్షలాది రూపాయలు అన్యాయంగా వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ప్రైవేట్ విద్యాసంస్థలను శాశ్వతంగా మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విద్యార్థి నాయకులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైనా రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉచిత విద్యాను మెరుగుపరచాలని పేద విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలను పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ పాఠశాలలను కళాశాలలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యార్థుల పక్షాన ప్రభుత్వ కళాశాల పక్షాన ప్రభుత్వ పాఠశాలల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలబడి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యలు ప్రభుత్వ కళాశాలల ప్రభుత్వ పాఠశాలలు సమస్యలు పరిష్కరించక పోతే విద్యార్థులను భారీ ఎత్తున ఏకం చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ధర్నాలు రాస్తరోకలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐసా జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్ విద్యార్థి నాయకులు అనిల్ రాజశేఖర్ నిఖిల్ జానీ అఖిల్ అభిషేక్ రాజు తదితరులు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల పెంపుకు కృషి చేయాలి.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల పెంపుకు కృషి చేయాలి

సీకేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన జెడి, ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేందర్ సింగ్

నేటిధాత్రి, వరంగల్.

 

 

 

 

వరంగల్ దేశాయిపేటలోని చందాకాంతయ్య ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలను శనివారం నాడు, కళాశాల విద్య సంయుక్త సంచాలకులు (జేడీ), ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేంద్ర సింగ్ సందర్శించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ధర్మారెడ్డి, అధ్యాపక బృందం స్వాగతం పలికారు.

కళాశాల లోని గ్రంథాలయం, ప్రయోగశాలలు, లేడీస్ హాస్టల్ తదితర వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో జేడీ ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేంద్రసింగ్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధిక సంఖ్యలో ప్రవేశాలు తీసుకునేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు.

 

CKM Government Degree College.

 

 

సీకేఎం డిగ్రీ కళాశాలలో నెట్, సెట్, పీహెచ్డీ వంటి అత్యున్నత విద్యార్హతలు, బోధన అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారని, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విభాగాలు అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎన్సిసి లో విద్యార్థులు శిక్షణ పొందినట్లయితే సాధారణ డిగ్రీతో పాటు మిలిటరీ డిగ్రీ కూడా వస్తుందని, అది విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని భవిష్యత్తులో ఆర్మీ, పోలీస్, పారా మిలిటరీ విభాగాలలో ఉన్నత ఉద్యోగాలకు ఎంపిక అవుతారని తెలియజేశారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంపిక చేసుకొని ముందుకు తగిన విధంగా శ్రమించాలని అధ్యాపకులు బోధన, పరిశోధన రంగాలలో మరింత నైపుణ్యాలను పెంపొందించుకొని కళాశాలను అభివృద్ధి చేయాలని సూచించారు.

సికేఎం కళాశాల అభివృద్ధి కోసం కళాశాల విద్య కమిషనర్ ఆదేశానుసారం ప్రభుత్వపరంగా సహాయ సహకారం అందించేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు.

 

CKM Government Degree College.

 

గెస్ట్ అధ్యాపకులు తమ సేవలను ఆటో రెన్యువల్ చేసి ప్రతి నెల కన్సాలిడేట్ పేమెంట్ ఇవ్వాలని, 12 నెలల వేతనం ఇవ్వాలని జేడీ కి వినతిపత్రం అందజేశారు.

అనంతరం జెడి ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేంద్ర సింగ్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ధర్మారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే ఎల్ వి వరప్రసాదరావు, పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ జి శశిధర్ రావు, ఎన్సిసి ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ పి .సతీష్ కుమార్, లైబ్రేరియన్ ఎస్. అనిల్ కుమార్, సి సి ఈ సూపరిండెంట్లు కృష్ణారెడ్డి, ఖుర్షీద్, కళాశాల సూపరిండెంట్ జి.శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, పాష,బోధన , బోధనేతర సిబ్బంది , విద్యార్థులు, ఎన్సిసి క్యాడేట్స్ తదితరులు పాల్గొన్నారు.

తవక్కల్ విద్యార్థులకు సెమ్స్ ఒలంపియాడ్.

తవక్కల్ విద్యార్థులకు సెమ్స్ ఒలంపియాడ్ జాతీయ ర్యాంకులు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

 

తవక్కల్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ప్రతీ సంవత్సరం ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందని విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ అన్నారు. గత విద్యా సంవత్సరం జాతీయ స్థాయిలో నిర్వహించిన సెమ్స్ ఒలంపియాడ్ టాలెంట్ టెస్ట్ లో పలువురు విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వచ్చాయని ఆయన అన్నారు. మందమర్రిలోని ఫోర్త్ క్లాస్ తన్విశ్రీ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్, రామకృష్ణాపూర్ లోని తొమ్మిదవ తరగతి అబూ హురైరా జాతీయ స్థాయిలో మూడవ ర్యాంక్, నాల్గవ తరగతి విధిషా రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్, ఐదవ తరగతి సాయి సృజన్ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ లు సాధించారని అబ్దుల్ అజీజ్ తెలిపారు. హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మొదటి అవార్డ్ గ్రహీత అనూప్ కుమార్ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు, గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రం నగదు పురస్కారాలతో విద్యార్థులను సన్మానించారు.విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి.

రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి

గ్రామా ల్లో తక్షణమే హెల్త్ క్యాంపులు నిర్వహించాలి

నర్సంపేట నేటిధాత్రి:

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలకు ఇండ్లను కేటాయించాలని ఎం సిపిఐ( యు)పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగ సుధా , నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు.
ఈ మేరకు నర్సంపేట తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటి రెండు తప్ప మిగతా హామీలు ఏవి కూడా అమలు కావడం లేదన్నారు.సీజనల్ వ్యాధులు విజ్రింబిస్తున్న క్రమంలో గ్రామాల్లో తక్షణమే హెల్త్ క్యాంపులు నిర్వహించాలని డిమాండ్ చేశారు .ప్రజాస్వామిక హక్కులపై గత పాలకుల వలె నిర్బంధాలు తీవ్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకుడు కర్నె సాంబయ్య ,జన్ను విజయ,దొమ్మాటి విమల,గొడిశాల లక్ష్మి,సోలంకి భాగ్య,సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

 

 

పేదల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల ముగ్గు పోసే కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని నిర్దిష్ట సమయంలో ఇండ్లను పూర్తి చేయాలని ఆయన అన్నారు కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

అల్లనా వలన లాభం ఎవరికి?….

అల్లనా వలన లాభం ఎవరికి?….టిఎస్ఎస్ సిసిడిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

◆ యాజమాన్యానికి లాభాలు..

◆ అధికారులకు లంచాలు

◆ నాయకులకు మామూళ్లు

◆ ప్రజలకు కాలుష్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

 

 

అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో IDA ద్వారా బుల్లెట్ కర్మాగారం అని చెప్పి పేద రైతుల దగ్గర నుండి ఫుడ్ ప్రాసింగ్ పేరిట సుమారు 150 ఎకరాలు కేటాయించారు కానీ అందులో అల్లనా పశువదశాలను నిర్మించారు, ప్రక్కనే ఉన్న ఆచార్య వినోబా సేకరించిన భూదాన్ భూములను కూడా ఆక్రమించుకొన్నారు,ఈ పరిశ్రమ పర్యవేక్షణ పశుసంవర్ధక శాఖ,కాలుష్య నియంత్రణ మండలి,మరియు APEDA,లు పర్యవేక్షించాలి కానీ ఎక్కడా కూడా సరైన పర్యవేక్షణ జరగడం లేదు,గతంలో ఈ పశువదశాలలో రోజుకు 3000ల వరకు పశువులను వదించేవారు ఇప్పుడు రోజుకు సుమారు 1000 వరకు వదిస్తున్నారు దీని వలన చుట్టు ప్రక్కల ప్రాంతంలో పశువుల సంఖ్య భారీగా తగ్గిపోయింది ఒక పశువును వదించాలంటే పశుసంవర్ధక శాఖ డాక్టర్ పశువులను పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంటుంది వ్యర్థాలను నిబంధనల ప్రకారం వదలాల్సి ఉంటుంది,ఇప్పుడు అక్కడ కనుగొంటే కేవలం ఇద్దరు మాత్రమే 1000 పశువులను పరిశీలించి దృవీకరిస్తారు ఇది ఎలా సాధ్యం.దీనిపైన పశుసంవర్ధక శాఖ అధికారులను అడగగా ఇప్పటివరకు స్పందన లేదు అంటే అధికారులు కర్మాగార యాజమాన్యంతో లంచాలు తీసుకొని కుమ్ముక్కైనట్లు తెలుస్తున్నది.
కాలుష్యం..వ్యర్థాలను సరిగ్గా పారపోయకుండా కర్మాగారంలో వెలువడిన కాలుష్య జలాలతో వర్షం వచ్చినప్పుడు రాత్రి వేళల్లో వర్షపు నీటిలో వదులుతున్నారు దీని వలన చుట్టు ప్రక్కల గ్రామాలలో భూగర్భజలాలు మరియు ప్రక్కనే ఉన్న నారింజ ప్రాజెక్టు నీరు కలుషితమవుతున్నది పంట పొలాలు పంటలకు పనికి రాకుండా పోతున్నాయి కర్మాగారం నుండి వెలువడే వాయు కాలుష్యంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు దీనిని పర్యవేక్షించాల్సిన బాధ్యత కాలుష్య నియంత్రణ అధికారులది,ఎన్నో సార్లు పిర్యాదు చేసిన అధికారులు కర్మాగార యాజమాన్యంతో కుమ్ముక్కై లంచాలు తీసుకొంటు చర్యలు తీసుకోవడం లేదు,జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు గల అధికారులు మాటలకే పరిమితం అవుతున్నారు,నారింజ జలాలు కలుషిo ఆవుతున్నాయి దీనిపై ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకివాలి కానీ ఎలాంటి చర్యలు కనబడటం లేదు.కర్మాగారం మొత్తం పరిధి విస్తీర్ణం లెక్క గట్టి మున్సిపల్ అధికారులు ట్యాక్స్ విధించాలి కానీ అది కూడా సక్రమంగా జరగడం లేదు ఇది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.ప్రతి కర్మాగార యాజమాన్యం తమకు వచ్చిన లాభాలలో 2% సియస్ఆర్ నిధులు కేటాయించి ప్రజల అభివృద్ధికి కేటాయించాలి కానీ అది ఎక్కడ కనబడటం లేదు.కర్మాగారంలో సుమారు 2000 వరకు కార్మికులు పనిచేస్తున్నారు అందులో 200 మంది మాత్రమే స్థానికులు ఉన్నారు నిబంధనల ప్రకారం 80% స్థానికులు ఉండాలి స్థానిక భూమి,స్థానిక నీళ్లు,స్థానిక విద్యుత్ వాడుకొంటు వందల కోట్లు సంపాదిస్తు స్థానిక పశు సదంపదను తగ్గించే, కాలుష్యాన్ని వేదజేల్లే, స్థానికులకు ఉపాధి కల్పించని కర్మాగారాలు మనకు అవసరం లేదు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,నాయకులు జి.నర్సింలు,శికారి గోపాల్, చల్లా శ్రీనివాస్ రెడ్డి,లు ఉన్నారు.

వికాస తరంగిణి ఆధ్వర్యంలో స్వర్ణామృత ప్రాసనా కార్యక్రమం

వికాస తరంగిణి ఆధ్వర్యంలో స్వర్ణామృత ప్రాసనా కార్యక్రమం
జమ్మికుంట నేటిధాత్రి:

శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనములతో వికాస తరంగిణి జమ్మికుంట శాఖ వారు జమ్మికుంట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆరు నెలల నుండి 16 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలకు ఈరోజు ఉదయం 7 గంటల నుండి 10 30 నిమిషాల వరకు స్వర్ణామృత ప్రాసన కార్యక్రమంలో 210 మందికి డ్రాప్స్ వేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వికాస్ తరంగిణి చీఫ్ కోఆర్డినేటర్ వచ్చు వీర లింగం ముక్క శివకుమార్ దేవాలయం ప్రధాన చార్యులు లింగరి హరికృష్ణ మాచార్యులు ఆలయ కమిటీ చైర్మన్ ముక్క జితేందర్ గుప్తా ట్రెజరర్ అంతం రాజిరెడ్డి పుల్లూరు ప్రభాకర్ రావు మరియు కమిటీ సభ్యులు మహిళా వికాస్ తరంగణి సభ్యులు 50 మంది పాల్గొన్నారు

ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి.

ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి

భూభారతి లోని లోపాలను వెంటనే సవరించాలి

ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో విఫలం చెందిందని, తక్షణమే పూర్తిస్థాయిలో 6 గ్యారంటీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించుకోవాలని మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ( ఐక్య)- ఎం సి పి ఐ (యు) రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబురావు అన్నారు.ఆ పార్టీ పిలుపులో భాగంగా దుగ్గొండి మండల తహసిల్దార్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి పలు డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కుసుంబ బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంలోని లోపాలను తక్షణమే సవరించి పేద ప్రజలకు అండగా నిలవాలని, పెంచిన విద్యుత్ బస్ చార్జీలను తగ్గించాలని అంతేకాకుండా గ్రామాలలో కేటాయిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.తద్వారా పేద బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా 6 గ్యారంటీలను అమలు సంపూర్ణంగా అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలని, లేనియెడల ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజాఉద్యమాలను నిర్మిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నాగేల్లి కొమురయ్య, పేరబోయిన చేరాలు,మేరుగు సుధాకర్, ఐలోని, సురేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను అడ్డుకోవడం సిగ్గుచేటు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను అడ్డుకోవడం సిగ్గుచేటు-కె. యూ విద్యార్థి సంఘాలు

నేటిధాత్రి :హన్మకొండ

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను అడ్డుకోవడం సిగ్గుచేటని కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధి సంఘాలు అన్నారు.

శనివారం కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసుకున్న విద్యార్థి సంఘాల సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు డా.సయ్యద్ వలి ఉల ఖాద్రి(ఏ.ఐ.వై.ఫ్)దుర్గం సారయ్య (పి.డి.యస్. యూ) గుగులోతు రాజు నాయక్( గిరిజన శక్తి) మెడ రంజిత్ (టి.జి.వి.పి) మట్టెడ కుమార్ (పరిశోధక నాయకులు) కన్నం సునీల్ (టి.యస్. ప్) దుప్పటి కిషోర్ కడాపాక రాజేందర్ ,బొట్ల మనోహర్ (బి.యస్.ఫ్) హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్య అందాలని మంచి ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయం చేసింది దానిలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ప్రారంభించడానికి యూనివర్సిటీని సంప్రదిస్తే యూనివర్సిటీ అధికారులు పోలీస్ క్యాంపు ని తీసేసి ఆ క్యాంపు స్థలాన్ని కేటాయించారని

ఈ నిర్ణయాన్ని అన్ని ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాలు స్వాగతించాయని కానీ కొన్ని విద్యార్థి సంఘాలు సొంత రాజకీయ ఎజెండా తో కుట్రలతో దీన్ని అడ్డుకోవాలని చుస్తున్నారని దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్య అందుతుందని నగరంలో మంచి వాతావరణం లో విద్య అందే అవకాశముంటుందని యూనివర్సిటీ పరిధిలో పెడితే రోడ్డు రవాణా సౌకర్యాలు కూడా అనుకూలంగా ఉంటుందని కావున వెంటనే స్కూలు ప్రారంభించి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాము.

అదే విధంగా కొందరు కావలసికొని కుట్రలు చేసి అడ్డుకోవాలని చూస్తున్నారని వారి ప్రయత్నాలు ఫలించవని ప్రభుత్వం స్కూలు నిర్మాణం చేపట్టి స్కూల్ ప్రారంభించాలని కోరుతున్నాం.

ఈ కార్యక్రమంలో పి.డి. యస్. యూ హన్మకొండ జిల్లా అధ్యక్షులు వంశీ కృష్ణ సౌరవ్ రాహుల్ వర్ధన్ శివ రెడ్డి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు

కే.యు ఆంగ్ల విభాగంలో పీహెచ్డి సూపర్వైజర్ గా ప్రొఫెసర్.

కే.యు ఆంగ్ల విభాగంలో పీహెచ్డి సూపర్వైజర్ గా ప్రొఫెసర్ నవీన్ ఎంపిక

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

కాకతీయ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పీహెచ్డి సూపర్వైజర్ గా నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ ఎంపికయ్యారు.
ప్రొఫెసర్ మల్లం నవీన్ ను కాకతీయ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పీహెచ్డీ గైడ్ షిప్ ను అందించింది.కాగా
వీరు ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సభ్యులుగా కొనసాగుతున్నారు.
కాకతీయ యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ కే. ప్రతాప రెడ్డి,రిజిస్ట్రార్, ఆర్ట్స్ డీన్ ఈ సందర్భంగా అభినందించారు.తెలంగాణ ప్రభుత్వం నుండి స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డును,ఏల్టాయి నుండి నేషనల్ లెవెల్ బెస్ట్ టీచర్ అప్రిసియేషన్ అందుకుని,వివిధ నేషనల్, ఇంటర్నేషనల్ సెమినార్లలో దాదాపు 59 పరిశోధన పత్రాలను, వివిధ జర్నల్ మరియు పుస్తకాలలో దాదాపు 30 వ్యాసాలను ఇప్పటివరకు ఆయన సంపర్పించారు.ఈ సందర్భంగా జరిపిన సమావేశంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, వివిధ కళాశాలల నుంచి అధ్యాపకులు ప్రొఫెసర్ మల్లం నవీన్ ను ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా పరిశోధనలు చేసే విద్యార్థులకు మెంటారుగా ,సూపర్వైజర్ గా తన యొక్క విద్యార్థులు పరిశోధన గ్రంథం సమర్పించడంలో తగు సలహాలు సూచనలు ఇస్తూ పరిశోధక విద్యార్థుల యొక్క అత్యున్నత డిగ్రీ( పీహెచ్డీ పట్టా) పొందడంలో పారదర్శకంగా, నిజాయితీగా నాణ్యమైన పరిశోధనలు రావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ గొప్ప అవకాశం కల్పించిన కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కే. ప్రతాప రెడ్డి, రిజిస్టర్, ఆర్ట్స్ డీన్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కు ఉన్నత గౌరవం దక్కడంతో కళాశాల యొక్క కీర్తి మరో మైలురాయి దాటినట్టు అధ్యాపక మిత్రులు సిబ్బంది, విద్యార్థులు సంతోషాన్ని ప్రకటించారు.

error: Content is protected !!
Exit mobile version