ఆస్కార్ అకాడమీలో తెలుగు వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్.

 ఆస్కార్ అకాడమీలో తెలుగు వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్…

 

ప్రపంచమంతా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల కమిటీలో సభ్యుడిగా వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ యుగంధర్ తమ్మారెడ్డి ఎంపికయ్యారు.ప్రపంచమంతా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల కమిటీలో ( Oscars committee) సభ్యుడిగా వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ (VFX Supervisor) యుగంధర్ తమ్మారెడ్డి (Yugandhar Tammareddy) ఎంపికయ్యారు.

ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్‌లో ప్ర‌ముఖంగా వార్త‌ల్లో నిలిచింది. తెలుగు సినిమా పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) రంగంలో విశేష కృషి చేసిన యుగంధర్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ Academy of Motion Picture Arts and Sciences (AMPAS) లో 2025 క్లాస్‌లో సభ్యుడిగా చేరడంతో అంతర్జాతీయ స్థాయిలోఆయ‌న గుర్తింపును సాధించారు. ఇప్ప‌టివ‌ర‌కు 125కి పైగా చిత్రాల‌కు ప‌ని చేసిన ఆయ‌న త‌న అద్భుత ప్ర‌తిభ‌తో తెలుగు సినిమాల్లో వీఎఫ్ఎక్స్ రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.

1999లో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన రాజకుమారుడు చిత్రంతో కెరీర్ మొదలు పెట్టిన యుగంధర్ నాటి నుంచి తెలుగు సినిమాల్లో వీఎఫ్ఎక్స్ వినియోగాన్ని కొంత పంత‌లు తొక్కించాడు.
ఆ రంగంలో నిరంతరం నూత‌న‌ ఆవిష్కరణలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కు విజువ‌ల్ ట్రీట్ అందించడంలో కీల‌క పాత్ర పోషించాడు. రంగస్థలం చిత్రంలో గ్రామీణ నేపథ్యాన్ని సజీవంగా తీర్చిదిద్దిన విజువల్స్, అల వైకుంఠపురము, దేవరలో యాక్షన్ సన్నివేశాల విజువ‌ల్స్ తెలుగు ప్రేక్షకుల నుంచి మాత్రమే కాక, దేశ వ్యాప్తంగా యుగంధ‌ర్‌కు మంచి పేరును తీసుకు వ‌చ్చాయి.ఇదిలాఉంటే..
‘ది అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ ఇటీవల విడుదల చేసిన కొత్త కమిటీ సభ్యుల జాబితాలో భారత్‌ నుంచి కమల్‌ హాసన్‌ (Kamal Haasan)తో పాటు నటుడు ఆయుష్మాన్‌ ఖురానా, దర్శకురాలు పాయల్‌ కపాడియా, ఫ్యాషన్‌ డిజైనర్‌ మాక్సిమా బసు ఉన్నారు.
ప‌లువురు హాలీవుడ్‌ నటీనటులతో పాటు ఆస్కార్‌ ఓటింగ్‌ ప్రక్రియలో వీరు పాలు పంచుకోనున్నారు. దీంతో అకాడెమీ 2025 క‌మిటీలో యుంధ‌ర్ ఎంపిక‌తో తెలుగు సినిమాకే కాకుండా మొత్తం భారతీయ వీఎఫ్ఎక్స్ రంగానికి గర్వకారణమ‌ని, మ‌రో సారి భార‌తీయుడి ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి చాటి చెప్పార‌ని ఆయ‌న‌ను కొనియాడుతున్నారు.
అన్ని ఇండ‌స్ట్రీల‌ నుంచి ఆయ‌న‌కు ప్ర‌శంస‌ల వెళ్లువెత్తుతున్నాయి.ఇక‌పై మ‌న‌ సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందని అంటున్నారు.

కే.యు ఆంగ్ల విభాగంలో పీహెచ్డి సూపర్వైజర్ గా ప్రొఫెసర్.

కే.యు ఆంగ్ల విభాగంలో పీహెచ్డి సూపర్వైజర్ గా ప్రొఫెసర్ నవీన్ ఎంపిక

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

కాకతీయ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పీహెచ్డి సూపర్వైజర్ గా నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ ఎంపికయ్యారు.
ప్రొఫెసర్ మల్లం నవీన్ ను కాకతీయ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పీహెచ్డీ గైడ్ షిప్ ను అందించింది.కాగా
వీరు ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సభ్యులుగా కొనసాగుతున్నారు.
కాకతీయ యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ కే. ప్రతాప రెడ్డి,రిజిస్ట్రార్, ఆర్ట్స్ డీన్ ఈ సందర్భంగా అభినందించారు.తెలంగాణ ప్రభుత్వం నుండి స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డును,ఏల్టాయి నుండి నేషనల్ లెవెల్ బెస్ట్ టీచర్ అప్రిసియేషన్ అందుకుని,వివిధ నేషనల్, ఇంటర్నేషనల్ సెమినార్లలో దాదాపు 59 పరిశోధన పత్రాలను, వివిధ జర్నల్ మరియు పుస్తకాలలో దాదాపు 30 వ్యాసాలను ఇప్పటివరకు ఆయన సంపర్పించారు.ఈ సందర్భంగా జరిపిన సమావేశంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, వివిధ కళాశాలల నుంచి అధ్యాపకులు ప్రొఫెసర్ మల్లం నవీన్ ను ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా పరిశోధనలు చేసే విద్యార్థులకు మెంటారుగా ,సూపర్వైజర్ గా తన యొక్క విద్యార్థులు పరిశోధన గ్రంథం సమర్పించడంలో తగు సలహాలు సూచనలు ఇస్తూ పరిశోధక విద్యార్థుల యొక్క అత్యున్నత డిగ్రీ( పీహెచ్డీ పట్టా) పొందడంలో పారదర్శకంగా, నిజాయితీగా నాణ్యమైన పరిశోధనలు రావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ గొప్ప అవకాశం కల్పించిన కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కే. ప్రతాప రెడ్డి, రిజిస్టర్, ఆర్ట్స్ డీన్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కు ఉన్నత గౌరవం దక్కడంతో కళాశాల యొక్క కీర్తి మరో మైలురాయి దాటినట్టు అధ్యాపక మిత్రులు సిబ్బంది, విద్యార్థులు సంతోషాన్ని ప్రకటించారు.

మహిళా దినోత్సవ సందర్భంగా సూపర్వైజర్ కు సన్మానం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సూపర్వైజర్ కు సన్మానం.

చిట్యాల, నేటిధాత్రి ;

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శనివారం రోజున భూపాల్ పల్లి కలెక్టర్ ఆఫీస్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ డి డబ్ల్యు ఆధ్వర్యంలో శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు సమక్షంలో అడిషనల్ కలెక్టర్ ప్రోగ్రాం నిర్వహించి ఉత్తమ ఉద్యోగులకు శాలువా షీల్డ్ సర్టిఫికెట్స్ తో సన్మానించారు అందులో భాగంగా చిట్యాల మండలంలో కొత్తపేట అంగన్వాడీ టీచర్ ఉమాదేవిని మరియు ఆయా తిరుమలాపూర్ ఓదెమ్మను మండల్ సూపర్వైజర్ జయప్రదను జిల్లా అధికారులందరూ కలిసి సన్మానించారు ఇందులో భాగంగా శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ ని కోలాటం పాట ద్వారా స్వాగతం తెలుపుతూ చిట్యాల మండల టీచర్స్ 20 మంది కోలాటం చేయడం జరిగింది ఆటల పోటీలలో గెలుపొందిన నలుగురు టీచర్స్ సాధన విజయ తిరుమల సుజాత బహుమతులు గెలుచుకున్నారు అనంతరం అ డిషనల్ కలెక్టర్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ డిడబ్ల్యుఒ చేతుల మీదుగా ఆవార్డ్స్ పొందారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version