అజిత్ పవార్.. మహారాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు: సీఎం ఫడ్నవీస్…

అజిత్ పవార్.. మహారాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు: సీఎం ఫడ్నవీస్

 

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారని తెలిపారు. రాష్ట్రంలో విషాద వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.

 మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) మృతిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారని తెలిపారు. రాష్ట్రంలో విషాద వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. పవార్ లాంటి మంచి నాయకుడిని కోల్పోవడం తీరని లోటని చెప్పుకొచ్చారు.

వ్యక్తిగత జీవితంలో అజిత్ పవార్‌ తనకు మంచి స్నేహితుడని ప్రస్తావించారు. మహారాష్ట్ర అభివృద్ధికి అజిత్ పవార్ కృషి చేస్తున్న తరుణంలో ఆయన అకాల మరణం తీరని లోటని తెలిపారు. పవార్ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. మరికాసేపట్లో బారామతికి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే వెళ్లనున్నారు. వారి కుటుంబ సభ్యులను సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. అనంతరం అజిత్ పవార్‌కు నివాళులు అర్పించనున్నారు.

అజిత్ పవర్ గొప్ప వ్యక్తి: ఆశిష్ షెలార్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ మృతిపై మహారాష్ట్ర మంత్రి, బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ ఆశిష్ షెలార్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అజిత్ పవార్‌ సేవలను కొనియాడారు. అనంతరం మీడియాతో ఆశిష్ షెలార్ మాట్లాడారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ గొప్ప వ్యక్తి అని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా హఠాన్మరణం చెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.అజిత్ పవార్ నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి అని కీర్తించారు. కరోనా సంమయంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని ప్రశంసించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ ప్రత్యేకమైన ముద్ర వేశారని తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 6గంటల నుంచే ఆయన ప్రజల కోసం అందుబాటులో ఉండే వారని కీర్తించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడిగా అజిత్ పవార్ ఉన్నారని తెలిపారు. అజిత్ పవర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. ఆ పరమేశ్వరుడు ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉండి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఆశిష్ షెలార్ పేర్కొన్నారు.

ఒలిమా డిన్నర్ పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు….

ఒలిమా డిన్నర్ పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్, నేటిధాత్రి:

ఝరాసంగం గ్రామానికి చెందిన సొసైటీ కార్యదర్శి నిస్సర్ అహ్మద్ గారి సోదరుని ఒలిమా డిన్నర్ కార్యక్రమంలో పాల్గొని పెళ్లి కుమారుని పూలమాలలతో సన్మానించారు తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్.ఈ సందర్బంగా నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలిపారు.బొగ్గుల జగదీశ్వర్. తో పాటు మండల మాజీ ఎంపీటీసీ సంతోష్ రజిని ప్రియ మాజీ ఎంపీటీసీ విజేందర్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ ఏజాస్ బాబా సర్పంచ్ లు వార్డ్ మెంబర్లు నాయకులు పాల్గొన్నారు …

విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలి…

విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలి

​- బీజేవైఎం కళాశాలల రాష్ట్ర కన్వీనర్‌ మంద మహేష్ డిమాండ్

​గణపురం, నేటిధాత్రి:

 

గణపురం మండలం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని, గణపురం మండలంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పాఠశాలలకు తక్షణమే సెలవులు ప్రకటించాలని బీజేవైఎం కళాశాలల రాష్ట్ర కన్వీనర్‌ మంద మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ​​ఈ నెల 28 నుండి 31 వరకు జరిగే జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారని, దీనివల్ల గణపురం మండలంలోని ప్రధాన రహదారులన్నీ బస్సులు, భారీ వాహనాలతో నిండిపోయాయని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారి విద్యార్థులు సైకిళ్లపై వెళ్తూ ఈ రద్దీలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రహదారులు దాటే సమయంలో ప్రాణాపాయం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జాతర సందర్భంగా మూడు, నాలుగు రోజులు సెలవులు ఇచ్చే ఆనవాయితీ ఉందని, కానీ ఈసారి ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని విమర్శించారు. విద్యార్థుల భద్రత కంటే ముఖ్యం ఏదీ కాదు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే దానికి బాధ్యులు ఎవరని మంద మహేష్ ప్రశ్నించారు. తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నాలుగు రోజులు మండలంలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేవైఎం నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఉచిత నేత్ర పరీక్ష క్యాంప్..

ఉచిత నేత్ర పరీక్ష క్యాంప్

సర్పంచ్ భానోత్ రమ భగవాన్ ఆధ్వర్యంలో

సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా నేత్ర వైద్య శిబిరం

నిరుపేదలకు కంటి చూపును ఇవ్వడమే మా స్వచ్ఛంద సేవ సంస్థ ఉద్దేశం… డాక్టర్ మాధవరావు.

మహబూబాబాద్, నేటిధాత్రి:

మండలంలోని గోవిందపురం గ్రామంలో సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్ట్ డాక్టర్ మాధవరావు నిరుపేదలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు మరియు కంటి ఆపరేషన్లు గోవిందాపురం గ్రామ సర్పంచ్ భానోత్ రమ భగవాన్ల ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి పరీక్షల శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ భానోత్ రమ పాల్గొన్నారు. గ్రామంలోని నిరుపేదలకు కంటి పరీక్ష చేయించుకోలేనటువంటి వారికి సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్టు వారిచే ఉచితంగా కంటి ఆపరేషన్లు అవసరం ఉన్నవారికి కంటి అద్దాలు ఆపరేషన్ చేయాలన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గోవిందపురం గ్రామ ప్రజలు 111 మంది ఉచిత వైద్య శిబిరంలో పరీక్షల నిర్వహించుకున్నారని వారిలో 40 మందికి ఉచితంగా కంటి అద్దాలు అందించడం జరిగిందని, అలాగే కంటి ఆపరేషన్ అవసరం ఉన్నటువంటి 9 మందికి ఆపరేషన్ నిర్వహించుటకు జిల్లా మహబూబాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి సూర్య స్వచ్ఛత సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ మాధవరావు కంటి దావకానలో ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. మనిషి మనుగడ సజావుగా సాగాలంటే నయనాలు ప్రధానం అలాంటి నాయాలు నేత్రాలు నేడు మనం తింటున్నటువంటి కలుషిత ఆహారం వల్ల రెండవ అనారోగ్య సమస్యలు ఏర్పడడంతో నిరుపేదలైన వారు వైద్యం చేయించుకోలేక స్తోమత లేక నిర్లక్ష్యం వహిస్తున్నారని అంతత్వంతో కాలం గడుపుతున్నారని ఇలాంటి వారి పట్ల దాతృత్వం చాటుకొని ముందుకు పోతున్న సంస్థ సూర్య స్వచ్ఛంద సేవ ట్రస్ట్ మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతుందని నిరుపేదలైన వారికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్లు చేసి మరి కంటి అద్దాలను ఇస్తుందని ఎవరికీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చేర్చుకునే మా గొప్ప అవకాశం కల్పిస్తున్నారని గ్రామ ప్రజల తరఫున సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని గ్రామ సర్పంచ్ భానోత్ రమా భగవాన్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి వారు గ్రామ వార్డు సభ్యులు కాంపాటి వెంకన్న, యాకయ్య, ప్రభాకర్, దేవేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం భజన మండలి అనుమతికి వినతిపత్రం…

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం భజన మండలి అనుమతికి వినతిపత్రం

జహీరాబాద్, నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భజన మండలి ప్రత్యేక కార్యక్రమాల కోసం అనుమతి కోరుతూ ఒక వినతిపత్రాన్ని దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు అందజేశారు.తుమ్మన్ పల్లి గ్రామానికి చెందిన మల్లిపటిల్ సిద్ధారెడ్డి ఈ వినతిపత్రం ద్వారా తమ గ్రామంలోని “శివ శరన్నే – హేమరెడ్డి మల్లమ్మ” భజన బృందం ద్వారా శైవతత్వాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక–సాంప్రదాయ కళాప్రదర్శన నిర్వహించేందుకు ఆలయ ప్రాంగణంలో సమయాన్ని కేటాయించాలని కోరారు.భక్తులకు శైవభక్తి, సాంప్రదాయ కళలను చేరవేయాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శనను మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపింది భజన మండలి. వినతిపత్రాన్ని స్వీకరించిన ఆలయ అధికారులు త్వరలో నిర్ణయం తెలియజేస్తామని వెల్లడించారు.

మీ మెదడుకు మేత.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 50 సెకెన్లలో కనిపెట్టండి..

మీ మెదడుకు మేత.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 50 సెకెన్లలో కనిపెట్టండి

 

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఒక బాలిక కేక్ తయారు చేయడానికి మిక్స్ చేస్తోంది. పక్క పక్కనే ఉన్న రెండు ఫొటోల్లోనూ అదే దృశ్యం ఉంది. అయితే ఆ రెండు ఫొటోల్లో మూడు చిన్న తేడాలున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే ఆ రెండు ఫొటోల మధ్యనున్న తేడాలు కనబడతాయి. 50 సెకెన్ల వ్యవధిలో ఆ తేడాలను కనిపెడితే మీ బ్రెయిన్ స్పీడ్‌గా పని చేస్తున్నట్టు లెక్క. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ రెండు ఫొటోల మధ్యనున్న తేడాలేంటో తెలుస్తుంది.

ఎమ్మెల్యే దొంతి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు….

ఎమ్మెల్యే దొంతి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని 25వ వార్డు నుండి పలువురు ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీపీసీసీ సభ్యులు,మాజీ కౌన్సిలర్ పెండెం లక్ష్మిరామానంద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారిలో నల్గొండ సంతోష్,నల్గొండ వంశీ,చీకటి శివమణి,ముద్రబోయిన రాజు,పుట్ట జగదీష్,పుట్ట రామస్వామి,జాటోతు వీరన్న,మురారి వినయ్,స్వామిశెట్టి రాజశేఖర్,చీకటి విజయ్,శ్రీనివాస్ ఉన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి,మాజీ ఎంపిటిసి కాట ప్రభాకర్,కాట రఘు,మెరుగు కిరణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

సంగారెడ్డిలో కొత్త సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు మంత్రి పొంగులేటి శంకుస్థాపన…

సంగారెడ్డిలో కొత్త సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు మంత్రి పొంగులేటి శంకుస్థాపన

 

సంగారెడ్డి జిల్లాలో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో కోట్లాది రూపాయలు ఫీజులు చెల్లించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని మంత్రి వివరించారు.

సంగారెడ్డి, జనవరి 28: సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం కర్దనూరులో నూతనంగా నిర్మించనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Pongulet Srinivasreddy), వివేక్ వెంకట స్వామి(Minister Vivek Venkata Swamy) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భూమి సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ధరణి వ్యవస్థను మార్చి.. భూ భారతి వ్యవస్థను తీసుకొచ్చామని.. సామాన్య ప్రజలకు ఒక చుట్టం లాంటిదిగా భూ భారతిని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో కోట్లాది రూపాయలు ఫీజులు చెల్లించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని వివరించారు.
అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్(ORR) పరిధిలో 11 ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. పటాన్‌చెరు ప్రాంతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోసం 3 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వానికి అదనపు భారం పడకుండా సీఎస్‌ఆర్ ఫండ్ ద్వారా ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు చెప్పారు. నిర్మాణ పనులను రాజ్ పుష్ప సంస్థకు అప్పగించినట్లు వివరించారు. రాబోయే 6 నెలల్లో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో అన్ని సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.పెద్దపల్లిలోనూ రాజ్ పుష్ప సంస్థ.. భవన నిర్మాణాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ భవనాల మెయింటెనెన్స్‌ను ఐదేళ్ల పాటు సంబంధిత సంస్థలకే అప్పగించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 ఏజెన్సీలను ఎంపిక చేసి ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తున్నట్లు వెల్లడించారు. ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫైవ్ స్టార్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. మ్యారేజ్ హాల్స్, చంటి పిల్లల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఉండనున్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు లేకుండా భూధార్ వ్యవస్థను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఒకే ప్లాట్‌ఫాం ద్వారా భూమి సరిహద్దులు, వివరాలు అందుబాటులో ఉండనున్నాయని అన్నారు.

మద్యం అమ్మితే 50వేలు..

మద్యం అమ్మితే 50వేలు
పట్టించిన వారికి 10 వేలు నజరానా
గ్రామ సభలో తీర్మానం.

నిజాంపేట, నేటి ధాత్రి:

గ్రామాల్లో బెల్ట్ షాపులపై ప్రజలు కదం తొక్కుతున్నారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించి మద్యపాన నిషేధాన్ని తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం అమ్మితే 50 వేలు జరిమానా, పట్టించిన వారికి 10 వేలు నజరానా అందజేస్తామని గ్రామంలో గ్రామ సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మ గౌడ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ఎవరైనా గ్రామంలో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మమత, ఉపసర్పంచ్ దేవరాజ్, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

పశువులకు గర్భకోశ వ్యాధి టీకాలు..

పశువులకు గర్భకోశ వ్యాధి టీకాలు..

నిజాంపేట, నేటి ధాత్రి:

పశువులకు గర్భకోశ వ్యాధి టీకాలు పశుసంవర్ధక శాఖ సహకారంతో అందివ్వడం జరుగుతుందని మండల పశువైద్యాధికారి మణికుమార్ అన్నారు. నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న, రమేష్ ఆధ్వర్యంలో రైతుల పశువులకు టీకాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లేగ దూడలు పుట్టిన 15 రోజుల నుండి ఆరు నెలల వరకు నట్టల నివారణ మందులు తాగించడం వల్ల లేగ దూడలు ఎదుగుతాయన్నారు. రైతులు ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అవినీతి కట్టడితో ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తున్నాం..

అవినీతి కట్టడితో ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తున్నాం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 

గత 11 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. అవినీతి కట్టడితో ప్రభుత్వం.. ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తోందన్నారు. ఇవాళ ఉభయసభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో పలు కీలక విషయాలు ఉన్నాయి.

న్యూ ఢిల్లీ, జనవరి 28: 2026 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజైన ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి.. దేశం వికసిత్ భారత్‌ వైపు పయనిస్తోందని చెప్పారు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత పదేళ్లలో పేదల కోసం 4కోట్ల ఇళ్లు కట్టించామని, జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు.
‘పదేళ్లలో 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. సామాజిక న్యాయం ప్రాతిపదికన కేంద్రం పనిచేస్తోంది. వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల ద్వారా సేవలు విస్తరించాం. ప్రతి పౌరుడికి జీవిత బీమా కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. ఆయుష్మాన్ భారత్‌తో కోట్లమందికి వైద్యసేవలందిస్తున్నాం. వరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నెం1 స్థానంలో నిలిచింది. అక్వా, పాల ఉత్పత్తుల్లో భారత్ ముందంజలో ఉంది’ అని రాష్ట్రపతి వెల్లడించారు.

దేశంలో స్పేస్ టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని రాష్ట్రపతి అన్నారు. భవిష్యత్‌లో అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని, జమ్మూకశ్మీర్‌లో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మించామని గుర్తు చేశారు. గత 11 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని రాష్ట్రపతి చెప్పారు.

ఇంకా రాష్ట్రపతి తన ప్రసంగంలో ఏమన్నారంటే.. ‘అవినీతి కట్టడితో ప్రభుత్వ ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తోంది. GST స్లాబ్‌ల తగ్గింపుతో దేశ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. యూరోపియన్ యూనియన్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. రూ.12లక్షల వార్షిక ఆదాయం వరకు ఆదాయపు పన్ను లేకుండా చేశాం. స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లోనూ భారత్ దూసుకెళ్తోంది. భారత్ పవర్ టెక్నాలజీ హబ్‌గా రూపొందుతోంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్‌ను పవర్ హౌస్‌గా తయారు చేస్తున్నాం. భవిష్యత్‌లో 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి చర్యలు. వికసిత్

గ్రేటర్ వరంగల్ మేయర్ సొంత డివిజన్‌లోనే అధ్వాన్న రోడ్డు..!

గ్రేటర్ వరంగల్ మేయర్ సొంత డివిజన్‌లోనే అధ్వాన్న రోడ్డు..!

ఆరు నెలలుగా పట్టించుకోని మేయర్–అధికారులు?

మేడారం జాతర సందర్భంగా స్పందించాలంటున్న వాహనదారులు

వరంగల్, నేటిధాత్రి:

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న రోడ్డు పరిస్థితి నగర పాలన తీరుకు అద్దం పడుతోంది.నగర మేయర్ స్వయంగా ఎన్నికైన 29వ డివిజన్ పరిధిలోకి వచ్చే వరంగల్ పోతన నగర్ నుంచి హంటర్ రోడ్డుకు వెళ్లే మార్గం పూర్తిగా అధ్వాన్నంగా మారి, నిత్యం రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.గత ఆరు నెలలుగా కొన్ని పత్రికల్లో ఈ రోడ్డు సమస్యపై వార్తలు వచ్చినప్పటికీ, నగర మేయర్ గానీ, మున్సిపల్ అధికారులు గానీ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.ముఖ్యంగా మేడారం మహాజాతర నేపథ్యంలో ఈ రోడ్డుమీదుగా భక్తులు, వాహనాలు భారీగా ప్రయాణించనున్న నేపథ్యంలో, ప్రమాదాలకు ఆస్కారం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కనీసం తాత్కాలికంగైనా మొరం పోసి రోడ్డు సరిచేసి, భక్తులకు మరియు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా సజావుగా సాగేటట్లు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.“గ్రేటర్ వరంగల్ మేయర్ సొంత డివిజన్‌లోనే ఇలాంటి దయనీయ స్థితిలో రోడ్డు ఉంటే, మిగతా డివిజన్ల పరిస్థితి ఏమిటి?” అంటూ వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.లక్షల రూపాయలు ఖర్చు చేసి విహారయాత్రలు, పర్యటనలకు వెళ్లే ప్రజాప్రతినిధులు, తమ సొంత డివిజన్‌లో కనీస రోడ్డు సౌకర్యాన్ని కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Mayor-officials

నగర మేయర్ హోదాలో ఉండి తన డివిజన్ సమస్యలకే పరిష్కారం చూపలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందనివాహనదారులు నిలదీస్తున్నారు.నగర మేయర్ గానీ, మున్సిపల్ అధికారులు గానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి తక్షణమేరోడ్డుమరమ్మతులులేదానిర్మాణపనులుచేపట్టాలని,లేకపోతేప్రజాగ్రహానికిగురికావాల్సివస్తుందనివాహనదారులుహెచ్చరిస్తున్నారు.ఇదిలా ఉండగా,ఈ రోడ్డు సమస్యపై పెద్ద పత్రికలు, ఛానెళ్లు అని చెప్పుకునే”కొందరు”మీడియాప్రతినిధులుఒక్కవార్తకూడారాయకపోవడంపలుఅనుమానాలకుతావిస్తోంది.మేయర్‌కుఅనుకూలంగా వ్యవహరిస్తూ వార్తలను పక్కన పెట్టారాఅనేసందేహాలువ్యక్తమవుతున్నాయి.అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ స్థానిక యువత రీల్స్ రూపొందించి సోషల్ మీడియాలో వైరల్చేస్తున్నా,ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

పరుగు ఆపని బంగారం.. రూ.4 లక్షలకు చేరకున్న వెండి..

పరుగు ఆపని బంగారం.. రూ.4 లక్షలకు చేరకున్న వెండి..

బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. పరుగు ఆపకుండా ముందుకు సాగుతున్నాయి. బంగారం ధర పది గ్రాములకు రూ.3,220 మేర పెరిగింది. వెండి కిలోకు రూ.10 వేల మేర పెరిగింది.

బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. పరుగు ఆపకుండా ముందుకు సాగుతున్నాయి. బంగారం ధర పది గ్రాములకు రూ.3,220 మేర పెరిగింది. వెండి కిలోకు రూ.10 వేల మేర పెరిగింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది (Gold prices).
ఈ రోజు (జనవరి 28న) ఉదయం 11:00 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,65,170కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,950 మేర పెరిగి రూ. 1,51,400కి చేరింది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,65,300కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,51,550కి చేరుకుంది.మరోవైపు వెండి కూడా జోరు చూపిస్తోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలోకు పది వేల రూపాయల మేర పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.4,00,00కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.3.8 లక్షలుగా ఉంది.

అజిత్ పవార్ మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి…

అజిత్ పవార్ మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

 

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(66) విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అజిత్ పవార్‌(Ajit Pawar) సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా అజిత్ పవార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
అజిత్ పవార్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం..

‘ఈరోజు ఉదయం విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హఠాత్తుగా మరణించడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. తీవ్ర బాధకు గురిచేసింది. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు అందులో పేర్కొన్నారు.

అజిత్ పవార్ మృతిపై కేబినెట్ సంతాపం..

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతిపై ఏపీ కేబినెట్ సంతాపం వ్యక్తం చేసింది. మంత్రి మండలి సమావేశం ప్రారంభ సమయంలో అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. ప్రమాదంలో అజిత్ పవార్‌తో సహా ఐదుగురు చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. అజిత్ పవార్‌తో తనకు ఉన్న పరిచయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ముంబై నుంచి బారామతి వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణంతో దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మృతి తీరని లోటని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అజిత్ పవార్ మృతిపై పవన్ కల్యాణ్ సంతాపం..

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్‌సీపీ అధ్యక్షుడు, ఎన్‌డీఏ కూటమి నాయకులైన అజిత్ దాదా పవార్ ఈరోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారనే విషాద వార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం సోషల్ మీడియా వేదికగా అజిత్ పవార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన చేసిన అంకితభావంతో కూడిన ప్రజాసేవ, మహారాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అందించిన అపారమైన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ప్రజల పట్ల అజిత్ పవార్‌కున్న నిరంతర నిబద్ధతను గౌరవంతో స్మరించుకుంటారని తెలిపారు. ఆయన మరణం పట్ల నేను ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఈ తీవ్ర దు:ఖ సమయంలో అజిత్ పవార్‌ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

అజిత్ పవార్ మృతిపై పీవీఎన్ మాధవ్ విచారం..

అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హృదయ విదారక ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. మృతుల కుటుంబాలకు భగవంతుడు ధైర్యం చేకూర్చాలని ఆకాంక్షించారు.

అజిత్ పవార్ మృతికి రామ్మోహన్ సంతాపం..

అజిత్ పవార్ మృతికి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందడం అత్యంత విషాదకరమని తెలిపారు. ఈ ఘటనతో ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అలాగే ఈ నష్టంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక సానుభూతి వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలవాలని, ఈ కఠిన సమయంలో శోకతప్తులైన కుటుంబానికి, అభిమానులకు ధైర్యం, బలం కలగాలని రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు.

లాభాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

లాభాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సూచీలకు మద్దతుగా నిలుస్తోంది. ఈ ఒప్పందం కారణంగా మంగళవారం లాభపడిన సూచీలు బుధవారం కూడా అదే జోరులో ప్రారంభమయ్యాయి. భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి.

భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సూచీలకు మద్దతుగా నిలుస్తోంది. ఈ ఒప్పందం కారణంగా మంగళవారం లాభపడిన సూచీలు బుధవారం కూడా అదే జోరులో ప్రారంభమయ్యాయి. భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా భారీ లాభాల నుంచి దిగి వచ్చాయి. అయితే ఇప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లోనే కదలాడుతున్నాయి.
గత సెషన్ ముగింపు (81,892)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత భారీ లాభాల్లోకి ఎగబాకింది. ఒక దశలో 600 పాయింట్లకు పైగా లాభపడి 82,500 మార్క్ దాటింది. అయితే ఆ తర్వాత అమ్మకాల కారణంగా కిందకు దిగి వచ్చింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో 335 పాయింట్ల లాభంతో 82,199 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 104 పాయింట్ల లాభంతో 25,279 వద్ద కదలాడుతోంది (stock market news today).సెన్సెక్స్‌లో ఆయిల్ ఇండియా, ఎమ్‌సీఎక్స్ ఇండియా, సీజీ పవర్, ఓ‌ఎన్‌జీసీ, వేదాంత మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఏషియన్ పెయింట్స్, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, ఎయిచర్ మోటార్స్, మారికో, బ్రిటానియా మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 293 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 321 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.60గా ఉంది.

అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్…

అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్

 

 

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల పలువురు తెలంగాణ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్, కేటీఆర్ తదితరులు.. అజిత్ మృతిపై ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్(Maharashtra Deputy CM Ajit Pawar) బుధవారం ఉదయం బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి కేటీఆర్ తదితరులు పవార్ మృతికి సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి..

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి

 

మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అజిత్ అనంతరావు పవార్ ఇవాళ పుణేలో చార్టర్డ్ విమానం కూలిపోవడంతో మృతి చెందారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ అనంతరావు పవార్(Ajit Pawar) ఇవాళ(జనవరి 28) పుణేలో చార్టర్డ్ విమానం కూలిపోవడంతో దుర్మరణం చెందారు. ఈ ఘటనలో ఆయనతోపాటు విమానంలో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముంబై నుంచి బారామతి వెళ్తున్న ఈ ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉదయం 8:45 గంటల సమయంలో క్రాష్ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అజిత్ పవార్ వయసు 66 సంవత్సరాలు.

మున్సిపాలిటీ పై బిఆర్ఎస్ జెండా ఎగురవేయాలి…

మున్సిపాలిటీ పై బిఆర్ఎస్ జెండా ఎగురవేయాలి

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 5 6వ వార్డులు కృష్ణా కాలనీలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బస్తీ బాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొని కాలనీలో పర్యటించారు

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి 5 6వ వార్డు కృష్ణ కాలనీలో ఇంటింటా తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కాలనీలో నెలకొన్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ
కాలనీలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తున్నా పారిశుధ్య నిర్వహణపై అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాలనీ వాసుల సౌకర్యార్థం నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడంతో సింగరేణి పర్యవేక్షణ లేకుండా పోయిందని,ప్రస్తుతం అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు
కృష్ణ కాలనీలోని భూములను సింగరేణి నేరుగా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రత్యేక జీవో ద్వారా భూములు ఇప్పించి,ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ కూడా చేయించి కాలనీ వాసులకు అందించామని, అలాగే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛమైన గోదావరి జలాలను సరఫరా చేసి కాలనీ వాసుల నీటి కష్టాలను తీర్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న, ప్రజలను మాయ మాటలతో మోసం చేసే నాయకులకు బుద్ది చెప్పాలన్న రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కమ్యూనిస్టు పార్టీలో చేరికలు…

కమ్యూనిస్టు పార్టీలో చేరికలు

* మున్సిపల్ ఎన్నికలలో సీపీఐ అభ్యర్థులు
* చేవెళ్ల 17వ వార్డు నుండి సీపీఐ అభ్యర్థి సాల్రా వెంకటేష్
* సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కే. రామస్వామి
వారికీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానం పలికారు

చేవెళ్ల, నేటిధాత్రి:

 

భారత కమ్యూనిస్టు పార్టీ నిరుపేదల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పేదల పక్షాన చేస్తున్న పోరాటాలు ఆకర్శించి పలువురు సిపిఐ పార్టీలో చేరుతున్నారని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కే. రామస్వామి అన్నారు. చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం చేవెళ్ల ప్రాంతానికి చెందిన సాల్రా వెంకటేష్ పరివేద సత్యం కుక్కుడాల వెంకటేష్ తదితరులు భారత కమ్యూనిస్టు పార్టీలో చేరినారు వీరికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నియోజకవర్గం ఇన్చార్జి కె.రామస్వామి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ప్రభు లింగం జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సత్యనారాయణ కలిసి వారికి సిపిఐ పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో సిపిఐ పార్టీ నుండి 17వ వార్డు నుండి సాల్రా వెంకటేష్ పోటీలో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీ కార్యదర్శి ఎం. సత్తిరెడ్డి ఎన్ఎఫ్ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల.మంజుల, ఒగ్గు సత్తయ్య,తదితరులు పాల్గొన్నారు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డు…

ఉత్తమ ఉద్యోగులకు అవార్డు

మంచిర్యాల, నేటి ధాత్రి:

 

నస్పూర్ మండలంలోని శ్రీరాంపూర్ ప్రాంతం ఆర్కే-8 డిస్పెన్సరీ లోని ఉద్యోగులు విధి నిర్వహణలో అందించిన సేవలు,వారు కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేస్తారు.అందులో భాగంగా ఉత్తమ ఉద్యోగులుగా జి. విజయలక్ష్మి,సురేష్,రాజేశ్వరి ఎంపికయ్యారు.రిపబ్లిక్ డే సందర్భంగా డిస్పెన్సరీలో డివై సీఎంఓ డాక్టర్ పి.రమేష్ చేతుల మీదుగా వారికి జ్ఞాపకలు అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ విధుల పట్ల మరింత క్రమశిక్షణతో వ్యవహరిస్తూ,సింగరేణి సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version