డ్రగ్స్ కేసులో నటుడు రశ్రీరామ్ అరెస్టు
డ్రగ్స్ కేసులో తమిళ, తెలుగు చిత్రాల నటుడు శ్రీరామ్ (శ్రీకాంత్)ను చెన్నై నార్కోటిక్ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆయనకు జరిపిన వైద్య ప్రాథమిక పరీక్షల్లో…
డ్రగ్స్ కేసులో తమిళ, తెలుగు చిత్రాల నటుడు శ్రీరామ్ (శ్రీకాంత్)ను చెన్నై నార్కోటిక్ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆయనకు జరిపిన వైద్య ప్రాథమిక పరీక్షల్లో…
ఓటీటీలో దుమ్ము రేపుతున్న.. కోర్టు రూం డ్రామా
సడన్గా కన్నడ నుంచి రిమేక్ అయి తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చిన కోర్టు డ్రామా చిత్రం యుద్ధకాండ ఛాప్టర్2 చిత్రం కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది.
ఇటీవల ఎలాంటి ప్రకటన లేకుండానే సడన్గా కన్నడ నుంచి రిమేక్ అయి తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చిన కోర్టు డ్రామా చిత్రం యుద్ధకాండ ఛాప్టర్2 (Yuddhakaanda Chapter 2).
చిత్రం కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది.
అజయ్ రావు (Ajay Rao) హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ సినిమాకు పవన్ భట్ (Pavan Bhat) దర్శకత్వం వహించగా ప్రకాశ్ బెలవాడి (Prakash Belawadi), K.G.F ఫేమ్ అర్చన జోయిస్ (Archana Jois), టీఎస్ నాగాభరణ (T. S. Nagabharana) కీలక పాత్రల్లో నటించారు.
రెండు నెలల క్రితం ఏప్రిల్18న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కన్నడ నాట మంచి విజయాన్ని నమోదు చేసింది.
సుమారు రెంఉ గంటల నిడివితో గత వారం ప్రపంచ వ్యాప్తంగా కన్నడతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్కు వచ్చింది.
కథ విషయానికి వస్తే..
ఈ క్రమంలో భరత్ అంత పెద్ద లాయర్ను ఎదుర్కొంటూ ఆ కేసును ఎలా వాదించాడు, ఇద్దరి మధ్య ఎలాంటి వాదనలు, ప్రతివాదనలు జరిగాయి, ఎవరు పై చేయి సాధించారు చివరకు ఓ యువకుడిని చంపి నేరం చేసిన నివేదితను బయటకు ఎలా తీసుకు వచ్చాడనే ఈ సినిమా కథ.
మనం ఇప్పటి వరకు చూసిన చిత్రాల లాగే ఈ చిత్రం ఉంటుందని ముందే తెలిసిన్నప్పటికీ కథను నడిపించిన విధానం భిన్నంగా ఉంటుంది.
అన్ని సినిమాల్లో జైలులో ఉన్న నిరపరాధులను హీరో విడిపిస్తే..
ఈ చిత్రంలో మాత్రం కోర్టులో అందరి ముందే నేరం చేసిన ఓ మహిళను హీరో ఏ విధంగా బయటకు తీసుకు వచ్చాడనే పాయింట్ కొత్తగా ఉంటుంది.
ఎలాంటి సినిమాటిక్ లిబరిటీస్ తీసుకున్నారనే మాట రాకుండా చట్టంలో ఉన్న పాయింట్లను బేస్ చేసుకుని ఈ స్టోరినీ అద్భుతంగా తీర్చిదిద్దారు.
సినిమా మొదట్లో హీరో అనవసర ప్రేమ వ్యవహారం తప్పితే సినిమా అంతా కోర్టు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.
ముఖ్యంగా సెకండాఫ్ ఫైనల్ హియరింగ్ సమయంలో హీరో చెప్పే డైలాగ్స్ గూస్బమ్స్ తీసుకు వచ్చేలా ఉంటాయి.
అందుకు భగవద్గీత శ్లోకాలను వాడుకున్న విధానం, ఏళ్లకు ఏళ్లు కేసులు పెండింగ్, సరైన సమయానికి న్యాయం లభించకపోవడం అనే పాయింట్లు చర్చించిన విధానం ఆకట్టుకుంటుంది.
కుటుంబంతో కలిసి మంచి సినిమా చూడాలనుకునే వారు ఈ చిత్రాన్ని ఎలాంటి జంకుబొంకు లేకుండా హాయిగా ఫ్యామిలీ మొత్తం చూసేయవచ్చు.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఇల్లు కాలిపోయిన వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
చర్ల నేటిదాత్రి:
చర్ల మండలం కలివేరు గ్రామంలో కల్లూరి సమ్మయ్య ఇళ్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి పూర్తిగా కాలిపోవడం జరిగింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్వయంగా ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి అండగా ఉంటానని ఆర్థిక సహాయం చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
మూడు భాషల్లో ఒకేసారి దృశ్యం 3
దృశ్యం ఫ్రాంచైజీకి ఉన్న ప్రేక్షకాదరణ గురించి తెలిసిందే. ఇప్పటికే మాతృక (మలయాళ వెర్షన్) ఆధారంగా తెలుగు హిందీలో రీమేక్ అయిన రెండు భాగాలూ సూపర్హిట్ అయ్యాయి. ఇటీవలె…
‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఉన్న ప్రేక్షకాదరణ గురించి తెలిసిందే. ఇప్పటికే మాతృక (మలయాళ వెర్షన్) ఆధారంగా తెలుగు, హిందీలో రీమేక్ అయిన రెండు భాగాలూ సూపర్హిట్ అయ్యాయి. ఇటీవలె ‘దృశ్యం 3’ సిద్ధమవుతోందని ప్రకటించారు మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్. అప్పటినుంచి ఈ సినిమా గురించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. మలయాళంలో తెరకెక్కనున్న పార్ట్ 3 కథ వేరు.. హిందీలో రూపొందే చిత్ర కథాంశం వేరు.. అని. ఈ నేపథ్యంలో ‘దృశ్యం 3’ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు దర్శకుడు జీతూ జోసెఫ్. ‘‘దృశ్యం 3’ని ఒకే కథతో తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తాం. మలయాళ, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరణ జరపడం కుదరకపోవచ్చు.. కానీ, మూడు భాషల్లోనూ ఒకే రోజున విడుదల చేస్తాం. ప్రస్తుతం స్కిప్ట్ వర్క్ జరుగుతోంది. పూర్తయ్యాక హిందీ టీమ్కు అందిస్తాం.. అక్కడ పరిస్థితులకు తగినట్లుగా మేకర్స్ మార్పులు చేస్తారు’’ అని చెప్పారు. తెలుగులో పార్ట్ 3లో వెంకటేశ్ నటిస్తున్నారా లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. కాగా, తొలి రెండు భాగాల్లో మలయాళ వెర్షన్లో కథానాయకుడిగా మోహన్లాల్, తెలుగులో వెంకటేశ్, హిందీలో అజయ్ దేవగణ్ నటించారు. మలయాళంలో రెండు భాగాలకూ జీతూ జోసెఫ్ దర్శకుడు. తెలుగులో, హిందీలో దర్శకులు మారారు.
దళిత వాడలో సిసి రోడ్డు మంజూరులో జాప్యమేళా
చర్ల నేటిధాత్రి:
చర్ల మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో విజయకాలనీ గ్రామంలో అత్యధికంగా దళితులు నివసిస్తున్నారు మండలంలో అన్ని రోడ్లు వేసిన దళిత వాడలో రోడ్డు వేయకపోవడం ఎంతో హేయమైన చర్య అని దళిత సామాజిక వర్గానికి చెందిన జెట్టి శ్రీను ఆరోపించారు మా గ్రామంలో అన్ని సందుల్లో సిమెంట్ రోడ్లు వేసిన మా ఇండ్ల ముందు ఉన్న సిసి రోడ్డు వేయకపోవడం వల్ల వర్షం పడితే ఈ ప్రాంతం మొత్తం బురద అయ్యి ఇండ్లలోకి నీరు వస్తుందని అన్నారు ఇకనైనా చర్ల మండలం ఎంపీడీవో ఎంపీవో ఈ ప్రాంతంలో పర్యటించి మా ఇండ్ల ముందు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నారు
ఓటీటీలో ప్రియాంక మూవీ… ఎప్పుడంటే…
సినిమా థియేటర్లు
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న అమెరికన్ యాక్షన్ కామెడీ మూవీ హెడ్స్ ఆఫ్ స్టేట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
ప్రముఖ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇప్పుడు గోబ్లల్ స్టార్. తెలుగులో మహేశ్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నా… ఆమె తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన యాక్షన్ సినిమాలకూ దూరం కాలేదు. అయితే అవకాశం చిక్కితే తన చిత్రాలు, వెబ్ సీరిస్ ద్వారా వినోదాన్ని పంచడానికీ రెడీ అంటోంది. అలాంటి ఓ వినోదాత్మక చిత్రమే ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ (Heads of State).
సినిమా థియేటర్లు
గతంలో ‘బేవాచ్, క్వాంటికో, సిటాడెల్’ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేసిన ప్రియాంక ఇప్పుడు యాక్షన్ కామెడీ మూవీ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’లో సీనియర్ ఎం.ఐ.6 ఏజెంట్ గా నటించింది. ఆమెతో పాటు జాన్ సీనా, ఇద్రిస్ ఎల్బా ఈ మూవీలో లీడ్ రోల్స్ చేశారు. అలానే జాక్ స్వాయిడ్, స్టీఫెన్ రూట్, కార్లా గుగినో, సారనైల్స్ కీలక పాత్రలు పోషించారు. జూలై 2న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రియాంక పాల్గొంటోంది. అమెరికన్ ప్రెసిడెంట్ (జానా సీనా), బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ (ఇంద్రిస్) ఒకసారి విమానంలో ప్రయాణిస్తుంటారు. వీళ్ళిద్దరిపై శత్రువులు దాడి చేయడంతో వీరి విమానం ఓ ప్రదేశంలో లాండ్ అవుతుంది. అక్కడకూ చేరుకుని శత్రువులు వీరిని హతమార్చడానికి ప్రయత్నిస్తే సీనియర్ ఏజెంట్ నోయెల్ బిస్సిట్ (ప్రియాంక చోప్రా) వీరిని ఎలా కాపాడిందనేదే ఈ మూవీ మెయిన్ థీమ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ వీక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి జూలై 2న స్ట్రీమింగ్ అయ్యే ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ఏ తీరిన ఆకట్టుకుంటుందో చూడాలి.
ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పి ఆర్ టి యు టి ఎస్ సంఘ కృషి మేరకు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకై ప్రభుత్వం నిధుల విడుదల
ఇది ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం
చర్ల నేటిధాత్రి:
ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల కొరకు అలుపెరగని పోరాటం చేసిన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్ పులగం దామోదర్ రెడ్డి పి ఆర్ టి యు టీఎస్ సంఘం పక్షాన పలుమార్లు ఇచ్చిన ప్రాతినిధ్యం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపునకు గాను రాష్ట్ర ప్రభుత్వం నేడు 700 కోట్ల రూపాయలు విడుదల చేయనుందని హర్షం వ్యక్తం చేశారు ముఖ్యంగా 270 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ మెడికల్ బిల్లుల చెల్లింపుకు గాను కేటాయించగా ఇప్పటికే జిల్లాల వారీగా మెడికల్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది మిగిలిన నిధులతో పెండింగ్ జిపియఫ్ పార్ట్ ఫైనల్స్ తుది చెల్లింపులు మరియు వేతన బకాయిల చెల్లింపు కూడ జరగనుంది
పెండింగ్ బిల్లుల సాధనలో ప్రభుత్వాన్ని ఒప్పించి నిధుల విడుదలకై అవిరామ కృషితో శ్రమిస్తూ ఉన్న ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పిఆర్ టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్ పులగం దామోదర్ రెడ్డి కు పి ఆర్ టి యు టి ఎస్ చర్ల మండల శాఖ చర్ల మండలం అధ్యక్షులు ఎస్ఎస్ఎస్ రవికుమార్ ప్రధాన కార్యదర్శి వీరభద్రం రాష్ట్ర జిల్లా కార్యదర్శులు వేణు శ్రీనివాస్ గురుమూర్తి కొల్లిపాక హరికృష్ణ రాజు వైవి రాజు పున్నం సారయ్య మీడియం రామకృష్ణ రమణయ్య హర్షం వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటన ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు
నెమలి ఏది కన్నప్ప! ఈవెంట్లలో కనిపించని హీరోయిన్
మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన్న చిత్రం ‘కన్నప్ప’ భారీ అంచనాల మధ్య ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్టుగా ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పరమ శివుని భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇందులో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషించగా, మోహన్ బాబు, ప్రభాస్, శరత్కుమార్, మోహన్లాల్, అక్షయ్ కుమార్ వంటి అగ్రతారలు కీలక పాత్రల్లో నటించారు.
అయితే ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్ది మేకర్స్ ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచారు.
ఇప్పటికే అమెరికా, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లోప్రత్యేక ఈవెంట్లు సైతం నిర్వహించి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు.
ఇదిలాఉంటే.. ఈ సినిమా ప్రారంభంలోనే అప్పటివరకు కథానాయికగా ఉన్న నుపుర్ సనన్ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
అఖరుకు.. ఇటీవల హైదరాబాద్లో జరిగిన మెయిన్ ఈవెంట్లోనూ ప్రీతి కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాశం అవుతుంది.
కన్నప్ప సినిమాలో తిన్నడు ప్రేయసిగా, భార్యగా కీలక పాత్ర పోషించిన నటి ఈవెంట్లలో ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్న తలెత్తుతుంది.
అంతేకాదు ఇప్పటికే సినిమాలో విష్ణు, ప్రీతి ముకుందన్లపై చిత్రీకరించిన పాట బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.
అంతేకాదు అందులో హీరోయిన్కు వేసిన బట్టలు, పాట చిత్రీకరించిన విధానం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఈ సినిమాలో ఇంత రొమాంటిక్ సాంగ్ ఏంటనే కామెంట్లు వచ్చాయి.
ఇది అసలు భక్తి చిత్రమా లేక రక్తి మూవీనా అనే వరకు వెళ్లింది.
కాగా ఇటీవల విడుదల చేసిన మేకింగ్ వీడియోలోనూ ప్రధానంగా హీరోయిన్ ప్రీతి నటించిన యుద్దం, ఎమోషనల్, రొమాంటిక్ సన్నివేశాలే అధికంగా చూపించడం విశేషం.
అలాంటిది పాన్ ఇండియాగా విడుదలవుతున్న ఇంత పెద్ద సినిమాలో కీ రోల్ చేసిన నటి ఇ్పపుడు ఎక్కడా కనిపించక పోవడంపై విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్లో నిర్వహించిన ఈవెంట్కు చిన్న క్యారెక్టర్ చేసిన సీనియర్ నటి మధుబాల రాగా హీరోయిన్ ఎందుకు రాలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మూవీ యూనిట్ ప్రీతి (Preity Mukhundhan)ని లెక్కలోకి తీసుకోలేదా, ఈవెంట్లకు పిలవడం మరిచారా, కావాలనే దూరం పెట్టారా లేక తనే రానందా అనే ప్రశ్నలు చిత్ర బృందానికి ఎదురౌతున్నాయి.
ఈవెంట్లో సైతం ప్రీతి గరించి, ఆమె పాత్ర, నటన గురించి మాట్లాడినట్లుగా కూడా లేదు.
అఖరకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సైతం కన్నప్ప టీంతో కలిసి ఇంటర్వ్యులు ఇచ్చి సినిమా ప్రచారంలో పాల్గొంటు తన వంతు సాయం అందించారు.
అలాంటిది కన్నప్ప సినిమాలో మెయిన్ పిల్లర్లలో ఒకరైన హీరోయిన్ ఎందుకు ఈవెంట్లు, ఇంటర్వ్యూలలో ఎక్కడా కనిపించడం లేదని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
సినిమా విడుదలకు మరొ నాలుగు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రీతి ముకుందన్ మీడియా ముందుకు వస్తుందేమోనని బావిస్తున్నారు.
నేడు ప్రో కొత్తపల్లి ఆచార్య జయశంకర్ గారి 14 వ వర్ధంతి.
◆ నివాళ్లు అర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు,
◆ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ బిఆర్ఎస్ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో ఆచార్య జయశంకర్ గారి 14 వ వర్ధంతి. జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ బిఆర్ఎస్ నాయకులు నివాళ్లు అర్పించిన ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ
ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్కాని..
తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిన మహాజ్ఞాని, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు అని, ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు…
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజి సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి ,భారత్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
నడికూడ నేటిధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు అందరు కలిసి యోగాసనాలు వేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ శ్వాస మీద,ధ్యాస,మనకై మనం చేసే అన్వేషణే యోగాని,అదేవిధంగా తనువును,మనసును, ఆత్మను ఏకం చేసే ఒకే ఒక సాధనం యోగాని, అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని,ఈ యోగా దినోత్సవాన్ని 2014 సెప్టెంబర్ 27 న భారత ప్రధాన నరేంద్ర మోడీ ఐక్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21 జరుపు కోవడం గురించి ప్రతిపాదన చేశారని,ఈ ప్రతిపాదనకు 193 ఐక్యరాజ్యసమితి ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారని,భద్రతా కమిషన్ లో శాశ్వత సభ్యులుగా ఉన్న భారతదేశం,అమెరికా, ఇంగ్లాండ్,చైనా,ఫ్రాన్స్,రష్యా దేశాలు కూడా ఈ తీర్మానానికి సహప్రతినిధులు అని,విస్తృతమైన చర్చల అనంతరం డిసెంబర్ 2014లో ఆమోదించబడి 2015 జూన్ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు.యోగా జూన్ 21న జరుపుకోవడానికి గల కారణం జూన్ 21న ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుందని ఎక్కువ ప్రగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోడీ సూచించారని అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు
తెలంగాణ ఉద్యమ పితామహుడు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలను చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజకుమార్, మేకల సత్యపాల్, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య,విద్యార్థిని,విద్యార్థులు మరియు ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం.
చిట్యాల నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని జెడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఎంఈఓ కోడపాక రఘుపతి, ఎస్సై -2 ఈశ్వరయ్య, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఘనంగా యోగా దినోత్సవం ను నిర్వహించారు. ఎంఈఓ రఘుపతి మాట్లాడుతూ యోగా ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప విధానమని దీని ద్వారా విద్యార్థులు ఏకాగ్రతను, శారీరక మానసిక వికాసాన్ని సాధించవచ్చని చెప్పారు. ఎస్సై -2 ఈశ్వరయ్య స్వయంగా కొన్ని యోగాసనాలు వేసి విద్యార్థులతో చేయించాడు. యోగాతో శారీరక అనారోగ్యాలను తొలగించుకోవచ్చని విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆదర్శవంతమైన పౌరులుగా మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు బుర్ర సదయ్య విద్యార్థుల చే యోగాసనాలు వేయించారు. హాస్టల్ వార్డెన్లు వేణు సింగ్, అరుణలు పాల్గొని విద్యార్థులకు మొలకలు, రాగి జావా అందించి ఉత్సాహపరిచారు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు బొమ్మరాజమౌళి, సరళ దేవి, నీలిమారెడ్డి రామనారాయణ కల్పన,శంకర్, మౌనిక, ఉస్మాన్ అలీ,బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్లలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
గర్భిణీ మహిళలకు యోగ ఒక వరం
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
ఈరోజు మహిళా శిశు దివ్యాంగులు వయవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ తరపున జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలతో ఆడిటోరియంలో గర్భిణీ మహిళలకు బాలింతలకు అంగన్వాడీ టీచర్లకు యోగ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మహిళల ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఆర్య జనని అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా మహిళలు గర్భిణీ సమయంలో బాలింత సమయంలో చేయవలసినటువంటి ప్రత్యేక ఆసనాలు ప్రత్యేక ధ్యానం ప్రత్యేక యోగా పద్ధతుల గురించి వివరించడం జరిగింది. ఈ పద్ధతులను ఉపయోగించడం ద్వారా పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండడంతో పాటు సాధారణ ప్రసవాలు జరుగుతాయని జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం వివరించారు. అలాగే జిల్లా వైద్యాధికారి రజిత మాట్లాడుతూ యోగ పద్ధతులు నేర్చుకోవడం ద్వారా సాధారణ ప్రసవాలు జరుగుతాయనిచెప్పారు. మన దేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు సిరిసిల్ల జిల్లా సి సెక్షన్ లలో అత్యధిక శాతంతో ముందున్నాయి.
కాబట్టి యోగ నేర్చుకోవడం ఆసనాలు ధ్యానం ద్వారా మనం సాధారణ ప్రసవాలకు మళ్ళించవచ్చని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం నుండి డాక్టర్ అంజలి,దీప్తి చాలా సాధారణ పద్ధతులతో ఏ విధంగా యోగాను పూర్తి చేయవచ్చు ధ్యానం గురించి కూడా వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా క్షుణ్ణంగా అర్థమయ్యేలాగా ఒక్కో మెట్టు గురించి వివరించడం జరిగింది. పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గురించి వివరించారు. మంచి సంకీర్తన వినడం మంచి చిత్రాలు చూడడం ఆహ్లాదకర వాతావరణము ప్రశాంత వాతావరణము సమయానికి ఆహారం తీసుకోవడం కనీసం 8 గంటల నిద్ర ఇలాంటివి కూడా తప్పనిసరిగా పాటించాలని సూచించారు.. అలాగే ఈ కార్యక్రమానికి డాక్టర్ సురేంద్రబాబు పీడియాట్రిషన్ అతిథిగా హాజరై పిల్లల ఆరోగ్యానికి మంచి చేస్తాయని యోగా ధ్యానం పద్ధతులు వాడుకుని ఏకాగ్రతను జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని తెలిపారు. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని సదస్సుకు హాజరైన అందరు సిబ్బందికి తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో సిడిపివోలు సౌందర్య ఉమారాణి జిల్లా మిషన్ కోఆర్డినేటర్ రోజా సూపర్వైజర్లు పోషణ అభియాన్ కోఆర్డినేటర్ బాలకిషన్ ఇన్చార్జ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ , చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ పరమేశ్వర్, సఖి కో ఆర్డినేటర్ మమత, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇది చర్ల ఇక్కడ రాజకీయం ఎక్కువ అభివృద్ధి తక్కువ
సీనియర్ జర్నలిస్టు నరసింహ
నేటి ధాత్రి చర్ల:
చర్ల మండల కేంద్రంలోని ప్రజల బాధలు వర్ణనాతీతం తరతరాలుగా దళితులు గిరిజనులు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉండగా నేటికీ మెరుగైన వైద్య సౌకర్యం అందకపోవడం దురదృష్టకరం 100 సంవత్సరాల ప్రభుత్వ వైద్యశాలలో ఎక్సరే స్కానింగ్ సెంటర్ ఎమ్మారై స్కానింగ్ సిటీ స్కానింగ్ లేకపోవడం శోచనీయం మండలంలోని నేటికీ కొన్ని పాఠశాలలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు లేకపోవడం దురదృష్టకరం అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నారు కానీ ప్రభుత్వ బడులకు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంలో అంతర్యం ఏమిటో ఇది అధికారులు నిర్లక్ష్యమా స్థానిక రాజకీయ నాయకుల వైఫల్యం చర్ల మండల కేంద్రంలో తాలుపేరు డ్యామ్ ఉండగా పెద్ద కాలువ ద్వారా దుమ్ముగూడెం మండలానికి సాగునీరు తరలిపోతున్న చర్ల మండలంలోని కొన్ని గ్రామపంచాయతీలకు నీరు అందకపోవడం ఏమంటారు అంటే గిరిజనులకు సాగునీరు అవసరం లేదా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించకపోవడంలో వైఫల్యం ఏమిటి ఉప్పరిగూడెం కొయ్యూరు సుబ్బంపేట గ్రామపంచాయతీలకు సాగునీరు కాలువల ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎందుకు ఇవ్వటం లేదు తాలిపేరు డ్యామ్ మూడు గేట్ల వల్ల అభివృద్ధి చెందిన ఆ కాంట్రాక్టర్ ఎవరు తాలిపేరు డ్యాం కాలువల మీద డ్యామ్ మీద ఆ కాంట్రాక్టర్ ఎంత లబ్ధి పొందాడు అసలు తాలుపెరు డ్యామ్ ను పూర్తిస్థాయిలో ఎందుకు అభివృద్ధి పరచడం లేదు తాలిపేరు డ్యామ్ లో పూర్తిస్థాయిలో పూడిక తీసి అధునాతన హైడ్రాలిక్ గేట్లను అమర్చి ఆ ప్రాంతంలో హరిత హోటల్స్ కట్టి టూరిజం సెక్టర్ అభివృద్ధి పరచకపోవడంలో అంతర్యం ఏమిటి ఈ ప్రాంతంలోని గిరిజన దళిత యువతకు తాళిపేరు డ్యాం దగ్గర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఇక్కడ యువత కోరుకుంటున్నారు చర్ల మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కేంద్రం నిధులు అధిక మొత్తంలో ఈ ప్రాంతానికి వస్తున్న ఈ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి కారణం అన్ని శాఖల అధికారుల నిర్లక్ష్యమా లేక రాజకీయ నాయకుల అవగాహన రాహిత్యమా లేకపోతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా ఉండాలని అనుకుంటున్నా నాయకులు ఎవరు చర్ల మండల కేంద్రంలో రైతు వేదికలు రైతులకు సలహాలు సూచనలు ఇస్తున్నారా కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు చర్ల మండల కేంద్రంలో పర్యటించకపోవడం లోపం ఏమిటి ఎన్ని సంవత్సరాలు అయినా దళితులు గిరిజన రైతులు అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏమిటో ఇందిరమ్మ ఇండ్ల కోసం పడిగాపులు కాస్తున్న దళితులు గిరిజన కుటుంబాలు గూడు కోసం పడరాని పాట్లు పడుతున్న కుటుంబాలు దండుపేట నుండి కొత్తపెళ్లి లింగాపురం గొంపల్లి మొగుళ్లపల్లి కత్తిగూడెం రహదారి మీదుగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నిధుల ద్వారా రహదారి మంజూరు చేసిన పూర్తిస్థాయిలో రహదారి వేయకుండా ఎక్కడ పనులు అక్కడే నిలిపివేసి గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించకుండా నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ అధికారులను ఏసీబీ విచారణ కోరుతుందా అని ప్రజల ఆకాంక్ష ఈ ప్రాంతంలోని దళిత గిరిజన రైతులకు వ్యవసాయ పనిముట్ల కొరకు క్రాప్ లోన్స్ ద్వారా రైతులకు సుమారు ఎకరానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తే ఈ ప్రాంతంలోని రైతులు చిన్న సన్నకారు రైతులు అభివృద్ధి చెందుతారు కానీ రైతులు బ్యాంకు లోకి వెళితే కూర్చోమని చెప్పే బ్యాంకు మేనేజరు లేడు క్రాప్ లోన్ ఆఫీసర్ లేరు ఆ చెప్పు అయ్యా రైతు నాకు లోను కావాలి సార్ ఎంత ఏంటని రైతుతో అవహేళనతో మాట్లాడుతూ అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు అసలు చర్ల మండల కేంద్రంలోని బ్యాంకు మేనేజరు క్రాప్ లోన్ ఆఫీసర్లు రైతులకు పంట రుణాలపై అవగాహన కల్పించకపోవడంలో అంతర్యం ఏమిటి ఆర్.బి.ఐ రైతులకు ఇవ్వమన్న రుణం ఏమిటి బ్యాంక్ అధికారులు రైతులకు ఇస్తున్న రుణం ఎంత చర్ల మండల ప్రాంతంలోని రైతులకు బ్యాంకర్లు అవగాహన సదస్సులు ఏర్పరచి ఒక ఎకరం రెవెన్యూ భూమికి ఐదు లక్షల వరకు రుణ సహాయం అందించాలని చర్ల మండల కేంద్రంలోని రైతుల ఆకాంక్ష అదేవిధంగా మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ నేటి వరకు ఏర్పరచకపోవడంలో అంతర్యం ఏమిటి గిరిజనులు దళితుల ఇండ్లు తగలబడి పోతున్న పట్టించుకునే అధికారులే లేరు వరికుప్పలు దగ్ధమవుతున్న పేదలు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్న అధికారులు ఫైర్ స్టేషన్ ఏర్పరచకపోవడంలో ఇంత నిర్లక్ష్యమా భద్రాచలం నియోజకవర్గంలో ఇసుక రాంపులు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్న చర్ల మండల కేంద్రంలోని యువతకు ఉపాధి కల్పించకపోవడంలో అంతర్యం ఏమిటి సింగరేణి సంస్థకు ఇసుక రాంపుల నిర్వహణను కేటాయించి మండల కేంద్రంలోని దళిత గిరిజన యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు భద్రాచలం నియోజకవర్గం లో చర్ల మండలం ఏర్పడి సంవత్సరాలు అవుతున్న నేటికీ చర్ల మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పరచకపోవడం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు నిర్లక్ష్యం భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉన్నా చర్ల మండలానికి నిధుల కొరత సృష్టిస్తున్న జిల్లాలోని అధికారులు ఎవరు చర్ల పోలీస్ స్టేషన్కు మావోయిస్టు ప్రభావిత ప్రాంత నిధులు రావడం లేదా వస్తే ఆ నిధులు ఏమవుతున్నాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అని సీనియర్ జర్నలిస్ట్ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా భద్రాద్రి జిల్లాలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉన్నా చర్ల మండలానికి నిధుల కొరత సృష్టిస్తున్న జిల్లాలోని అధికారులు ఎవరు చర్ల పోలీస్ స్టేషన్కు మావోయిస్టు ప్రభావిత ప్రాంత నిధులు రావడం లేదా వస్తే ఆ నిధులు ఏమవుతున్నాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అని సీనియర్ జర్నలిస్ట్ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా భద్రాద్రి జిల్లాలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు
కరుణించు వరుణ దేవా…
వరుణుడి కోసం రైతుల ఎదురుచూపులు…
వరుణుడి రాక కోసం పడిగాపులు కాస్తున్న రైతన్న…
అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నాయి-చెరువులు,కాలువలు,కుంటలు అడుగంటిపోయినాయి…
నేటి ధాత్రి గార్ల:
జూన్ మొదటి వారంలోనే తొలకరి పలకరించినప్పటికీ నైరుతి రుతుపవనాలు ఆలస్యంతో మూడు వారాలైన ఒక్క వర్షం పడకపోవడంతో ఖరీఫ్ సీజన్ వెనక్కి వెళ్తుంది. ఖరీఫ్ లో వ్యవసాయ పనులు ప్రారంభానికి సరైన వర్షాలు లేవు. జూన్ నెల ప్రారంభమై 20 రోజులు దాటిన ఎండలు మండిపోతున్నాయి. రోజువారి ఉష్ణోగ్రత 35 డిగ్రీలు పైబడి నమోదు అవుతున్నాయి. చిన్నపాటి వర్షాలు కురిసిన మండుతున్న ఎండలతో వ్యవసాయ పనులు ప్రారంభానికి ఏ మాత్రం అనుకూలంగా లేవని రైతులు చెబుతున్నారు. తొలకరి చినుకులు కురుస్తాయని ఉద్దేశంతో పది రోజుల కిందట వరి దుక్కులు ప్రారంభించారు. మొక్కజొన్న, పత్తి పంటలు వేసుకున్నారు. మొలకలు వచ్చినప్పటికీ ఎండకు పంట అంతా ఎండిపోతుందని రైతులు వాపోతున్నారు.
త్వరలోనే సిరిసిల్ల లో పద్మశాలి భవన్ నిర్మాణం పూర్తి
హైదారాబాద్ లోని చేనేత భవన్ లొ ప్రత్యేక సమావేశం
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి భవన్, మార్కండేయ ఆలయా నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి లోని చేనేత భవన్ లో పద్మశాలి భవన్ నిర్మాణం పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, సిరిసిల్ల పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు..
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో మధ్యలో ఆగిపోయిన పద్మశాలీల కుల భవనము, మార్కండేయ స్వామి ఆలయం నిర్మాణాలు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు..బీసీ సంక్షేమ శాఖ ద్వారా 5 కోట్ల నిధుల విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడడం జరిగిందన్నారు..టెస్కో నుంచి కూడా ఆర్థిక సహాయం అందజేయవలసిందిగా కోరడం జరిగింది అని తెలిపారు..ప్రస్తుతం పిల్లర్లు పోసిన భవనాన్ని స్లాబ్ వరకు తీసుకువచ్చి, మరో 3 కోట్ల 40 లక్షలతో కళ్యాణ మండపం నిర్మాణం పూర్తిచేసుకుని, అందులో పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.. మరో 2 కోట్లతో మార్కండేయ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని మొత్తం 11 కోట్లతో అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు..
చేనేతలకు ప్రభుత్వ పక్షాన పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ ఇప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పవర్లూమ్ కార్మికులకు పని కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా తల్లులకు ఇందిరా మహిళా శక్తి చీరలు అందజేస్తున్నట్లు తెలిపారు.. గతంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ అంత్యోదయ కార్డులను అందజేసినట్లు గుర్తు చేసుకున్నారు.
యోగ అనేది మానవతా సంపద
#మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది..
#ఇది కేవలం ఆరోగ్యానికి కాదు ప్రశాంతతకు కూడా ఓక మార్గం..
యోగ దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మరియు ఎంపీ
హన్మకొండ నేటిధాత్రి:
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం.
యోగ అనేది శరీరానికి మాత్రమే కాదు మనస్సుకు, శరీరానికి,ఆత్మకు శుద్ధి కలిగించే మార్గమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ వేయి స్తంభాల దేవాలయ ప్రాంగణంలో కేంద్ర పురావస్తు శాఖ మరియు ఆయుష్ విభాగం తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డా కడియం కావ్యగారితో కలిసి పాల్గొన్నారు.
శిక్షణ పొందిన యోగ నిపుణులతో ప్రత్యేకంగా యోగా ఆసనాలను నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు యోగా సాధన చేయాలని,యోగ అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని సూచించారు.భారతీయ సంస్కృతికి యోగా చిరునామా అని అన్నారు.ప్రపంచమంతా మన సంప్రదాయలను ఆదరించే చేసిన ఆత్మీయ సాధన అని కొనియాడారు.ప్రతి రోజు యోగా చేయాలనే కోరిక ఉంటున్న కూడా రోజు దినచర్య వలన సమయం కేటాయించలేకపోతిన్నామని చెప్పారు.నగరంలో యోగ సెంటర్ ల పై అవగాహన కల్పించాలని నూతన యోగ కేంద్రాల్ని ఏర్పాటు చేసిన ప్రజలను ప్రోత్సహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి,జిల్లా వైద్యశాల అధికారి అప్పయ్య మరియు కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న నాయకులు నాయిని లక్ష్మా రెడ్డి,సుగుణాకర్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు కుమార్ యాదవ్,మాడిశెట్టి సతీష్ మరియు యోగ నిపుణులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
యోగాతో ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు
యువత వ్యసనాలకు బానిస కావద్దు….
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ములుగు జిల్లా నేటిధాత్రి:
ప్రతి ఒక్కరూ యోగ చేయడం వలన వారి ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉంటారని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని డి బ్ల్యూ సి డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో నిర్వహించిన యోగ కార్యక్రమంలో అదనం కలెక్టర్ మహేందర్ జి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి గోపాల్ రావు తో కలిసి జ్యోతి ప్రజ్వల చేసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానసిక, శారీరక, ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు యోగా చేయాలని సూచించారు. యువతీ యువకులు వ్యసనాలకు బానిస కాకుండా మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని అన్నారు.
ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం వేళలా కొంత సమయాన్ని కేటాయిస్తూ యోగా కార్యక్రమాలు నిర్వహించాలని, యోగ చేయడం వలన పలు రకాల వ్యాధులు దరి చేరకుండానే ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు.
అనంతరం యోగ ఆసనాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు,
జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ లీ చంద్ర, డాక్టర్ సంధ్య (జిల్లా ఇన్చార్జ్) యోగ ఇన్స్ట్రక్టర్ శ్రీ గురు శివ కృష్ణ, హరిత, మానస, లయ, ప్రియాంక, గిరివర్ధన్ లు పాల్గొన్నారు.
యోగాను నిత్య ప్రక్రియగా పాటించాలి
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
పరకాల నేటిధాత్రి:
నిరంతర యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుంకుమేశ్వర స్వామి ఆలయ చైర్మన్,యోగ గురువు కొల్గూరి రాజేశ్వర రావు ఆద్వర్యంలో శనివారం పరకాల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పతంజలి యోగ మహర్షికి జ్యోతి ప్రజ్వలన గావించి సుమారు రెండు గంటల పాటు వివిధ రకాల యోగాసనాల,ప్రణాయమాలు పట్టించడం జరిగింది.అనంతరం యోగా”డే”ను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా,ఆనందంగా గడపాలంటే ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి యోగాను నిత్య ప్రక్రియగా పాటించాలన్నారు.తాను కొంత కాలంగా యోగ వర్చ్యువల్ గా పాటిస్తున్నట్లు తెలిపారు.
మానసిక ప్రశాంత చేకురుతుందని,ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నట్లు వెల్లడించారు.యోగా
9సంవత్సరాల వయస్సు నుండి 90 సంవత్సరాల వయస్సు వరకు యోగాను ఎవరైన పటించ వచ్చన్నారు.
యోగ గురువు రాజేశ్వరరావు మాట్లాడుతూ యోగా డే ప్రాశస్త్యాన్ని వివరించారు.అనంతరం అతిథులను శాలువాతో ఘనంగా సన్మానించి,మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి తన జన్మదినం సందర్భంగా అందించిన భగవద్గీతను యోగ అభ్యాసకులకు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్డీవో డాక్టర్ కే నారాయణ,మున్సిపల్ ఇంచార్జీ కమిషనర్ సుష్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,సిఐ క్రాంతికుమార్, కాంగ్రెస్ నాయకులు పాడి ప్రతాప్ రెడ్డి,ప్రభుత్వ వైద్యులు డాక్టర్ మౌనిక,ప్రభుత్వ అయూష్ వైద్యాధికారి సీనియర్ జర్నలిస్టు మెండు రవిందర్,మాజీ కౌన్సిలర్ పంచగిరి జయమ్మ,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ఆకస్మిక తనిఖీ
సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి ):
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వంట గది, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం తరగతి గదుల్లో పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు.
విద్యార్థులకు మ్యాథ్స్ పాఠ్యాంశాలు బోధించి.. ప్రశ్నలు వేసి.. సమాధానాలు రాబట్టారు. ప్రతి పాఠ్యాంశాన్ని శ్రద్ధగా చదవాలని, అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాలయం ఎస్ఓ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు..
రామకృష్ణాపూర్ నేటిధాత్రి:
ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కంబగోని సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్ లు అన్నారు. తెలంగాణ సిద్ధాంత కర్త, జయశంకర్ వర్ధంతి పురస్కరించుకొని రామకృష్ణాపూర్ పట్టణంలోని జయశంకర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ శ్రేణులు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన నష్టాలను, కష్టాలను.. తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని జయశంకర్ సార్ రగిలించారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా, ధ్యాసగా వారు నడిపిన పోరాటం, జీవితం మహోన్నతమైనదని, మీరు కలలుగన్న తెలంగాణ ప్రగతి సాక్షిగా మీకివే మా నివాళులు అని అన్నారు.తెలంగాణ ప్రాంతం ఆంధ్ర పాలకుల వల్ల అణగారిపోయి అభివృద్ధికి నోచుకోకుండా ఉందని వారి నుండి విముక్తి కోసం తెలంగాణ ఉద్యమ కర్త కెసిఆర్తో వెన్నంటి ఉండి తెలంగాణ ప్రాంతంలో మన నీళ్లు,మన నిధులు,మన ఉద్యోగాలు కావాలని, కోరుకునే వ్యక్తులలో మొదటి వ్యక్తి జయశంకర్ అని అన్నారు. ఆశయాలను బంగారు తెలంగాణ కోసం నిత్యం తపించే గొప్ప ఆదర్శవాది అని అన్నారు. వారి మరణం తెలంగాణ ప్రాంత ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు రెవెల్లి ఓదెలు, అనిల్ రావు, పోగుల మల్లయ్య, జాడి శ్రీనివాస్, జిలకర మహేష్, సీనియర్ నాయకులు అలుగుల సత్యం, జక్కన బోయిన కుమార్, రామిడి లక్ష్మి కాంత్, గోనె రాజేందర్, ఖలీం,చంద్రకిరణ్, కుర్మ దినేష్ తదితరులు పాల్గొన్నారు.