భూపాలపల్లి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి: గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి

ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో భూపాలపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బస్తీ బాట కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి బిఆర్ఎస్ పార్టీ పాల్గొన్నారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఓటు కు ఉండే ప్రాముఖ్యత మీరు గుర్తించాలి
నేను మొదటి సారి ఎమ్మెల్యే అయినప్పుడు హన్మకొండ నుండి భూపాలపల్లికి రావాలంటే పెద్ద పెద్ద బొందలు ఉన్న రోడ్లు ఉండే… మరీ ఆ రోడ్డే అలా ఉంటే మన భూపాలపల్లి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఉహించుకోండి.
నేను బస్సులో, కారులో నేను వస్తుంటే సార్ ఇగో మా రోడ్లు అని ప్రజలు చూపెడుతుండే.
భూపాలపల్లిని సరిగ్గా అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి గ్రామ పంచాయతీ గా ఉన్న భూపాలపల్లిని నగర పంచాయతీ చేసి కొన్ని గ్రామాలను భూపాలపల్లి లో కలిపి మున్సిపాలిటీ చేయడం జరిగింది.
దాని వల్ల భూపాలపల్లి ఒక్క జిల్లా స్థాయికి ఎదిగింది జిల్లా కేంద్రం అయిన భూపాలపల్లి పై ఎందుకో రేవంత్ రెడ్డి కి కళ్ళు మండుతున్నాయి. ఇన్ని జిల్లాలు అవసరం లేదని మేడారంలో మంత్రివర్గ సమావేశం పెట్టి జిల్లాలను కుదించేందుకు ఒక్క కమిటీ ఏర్పాటు చేసిన జిల్లాల్ని తొలగించే దాంట్లో మొదటి జిల్లా భూపాలపల్లి అనే విదంగా చేసిండు.

ముఖ్యమంత్రికి పరిపాలన చేసే శక్తి లేదు,ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే ధైర్యం లేదు.
మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన గోదావరి జలాలు ప్రతి ఇంటికి వచ్చినాయి, రోడ్లు, సైడ్రైన్స్ ప్రజలకి మెరుగైన సౌకర్యాలు వచ్చినాయి.
జిల్లా అయింది కాబట్టి భూపాలపల్లికి మెడికల్ కాలేజీ వచ్చింది.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని 100 పడకల ఆసుపత్రి నిర్మించి ప్రతి రోజు వైద్య సేవలు ఎలా ఉన్నాయో అని ప్రతి నెలకి ఒక్కసారి హాస్పిటల్ విజిట్ చేశాము కానీ
జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేసిన మీ పక్కనే ఉన్న హాస్పిటల్ ఒక్కసారి విజిట్ చేయమని కోరినం, అది చేత కాకపోతే ఒక్క స్పెషల్ ఆఫీసర్ వేయమని కోరిన కనీసం పట్టించుకోవడం లేదు.
ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలి అంట మీ అమూల్యమైన ఓటు బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై వేసి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించండి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

29వ డివిజన్లో బస్తీ బాట, డివిజన్ కార్యాలయం ప్రారంభించిన వెలిచాల….

29వ డివిజన్లో బస్తీ బాట, డివిజన్ కార్యాలయం ప్రారంభించిన వెలిచాల

కరీంనగర్, నేటిధాత్రి:

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి పనిచేసిన సీనియర్ నాయకులు కార్యకర్తలకు తప్పకుండా నామినేటెడ్ పదవులు దక్కుతాయని వారి శ్రమ కష్టం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడ్డ వారందరికీ తగిన న్యాయం చేస్తుందని అందుకు తాను ముందుండి అన్ని విధాలా సహకరిస్తానని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవులు దక్కేలా ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు. ఆదివారం సాయంత్రం 29వ డివిజన్ కిసాన్ నగర్ లో కాంగ్రెస్ నాయకులు తాండ్ర శంకర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డివిజన్ కార్యాలయాన్ని రాజేందర్ రావు ప్రారంభించారు. అనంతరం బస్తిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు డివిజన్ కాంగ్రెస్ నాయకులు మహిళలు ప్రజలు రాజేందర్రావుకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. 29వ డివిజన్ కిసాన్ నగర్ లో రాజేందర్రావు ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెలిచాల రాజేందర్రావు మాట్లాడుతూ సర్వే ఆధారంగా అధిష్టానం టికెట్లు కేటాయిస్తుందని తెలిపారు. అన్నింటినీ పరిగణలోకి తీసుకొని టికెట్లను అందిస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు నిరంతరం శ్రమించిన జీడి రమేష్ కల్వల రామచందర్ మహేష్ లాంటి సీనియర్ నేతలకు నామినేటెడ్ పదవులు దక్కేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తాను ప్రమాణం చేసి ఈవిషయాన్ని మనస్ఫూర్తిగా చెబుతున్నానని తెలిపారు. అనేక ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతున్నారని వారి కష్టానికి ఫలితం కొద్ది రోజుల్లో దక్కనుందని ఉందని రాజేందర్రావు పేర్కొన్నారు. కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వారిని ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలా బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరు కూడా నిరుత్సాహపడవద్దని కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ముందుండి కృషి చేయాలని కోరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికీ విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. బస్తి బాట కార్యక్రమానికి డివిజన్ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తాండ్ర శంకర్ బాబు, గసికంటి కుమారు జీడి రమేష్ గండి రాజేశ్వర్ గండి శ్యామ్ గండి గణేష్ కాసారపు కిరణ్ కుమార్, గోశిక శంకర్ సముద్రాల అజయ్ వడ్లూరి శ్రీనివాస్ వివిధ కుల సంఘాల నాయకులు, ఇతర నాయకులు, మహిళలు డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బస్తీ బాట పట్టిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి…

బస్తీ బాట పట్టిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు జంగేడు ప్రాంతంలో పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన బస్తీ బాట కార్యక్రమం
నిర్వహించిచారు ఈ బస్తీ బాట కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వార్డు పరిధిలో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులపై ప్రజలు వ్యక్తం చేసిన సమస్యలను శ్రద్ధగా విన్న గండ్ర వెంకట రమణా రెడ్డి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ, భవిష్యత్తులో కూడా భూపాలపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version