ఉత్తమ ఉద్యోగులకు అవార్డు
మంచిర్యాల, నేటి ధాత్రి:
నస్పూర్ మండలంలోని శ్రీరాంపూర్ ప్రాంతం ఆర్కే-8 డిస్పెన్సరీ లోని ఉద్యోగులు విధి నిర్వహణలో అందించిన సేవలు,వారు కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేస్తారు.అందులో భాగంగా ఉత్తమ ఉద్యోగులుగా జి. విజయలక్ష్మి,సురేష్,రాజేశ్వరి ఎంపికయ్యారు.రిపబ్లిక్ డే సందర్భంగా డిస్పెన్సరీలో డివై సీఎంఓ డాక్టర్ పి.రమేష్ చేతుల మీదుగా వారికి జ్ఞాపకలు అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ విధుల పట్ల మరింత క్రమశిక్షణతో వ్యవహరిస్తూ,సింగరేణి సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు.
