లాభాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

లాభాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సూచీలకు మద్దతుగా నిలుస్తోంది. ఈ ఒప్పందం కారణంగా మంగళవారం లాభపడిన సూచీలు బుధవారం కూడా అదే జోరులో ప్రారంభమయ్యాయి. భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి.

భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సూచీలకు మద్దతుగా నిలుస్తోంది. ఈ ఒప్పందం కారణంగా మంగళవారం లాభపడిన సూచీలు బుధవారం కూడా అదే జోరులో ప్రారంభమయ్యాయి. భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా భారీ లాభాల నుంచి దిగి వచ్చాయి. అయితే ఇప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లోనే కదలాడుతున్నాయి.
గత సెషన్ ముగింపు (81,892)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత భారీ లాభాల్లోకి ఎగబాకింది. ఒక దశలో 600 పాయింట్లకు పైగా లాభపడి 82,500 మార్క్ దాటింది. అయితే ఆ తర్వాత అమ్మకాల కారణంగా కిందకు దిగి వచ్చింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో 335 పాయింట్ల లాభంతో 82,199 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 104 పాయింట్ల లాభంతో 25,279 వద్ద కదలాడుతోంది (stock market news today).సెన్సెక్స్‌లో ఆయిల్ ఇండియా, ఎమ్‌సీఎక్స్ ఇండియా, సీజీ పవర్, ఓ‌ఎన్‌జీసీ, వేదాంత మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఏషియన్ పెయింట్స్, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, ఎయిచర్ మోటార్స్, మారికో, బ్రిటానియా మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 293 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 321 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.60గా ఉంది.

వరుస నష్టాలకు బ్రేక్.. కోలుకున్న సూచీలు..

వరుస నష్టాలకు బ్రేక్.. కోలుకున్న సూచీలు..

 

గత మూడు సెషన్లుగా నష్టాలనే చవి చూస్తూ వస్తున్న దేశీయ సూచీలు గురువారం కాస్త కోలుకున్నాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, ఐటీ షేర్లపై ఆసక్తి సూచీలకు ఊరట కలిగించింది. అయితే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (రూ.90.43) మరింతగా క్షీణించడంతో ఆందోళన తప్పలేదు.

గత మూడు సెషన్లుగా నష్టాలనే చవి చూస్తూ వస్తున్న దేశీయ సూచీలు గురువారం కాస్త కోలుకున్నాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, ఐటీ షేర్లపై ఆసక్తి సూచీలకు ఊరట కలిగించింది. అయితే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (రూ.90.43) మరింతగా క్షీణించడంతో ఆందోళన తప్పలేదు. విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతుండడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండదనే అంచనాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం కలవరపెడుతున్నాయి. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో రోజును ముగించాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (85, 106)తో పోల్చుకుంటే గురువారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి ఎగబాకింది. ఒక దశలో సెన్సెక్స్ 380 పాయింట్లు లాభపడి 85, 487 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత కిందకు దిగి వచ్చింది. చివరకు సెన్సెక్స్ 158 పాయింట్ల లాభంతో 85, 265 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 47 పాయింట్ల లాభంతో 26, 033 వద్ద స్థిరపడింది (stock market news today).సెన్సెక్స్‌లో పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, కోఫోర్జ్, క్యామ్స్, హెచ్‌ఎఫ్‌సీఎల్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). హిటాచీ ఎనర్జీ, కేన్స్ టెక్నాలజీ, బయోకాన్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, సుజ్లాన్ ఎనర్జీ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 15 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 59 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.97గా ఉంది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version