మేడ్చల్‌లో 20 కాంగ్రెస్ నేతలు బిఆర్ఎస్‌లో చేరిక

బిఆర్ఎస్లో 20 మంది కాంగ్రెస్ నేతల చేరిక

కండువా కప్పి ఆహ్వానించి ఎంఎల్ఏ మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మూడు మున్సిపాలిటీ లపై బిఆర్ఎస్జెండా ఎగరావేస్తామని మాజీ మంత్రి, ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి లక్ష్మి, బండి రామ్ రెడ్డి, బండి శ్రీకర్ రెడ్డి లతో పాటు 20మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ లో చేరగా గులాబీ కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం అలియాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా
రోడ్ షో లో పాల్గోని బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని కోరారు.

కమ్యూనిస్టు పార్టీలో చేరికలు…

కమ్యూనిస్టు పార్టీలో చేరికలు

* మున్సిపల్ ఎన్నికలలో సీపీఐ అభ్యర్థులు
* చేవెళ్ల 17వ వార్డు నుండి సీపీఐ అభ్యర్థి సాల్రా వెంకటేష్
* సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కే. రామస్వామి
వారికీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానం పలికారు

చేవెళ్ల, నేటిధాత్రి:

 

భారత కమ్యూనిస్టు పార్టీ నిరుపేదల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పేదల పక్షాన చేస్తున్న పోరాటాలు ఆకర్శించి పలువురు సిపిఐ పార్టీలో చేరుతున్నారని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కే. రామస్వామి అన్నారు. చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం చేవెళ్ల ప్రాంతానికి చెందిన సాల్రా వెంకటేష్ పరివేద సత్యం కుక్కుడాల వెంకటేష్ తదితరులు భారత కమ్యూనిస్టు పార్టీలో చేరినారు వీరికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నియోజకవర్గం ఇన్చార్జి కె.రామస్వామి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ప్రభు లింగం జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సత్యనారాయణ కలిసి వారికి సిపిఐ పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో సిపిఐ పార్టీ నుండి 17వ వార్డు నుండి సాల్రా వెంకటేష్ పోటీలో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీ కార్యదర్శి ఎం. సత్తిరెడ్డి ఎన్ఎఫ్ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల.మంజుల, ఒగ్గు సత్తయ్య,తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version