నాకు తెలియదు.. సునేత్రకు డిప్యూటీ సీఎంపై శరద్ పవార్..

నాకు తెలియదు.. సునేత్రకు డిప్యూటీ సీఎంపై శరద్ పవార్

 

సునేత్ర ప్రమాణస్వీకార కార్యక్రమంపై శరద్ పవార్ బారామతిలో జరిగిన మీడియా సమావేశంలో స్పందించారు. శనివారం సాయంత్రం ప్రమాణస్వీకారం ఉంటుందనే విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందని చెప్పారు.

ముంబై: విమాన ప్రమాదంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ (Ajit Pawar) ఇటీవల కన్నుమూయడంతో ఆయన భార్య సునేత్రా పవార్ (Sunetra Pawar) మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదని అజిత్ పవార్ బాబాయ్, ఎన్‌సీపీఎస్‌పీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) తెలిపారు. ఎన్‌సీపీ, ఎన్‌సీపీఎస్‌పీ విలీనం కానున్నాయనే ఊహాగానాల నేపథ్యంలో ‘మహాయుతి’ సర్కార్‌లో ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు సునేత్ర సిద్ధమవుతుండటం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ఎలాంటి సమాచారం లేదు

సునేత్ర ప్రమాణస్వీకార కార్యక్రమంపై శరద్ పవార్ బారామతిలో జరిగిన మీడియా సమావేశంలో స్పందించారు. శనివారం సాయంత్రం ప్రమాణస్వీకారం ఉంటుందనే విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందని చెప్పారు. ‘ప్రమాణస్వీకారంపై నాకు ఎలాంటి సమాచారం లేదు’ అని పవార్ తెలిపారు. పవార్ కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా ప్రమాణస్వీకారానికి హాజరవుతారా అనేది కూడా తనకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అజిత్ పవార్ వారసుని ఎన్నిక ప్రక్రియ నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచారని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు సైతం ఆయన తనకు తెలియదని సమాధానమిచ్చారు. రాజకీయాలు వేరు, కుటుంబం వేరనే అభిప్రాయం పవార్ మాటల్లో వ్యక్తమైంది.

అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్…

అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్

 

 

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల పలువురు తెలంగాణ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్, కేటీఆర్ తదితరులు.. అజిత్ మృతిపై ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్(Maharashtra Deputy CM Ajit Pawar) బుధవారం ఉదయం బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి కేటీఆర్ తదితరులు పవార్ మృతికి సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి..

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి

 

మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అజిత్ అనంతరావు పవార్ ఇవాళ పుణేలో చార్టర్డ్ విమానం కూలిపోవడంతో మృతి చెందారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ అనంతరావు పవార్(Ajit Pawar) ఇవాళ(జనవరి 28) పుణేలో చార్టర్డ్ విమానం కూలిపోవడంతో దుర్మరణం చెందారు. ఈ ఘటనలో ఆయనతోపాటు విమానంలో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముంబై నుంచి బారామతి వెళ్తున్న ఈ ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉదయం 8:45 గంటల సమయంలో క్రాష్ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అజిత్ పవార్ వయసు 66 సంవత్సరాలు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version