బహుజన్ సమాజ్ పార్టీ డోర్నకల్ నియోజక వర్గ ఇన్చార్జి పార్వతి రమేష్ నాయక్ అనెపురం రెవెన్యూ గ్రామ పంచాయతీ యలమంచిలి తండా లో ఇటీవల స్వర్గస్థులు అయిన బాణోత్ లాలమ్మ దశ దిన కర్మ కు హాజరు అయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారి కుటుంబానికి సద్గురువు సేవాలాల్ మహారాజ్ మరియు సప్త భవాని మాతల మనో ధైర్యం ప్రసాదించాలి అని కోరారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బానోత్ భద్రు నాయక్, వీరన్న నాయక్, శ్రీను నాయక్ అమ్మ అయిన లాల్లమ్మ తొలిదశ అనేపురం రెవెన్యూ గ్రామ నాయకులు అన్నారు, ఈ కార్య క్రమం లో లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్,బహుజన్ సమాజ్ పార్టీ మరిపెడ మండల సెక్రటరీ గుగులోత్ మోహన్ నాయక్, తండా నాయకులు భీమా నాయక్,సిరి నాయక్, లాలు నాయక్ , కీరు నాయక్,చందు నాయక్, రామ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
10వ తరగతి పరీక్షలు జరగబోతున్న సందర్భంగా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీ యన్ జి ఓ స్) భద్రాచలం ప్రెసిడెంట్, సెక్రటరీ ట్రెజరర్ డెక్కా నరసింహారావు, గగ్గూరి బాలకృష్ణ, పడిగ నరసింహారావు విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థి దశలో ప్రతి విద్యార్థికి అత్యంత కీలకమని.. అందుకే ప్రతి విద్యార్థి ఎంతో మేలుకువతో పరీక్షలు వ్రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని,. అదేవిధంగా వడ దెబ్బ తగలకుండా తల్లిదండ్రులు మరియు విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తూ.. ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా విద్యాశాఖ వారు ఆయా పరీక్ష హాల్ నందు అన్ని రకాల వసతులు సమకూర్చనీ ఒక ప్రకటనలో తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి మరియు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అసెంబ్లీలో బీసీ కులగనన ఎస్సీ వర్గీకరణ రాజీవ్ యువ వికాసం అనే బిల్లులను అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించినందులకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు పేల్చి సంబరాలు చేసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి మాట్లాడుతూ గత 70 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో బీసీ కులగలను చేయక బీసీలకు అన్యాయం చేసిన ప్రభుత్వాలను అధిగమించి ఎంతో సాహసోపేతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి అలాగే గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ రిజర్వేషన్లలో జనాభా దామాషా ప్రకారంగా ఎస్సీల్లలోని మాదిగలు చేస్తున్న పోరాటాన్ని న్యాయమైనదిగా గుర్తించి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర కె దక్కింది అన్నారు,ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఎలాంటి అభివృద్ధి చేయక ఇబ్బందులు పెట్టిన పార్టీలు టిఆర్ఎస్ బిజెపి లను రాబోయే కాలంలోప్రజలు బొంద పెడతారని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య , రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యదర్శి పింగిలి జ్యోతి , మండల మహిళా అధ్యక్షురాలు లక్ష్మి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ములశంకర్ గౌడ్ మండల ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ బీసీ సెల్ అధ్యక్షులు బొట్ల రవి నందరాజు బుర్ర శ్రీనివాస్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి గుండెపు రెడ్డి రవీందర్ రెడ్డి చిట్యాల టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ సి ఆర్ పల్లి మాజీ ఉపసర్పంచ్ పార్లపల్లి కుమార్ మార్కెట్ డైరెక్టర్ మటిక రవీందర్ నాయకులు నల్ల బుచ్చిరెడ్డి పోలోజూ సంతోష్ శరత్ ఆరేపల్లి మల్లయ్య శనికరం మొగిలి గుర్రపు అశోక్ ఈగ కోటి చిలుముల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు..
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని, విద్యార్థులు మనసులో ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకుండా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ధైర్యంగా ఏకాగ్రతతో మనసు పెట్టి ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలు బాగా రాసి, ఏ గ్రేడ్ లో పాస్ కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు మంచిగా రాస్తే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. శుక్రవారం నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు విషెస్ తెలియజేస్తూ, ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసే ఈ పరీక్షలు మీరు ప్రశాంతంగా వ్రాసేందుకు సంబంధిత హెచ్ఎం, ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కావద్దని, భయపడవద్దని, నిర్భయంగా ధైర్యంగా పరీక్షలు రాయాలని, ఈ పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితానికి మైలురాయని, ఈ మైలురాయిని అధిగమించడానికి మీరు ఎంత దృఢంగా నిలబడతారో మీ ఉజ్వల భవిష్యత్తుకు ఆధారపడి ఉంటుందని, విద్యార్థులు ఈ పరీక్షల సమయంలో ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడం ద్వారా విజయం సాధిస్తారని, పరీక్షల్లో విజయం సాధించడానికి ప్రణాళికబద్ధంగా చదివి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పరీక్షలు అంటే భయపడకుండా అన్ని ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు రాయాలని, మానసిక ఒత్తిడిని అధిగమించి, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు 55, వసతిగృహాలు 21, బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు 03, మొత్తం 79 ఇన్స్టిట్యూషన్లలో 2665 మంది 10వ తరగతి గిరిజన విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నారని ఇందులో బాలురు 1423, బాలికలు 1242 కలిపి 2665 మంది పిల్లలు పరీక్షలకు హాజరవుతున్నారని, అందుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, విద్యార్థినీ విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరవేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పిల్లల వెంట పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడానికి ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని,విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకమైన పరీక్షల్ని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని, పరీక్షలు జరుగు సమయంలో వైద్య సిబ్బంది ప్రతి పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉండాలని,పారిశుద్ధ్యం, త్రాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం,తప్పనిసరిగా ఉండాలని, విద్యార్థిని విద్యార్థులు అస్వస్థతకు గురి అయితే తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించి ఐటిడీఏకు మంచి పేరు తేవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పిల్లలందరూ ఎటువంటి భయం లేకుండా, ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పరీక్షలు బాగా రాసి నూరు శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలోని ఐటీడీఏల కంటే భద్రాచలం ఐటీడీఏ లోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలపాలని ఆయన తెలుపుతూ పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు మనస్ఫూర్తిగా దీవిస్తున్నానని ఆయన తెలిపారు.-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక ప్రధానోపాధ్యాయులు రవిలాదేవి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రవిలాదేవి మాట్లాడుతూ విద్యార్థులు ముందుగా ఉపాధ్యాయులు నిర్దేశించినటువంటి మార్గదర్శకాలను చక్కగా పాటించాలని, చెడు అలవాట్లు కలిగి ఉండకూడదు అని, లక్ష్యాలు సాధించే విదంగా శ్రమించాలని, తరగతి గదుల్లో భోదించిన విషయాలు విద్యార్థుల జీవితాలపై చాలా ప్రభావం చూపుతాయి అని, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని చెప్పారు. అనంతరం విద్యార్దులను ఉద్దేశించి గణిత ఉపాధ్యాయుడు నాగేశ్వరావు మాట్లాడుతూ విద్యార్థుల “భవిష్యత్తు” బాటకు తొలిమెట్టు పదవతరగతి అని, అత్యుత్తమ మార్కులను సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని కోరారు. ఉత్తమ ఫలితం అన్ని సబ్జెక్టులలో 80 శాతం మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి ఉన్నత చదువుల నిమిత్తం ఐదువేల రూపాయల నగదును బహుమానంగా అందిస్తానని ఆయన వీడ్కోలు సభలో తెలిపారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించన తర్వాత విద్యార్థులకు హల్ టికెట్లతో పాటు పరీక్షా ఫ్యాడ్లు, పెన్నులు అందించారు. వీడ్కోలు సభలో విద్యార్థులు ఆట, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రవిలాదేవి, పిడి విద్యాసాగర్, ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, శంకర్, రామకృష్ణ, నాగేశ్వరావు, రత్నకుమారి పలువురు ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
భద్రాది జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బిజెపి
బిజెపి భద్రాద్రి జిల్లా నూతన అధ్యక్షులుగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నేటి ధాత్రి,;భద్రాద్రి జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ (బిజెపి) జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికై మొదటిసారి భద్రాచలం నియోజకవర్గ వచ్చిన బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి బ్రిడ్జి సెంటర్ వద్ద బిజెపి నాయకులు పూలమాలలతో ఘన స్వాగతం పలికి సీనియర్ నాయకులు అల్లాడి వెంకటేశ్వరరావు సాలువతో సత్కరించారు ముందుగా భద్రాచలం రామాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా లో ముగ్గురు మంత్రులు ఉన్నా కానీ నిధులు తీసుకురాకపోగా అవినీతికి పరాకాష్టగా మిగిలారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేననిస్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాదించడాన్నిఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందగా టిఆర్ఎస్ కనీసం బరిలో నిలిచేందుకు అభ్యర్థులు సైతం కరువయ్యారనీఅన్నారు ఈ రెండు పార్టీలతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ లోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంజా దర్శ,ములిశెట్టి రామ్మోహన్రావు, కుంజా సంతోష్, త్రినాథరావు, రఘురాం, బిట్రగుంట్ల క్రాంతికుమార్, ముఠాల శ్రీనివాసరావు, నాగబాబు, ముక్కెరకోటేశ్వరి పాల్గొన
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేర్చింది. తిరుపతి.
మహాదేవపూర్- నేటి ధాత్రి:
బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించడంతో బిసి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటి మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. గురువారం రోజున మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంఘం అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో, పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం రాష్ట్రంలోని బీసీల కు రిజర్వేషన్ కల్పించడం హర్షణీయమని, ప్రభుత్వం బిల్లు ఆమోదించడం రాష్ట్రవ్యాప్తంగా బీసీలు మర్చిపోలేని రోజని అన్నారు. అలాగే రాష్ట్ర మంత్రులకు శాసనమండలి సభ్యులకు, బీసీ సంఘాల ప్రతినిధులకు, అధ్యక్షుడు తిరుపతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు మురళి, దేవరావు, స్వామి, తిరుపతి, డాక్టర్ హబీబ్ ,సతీష్ జగదీష్ రామస్వామి, ప్రవీణ్, చంద్రయ్య, లక్ష్మణ్, మహబూబ్ ఖాన్, మహేష్ లు పాల్గొన్నారు.
తేదీ:20-03-2025. వర్ధన్నపేట (నేటిదాత్రి ) వాస్తవిక బడ్జెట్ అందరికీ సంతృప్తి నిచ్చిన బడ్జెట్
రాష్ట్ర బడ్జెట్2025-26 ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి బడ్జెట్ ను నిన్న అసెంబ్లీ లో ప్రవేశ పెట్టారు అయితే నేడు వర్ధన్నపేట నియోజక వర్గ,వర్ధన్నపేట మండల కేంద్రము లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏద్దు సత్యం,వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,మాజీ జెడ్పీటీసీ& కొత్తపల్లి మాజీ సర్పంచ్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పొషాల వెంకన్న గౌడ్ లు విలేఖర్లతో మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా అస్తవ్యస్తంగా ఉన్న వాటిని అన్నిటిని అధిగమించే ప్రయత్నం చేస్తూనే మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల 65 కోట్ల ప్రణాళికతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అభివృద్ధి సంక్షేమాన్ని కాంక్షిస్తూ తీసుకొచ్చినటువంటి బడ్జెట్ మహిళలకు విద్యార్థులకు నిరుద్యోగులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు స్కూలు విశ్వవిద్యాలయాలు రైతన్నలకు ఇటు విద్యుత్తు నీటిపారుదల శాఖ వైద్యం పౌరసర రోడ్లు భవనాలు ఒకటి కాదు అన్ని వర్గాలు అన్ని వ్యవస్థలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరికీ సంతృప్తినిచ్చింది ఆమోదయోగ్యంగా ఉన్నది
కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి , నేటి ధాత్రి
చౌటుప్పల్:రాష్ట్ర వ్యాప్త పర్యటన భాగంగా కేటీఆర్ నేడు సూర్యాపేటలో భారీ బహిరంగ సభలో పర్యటించిన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ వద్ద కేటీఆర్ కు మునుగోడు బిఆర్ఎస్ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి ఘన స్వాగతం పలికిన టిఆర్ఎస్ కార్యకర్తలు.. కేటీఆర్ కు ప్రత్యేకంగా శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ,పాల్వాయి స్రవంతి ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షులు ,ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యారంగానికి 7.5%నిధులను మాత్రమే కేటాయించడాన్ని బిఆర్ఎస్వి పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం..
బిఆర్ఎస్వి సీనియర్ నాయకుడు వొల్లాల శ్రీకాంత్ గౌడ్
వీణవంక,( కరీంనగర్ జిల్లా ):నేటి ధాత్రి :
నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ సమావేశంలో 2025-2026 ఆర్థిక సంవత్సర బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీగా ఉంది. అమలుకాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ అధికారం చేపట్టిన ఈ ప్రభుత్వం పథకాలను అమలు చేయకుండా నానా అవస్థలు పడుతున్నారు. గత ఎన్నికల సమయంలో విద్యారంగానికి 15%నిధులు కేటాయిస్తామని ప్రగల్బాలు పల్కి, పోయిన బడ్జెట్ లో 7.3%నిరాశ మిగిల్చి, నేడు ఈ బడ్జెట్ లో కూడా 7.5%23,108 కోట్లు మాత్రమే కేటాయించింది. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అని వారి నినాదాలతో ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. కానీ వారి నినాదాలు వాస్తవానికి మాత్రం సంక్షేమనికి ఆమడ దూరం, అభివృద్ధి లో వెనుకబాటు తనం, సూపరిపాలన శూన్యం మాత్రమే చూస్తున్నాం. బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యారంగానికి,యూనివర్సిటీలకు, గురుకులాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అద్భుతంగా అభిరుద్ది పరిచింది. కానీ ఈ ప్రభుత్వం యూనివర్సిటీ, గురుకులాలను నిర్లక్ష్యం చేస్తు విద్యార్థుల మరణాలకు కారణమౌతున్నాయి. గురుకులాలలో చదువుతున్న విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలను 200%, డైట్ చార్జీలు 40% పెంచుతామణి గత బడ్జెట్ లోనే అన్నారు. మళ్ళీ గతంలో మాదిరే ఇప్పుడు కాస్మోటిక్, డైట్ ఛార్జిలను 200%, 40% అంటున్నారు. అంటే గతంలో ఈ కేటాయింపులు జరగలేదా..?. మీ బడ్జెట్ నిధులు నీటి మూటలేనా..? అని అడుగుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు చైతన్య వంతులు, విద్యావంతులు, మేధావులు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. విద్యారంగా సమస్యల మీద అసెంబ్లీ ముట్టడి చేసిన కూడా మీ వైఖరి మారలేదు. వందేళ్లకు పైబడి ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కీ 1000 కోట్లు రాష్టంలోని అన్నీ యూనివర్సిటీ లను అభివృద్ధి చేయాలి అలాగే యూనివర్సిటీ లో ఉన్న బోధన, బోధనేతర ఖాళీలను తక్షణమే భర్తీ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో విద్యారంగా సమస్యలు తీర్చే వరకు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మా పోరాటాన్ని ఉదృతం చేస్తామని అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన ఆవుల జుగునమ్మ ఆమె అకౌంట్లో ఉన్న 28 వేల రూపాయలను వేరే అకౌంట్ లో పడి చాలా రోజులు నుండి బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నాన్న ఇబ్బందులు పడి రెండు రోజుల క్రితం కరకగూడెం పోలీస్ స్టేషన్కు వచ్చి తన సమస్యను ఎస్సై రాజేందర్ సార్ తో చెప్పుకోగా వెంటనే స్పందించి ఆమె అకౌంట్లో ఉన్న డబ్బులు ఎవరి అకౌంట్లో పడినాయి అని సంబంధిత బ్యాంక్ అధికారులతో మాట్లాడి ఈరోజు జుగుణమ్మ పిలిపించి డబ్బులు ఇప్పించడం జరిగింది. ఈ విషయంపై జుగుణమ్మ ఎస్సై రాజేందర్, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 5వ తేదీ నుండి గురువారం వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రసాయన శాస్త్రం, వాణిజ్యశాస్త్రం పరీక్షలు జరిగాయి. మొత్తం 443 మంది విద్యార్థులకు గాను.. 4 గైర్హాజరు కాగా.. 439 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రశాంతంగా పరీక్షలు జరగడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ.. ఆనంద వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల కార్యవర్గo ఎన్నిక
చందుర్తి, నేటిధాత్రి:
ఈ రోజు చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు చింతకుంట సాగర్ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీ నియామకం చేయడం జరిగింది. ఇందులో ప్రధాన కార్యదర్శి గా ముడపెల్లి ముకేష్ (మల్యాల ), ఉపాధ్యక్షులు గా బోరగాయ తిరుపతి (జోగాపూర్ ) బంబోతుల ప్రశాంత్ (మర్రిగడ్డ) లను, కార్యదర్శులు గా నీరటి శేఖర్ (నర్సింగపూర్), పగిడే మల్లేశం (ఎన్గల్ ), లంబ రాకేష్ (మూడపెల్లి ), తోట శంకర్(మూడపెల్లి) లను, కార్యవర్గ సభ్యులు గా ఈగ శ్రీధర్ (లింగంపేట), అట్టేపెళ్లి సాయి (తిమపూర్) లను నియమించారు.
ఈ నియామకలు తక్షణమే అమలోకి వస్తాయి అని తెలియజేరశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ బిజెపి కన్వీనర్ మార్తా సత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్ మండల అధ్యక్షుడు మొఖిల విజేందర్, మండల ప్రధాన కార్యదర్శిలు పెరుక గంగరాజు,మర్రి మల్లేశం బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ పొంచెట్టి రాకేష్, బిజెపి నాయకులు చింతకుంట గంగాధర్, చినుముల హనుమయ్య చారి, లింగాల రాజయ్య, మట్కా మల్లేశం, పాటి సుధాకర్, చిర్రం తిరుపతి, పెరుక రంజిత్,బద్దం తిరుమల్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు మోతుకుపెల్లి రాజశేఖర్,మెంగాని శ్రీనివాస్, మర్రి రాజు, కుసుంబ లింగ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దామాగ్నాపూర్ గ్రామంలో దేవరకద్ర మండలానికి చెందిన పలువురికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి గురువారం లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం వద్ద రాజగోపురం ముందు షెడ్డు నిర్మాణం సంబంధించిన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సింగరేణి ఉన్నత పాఠశాలలో ఫేర్వెల్ డే పార్టీ వేడుకలు
మందమర్రి నేటి ధాత్రి
Farewell Day Party
సింగరేణి ఉన్నత పాఠశాలలో 2024 /25 సంవత్సరానికి 10వ తరగతి పూర్తి చేసి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు పలుకుతూ ఏర్పాటు చేసిన ఫేర్వెల్ డే పార్టీ వేడుకలు ఆనందోత్సవాల నడుమ ఘనంగా నిర్వహించారు.
మందమర్రి ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాల ఆవరణలో సీనియర్ విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు బుధవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల కరస్పాండెంట్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్ కు విద్యార్థులు పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఇందులో భాగంగా పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పెన్నులు హాల్ టికెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులకు గౌరవాన్ని అందిస్తూ చదువు పూర్తి చేసుకుని పాఠశాలను వదిలి వెళుతున్న వారి కోసం ఏర్పాట్లు అభినందనీయమని కొనియాడారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల శిక్షణలో విద్యను అభ్యసించిన అందరూ పదవ తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆశాభవం వ్యక్తం చేశారు. పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడులకు లోను కాకుండా చదువు పైనే దృష్టి పెట్టి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. సింగరేణి పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల కోసం సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలతో పాటు ఉచితంగా పుస్తకాలు యూనిఫాం పంపిణీ చేస్తూ మధ్యాహ్న భోజనం కూడా కల్పిస్తుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
వడ్డీ లేని రుణాల మంజూరుతో సీఎం చిత్ర పఠానికి క్షీరాభిషేకం
మొగుళ్లపల్లి నేటి ధాత్రి
మండల కేంద్రంలోని వెలుగు మండల సమైక్య కార్యాలయంలో. బుధవారం ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే చిత్రపటాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినందుకు గాను మహిళల పాలాభిషేకం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీఎం రవి వర్మ మాట్లాడుతూ ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్య మంత్రి మొన్న జనగామ జిల్లా పర్యటనకు వచ్చిన సంధర్భంగా మహిళా స్వయం సహాయక సభ్యులతో చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమాల గురించి వారితో మాట్లాడి సంతృప్తితో ఎస్ హెచ్ జి లకు వడ్డీ లేని ఋణం క్రింద రూ.100 కోట్లను మంజూరీ చేశారన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వెలుగు మండల సమాఖ్య మొగుళ్ళపల్లి సెర్ప్, డి.ఆర్.డి.ఏ మొగుళ్లపల్లి మండలం ఆధ్వర్యంలో. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గ్రామీణ అభివృద్ధి శాఖ మినిస్టర్ సీతక్క, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రూ. 10 కోట్లు మంజూరీ కాగా మొగుళ్లపల్లి మండలానికి క్రింది విధంగా మంజూరీ కావడం జరిగింది.మండలంలో మొత్తం 657 సంఘాలకు ఒక కోటి ఆరు లక్షల తొంబై ఏడు వెయ్యిల రెండు వందల తొంబై నాలుగు రూపాయలు సంఘాల ఖాతాలలో పడడం జరిగినది. మహిళా సంఘ సభ్యులకు అందించిన ముఖ్య మంత్రి, పంచాయితీ రాజ్ గ్రామీణభివృద్ధి శాఖా మంత్రి , సి.ఈ.ఓ, సెర్ప్, మండల మహిళలు అందరి తరపున ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సిబ్బంది గాజుల బాబురావు, బత్తిని శ్రీనివాస్, బత్తిని ప్రవీణ్, పసరగొండ రేవతి, వివో ఏలు శ్రీరామ్ తిరుపతి, లలిత, పావని, రమాదేవి, రమ్య, శ్రీకాంత్, బాలకృష్ణ, వివిధ గ్రామాల వివోఏలు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి: న్యాల్కల్ మండలం గంగ్వార్ గ్రామంలోని 1వ వార్డ్ లో గత ఏడునెలల నుంచి నీటికొరత ఏర్పడుతుంది. బోరు చెడిపోయి ఏడునెలలు గడుస్తున్నా ఏఒక్క అధికారి కూడా పట్టించుకోలేదని కాలనీవాసులు వాపోయారు. ఈ విషయంపై అధికారులకు చాలా సార్లు గ్రామస్థులు వినవించుకొన్న పటించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున నీటి సమస్యను తీర్చాలని మండల బీజేపీ అధ్యక్షులు మల్లేష్ డిమాండ్ చేశారు.
బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2025-2026 సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆరోపించారు. గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3,04,965 కోట్ల మొత్తం బడ్జెట్లో 56 శాతం పైగా ఉన్న బీసీలకు కేవలం ముష్టి వేసినట్లు 3.6 శాతం రూ.11,405 ఓట్లు కేటాయించి బీసీలను అవమానపరిచారని ఆయన మండిపడ్డారు. బీసీలకు కేటాయించిన ఈ బడ్జెట్ బీసీలకు ఏ విధంగా..ఏ మేరకు..ఏ మూలకు సరిపోతాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు చెప్పాలని మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో మరియు విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింప చేసిన మీరు..బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం ఎందుకింత వివక్షత చూపుతున్నారని ప్రశ్నించారు. బడ్జెట్లో బీసీలకు ఇంత తక్కువ నిధులు కేటాయించడంలో ఆంతర్యం ఏమిటని..ఇది వివక్షత కాదా..? అని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం బీసీలకు 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. బడ్జెట్ ను సవరించైనా సరే బీసీలకు బడ్జెట్ పెంచాలని మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.
ప్రశాంతతతోనే మెరుగైన ఫలితాలు ఫోటో కాన్ కరాటే మాస్టర్ సిద్దు స్వామి.
జహీరాబాద్.నేటి ధాత్రి:
ఝరాసంగం,ఎలాంటి ఒత్తిడి, భయాందోళనలు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు వ్రాస్తేనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫోటో కాం కరాటే మాస్టర్ సిద్దు స్వామి మార్గదర్శనం చేశారు. బుధవారం ఝరాసంఘం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2024 – 25 విద్యా సంవత్సరానికి చెందిన 10 తరగతి విద్యార్థునులకు ఆత్మీయ వీడుకోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరాటే మాస్టర్ సిద్దు స్వామి10వ తరగతి విద్యార్థునులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ మేరకు పదవ తరగతి విద్యార్థునులకు పరీక్ష ప్యాడులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం పీచేరాగడి గ్రామానికి చెందిన బాధితులకు గురువారం ఉదయం ముఖ్య మంత్రి సహయనిధీ చెక్కులు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ కోహీర్ మండల అధ్యక్షుడు రామలింగారెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.