తీన్మార్ మల్లన్న పై దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన.

తీన్మార్ మల్లన్న పై దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద మొన్న తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడిని ఖండిస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈసందర్భంగా బీసీ నాయకులు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న అనుచిత వాక్యాలు చేశాడు.అని చెప్పి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేయడాన్ని బీసీ సమాజం పై దాడిగా భావిస్తున్నాం అని అన్నారు.ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం మన సంస్కృతి కాదు మల్లన్న పై దాడికి ఉసిగొలిపిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.తీన్మార్ మల్లన్న పార్టీ పెడితే మా పప్పులు ఏమి ఉడకవని అన్న ఉద్దేశంతో దాడికి పాల్పడిందని భావిస్తున్నట్లు తెలిపారు.ఇలాంటి ఘటన పునరావృత్తం అయితే కలవకుంట్ల కవిత బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు అని హెచ్చరిస్తున్నాం.తీన్మార్ మల్లన్నకు బీసీ సమాజం అండగా నిలుస్తుందని ఈసందర్భంగా తెలియజేస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, తుల మధుసూదన్ రావు, శాఖ పురం భీమ్సేన్,గజ్జెల్లి వెంకన్న,చంద్రగిరి చంద్రమౌళి, ఆరెంధుల రాజేశం,వేముల అశోక్,శాఖ పురం కోటేశ్వరరావు,కీర్తి బిక్షపతి, అంకం సతీష్,నగునూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

నష్టం కలిగించే నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయాలి.

కార్మికులకు నష్టం కలిగించే నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయాలి..

కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

భూపాలపల్లి నేటిధాత్రి

కార్మికులకు నష్టాన్ని కలిగించే నాలుగు నల్ల చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఏఐటీయూసీ మధుగాని విజయేందర్, ఐఎన్టీయూసీ జోగబుచ్చయ్య, సి ఐ టియు కంపేటి రాజయ్య, టీబీజీకేఎస్ బడితల సమ్మయ్య లు డిమాండ్ చేశారు. కేటీకే ఓసి-3 యూజీ గని లో పిట్ సెక్రటరీ ఎల్ శంకర్ అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్లో జాతీయ సంఘాల జేఏసీ నాయకులు పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లు విభజించి కార్మిక హక్కులను కాల రాసిందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వo బీజేపీ చట్టాలు సవరణ చేసి 4 నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేయబోతుందని వాపోయారు. ఈ నాలుగు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను భూపాలపల్లి ఏరియాలోని అన్ని మైన్స్, డిపార్ట్మెంట్లలో పనిచేసే కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ సంఘాల నాయకులు నూకల చంద్రమౌళి, కార్మికులు పాల్గొన్నారు.

విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేత.

విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కరేటేలో ఝరాసంగం సిద్దు మాస్టర్ విద్యార్థుల ప్రతిభ జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం సదాశివపేట పట్టణంలో బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్ ను తెలంగాణ చీఫ్ రాపోలు సుదర్శన్ మాస్టర్ జిల్లా ఎగ్జామినర్ శంకర్ గౌడ్ మాస్టర్ జిల్లా చీఫ్ చందర్ మాస్టర్ ఎగ్జామినేటర్గా విద్యార్థులను పరీక్షించారు. ప్రతిభ కనబరిచిన సైఫ్ సంగమేశ్వర్ విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ లో గోవాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు సిద్ధంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో సిద్దు మాస్టర్ సతీష్ గౌడ్. శ్వేత వారిని అభినందించడం జరిగింది

నల్ల బ్యాడ్జి ధరించి నిరసన తెలిపిన.

నల్ల బ్యాడ్జి ధరించి నిరసన తెలిపిన
మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారీ మీద జరిగిన దాడిని ముత్తారం వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు ఖండించారు వారు మాట్లాడుతూ ఇటీవలె జిల్లాలోని ప్రైవేటు హాస్పిటల్స్ లో ఏలాంటి పర్మిషన్స్ లేకుండా నిర్వహిస్తున్న స్కాన్ సెంటర్స్ ను పర్మిషన్ తీసుకోవాల్సిందని ఆదేశించిన సందర్భంలో జిల్లా వైద్యాధికారినీ అగౌరపరుస్తూ ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది చేసిన తప్పుడు మరియు అబద్ధపు ఆరోపణలను ఖండిస్తూ మండల వైద్యాధికారి అమరేందర్ రావు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం జరిగింది అని తెలిపారు

పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమికొట్టాలని నల్ల రిబ్బన్లతో.

పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమికొట్టాలని నల్ల రిబ్బన్లతో నమాజ్.

మాజీ కోఆప్షన్ సభ్యులు
ఎండి రాజ్ మహమ్మద్.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

ఈనెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని పైల పహిలగామ్ లో పాకిస్తాన్ టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు వారి మృతికి సంతాప సూచకంగా శుక్రవారం రోజున చిట్యాల మండల కేంద్రంలోని మరియు మండలంలో ఉన్నటువంటి మసీదు లలో శుక్రవారం నమాజులో ముస్లిం సోదరులు అందరూ నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేసుకొని ఉగ్రవాద కార్యకలాపాలను చేసేవారిని తరిమికొట్టాలని ముఖ్యంగా టెర్రరిస్టులు కాల్పులు జరిపిన సమయంలో కాశ్మీరు వస్త్ర వ్యాపారి నాజా కతలి మరియు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ వీరోచితంగా పోరాడి చాలామంది టూరిస్టుల ప్రాణాలు కాపాడారు కావున ముస్లింలు ఎప్పుడు కూడా భారతదేశానికి స్వాతంత్ర సమరంలో ప్రాణాలర్పించి ముందు వరుసలో ఉన్నారు కావున అందరం కలిసి టెర్రరిస్టుల చర్యను ఖండించాలని చిట్యాల మండలం

మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి రాజ్ మహమ్మద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version