దోపిడి పాలకులకు వామపక్ష ఐక్యతే ఏకైక మార్గం.

దోపిడి పాలకులకు వామపక్ష ఐక్యతే ఏకైక మార్గం

ఓంకార్ పీడిత ప్రజల మహాశక్తి

ఎంసిపిఐ(యు)జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్

ఓంకార్ శత జయంతి వార్షికోత్సవ ప్రారంభ సభలో పాల్గొన్న వామపక్ష సామాజిక రాష్ట్ర నేతలు

వరంగల్ జిల్లా ప్రతినిధి  నేటిధాత్రి:

దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలకు మతోన్మాద దోపిడీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం వామపక్ష సామాజిక శక్తుల ఐక్య ఉద్యమాలు అని ఎంసిపిఐ యు జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ అన్నారు. కమ్యూనిస్టుల ఐక్యతకు అమరజీవి మద్ది కాయల ఓంకార్ కలలు కన్నాడని అది నిజం చేయడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, అసెంబ్లీ టైగర్ ఎంసిపిఐ యు వ్యవస్థాపకులు,అమరజీవి మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభ కామ్రేడ్ గోనె కుమారస్వామి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన అశోక్ ఓంకార్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, ప్రజాకవి జయరాజు, సినీ డైరెక్టర్ బాబ్జి, సిపిఐ ఎంఎల్ యు డెమోక్రసీ అధికార ప్రతినిధి చలపతిరావు, బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్, మురహరి తదితరులు మాట్లాడుతూ అమరజీవి ఓంకార్ త్యాగాలు ఆదర్శాలు ప్రతి కమ్యూనిస్టు ఉనికిబుచ్చుకొని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆ దిశలో బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందని అందరికీ చెందాల్సిన సంపదను పెట్టుబడిదారులకు కట్ట పెడుతున్నారని ప్రజా ఉద్యమాలనుంచి వేస్తున్నారని భద్రత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మతం అంట కడుతున్నారని ప్రజలకు కనీస అవసరాలు సమకూర్చడంలో కనీస చిత్తశుద్ధి ప్రదర్శించని పాలకులు పోరాడే వారిపై మాత్రం అణిచివేత చర్యలకు పాల్పడుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ఓంకార్ గారి స్ఫూర్తితో ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి పోరాటాలను నిలబెట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, పోలి బ్యూరో సభ్యులు కాటం నాగభూషణం, వల్లె పుపేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వనం సుధాకర్, జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, యువ రచయిత యోజన,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ రెడ్డి అంశారెడ్డి, మస్తుల మట్టయ్య, వరికుప్పల వెంకన్న,మంద రవి,కుంభం సుకన్య, తుకారాం నాయక్, లింగంపల్లి శ్రీనివాసరెడ్డి,వర్ణం వెంకటరెడ్డి, సోమిడి శ్రీనివాస్ లతోపాటు ఐక్య ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న బృందం ఇతర కళాకారులు ఆటపాట అలరించాయి.ముందుగా వరంగల్ వ్యాప్తంగా ఎర్రజెండాలు,ప్రభబండ్లు,కోలాటాలు,ప్రజా నాట్యమండలి డప్పు చప్పుళ్ళతో వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై
భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.మహిళల కోలాట నృత్యాలు,విప్లవ పాటలు ఎంతగానో అలరించారు.

కాంగ్రెస్ పార్టీని వీడి బి.ఆర్.ఎస్. పార్టీలో.!

కాంగ్రెస్ పార్టీని వీడి బి.ఆర్.ఎస్. పార్టీలో చేరిన నాయకులు
మాజీ మంత్రి దయాకర్ రావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న మాజీ సర్పంచ్ ఉప, సర్పంచ్
కక్కిరాల పల్లిలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ

నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ:-

ఐయినవోలు మండలం కక్కిరాల పల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ కంచర్ల రమేష్, ఉప సర్పంచ్ బొల్లం ప్రకాష్ మంగళవారం మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బి. ఆర్. ఎస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఈ మోసపూరిత కాంగ్రెస్ మాటలు విని మేం మోసపోయామని ప్రజలు అంటున్నారని,కెసిఆర్ ఒక విజన్ తో పని చేస్తే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవగాహన లోపంతో ప్రజలను ఆగం పట్టిస్తున్నారని విమర్శించారు. బోగస్ మాటలు చెప్పి ప్రజలను బోల్తా కొట్టించిన ఈ కాంగ్రెస్ పార్టీని తొందరలోనే బొంద పెట్టే రోజులు వస్తున్నాయని వారు అన్నారు.వీరితోపాటు బీ. ఆర్. ఎస్ పార్టీలో కాటబోయిన కుమారస్వామి, గాడుదల లింగయ్య, చిర్ర రాజేందర్, తల్లపెల్లి నాగరాజు, మడ్లపల్లి రాజు,ఆరూరి అరుణ్, నూనె సాంబరాజు, జోగు సతీష్, జోగు రమేష్, గుబ అరుణ్ కుమార్, కోల శ్రీనివాస్, ఆరూరి లలిత, ఆరూరి పూల, బర్ల సుమలత, ఆరూరి అనిత ఇంకా భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర్తలు పార్టీలో చేరటం జరిగింది.ఈ కార్యక్రమంలో బి. ఆర్. ఎస్ మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపల్లి చందర్ రావు మండల కన్వీనర్ తంపుల మోహన్, మండల ఇంచార్జ్ గుజ్జ గోపాలరావు, నాయకులు పల్లకొండ సురేష్, గ్రామ పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడు అల్లం సోమయ్య, టిఆర్ఎస్ నాయకులు మరుపట్ల దేవదాస్,దుప్పెల్లి కొమురయ్య, గడ్డం రఘువంశీ గౌడ్ పాల్గొన్నారు.

మోదీ జీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఒక్కటే మిగిలాయా.

మోదీ జీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఒక్కటే మిగిలాయా?

వీటిని సైతం విడిచి పెట్టరా?

పెంచిన వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలి

పేదలపై పెనుభారం మోపవద్దు

దోపిడీ, మోసానికి కేరాఫ్
మోదీ ప్రభుత్వం

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, నేటిధాత్రి:

కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను యాభై రూపాయల మేర పెంచడంతో సామాన్య ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని, తక్షణమే పెంచిన ధరను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు. దోపిడీ, మోసానికి మోదీ ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నదని, చివరకు గ్యాస్ సిలిండర్లను సైతం విడిచిపెట్టడం లేదని మండి పడ్డారు. వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను పెంచడం వల్ల పేద కుటుంబాలకు మరింత నష్టం కలుగుతుందన్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో, కొత్తగా గ్యాస్ ధరల పెంపు సామాన్యుడి జీవన వ్యయాన్ని మరింత పెంచి, వారి రోజు వారీ జీవితాన్ని అతలాకుతలం చేస్తాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఉజ్వల యోజన ద్వారా పేదలకు సబ్సిడీతో కూడిన గ్యాస్ సిలిండర్లను అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఈధరల పెంపు ఆహామీలను గాలికి వదిలేసినట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోక పోవడం దారుణమని, వంట గ్యాస్ ధర పెంచడం వల్ల గృహిణులు, చిరు వ్యాపారులు, రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ జీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఒక్కటే మిగిలాయా ? అని మండిపడ్డారు ఈసారి ద్రవ్యోల్బణం కొరడా దెబ్బ పేద మహిళల పొదుపు పైనా పడిందనీ, దోపిడీ, మోసం అనే పదాలకు మోదీ ప్రభుత్వం పర్యాయ పదంగా మారిందని రాజేందర్ రావు ధ్వజమెత్తారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించక పోవడం దారుణమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పేద, మధ్య తరగతి కుటుంబాల జీవనం దుర్భరంగా మారిందని రాజేందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పదకోండు ఏళ్ల మోడీ సర్కార్ హాయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచములు ధరలు తగ్గినప్పుడల్లా ఎక్సైజ్ సుంకాన్నీ పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజేందర్ రావు పేర్కొన్నారు. తరచూ పెట్రోలు, డీజిల్ వంటగ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే గట్టి బుద్ధి చెబుతారని  హెచ్చరించారు.

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version