మాజీ సర్పంచ్ భాస్కర్ నాయుడు మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన.

మాజీ సర్పంచ్ భాస్కర్ నాయుడు మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన

చిత్తూరు ఎంపి
దగ్గు మళ్ళ ప్రసాద రావు

చిత్తూరు(నేటి ధాత్రి) జూలై 15:

గంగాధర నెల్లూరు నియోజకవర్గంవెదురుకుప్పం మండలం, గొడుగు చింత గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, టిడిపి పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ నాయుడు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు అలాగే ఆయన కుటుంబ సభ్యులకు
ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారురాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఢిల్లీ పర్యటన నేపథ్యంలో
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు మాజీ సర్పంచ్ భాస్కర నాయుడు మరణం వార్తను,టీడీపీ శ్రేణుల ద్వారా తెలుసుకున్నారు.ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
సౌమ్యలైన భాస్కర నాయుడు పార్టీ బలోపేతానికి అంకితభావంతో పని చేసారని గుర్తు చేసిన చిత్తూరు ఎంపీ భాస్కర నాయుడు లేని లోటు పార్టీకి తీర్చలేనిదన్నారు.
ఈ విషాద సమయంలో
ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం, శక్తిని ఇవ్వాలని, భాస్కర్ నాయుడు పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు,

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని సభలో చాటాలి.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని సభలో చాటాలి

-స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ దే ఘన విజయం

-కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి

-మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి
నేటి ధాత్రి మొగుళ్ళపల్లి

 

ఓరుగల్లు గడ్డమీద జరగనున్న 27వ రజతోత్సవ సభలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటాలని సర్పంచ్ ల ఫోరం మొగుళ్లపల్లి మండల మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి
బీఆర్ఎస్ నాయకత్వానికి పిలుపునిచ్చారు. శనివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 25 ఏళ్ల గులాబీ పండుగను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో గత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. సబ్బండ వర్గాలకు న్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. నాడు అందుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉండేవారని, నేడు రైతన్నలు మొదలు ప్రతి ఒక్క రంగానికి చెందిన వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే హావా కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటేనే బాగుండేదని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. రానున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రజతోత్సవ సభ నాందిగా నిలవాలని వ్యాఖ్యానించారు. మొగుళ్లపల్లి మండలంలోని ప్రతి గ్రామం నుండి సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version