ఈదురు గాలుల బీభత్సానికి మార్కెట్ షెడ్.!

ఈదురు గాలుల బీభత్సానికి మార్కెట్ షెడ్ పైకప్పు ధ్వంసం

మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

మండలంలోని పర్లపల్లి గ్రామంలో. ఆదివారంవారం అర్ధరాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించడంతో. కూరగాయల మార్కెట్ షెడ్లు పైకప్పు కూలిపోవడం జరిగింది. ప్రజల అవసరాల మేరకు షెడ్డు మల్లి నిర్మానించాలని మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య అన్నారు. ప్రజల అవసరాల కోసం వారసంతపు సంత ప్రతి బుధవారం కూరగాయలు కొనుగోలు నిర్వహించడం జరిగేదని, ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో గాలులు రావడంతో ద్వారంతో పాటు 15 షెడ్లు పై కప్పులు కూలిపోవడం జరిగిందని. ఎన్.ఆర్.ఇ.జి ఎస్ ద్వారా మార్కెట్ షెడ్లు నిర్మించడం జరిగిందని. దాని విలువ ఐదు లక్షలు అవుతుందని ప్రభుత్వం వెంటనే స్పందించి కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే స్పందించి. గ్రామప్రజల అవసరాల దృష్ట్యా మళ్ళీ మార్కెట్ షెడ్లు పైకప్పులు పునర్నిర్మానం చేయాలని ఆయన కోరారు.

ఈదురు గాలుల బీభ త్సానికి ఇల్లు ధ్వంసం.

ఈదురు గాలుల బీభ త్సానికి ఇల్లు ధ్వంసం..

దిక్కుతోచని స్థితిలో కుటుంబం..

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి ఈదురు గాలుల. బీభత్సవo సృష్టించ డంతో బీసీ కాలనీ చెందిన బాసాని రామకృష్ణ ఇల్లు పూర్తి స్థాయిలో ధ్వంసం అయ్యాయి తృటిలో తప్పించుకొని ప్రాణాలను కాపాడుకున్న వారు ప్రకృతి ప్రకోపంతో ఇల్లు ధ్వంసమవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.రెక్కాడితే కాని డొక్కాడని దయనీయ స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభు త్వం ఇందిరమ్మ ఇల్లు మం జూరు చేసి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version