విద్యుత్ ప్రమాదంతో వృద్ధురాలు మృతి…

విద్యుత్ ప్రమాదంతో వృద్ధురాలు మృతి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్నానం చేసి శౌచాలయం (బాత్ రూమ్) లోంచి బయటకు వస్తుండగా విద్యుత్ ప్రమాదానికి గురై ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కుటుంబీకులు, హద్దునూరు ఎస్పై చెల్లా రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్కల్ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన వడగామ సిద్ధమ్మ (56) ఆదివారం ఉదయం స్నానం, కాళ కృత్యాలు చేసేందుకు శౌచాలయంలోకి వెళ్ళింది. స్నానం అనంతరం బయటకు వస్తుండగా ఓ ఇనుప రాడ్డును పట్టుకోవడంతో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న సిద్ధమ్మ (56)ను గుర్తించిన సమీప స్థానికులు వెను వెంటనే బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన సిద్ధమ్మకు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మృతురాలి సోదరి కుమారుడు సంజీవ్ కుమార్ (31) ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్పై చెల్లా రాజశేఖర్ కేసు నమోదు చేసి. శివ పంచనామ, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

వందల చెట్లు నరికిన కరెంటు కాంట్రాక్టర్.

వందల చెట్లు నరికిన కరెంటు కాంట్రాక్టర్
ప్రకృతి పెంచమంటుంది కరెంటు స్తంభం తుంచుమంటుంది
చోద్యం చూస్తున్న అధికారులు
ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరుకుతున్న కాంట్రాక్టర్

జమ్మికుంట :నేటిధాత్రి

 

జమ్మికుంట మండల పరిధిలోగల కోరపల్లి గ్రామంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణం జరిగింది ఇట్టి సబ్స్టేషన్ ప్రారంభించడానికి సన్నద్ధమై ఉంది ఈ సబ్ స్టేషన్ కు కరెంటు సప్లై కోసం జమ్మికుంట నుండి ప్రత్యేకంగా పోల్స్ ద్వారా కరెంటు తీసుకురావడం జరిగింది తీసుకువచ్చే క్రమంలో దాదాపు రెండున్నర కిలోమీటర్లు సైదాబాద్ శివారు కోరపల్లి శివారు ఆర్ అండ్ బి రోడ్డు ప్రక్కన పెట్టినటువంటి పెద్ద పెద్ద చెట్లను అనుమతి లేకుండా ఏ అధికారి పర్యవేక్షణ లేకుండా ఇష్టానుసారంగా చెట్లను నరకడం జరిగింది . దాదాపు పది సంవత్సరాల క్రితం పెట్టినటువంటి చెట్లు ఎన్జీఎన్ఆర్ఇజేఎస్ పథకం కింద ప్రభుత్వం వ్యయం చేసి చెట్లను పెంచడం జరిగింది . వాస్తవానికి అటవీ శాఖ మరియు రెవెన్యూ శాఖ అనుమతులు తీసుకుని టెండర్ ద్వారా ఈ చెట్లను తొలగించాలి కానీ వాళ్లు చెట్టు ఉన్నది తెలిసి కూడా చెట్టు పైన లైన్ వచ్చే విధంగా ఫోల్స్ పాతడం అది కావాలని తప్పు చేయడమే ఎందుకంటే రోడ్డు పక్కన చాలా స్థలంఉంది చెట్లను వదిలిపెట్టి కూడా పోల్స్ వేయచ్చు గతంలో కూడా నిర్మాణ సమయంలో ఇట్టి నిర్మాణం చెరువులో చేస్తున్నారని కోరపల్లి గ్రామస్తులు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్టి నిర్మాణం మొట్టమొదటి నుండి వివాదాస్పదంగానే జరుగుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి తప్పును గుర్తించి చర్యలు తీసుకోవాలని రహదారి వెంటే పోయేటువంటి ప్రయాణికులు కోరుతున్నారు.

యుద్ద ప్రాతిపదికన విద్యుత్ అమర్చిన సింగరేణి.

యుద్ద ప్రాతిపదికన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అమర్చిన సింగరేణి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రాజీవ్ చౌక్ ఏరియాలో సింగరేణి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గురువారం మధ్యాహ్నం పేలడంతో విద్యానగర్, భగత్ సింగ్ నగర్ ఏరియాలలో గల సింగరేణి క్వార్టర్స్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తక్షణమే స్పందించిన సింగరేణి యాజమాన్యం నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేసి కార్మికుల సౌకర్యార్థం నూతన ట్రాన్స్ఫార్మర్ ను వెంటనే అమర్చడంతో కార్మికులు సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల కొరకు అహర్నిశలు పాటుపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని కార్మికులు వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ పునరుద్ధరణలో సింగరేణి ఇంజనీర్ సదానందం, ఎలక్ట్రిషన్లు తిరుమలరావు, ముస్తాఫ్ అలీ, కాంతారావు, సంపత్ తదితర సింగరేణి మజ్దూర్లు పాల్గొన్నారు.

కల్బేమల్ లో విద్యుత్ ప్రమాదం…

కల్బేమల్ లో విద్యుత్ ప్రమాదం…

• కుటుంబ సభ్యులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

జహీరాబాద్. నేటి ధాత్రి:

న్యాల్కల్ మండలంలోని కల్బేమల్ గ్రామంలోని దళిత
వాడలో శనివారం రాత్రి విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు రోజులుగా ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షాలతో.. కాలనీలోని మాజీ ఎంపీటీసీ సభ్యుడు మాణిక్, శిరోమణిలకు చెందిన ఇండ్ల సమీపం వద్ద శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఉన్నట్టుండి విద్యుత్ తీగలు నేల వారాయి. ఇంటి పైకప్పు కు సమీపంలో ఉన్న ఇనుప కడ్డీలకు ఎర్తింగ్ విద్యుత్ తీగ తగలడంతో ఒక్కసారిగా మంటలు ఏర్పడ్డాయి. దీంతో మాణిక్ స్వగృహంలో పంటలు ఏర్పడ్డాయి. అట్టి సమయంలో మాణిక్ మినహా కుటుంబ సభ్యులందరూ ప్రార్థనలు చేసేందుకు చర్చికి వెళ్లడంతో కుటుంబ సభ్యులందరికీ తృటిలో ప్రాణాపాయం తప్పింది. మంటలు ఆర్పేందుకు అగ్నిమాకపాక యంత్రం సకాలంలో రాకపోవడం, అందుబాటులో లేని కారణంగా తీవ్రంగా నష్టం వాటిల్లిందని బాధితులు మాణిక్, శిరోమణిలు వాపోయారు. ఈ మేరకు బాధితులు స్థానిక హదునూర్ పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

బగుళ్ల దేవస్థానం విద్యుత్ దీపాల పనులు ప్రారంభించిన విద్యుత్ అధికారులు

ముత్తారం :- నేటి ధాత్రి

ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు బగుళ్ళ దేవస్థానం విద్యుత్ దీపాల పనులను విద్యుత్ అధికారులు ప్రారంభించారు ఈ కార్యక్రమం లో మండల విద్యుత్ అధికారి హనుమాన్ దాస్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి కుమార్ తాజా మాజీ సర్పంచులు మేడగుని సతీష్ గోవిందుల సదానందం యువత అధ్యక్షులు కలవైన దేవరాజ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version