ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత..

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణం లోని సింగరేణి ఏరియా హాస్పిటల్ సమీపంలో నివాసం ఉండే అరికపురం రాజేశ్వరి అనే నిరుపేద మహిళ ఇటీవల అనారోగ్య రీత్యా మరణించింది.దశదినకర్మ సైతం చేయలేని దిన స్థితిలో ఉన్న కుటుంబానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి పదివేల ఆర్థిక సహాయం అందించారు. ఈకార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సట్ల మహేందర్,కోశాధికారి తూముల సురేష్ , ఉపాధ్యక్షుడు బొద్దుల సతీష్ సభ్యులు జెట్టి శ్రీనివాస్, జె సతీష్, మోటం తిరుపతి , కొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు

వైద్యానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం.

బైక్ మెకానిక్ వైద్యానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ మిత్ర బైక్ మెకానిక్ షాప్ లో మెకానిక్ గా పని చేసే సాగర్ కి ఆదివారం యాక్సిడెంట్ అయ్యి త్రీవ గాయాలు అయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.గాయపడిన సాగర్ ని చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ప్రవేట్ హాస్పిటల్ చేర్పించారు.హాస్పటల్ వైద్య ఖర్చులకు 5 లక్షల రూపాయలు అవుతుందని డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో,ఆర్థిక స్తోమత లేని కుటుంబం కావడంతో ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు సాగర్ కుటుంబ సభ్యులు తెలిపారు.ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఆత్మీయ చారిటబుల్ ట్రస్టును సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు సట్ల మహేందర్, అధ్యక్షుడు కాయం తిరుపతి, కోశాధికారి తూముల సురేష్, సభ్యులు బి.సంపత్,జె.సతీష్, కే.మోహన్,బి.లక్ష్మణరావు,ఈ. వెంకటేష్,జై.నాగరాజు మిగతా సభ్యులు పాల్గొన్నారు.

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయం..

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయం

చికిత్స పొందుతున్న వారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ కుటుంబానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. శ్రీరాంపూర్ పట్టణంలో ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో సూపర్వైజర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ కుమారుడు శ్రీకాంత్ చదువులో గొప్పగా రాణించి ప్రిపేర్ అయ్యే సమయంలో విపరీతంగా తలనొప్పి రావడంతో జిల్లాలోని హాస్పటల్ కి తరలించగా వైద్యులు పరీక్షలు చేసి హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కి పంపించారు.వారిది నిరుపేద కుటుంబం కావడంతో డబ్బులు లేక దిక్కుతోచని స్థితిలో ఉండగా కొందరు గ్రామస్తులు ఆత్మీయ చారిటబుల్ ట్రస్టు ను సంప్రదించండి సహాయమందిస్తారని తెలియజేయడంతో హుటాహుటిన ట్రస్ట్ సభ్యులను సంప్రదించడంతో వెంటనే వారు హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో సభ్యులు డి.ప్రేమ్ కుమార్,కె. మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version