శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్: విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచే కార్యక్రమం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని కుప్పానగర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ‘చదువుకో తెలంగాణ – బాగా చదవండి’ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని, ప్రతిభను వెలికితీయడం దీని లక్ష్యం. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పోటీల్లో ప్రతిభచూపిన వారికి నగదు బహుమతులు అందజేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
సుమారు 80 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో, ఉన్నత లక్ష్యాలతో రాణించాలని వక్తలు సూచించారు. గ్రామ సర్పంచ్ రాజ్కుమార్, ఉపసర్పంచ్ వాహబ్, ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ఉపాధ్యాయులు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బి.డి.ఎం సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
