థౌసండ్ పిల్లర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టై బెల్ట్స్ పంపిణి.

థౌసండ్ పిల్లర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టై బెల్ట్స్ పంపిణి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలంలోని నాచినపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు థౌసండ్ పిల్లర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టై,బెల్ట్స్,గుర్తింపు కార్డులను ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్ సౌజన్యంతో అందిజేశారు
ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం గంగాధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 1000 పిల్లర్స్ లైన్ క్లబ్ అధ్యక్షులు పరికిపండ్ల వేణు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడానికి గ్రామస్తులు ముందుకు రావాలన్నారు. రాబోయే రోజులలో ప్రభుత్వ విద్యాలయాలలో చదువుకున్న వారికే ఉన్నత విద్యాభ్యాసం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిబద్ధత గల ఉపాధ్యాయులు చక్కని విద్యా బోధన చేస్తున్నారని అభినందించారు. గ్రామీణ ప్రాంతాలలో అత్యంత నిరుపేద విద్యార్థులు పాఠశాలల్లో చదువుకోవడానికి వస్తారని వారికి సహాయ సహకారాలు అందించడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. పాఠశాల అభివృద్ధి కోసం తాము కృషి చేస్తామని రాజ్ కుమార్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రాజగోపాల్, జోనల్ చైర్మన్ చొప్పరి సోమయ్య, మాజీ సర్పంచ్ పెండ్యాల మమతా రాజు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఓరుగంటి కవిత తిరుపతి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి, ఉపాధ్యాయురాలు వీణ జ్యోతి, పెండ్యాల రాము మడతలపాటి కుమార్, రుదీర్, జటబోయిన రాజు, గుండెబోయిన కాజీ యాదవ్, పుట్టపాక భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలో టై,బెల్ట్,ఐడి కార్డు,డైరీల పంపిణీ…

పాఠశాలలో టై,బెల్ట్,ఐడి కార్డు,డైరీల పంపిణీ…

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండలంలోని చౌటుపర్తి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోడెం రాజేందర్ బాబు అద్యక్షతన జరిగిన సమావేశంలో మండల విద్యాశాఖాధికారి కునుసోతు హనుమంతరావు ముఖ్యఅతిధిగా పాల్గొని విద్యార్థులకు టై, బెల్ట్.ఐడి కార్డు,డైరీలు పంపిణీ చేసి తదనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యా బోధన జరుగుతున్నది.కావున విద్యార్థుల తల్లి దండ్రులు గ్రామంలో వున్న ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను అందుకోవాలని,ప్రభుత్వము విద్యార్థులకు అందిస్తున్న ఉచిత పుస్తకాలు,మధ్యాహ్న భోజనం,స్కూల్ యూనిఫామ్స్,వినియోగించుకోవాలని,ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి నైపుణ్యంతో బోధించే ఉపాధ్యాయులచే బోధన జరుగుతుంది.కాబట్టి గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కలిసి పాఠశాలలోని విద్యార్థుల నమోదును పెంచుటకు కృషి చేయాలని కోరారు
ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్. గూడెం రమ్య,పాఠశాల ఉపాధ్యాయులు సదానందం,రామయ్య జగదీశ్వర్,నాగరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version