నూతన అంగులతో కొల్లూరు పాటశాల మరియు గ్రామ పంచాయతీ కార్యాలయం..

నూతన అంగులతో కొల్లూరు పాటశాల మరియు గ్రామ పంచాయతీ కార్యాలయం :

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ప్రైవేట్ పాటశాలకు ధీటుగా ఝరాసంగం మండల కొల్లూరులో ప్రభుత్వ పాటశాలకు నూతన పెయింటింగ్ వేయించడం జరిగింది,ఎన్నో రోజులుగా పాటశాలకు పెయింటింగ్ లేక బోషి పోయిన పాటశాలకు నూతన పాలకవర్గం పగ్గాలు చేపట్టినవేంటనే గ్రామ పంచాయతీ కార్యాలయానికి మరియు పాటశాలకు ప్రభుత్వా కార్యాలయాలకు నూతన వరువడి సృష్టించాలనే మంచి ఉద్ధ్యేశంతో పెయింటింగ్ వేయించడం జరిగింది.బడిని దేవాలయం గా బావించే మనము మన పిల్లలకు చక్కని వాతవరణంలో విద్యను అందజేయాలనే మంచి సంకల్పంతో పాటశాలకు పెయింటింగ్ వేసి ప్రైవేట్ పాటశాలకు ధీటుగా ప్రభుత్వా పాతశాలను రూపుదిద్దడం జరిగింధని నూతన పాలకవర్గం అభిప్రాయపడింది,అలాగే గ్రామంలో గల విద్యార్థుల తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేసారు…ఈ కార్యక్రమము గ్రామ పెద్దలు మరియు గ్రామ నూతన పాలకవర్గం అధ్వర్యంలో నిర్వహించారు..

నీటి ఎద్దడి రాకుండా చూడాలి: ఎంపిఓ రాము

నీటి ఎద్దడి రాకుండా చూడాలి: ఎంపిఓ రాము

కామారెడ్డి జిల్లా/ పిట్లం నేటిధాత్రి:

కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని రాంపూర్ (కలాన్) గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ, కంపోస్టు షెడ్డు, గ్రామంలోని మంచినీటి మోటారులను పిట్లం మండల ఇన్చార్జి ఎంపీఓ, గ్రామ స్పెషల్ ఆఫీసర్ రాము శుక్రవారం పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను తనిఖీ చేసి, ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా చూడాలని, మిషన్ భగీరథ నీటిని అన్ని ట్యాంకులలో నింపే విధంగా చర్యలు తీసుకోవాలని, వేసవికాలం దృష్ట్యా నీటి కొరత రాకుండా, గ్రామ ప్రజలు నీటిని వృధా చేయకుండా అరికట్టాలని గ్రామపంచాయతీ కార్యదర్శి భాస్కర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి భాస్కర్, గ్రామపంచాయతీ కారోబార్ కృష్ణ, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version